Thursday, July 16, 2020

బాలీవుడ్ చేసిన హత్య-సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

బాలీవుడ్ చేసిన హత్య-సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

కూల్ డ్రింక్స్ లో పురుగుమందులు కలుపుతారని తెలిసినా కోట్ల రూపాయల డబ్బుల కోసం వాటికి ప్రచారం చేసే స్వార్ధ సినీ లోకంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఒక్క రూపాయి తీసుకోకుండా భారతప్రభుత్వ ' నీతి ఆయోగ్ ' సంస్థకు అంబాసిడర్ గా ప్రచారం చేస్తున్నారు..

అవకాశవాదుల బాలీవుడ్ మాఫియా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని చంపేసింది.
యశ్ రాజ్, సాజిద్ నడియాడ్ వాలా, సల్మాన్ ఖాన్, బాలాజీ ఫిల్మ్స్, కరణ్ జోహర్, దినేష్ విజయన్, భన్సాలి, షారుఖ్ ఖాన్, టీ సిరీస్..సుశాంత్ సింగ్ ని బహిష్కరించాయి. అతను ఇక బాలీవుడ్ లో ఉండడు. అతను నటించాలంటే టీవీ సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని బతకాల్సిందే..అని కమల్ ఖాన్ అనే సినీ విమర్శకుడు ఫిబ్రవరిలో పెట్టిన ట్వీట్ సారాంశం ఇది. తను నమ్ముకున్న సినీ ప్రపంచం ఇలా తన మీద పగ బడితే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఒక సాధారణనటుడు కుంగిపోయి ఆత్మహత్య చేసుకోక వేరే మార్గం ఏముంటుంది? బాలీవుడ్ మాఫియా సుశాంత్ ను ఎలా చంపిందో చాలా మందికి తెలియదు.

సుశాంత్ సింగ్ తెలివైన విద్యార్థి. అతను ఫిజిక్స్ ఒలింపియాడ్ విజేత మరియు ఇంజనీరింగ్ ప్రవేశంలో టాపర్. నటుడు అవ్వాలని ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు 34 ఏళ్ళ వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు.

కరణ్ జోహర్ ఒక రాక్షసుడు. అతను ఎవరి జీవితాన్ని అయిన నాశనం చేసే ఊబి లాంటోడు. ఇతను నిర్వహించే కాఫీ విత్ కరణ్ అనే టీవీ కార్యక్రమానికి వచ్చిన నటులు వీడు వేసే కుళ్లు జోకులకు నవ్వాలి, ఎదుటి వారిని చులకన చేసే వీడి పిల్ల ప్రవర్తనకు ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు లేకుంటే వాడు ఒక భూతంలా వెంటాడుతాడు.

కరణ్, యశ్ రాజ్ ఫిల్మ్స్, షారుఖ్ ఖాన్, భన్సాలీ మరియు మరికొంతమంది ఒక మాఫియా గ్యాంగ్ లా పని చేస్తారు. ఈ మాఫియా అండదండలు లేకుండా బాలీవుడ్ నటీనటులు బతకడం కష్టం. సినిమాల నిర్మాణంలో ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న బాలీవుడ్ పరిశ్రమ ఒక ఐదారుగురు మాఫియా చేతుల్లో చిక్కుకోవడం చాలా సిగ్గుచేటు. ప్రతిభ, నైపుణ్యం, కష్టపడే తత్వం, అంకితభావం ఉంటే అవకాశాలు రావా?
అస్సలు రావు. అవకాశాలు కావాలంటే నీకొక వారసత్వం ఉండాలి, ప్రత్యేకమైన ఇంటి పేరుండాలి, నువ్వొక మతానికి చెందినవాడై ఉండాలి లేకుంటే నువ్వు ఎప్పటికీ బయటివాడివే.

సుశాంత్ సింగ్ ని చాలా రకాలుగా మానసికంగా హింసించారు. స్కూల్ చదువును మధ్యలోనే వదిలేసిన కరణ్ జోహర్, ఆలియా భట్, కపూర్ వారసుల కంటే కూడా సుశాంత్ చాలా తెలివైనవాడు, మంచి చదువరి. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మంచి సందేశాలు, స్ఫూర్తి నింపే కొటేషన్స్, సంస్కృత శ్లోకాలు, ఇంజనీరింగ్, సైన్స్ కి సంబంధించిన విషయాలు పెట్టేవాడు. అతను ఆలోచనాపరుడు. బాలీవుడ్ అవకాశవాదులకు ఇతను, ఇతని ఆలోచనాధోరణి నచ్చేది కాదు. తాను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన మెసేజిలు, పోస్టులు తీసేసే వరకు బాలీవుడ్ మాఫియా హింసించేది. కరణ్ షో లో ఇతనికి చాలా తక్కువ ఓట్లు పోలయ్యేవి. రెండేళ్ల నుంచి యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ వారు ఛాన్సులు ఇచ్చినట్టే ఇచ్చి క్యాన్సిల్ చేసేవారు. ఇతనికి కోపం ఎక్కువ, ఆవేశపరుడు, ఇతనితో పని చెయ్యడం చాలా కష్టం అంటూ గాలి కబుర్లు రాసే కొంతమంది చేత గాలి వార్తలు ప్రచారం చేశారు. గతేడాది వచ్చిన ఇతని చివరి సినిమా చిచోర్ సూపర్ హిట్. ఇతనికి రావాల్సిన సినిమాలు చాలా వరకు రణవీర్ సింగ్ కి వెళ్లిపోయాయి. పద్మావతి సినిమాను వక్రీకరిస్తున్నారన్న కోపంతో కొంతమంది జాతీయవాదులు షూటింగ్ సమయంలో భన్సాలి ని కొట్టారన్న కోపంతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరులో రాజ్ పుత్ తీసెయ్యాలని బాలీవుడ్ మాఫియా బెదిరించింది కూడా.

మీకు గుర్తుందా ఇతను నటించిన సొంచరియా సినిమాను అందరూ చూసి తనను ఆదరించాలని, లేకుంటే ఎలాంటి వారసత్వం లేని తనకు అవకాశాలు రావడం కష్టం అని తన ఇన్స్టాగ్రామ్ లో అభిమానులను వేడుకున్నాడంటే అతని పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలి మనం.
అందం ఉంది, అందమైన నవ్వు మొహం, మంచి చదువరి, తెలివైనవాడు, నటనలో నైపుణ్యం కూడా ఉంది. కానీ బాలీవుడ్ మాఫియా అతడిని చంపేసింది. 90 శాతం చెత్త సినిమాలు తీసే పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ఇతని చావుకు కారణమైన ప్రతి ఒక్కరు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వారసత్వంతో విలవిల్లాడుతున్న మన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా బాలీవుడ్ మాఫియాకు తక్కువేమీ కాదు..

సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ లక్ష్యాల్లో కొన్ని...
క్రియా యోగ నేర్చుకోవాలి.
కైలాష్ లో ధ్యానం చెయ్యాలి.
మన వేద విజ్ఞానాన్ని తెలుసుకోవాలి.
స్వామి వివేకానంద గురించి డాక్యుమెంటరీ చెయ్యాలి.
విద్యార్థులను దేశ రక్షణ రంగాల్లో చేర్పించాలి.
ఉచిత విద్య కోసం పని చెయ్యాలి....

Source - Whatsapp Message

No comments:

Post a Comment