Monday, January 1, 2024

ధర్మాచరణపరులు ప్రతి నిత్యమూ పాటించవలసిన కొన్ని విషయాలు

*ధర్మాచరణపరులు ప్రతి  నిత్యమూ పాటించవలసిన కొన్ని విషయాలు*

*అవి*

*ప్రతిరోజూ కనీసం ఒక్క తులసిదళం అయినా తినండి.*

*మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ వారానికి* 
 *ఒక్కరికైనా అన్న దానం చేయండి.*

*ఎల్లపుడూ శుభాన్నీ , మంచిమాటలనీ పలకండి.దైవ నామస్మరణ చెయండి. శుభాన్ని పలుకుతూ ఉంటే  శుభం కలుగుతుంది. అశుభమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ అశుభాలు  వదలవు. ఎప్పుడైనా అశుభం పొరపాటున పలికితే, వెంటనే కాసేపు దైవ నామ స్మరణ చెయ్యండి.*

*ప్రతిరోజూ ఒక మంచి పుస్తకాన్ని కొద్ది పేజీలైనా చదవండి.   అలా చేస్తేనే  ధర్మాచరణ చేస్తున్నట్టు.*
   
*కనీసం రోజుకు ఒక్క పేజీ అయినా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. అలాచేస్తే  గ్రహాలు అనుకూలిస్తాయి.*

*ప్రతి రోజూ భగవద్గీత లోని ఏదో ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా చదవండి*

*గురూపదేశం పొందిన వారు ప్రతిరోజూ ఒక్క మాల అయినా మంత్రం జపం చెయ్యండి . కష్ట సమయంలో ఆ మంత్ర దేవత  రక్షిస్తుంది.*

*కోపాన్నీ మరియు అసూయనూ వదిలేసి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి.*

*అనుకూలించినంత వరకూ వ్రతాలూ, దానాలు చేస్తూ ఉండండి.*

*అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి*

*సవాళ్ళను ధైర్యం తో స్వీకరించండి*

*మీకు మీరు జవాబుదారీతనం తో అనునిత్యం వ్యవహరించండి*

*ప్రతి రోజూ ధ్యానం చేయండి*

*కష్టాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు* 
*కష్టమనుకోకుండా అనుభవిస్తే దాని గడువు ముగియ గానే   అది వెళ్ళిపోతుంది*

*సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి వ్యర్థ సంభాషణలతో అమూల్యమైన కాలాన్నీ శక్తినీ వృధా చేయకండి*

No comments:

Post a Comment