Monday, June 15, 2026

 దానం - వాగ్దానం

దానం, వాగ్దానం... చేసే ముందు ఆలోచించి చేయాలి. కీర్తికాంక్షతో చేయకూడదు. దానం చేసిన వెంటనే మరచిపోవాలి, ఇచ్చిన వాగ్దానాన్ని వీలైనంత త్వరగా నిలబెట్టుకోవాలి. అప్పుడే దానానికి, వాగ్దానానికి నిజమైన విలువ. గోరంత దానం చేసి కొండంత ప్రచారం కోరుకోవడం, వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకోవడం.. మంచిది కాదు.

కురుక్షేత్ర యుద్ధానంతరం సింహాసనాన్ని అధిష్టించిన ధర్మరాజు గొప్పదాతగా పేరు తెచ్చుకోవాలని దానధర్మాలు చేస్తాడు. ధర్మజుడి కీర్తిదాహాన్ని గ్రహించిన శ్రీకృష్ణుడు దాతృత్వం ఎలా ఉంటుందో అతడికి చూపించాలనుకున్నాడు. అశ్వమేధయాగం يكور చేయమని సలహా ఇచ్చాడు. ధర్మరాజు సరేనన్నాడు. యాగాశ్వం వెంట నకుల సహదేవులు సేనలతో సహా వెళ్లారు. యాగాశ్వం మణిపురం చేరింది. وع రాజ్యాధినేత మయూరధ్వజుడు గొప్ప బలశాలి. అతని కుమారుడు తామ్రధ్వజుడు అంతకన్నా పరాక్రమవంతుడు. యాగాశ్వాన్ని బంధించిన తామ్రధ్వజుడితో యుద్ధం చేసి నకుల సహదేవులు, es తరవాత భీమార్జునులు ఓడిపోయారు. మయూరధ్వజుణ్ని యుద్ధంలో ఓడించడం కష్టమని గ్రహిస్తాడు శ్రీకృష్ణుడు. మాయోపాయంతో ఓడించాలని ధర్మరాజుతో కలిసి వృద్ధుల వేషాల్లో మణిపురం వెళ్లి 'దానం కావాలి' అని అడుగుతారు. అతడు ఏంకావాలో కోరుకోమనగానే 'మహారాజా! మీ దర్శనం కోరి వస్తుండగా అడవిలో ఒక సింహం ఇతడి కుమారుణ్ని చంపబోయింది. బాలుణ్ని వదలమని మేము ప్రార్ధించగా మయూరధ్వజుని శరీరంలో సగభాగం కోసి తెచ్చినట్లయితే బాలుణ్ని విడిచిపెడతానంది. కనుక మీ శరీరంలో సగభాగాన్ని మీ భార్యాపిల్లలే కోసి ఇవ్వాలి' అన్నాడు కృష్ణుడు.

మయూరధ్వజుడు చిరునవ్వుతో అంగీకరించి తనను ఖండించమని భార్యను, కొడుకు తామ్రధ్వజుణ్ని ఆదేశిస్తాడు. ఆ మాట విని ధర్మజుడు అతడి దానగుణానికి నివ్వెరపోతాడు. భార్య, కొడుకు తన శరీరాన్ని ఖండిస్తుండగా మయూరధ్వజుడి ఎడమ కంటినుంచి నీరు కారింది. వెంటనే శ్రీకృష్ణుడు 'బాధపడుతూ ఇస్తున్నావు కనుక నీ దానం పనికిరాదు' అన్నాడు. అందుకు మయూరధ్వజుడు 'అది బాధ కాదు. దానానికి ఉపయోగపడే అదృష్టం తనకు కలగలేదని ఎడమవైపు శరీరం ఆవేదన చెందుతోంది' అన్నాడు. మయూరధ్వజుడి త్యాగానికి, దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు, ధర్మజుడు తమ నిజరూపాలను చూపించారు. 'మయూరధ్వజా! నీ దానగుణం నిరుపమానం. ఏదైనా వరం కోరుకో' అన్నాడు శ్రీకృష్ణుడు. అప్పుడు మయూరధ్వజుడు 'మహాత్మా! శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా, అనునిత్యం మీ ముందుండేలా వరం ఇవ్వమని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు 'తథాస్తు... నేటినుంచి ప్రతి దేవాలయం ముందు నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. నీ చుట్టూ ప్రదక్షిణం చేసిన తరవాతే భక్తులు తమ ఇష్టదైవాలను దర్శిస్తారు. అలాంటి భక్తుల కోరికలే నేను

తీరుస్తాన'ని వరమిచ్చాడు. కాబట్టి దానం చేసేటప్పుడు సంతోషంగా ఎదుటివారిని తృప్తిపరిచే విధంగా చేయాలి. వాగ్దానం చేసిన తరవాత ఎన్ని కష్టాలొచ్చినా వాటికి ఎదురీది ప్రాణాలొడ్డి అయినా దాన్ని నెరవేర్చాలి.

ఎన్.బి.యస్.శ్రీనివాస్ పోలిశెట్టి

No comments:

Post a Comment