Sunday, June 29, 2025

 *నీతికథలు*
*ఒకసారి, ఒక గ్రామపంచాయతీలో బహిరంగన్యాయస్థానంలో ఒక సమస్యను పరిష్కరించడానికి పెద్దలు సమావేశమైయ్యారు. కొంత దూరంలో, ఒక సాధువు ఎప్పటినుంచో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని వుంటున్నాడు.*

*పెద్దల న్యాయస్థానం ఏ నిర్ణయానికి రాలేకపోవడం వలన,  తమ సమస్య పరిష్కారం కోసం ఆ సాధువును సంప్రదించమని ఎవరో సూచించారు.*

*వారంతా సాధువు దగ్గరకు వెళ్లారు. అంతమందిని చూసి సాధువు వాళ్ళని ఏం కావాలని అడిగాడు.*

*"మహాత్మా, గ్రామంలో ఒకే ఒక బావి ఉంది. మేము ఆ బావిలో నీరు త్రాగలేకపోతున్నాము." అని గ్రామస్థులు సమాధానమిచ్చారు. *

*సాధువు, "ఎందుకు, ఏమి జరిగింది? మీరు దాని నుండి నీరు ఎందుకు త్రాగలేకపోతున్నారు?" అని అడిగాడు.* 

*"మూడు కుక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకుని బావిలో పడ్డాయి.   అవి బయటకు రాలేక అందులో మునిగి చనిపోయాయి. ఇప్పుడు నీరు బాగా దుర్వాసన వస్తోంది, ఆ నీరు ఎలా తాగాలి?" అని గ్రామస్తులు అన్నారు.*

*సాధువు "ఒక పని చేయండి, పవిత్రమైన గంగానది జలాన్ని  ఆ బావిలో పోయండి" అని చెప్పాడు.*

*అలా ఎనిమిది నుంచి పది బకెట్ల గంగాజలం బావిలో పోసినా సమస్య అలాగే ఉండిపోయింది.*

ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు.*

*సాధువు, "సరే, మీరందరూ సమావేశమై భగవంతుని నామాన్ని జపిస్తూ, ప్రార్ధన చేయండి," అన్నాడు.*

*ప్రజలు ‘అలాగే!’  అని, సాధువు సూచించినట్లు చేసారు, అయినప్పటికీ సమస్య అలాగే ఉంది.*

*ప్రజలు మళ్లీ సాధువు వద్దకు వెళ్లారు.*

*ఈసారి సాధువు "బావిలో   కొన్ని సువాసన వచ్చే పదార్ధాలు వేయండి" అన్నాడు.* 

*అది కూడా జరిగింది, కానీ! సమస్య ఇంకా కొనసాగింది.*

*ఇప్పుడు ఇంక సాధువు స్వయంగా బావి వద్దకు వచ్చాడు.*

*ప్రజలు, "చూడండి స్వామీ, పరిస్థితి అలాగే ఉంది, మేం ప్రతిదీ ప్రయత్నించి చూసాం, పవిత్ర గంగాజలం పోశాం, ప్రార్థనలు, కీర్తనలు చేసాం, ప్రసాదం పంచాము, బావిలో సువాసనగల పువ్వులు, పదార్ధాలు వేసాం,ఇవన్నీ!"*

*సాధువు అయోమయంగా చూస్తూ అడిగాడు, "అన్నీ చేసారు, కానీ ఈ బావిలో పడి,  చనిపోయిన మూడు కుక్కలను తొలగించారా?"*

*గ్రామస్తులు, "అదేంటి, మీరు అలా చేయమని మాకు చెప్పలేదు కదా, మేం వాటిని బయటకు తీయలేదు, మిగిలినవన్నీ చేసాం, కానీ కుక్కలు ఇప్పటికీ బావిలోనే  ఉన్నాయి!" అన్నారు.*

*సాధువు మొదట దిగ్భ్రాంతి చెందాడు, కాని ప్రశాంతంగా గ్రామస్తులకు ఇలా వివరించాడు… "నీటిలో పడి ఉన్న మూడు మృతదేహాలను బయటకు తీసే వరకు, ఎటువంటి బాహ్య చర్యలు ఎటువంటి ప్రభావం చూపవు, ముందుగా మీరు నీటి నుండి ఆ మురికిని బయటకు తీయాలి."*

*మన జీవిత కథ కూడా అలాంటిదే.  పల్లెటూరు వంటి మన దేహంలో… ‘కామం, క్రోధం, లోభం, అసూయ’ అనే అనేక జంతువులు పోట్లాడుకుని, ‘మనస్సాక్షి’ అనే బావిలో చెదపురుగుల్లా చిక్కుకుపోయాయి. అవి మెల్లగా మన మనస్సాక్షిని  లోపలి నుండి తినేస్తున్నాయి.*
*ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే... ఈ తెగులు నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తున్నాం?*

*మన జీవితాలను మెరుగుపరచు కోవడానికి బయటి నుండి చాలా కొత్త విషయాలను లోపలికి తీసుకుంటున్నాం, అయితే లోపల ఇప్పటికే కుళ్ళిపోయిన లేదా పేరుకుపోయిన వాటిని తొలగించడానికి మనం ఏమి చేస్తున్నాం?                                      దీని గురించి ఒకసారి ఆలోచిద్దాం.*

🌹🌹🌹🌹
*మనం మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకుంటే, బయట కూడా ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది, మన అంతరంగాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే, బయట ప్రతిదీ కూడా అందంగా అవుతుంది. *

🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌

No comments:

Post a Comment