Saturday, August 8, 2020

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి వడ్డిస్తున్నారన్నవిషయం కూడా చాలా ముఖ్యమైనది.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు.అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి
అయితే, ఈ అన్నాన్ని ఏ విధంగా, ఎక్కడ , ఎవరు వండి వడ్డిస్తున్నారన్నవిషయం కూడా చాలా
ముఖ్యమైనది.
🥀🌹అందు వలననే పూర్వకాలంలో మడి, ఆచారాల విషయంలోఖచ్చితంగా వుండేవారు
🌹🌿మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.
🥬అర్ధ దోషం ,. 🌻 నిమిత్త దోషం.
🌺స్ధాన దోషం, 🌷గుణ దోషం ,
🌹సంస్కార దోషం. ఈ ఐదు
దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు.
🌸 అర్ధ దోషం:
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
భోజనం చేస్తున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ శిష్యునికి ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు . భోజనం చేసి ,
సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.
ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగితన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.
.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి
సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు. తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం. చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి! యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు. "అని తలవంచుకొన్నాడు.ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బు తో కొన్న పదార్థాలతో , తయారు చేసిన ఆహారం
భుజించడమే అర్ధ దోషం. మనం న్యాయం గా సంపాదించిన దానితోనే ఆహారం తయారు
చేసుకుని , భుజించడం ముఖ్యం.
🌸నిమిత్త దోషం🌸
మనం తినే ఆహారాన్నివండేవారు కూడా మంచిమనసు కలవారై
వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.
వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు , పక్షులు జంతువులు తాక కూడదు.
ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడ కూడదు.

🌹🥀అపరి శుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది.
దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి
దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి.
🌺 భీష్మాచార్యుల వారు కురు క్షేత్ర యుధ్ధం లోబాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు.వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తూ వచ్చాడు.
🍁🌾అప్పుడు
ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది.ఇప్పుడు ఇంత వివేకం గా ఆలోచిస్తున్న భీష్ముడు
ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ,ఆదేశించినప్పుడు
ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు? అని అనుకొన్నది.
🌸🌿ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను.
నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా బయటికి పోయి నేను
ఇప్పుడు పవిత్రుడినైనాను.నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను.అన్నాడు భీష్ముడు.

🌻🌿చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది తినినందు వలన మనిషిలోని మంచి
గుణములు నశించి 'నిమిత్త దోషం ' ఏర్పడుతోంది.
🌸స్ధాన దోషం
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట
చేసే సమయంలోఅనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది.యుధ్ధరంగానికి , కోర్టులు ,రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు
అంత మంచివి కావు.
🥬🥀దుర్యోధనుడు ఒకసారి
యాభై ఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని విందు భోజనానికి పిలిచాడు.
కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొట్రుపాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది.కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు.అప్పుడు కృష్ణుడు "విదురా! నేను ఆప్యాయత తో
కూడిన ప్రేమకోసమే ఎదురుచూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు.
మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి
🌻గుణ దోషం :
మనం వండే ఆహారం
సాత్విక ఆహారంగా వుండాలి.
సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని
కలిగిస్తుంది. రజోగుణం
కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది. తామస ఆహారం👏👏👏
🌷సర్వేజనాః సుఖినోభవంతు🌷

Source - Whatsapp Message

No comments:

Post a Comment