Monday, June 29, 2020

మంచి నీళ్ళు ఎప్పుడు ఎలా త్రాగాలి

మంచి నీళ్ళు ఎప్పుడు ఎలా త్రాగాలి ...
.....
భోజనం చేసిన 1 1/2 గంట తర్వాత నీళ్ళు త్రాగితే ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారం జఠరస్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీపమై ఉంటుంది. నీరు త్రాగితే జఠరాగ్ని చల్లబడి తిన్న ఆహారము పూ ర్తిగా జీర్ణము కాక మలబద్దకం గ్యాస్ సమస్యలు వస్తాయి.

భోజనానికి ఒక గంట ముందు నీరు త్రాగవచ్చు. భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే , కాస్త అంటే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చు. భోజనం మగించాక గొంతు శుద్ధి కోసము, గొంతు సాఫీగా ఉంచటానికి రెండు గుటకల నీరు త్రాగవచ్చును.

భోజనం తరువాత నోరు సుబ్బరంగా నీళ్లతో పుక్కిలించాలి

భోజనంతో తీసుకోతగిన ఉత్తమమైన పదార్థాలు, పండ్లరసాలు , మజ్జిగ , పాలు. మనం ఎల్లప్పుడు పండ్లరసాలను ( ఆయా ఋతువుల్లో వచ్చే పళ్ళు మాత్రమే) ఉదయం భోజనాంతరము, మజ్జిగ మధ్యాహ్న భోజనాంతరము , పాలు రాత్రి భోజనాంతరము మాత్రమే త్రాగాలి. ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు , ఎందుకంటే ఆయా సమయాల్లో మాత్రమే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది.

నీటిని ఎప్పుడు నిలబడి త్రాగరాదు.

💦 రిఫ్రిజరేటర్ నీళ్ళు చాలా హానికరం.

💧గట గటా నీరుత్రాగే విధానం మంచిది కాదు.

💧కూర్చొని నింపాదిగా ఒక్కొక్క బుక్క నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ త్రాగాలి. వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి.

ఎందుకంటే నోటిలో లాలజలం తయారవుతుంది. పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి. మనం నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగితే నోటిలోని లాలజలంతో కలసి పొట్టలోకి చేరుతుంది. పొట్టలోని ఆమ్లాలతో కలసి న్యూ ట్రల్ అవుతుంది. అసలు నోటిలో లాలజలం తయారయ్యేది పొట్టలోనికి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికే.

ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కోక్క గుటగా త్రాగుతుంది.

ఎడమ వైపు నిద్ర పోవడం

భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు
వజ్రాసనం వేయండి .
# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం
2 గంటల తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్ , హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది .
ఎడమ ప్రక్కకు తిరిగి పడుకొని విశ్రమించాలి .
# దీనిని
వామ కుక్షి అవస్దలో విశ్రమించటం అంటారు .
# మన శరీరంలో
సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
ప్రయోజనాలు

1 . గురక తగ్గి పోవును .
2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది .
6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .
14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
15 . ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి .
ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .

# దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
కుదరక పోతే తూర్పు తల పెట్టి పడుకోవాలి
# ఉత్తరం వైపు తలపెట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోకూడదు .
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

Whatsapp message posted

No comments:

Post a Comment