Saturday, November 1, 2025

ధ్యానం అంటే నువ్వు అనుకునేది కాదు..! | The Secret of Supreme Meditation 🔱

ధ్యానం అంటే నువ్వు అనుకునేది కాదు..! | The Secret of Supreme Meditation 🔱

https://youtu.be/ZzJF0vdsh_s?si=2ng-vkHnaJp2MULx


ధ్యానం అంటే ఏమిటని అడిగితే కొంతమంది మనసుని నిశబ్దం చేయడం అని అంటారు. ఇంకొందరు దేవుడిని కలుసుకోవడం అని అంటారు. మరి కొందరేమో ఒత్తిడిని తగ్గించుకోవడం అని అంటారు. కానీ అసలు సత్యాన్ని ఎవ్వరూ చెప్పలేదు. ధ్యానం అంటే కేవలం మనసుని ప్రశాంతం చేయడం కాదు. ధ్యానం అంటే ఆ యూనివర్స్ తో మన మనసు ఒక్కటయ్యే క్షణం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది అదే యోగులు ఋషులు అనుభవించిన మహా ధ్యాన రహస్యాన్ని కొందరికి ధ్యానం క్షణాల్లో దైవానుభూతిలా అనిపిస్తుంది. మరికొందరికి సంవత్సరాలుగా ధ్యానం చేసిన వారికి అనుభవానికి రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ధ్యానం వెనక ఉన్న ఆ గూఢ సత్యం ఏమిటి? వేదాలు చెబుతున్న ఆ నిశబ్ద రహస్యం ఎక్కడ దాగి ఉంది? ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ధ్యానం అనేది మనిషి కనుగొన్న మార్గం కాదు భగవంతుడు మనిషిలోకి ప్రవేశించే ద్వారం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి. ముందుగా ఈ ధ్యానం ఎప్పుడు పుట్టింది అనేది తెలుసుకోవాలి. సృష్టి ఆరంభంలో శబ్దమే మొదట పుట్టింది. అది కదలికకు రూపం ఇచ్చింది కాలానికి ఆరంభాన్ని ఇచ్చింది. కానీ ఆ శబ్దం ఆగిన క్షణంలోనే మొదటిగా నిశబ్దం జన్మించింది. ఆ నిశబ్దమే ధ్యానానికి మూలం ఆ నిశబ్దంలోనే ఈ సృష్టి విశ్రాంతి తీసుకుంది. దేవుడు తనలోకి మళ్ళీ మునిగిపోయాడు. ఋషులు మహర్షులు ఆ నిశబ్దాన్ని మళ్ళీ అనుభవించాలనే కోరికతో ఈ ధ్యాన యాత్రను మొదలు పెట్టారు. అప్పుడు వారు గ్రహించారు శబ్దం సృష్టిని ప్రారంభిస్తుంది. కానీ నిశబ్దం ఆ సృష్టినే నిలబెడుతుంది అని ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు కళ్ళు మూసుకొని మన లోపల ఉన్న విశ్వాన్ని దర్శించడం నీ ఊపిరి నిశబ్దంగా మారినప్పుడు నీ ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు నువ్వు నీలో ఉన్న ఆ శాశ్వత నిశబ్దాన్ని వింటావు. అక్కడ మాటలు లేవు కానీ ఒక చైతన్య ప్రవాహం ఉంది. అక్కడ కాలం ఆగిపోతుంది కానీ జీవం మేల్కుంటుంది. అదే క్షణంలో మీరు తెలుసుకుంటారు మీరు శరీరం కాదు మీరు మనసు కాదు మీరు ఒక చైతన్యం అని అయితే ఆ చైతన్యాన్ని కేవలం తెలుసుకోవడంతో సరిపోదు. దాన్ని ప్రతీక్షణం అనుభవించాలి. అవగాహనను అనుభవంగా మార్చే మొదటి దారి నీ శరీరాన్ని ఈ భూమితో మేళవించడం వేదాలు చెబుతున్నాయి మాతా భూమిహి పుత్రోహం పృథివ్యః అని ఈ వాక్యము అధర్వణ వేదంలో ఉంది. అంటే దీని అర్థం భూమి మన తల్లి మనం ఆమె సంతానం అని అంటే మన ప్రాణం భూమి ప్రాణం నుండే పుట్టింది. అందుకే ధ్యానంలో కింద కూర్చోమని అంటారు. ఎందుకంటే భూమి నీకు కేవలం నేల కాదు అది జీవశక్తి. ఈ భూమి హృదయగర్భంలో నిశబ్దంగా కొట్టుకునే ఒక చైతన్య నాదం ఉంది. ఆ నాదం మీ హృదయ స్పందనతో సమానంగా కదులుతుంది. మీరు నేలపై కూర్చున్నప్పుడు మీ కాళ్ళ కింద ఉన్న భూమి శక్తి మీలోకి ప్రవేశించడం ప్రారంభిస్తుంది. మీ కణాలు, మీ నాడులు, మీ ప్రాణం అన్నీ ఆ తరంగంతో సమానమైన రిథంలో కలిసిపోతాయి. అప్పుడు ఆ సూక్ష్మ కంపనం నీ వెన్నుముక దాకా పైకి ఎగిసిపోతుంది. నీ శరీరం మృదువైన గీతంలా ఆ భూమి రిథంలో నడవడం మొదలు పెడుతుంది. అప్పుడు నీ మనసు ఆగిపోతుంది. నీ ఊపిరి లోతుగా మారుతుంది. నీ చైతన్యం భూమి యొక్క నిశబ్దంలో మునిగిపోతుంది. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. ఈ భూమి యొక్క గుండె చప్పుళ్లను వినడం. ఎందుకంటే మనం పుట్టింది ఈ భూమిపైనే జీవించేది ఈ భూమిపైనే మన శరీరం చివరికి లయమైపోయేది కూడా ఈ భూమాత ఒడిలోనే కాబట్టి ఈ నిజాన్ని మీరు గుర్తించిన క్షణంలోనే మీరు కేవలం ధ్యానం చేయడం కాదు మీరు ఈ భూమితో ఏకమవుతారు. భూమి యొక్క చైతన్యం మీలోకి ప్రవేశించిన తర్వాత ఆ శక్తి మీ వెన్నుముక మార్గంలో పైకి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. అందుకే ధ్యానంలో ఒక సూత్రం చెబుతారు. శరీరం స్థిరమైతే శక్తి జాగృతం అవుతుంది అని ఎందుకంటే వెన్నుముక మధ్యలో ఒక గూడ మార్గం ఉంది. దానిని సుషుమ్న నాడి అంటారు. అది కేవలం నాడి కాదు అది భగవంతుడి శక్తి ప్రవహించే శ్రవంతి. ఈ నాడి భూమి నుంచి ఆకాశం దాకా ఉన్న ఒక అంతరిక లింక్ లాంటిది. మీరు నిటారుగా కూర్చున్నప్పుడు భూమి నుంచి వచ్చే శక్తి ఆ మార్గంలో పైకి ఎగిసిపోతుంది. అది మొదట మృదువైన వేడిలా అనిపిస్తుంది. తర్వాత ఒక కాంతిలా మారుతుంది. చివరికి ఒక నిశబ్ద తరంగంగా చైతన్యంలో కలిసిపోతుంది. ఈ ప్రయాణాన్నే యోగులు కొండలిని మేల్కొలుపు అని పిలుస్తారు. అది మన శరీరంలో ఆధ్యాత్మిక శక్తి మెలకువ అవ్వడం. వెన్నుముక వంకరగా ఉంటే ఆ శక్తి మధ్యలోనే ఆగిపోతుంది. కానీ నిటారుగా ఉన్నప్పుడు ఆ శక్తి నిర్బంధం లేకుండా సుషుమ్న నాడి ద్వారా పైకి ఎగిసి పోతుంది. ఆ ప్రవాహం పైకి ప్రవహిస్తూ ముందుగా మన హృదయాన్ని తాకుతుంది. తరువాత మన గొంతు దాటి మద్యంలోని ఆజ్ఞ చక్రాన్ని మేల్కొలుపుతుంది. చివరికి సహస్రార చక్రంలో దివ్య కాంతిగా వికసిస్తుంది. అదే క్షణంలో మీరు ఈ భూమి శక్తిని ఆ ఆకాశ చైతన్యాన్ని ఒకేసారి నీ లోపల అనుభవిస్తారు. కాబట్టి ధ్యానం అంటే కళ్ళు మూసుకుని కూర్చోవడమే కాదు. ధ్యానం అంటే భూమి నుంచి ఆకాశం వరకు మీ శక్తి యొక్క ప్రయాణం కూడా. భూమి నుంచి పైకి ఎగసిన ఆ శక్తి ఇప్పుడు నీ ఊపిరిగా మారుతుంది. ఆ ఊపిరి కేవలం గాలి కాదు అది నీలో ప్రవహించే ఆ దైవ చైతన్యం. అందుకే ప్రాచీన ఋషులు చెప్పారు శ్వాసే పరమజ్ఞానం అని. ఎందుకంటే ఊపిరి అనేది చైతన్యానికి తాళం చెవి. నువ్వు ఊపిరిని గమనించడం మొదలుపెట్టినప్పుడు నీ మనసు ఆలోచనల వలయం నుంచి బయటకు వస్తుంది. ఆలోచనలు తగ్గినప్పుడు నీ లోపల నిశబ్దం మొదలవుతుంది. కానీ ఆ నిశబ్దం ఖాళీ కాదు అది ఒక జీవం ఆకాశంల అంతులేని స్థితి అందులో ప్రతి ఊపిరి ఒక నాదంలా వినిపిస్తుంది. ప్రతి నిశ్వాసం ఒక కొత్త శాంతిలా అనిపిస్తుంది. ఆ నాదాన్ని విన్నవాళ్ళనే ఋషులు అన్నారు. వారు తమ లోపల ఆ నిశబ్దాన్ని విన్నప్పుడు ధ్యాన స్థితిలో వారు తలమునకలు అయ్యారు అప్పుడే వాళ్ళు గ్రహించారు ప్రతి ఊపిరి ఒక మంత్రం ప్రతి నిశ్వాసం ఒక సమర్పణ అని అయితే ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఈ మహా ధ్యాన రహస్యాన్ని ఎవరు మొదటిగా అనుభవించారు అనేది ఈ మహా ధ్యాన రహస్యాన్ని అనుభవించిన వారు మనలాగా సామాన్యులు కాదు వారు యోగులలో యోగులు మహా యోగులు వారి మనసు ఈ భూమి లాంటిది వారి అవగాహన ఆ ఆకాశం లాంటిది వారు కూర్చుని కళ్ళు మూసుకోలేదు వారు కళ్ళు తెరిచే ఈ సృష్టినంతటిని చూశారు. వారి ప్రతి శ్వాసలో ఆ భగవంతుని గుర్తించారు. వారు శ్వాసని కేవలం గమనించలేదు. ఆ శ్వాసనే ఆ విశ్వంగా భావించారు. వారు శబ్దాన్ని వినలేదు. శబ్దంలో ఉన్న శాంతిని గ్రహించారు. ఆ స్థితిలో శరీరం నిశబ్దమైంది. ఆలోచన ఆగిపోయింది. కానీ అవగాహన మాత్రం అంతటా విస్తరించింది. వారు గ్రహించారు మనసు ఆగిన చోటే చైతన్యం ప్రారంభం అవుతుంది అని అదే స్థితిని వారు మహాధ్యానం అని పిలిచారు. అక్కడ నేను అనే భావం లేనే లేదు కేవలం చైతన్యం మాత్రమే ఉంది. అయితే ఈ స్థితి సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అది మన మనసును దాటి చైతన్యంలోకి ప్రవేశించే స్థితి. ఆ స్థితి తపస్సు, నియమం, జాగృతి ఈ మూడు కలిసిన ఒక పర్వత శిఖరం లాంటిది. దానిని ఎక్కిన వారే ఈ సృష్టి రహస్యాన్ని అనుభవించారు. అదే మహా ధ్యాన రహస్యం. అక్కడ మౌనం మాత్రమే మాటగా మారుతుంది. శ్వాస ప్రార్థనగా మారుతుంది. జీవం స్వయంగా జ్ఞానం అవుతుంది. ఆ మహాయోగులు అనుభవించిన స్థితి ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు కాబట్టే వేదాలు మనకోసం ఒక మార్గాన్ని చూపాయి. అవే సామాన్యులకు చేరుకునే ధ్యానాలు. ప్రతి మనిషి తన స్థితికి సరిపోయే ధ్యానం చేయవచ్చు. ఎందుకంటే ధ్యానం ఒక్కటే కాదు అనేక రూపాలు ఉన్నాయి. శాంతి ధ్యానం మనసు నిశబ్దమయ్యే మార్గం ఆరోగ్య ధ్యానం శరీరాన్ని ప్రాణంతో నయం చేసే మార్గం సంపద ధ్యానం అబండెన్స్ ఫ్రీక్వెన్సీని మేలుకొలిపే సాధన సంకల్ప ధ్యానం ఆలోచనలను సృష్టిగా మార్చే మార్గం చైతన్య ధ్యానం అవగాహనను దివ్యంగా మార్చే ప్రయాణం ఈ ధ్యానాలన్నీ వేరు వేరు దారు లాంటివి కానీ చివరి కవి మనల్ని తీసుకెళ్లే స్థలం మాత్రం ఒక్కటే అది మీలోని సత్యానికే వేదాలు చెప్పిన ఈ మార్గం లు మనిషి నడవగలిగే దారులు ఈ ధ్యానాలు కూడా ఆ మహాధ్యానం వైపే మనల్ని తీసుకెళ్తాయి. భూమి నుండి ఆకాశం వరకు ఉన్న ఆ అంతరాన్ని మనలో కలుపుతాయి. అందుకే ఈ ధ్యానాలు కేవలం యోగులకే కాదు మనలాంటి సాధారణ మనుషులు కూడా సాధించగలిగే మార్గాలు. వీటిని అభ్యాసించినప్పుడు నీ ఆలోచన మారుతుంది. నీ శక్తి సమతుల్యం అవుతుంది. నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది. అందుకే ఈ ధ్యానాల వెనక దాగి ఉన్న రహస్యాన్ని మీ అందరికీ సులభంగా అర్థమయ్యేలా వివరించాలని అనుకుంటున్నాను. ఇక నుంచి మనం ఈ ధ్యాన రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సంపద ధ్యానం, శాంతి ధ్యానం, ఆరోగ్య ధ్యానం, సంకల్ప ధ్యానం, చైతన్య ధ్యానం ఇవన్నీ మీ జీవితంలో ఎలా చేయాలి ఎలా అనుభవించాలి అన్నది తదుపరి వీడియోలో ఒక్కొక్కటిగా వివరించబోతున్నాను. కాబట్టి మీరు ముందుగా ఏ ధ్యానం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వచ్చిన ధ్యానం పైనే మన తదుపరి వీడియో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మహా ధ్యాన రహస్యం మీకు ఏమనిపించింది? మీరు ఇప్పటివరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ కొట్టి మీ WhatsAppట్ఫ లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.

No comments:

Post a Comment