Tuesday, July 1, 2025

 ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, 
మెజీషియన్, రచయిత బి.వి.పట్టాభిరామ్(75) 
జూన్ 30వ తేదీ (సోమవారం) రాత్రి 9:45 నిమిషాలకు గుండెపోటుతో మరణించారు. 
ఆయనకు నివాళి 🙏

మీ చివరి నివాళులు అర్పించడానికి, జూలై 2వ తేదీ ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఆయన భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో సందర్శనార్థం ఉంచుతారు.

అంత్యక్రియలు (అంతిమ యాత్ర) జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటలకు మహాప్రస్థానంలో జరుగుతాయి.
..........
బి.వి.పట్టాభిరాం (భావరాజు వేంకట పట్టాభిరాం) రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్[1]. అతను తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో రచనలు చేసాడు. అతను విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతోపాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సుసులు నిర్వహిస్తున్నారు. అతను దూరదర్శన్ లో అనేక మేజిక్ షోలు నిర్వహించాడు. 1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో బాలలకు బంగారుబాట అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రలు గురించి వ్యాసాలు వ్రాసాడు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో "మాయావిజ్ఞానం" పేరిట వ్యాసాలు వ్రాసాడు.
జీవిత విశేషాలు
బి.వి.పట్టాభిరాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నాడు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేసాడు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికానుండి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకున్న అతను ఒత్తిడిని జయించడం, వ్యక్తుల మధ్య సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్‌షాపులు నిర్వహించాడు.

హిప్నోసిస్ పై ఇతను చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఇతనికి గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. నాష్‌విల్ల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు ఇతనికి గౌరవ పౌరసత్వంకూడా ప్రధానం చేశారు.

స్వయంగా ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్.ఆర్.డి సెంటరును నెలకొల్పి నిర్వహిస్తున్నాడు. అతను తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అకాడమీ, షార్ శ్రీహరి కోట, జుడిషియల్ అకాడమీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, డాక్టరు మర్రి చెన్నారెడ్డి మానవనరుల సంస్థ (IOA), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాదు, మచిలీపట్నం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీ రాజ్ (NIRD), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (CIRE), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, డిఆర్ డి ఎల్, డెల్, డెలాయిట్, ఇంకా రామకృష్ణ మఠం, రెడ్డిల్యాబ్స్, మహీంద్రా సత్యం, జీఈ, బేయర్ బయోసైన్స్, జేఎన్ టీయు అకాడమీ స్టాఫ్ కాలేజి, ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజీ, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంకా ఎన్నో విద్యాసంస్థలకు గౌరవ సలహాదారుగా ఉన్నాడు. వ్యక్తిత్వ వికాసం మీద, మానవవిలువల మీద, మ్యాజిక్ మీద తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ భాషలలో 110కి పైగా గ్రంథాలు రచించారు.

No comments:

Post a Comment