Saturday, November 1, 2025

 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(262వ రోజు):--
        స్వామీజీ తన జీవితంలో దుర్ఘ టనలు ఎదుర్కొన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఢిల్లీలో ఒక ముఖ్యమైన కార్యకర్తను అతని కొడుకే హత్యచేశాడు. స్వామీజీకి కార్యదర్శిగా పనిచేసే ఒక అమెరికన్ వ్యక్తి కామెర్లవ్యాధికి బలయ్యాడు. తన సవతి తల్లి కొడుకు త్రాగుబోతు తనం వల్ల అకాలమృత్యువు వాత పడ్డాడు. కొందరు శిష్యులు తాము గురువుగారి కంటే గొప్పవారైనట్లు భావించి, ఆయనను బాహాటంగా విమర్శించడం మొదలుపెట్టారు. దేనికీ భయపడకుండా ఆయన తన స్వేచ్చా గానాన్ని వినిపించేవారు, వినదలుచుకున్న వారికోసం. "విజయం పొందినా పొందకపోయి నా పర్వాలేదు" అని చెప్పేవారు అందరికీ ; తను బోధించినదే ఆచరించేవారు కూడా.
        తనవద్దకు వచ్చిన వారందరికీ వారి వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన వివేకాన్నీ, ధైర్యాన్నీ అందించడమే తన ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారు తను బోధించినన్నా ళ్లూ. వారంతా తమ స్వప్రయత్నం ద్వారా ముందుకుసాగి తమతోనే ఉన్న నిజమైన దైవాన్ని గ్రహించాలి. ఈ మార్గాన్ని జనులకు చూపే తన లక్ష్యం నుంచి ఆయన ఎన్నడూ - ఒక్క రోజైనా, ఒక్కగంటైనా - మరల లేదు. 
         తన జీవితాన్ని తన చెప్పుచేత ల్లో ఉంచుకోగలిగిన వాడు ప్రపంచా న్నంతనూ జయించగలడని స్వామీజీ విశ్వసించారు. విజయాని కి అదే నిజమైన పరీక్ష. వ్యాధిగ్రస్త మైన మనసుకు చికిత్సకోసం హిమాలయాలకు వెళ్లి ఆశ్రమంలో చేరటం కొందరికి అవసరమైనా, అందరూ ఆవిధంగా చేయనవసరం లేదని ఆయన అభిప్రాయం. " ఈ శరీరం ప్రపంచంలో వ్యవహరించ డానికి నిర్దేశించ బడింది. దీని నిజమైన యజమానికి ఎక్కడికైనా వెళ్లి, ఎప్పుడైనా, ఏదైనా చేసే స్వాతంత్య్రం ఉంది - ప్రత్యేకమైన గుర్తింపు పత్రమున్న వ్యక్తికిలా. 
         ప్రజలకు సేవచేయని స్వాముల నూ, మునులనూ ఆయన విమర్శిం చేవారు : "వాళ్లంతా ఈదేశం పండి స్తున్న ఆహారాన్నే తీసుకొని తింటున్నారు ; కాని, దానికి బదులు గా ఏమీ ఈయటం లేదు. మన ఆర్థిక స్థితికి దీనిని భరించే శక్తిలేదు. కొండ మీదినుంచి దిగివచ్చి ప్రపంచానికి సాయంచేయ్యడానికి భయపడితే, వాళ్లకేం జ్ఞానం ఉన్నట్లు ?" భగవద్గీత 3 వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృకృష్ణుడు పనిచేయ కుండా భుజించేవారందరూ దొంగ లన్నాడు. గాంధీజీ వ్యవసాయ దారులకు వర్షాకాలం లోనూ, శీతా కాలంలోనూ పనులుండవు కనుక ఆ కాలాలలో రాట్నంతో నూలు వడకాలని వారిని ఒప్పించడానికి అదే శ్లోకాన్ని వినియోగించారు. 
   "ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ! తైర్దత్తా నప్రదాయైభ్య యో భుంక్తే స్తేన ఏవ సః !!   (3-12)"
        యజ్ఞాలద్వారా పూజింపబడిన దేవతలు కోరిన సుఖాలనిస్తారు వారివల్ల పొందిన వస్తువులను వారికి అర్పించకుండా అనుభవించ డం దొంగతనంతో సమానం. 
        స్వామీజీ తదనంతరం ఆయన వంటి వారెవరూ ఉండబోరని చిన్మయమిషన్ సభ్యులు తరుచూ వాపోయేవారు. వారి అభిప్రాయం 
సరైనదే ; మరొక స్వామి చిన్మయా నంద ఉండబోరు. కాని, తమకున్న ప్రత్యేకమైన సామర్థ్యాల తోనూ, ప్రేరణల తోనూ పనిచేయటానికి ముందుకు వచ్చిన ఎందరో బ్రహ్మ చారులున్నారు ; ఇంకెందరో బ్రహ్మ చారులు ముందుకు వస్తారు. విత్తనాలను చాలా జాగ్రత్తగా నాటడం జరిగింది ; తగిన సమయం లో అవి వృక్షాలై ఫలించకపోవు. 
        1974 లో స్వామి గోవిందగిరి తపోవన్ కుటీరం నుంచి మద్రాసు కు వైద్యచికిత్స కోసం వచ్చారు. స్వస్థత చిక్కిన తర్వాత, తన సహ శిష్యుడు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామీజీ బోధనల గురించి ఆయన సంక్షిప్తంగా చెప్పినదిది:
       స్వామి తపోవన్ మాత్రమే కాదు, స్వామి చిన్మయానంద కూడా నాకు గురుసమానులే. ఔను, నేను స్వామి చిన్మయానంద నుంచి నేర్చుకున్నది చాలానే ఉంది. సత్యాన్ని గ్రహింప జేసే శక్తి ఆయనకుంది. ఆయన మాటలు విన్నపుడు తెలుసుకోవాల్సి నదంతా తెలిసిపోయిందని మన కనిపిస్తుంది. ఆ జ్ఞాన ప్రకాశాన్ని మనసులో నిలిపి శంకలన్నీ మాయంచేయటం లోనే మన మంతా విఫలమౌతున్నాం. మన పాత ప్రవృత్తులు మళ్ళీ వెనుకకు వచ్చి మనలో పాతుకుపోయే అవకాశా న్నిస్తున్నాము. 
       భగవదవ తారులైన ఋషులం దరూ దివ్యగానాన్ని వినిపించే వాద్య పరికరాలే. విశ్వ సేవకే అంకితమైన ఆ మహనీయులు తమ అవతారం ఈవిధంగా ఉండాలనో, మరోవిధం గా ఉండాలనో కోరుకోరు. తాము ఎక్కడున్నా, ఎలాఉన్నా తమలోనూ, ప్రపంచంతోనూ వారు నిరంతర సంతుష్టితో ఉంటారు. మహాత్ముల ప్రత్యేకత ఇదే. అన్ని కాలాలకూ అన్వ యించే జీవన శాస్త్రమైన వేదాంతం వ్యక్తికి తను వాగ్దానం చేసినదంతా చేయగలదా? వేదాంతజ్ఞానం సత్య మని నిరూపించడానికి స్వామి జీవితం, ఆదర్శం దృష్టాంతంగా నిలిచాయి. 
                        --***--
        🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺

No comments:

Post a Comment