Saturday, August 23, 2025

 ✍️

మన ఘనచరిత్రలో  ...
ఒక కలికితురాయి ...

మద్రాసు, 1930లు.
ఒక అమ్మాయి. 15 ఏళ్లకే పెళ్లిఅయ్యింది.
18వ ఏట తల్లి అయింది ... మరియు, బిడ్డ పుట్టిన నాలుగునెలలకే ఆమె భర్త మరణించారు.

శబ్దం లేదు.
సమాధానం లేదు.
కేవలం నిశ్శబ్దం.
కళ్ళముందున్న బిడ్డతో ఆమె జీవితం నిలిచిపోయినట్టే అనిపించింది.

కాని 
అక్కడే 
ఆమె కథ ముగియలేదు.
అక్కడినుంచే మొదలైంది...

ఆమె పేరు అయ్యల సోమాయజుల లలిత.
ఆమె తర్వాత ఏం చేసింది అంటే..

భారతదేశం 
ఆనాటికి సిద్ధంగా లేదు.

ఆమె తండ్రి
పప్పు సుబ్బారావు,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్,
ఆమె కళ్ళలోని మెరుపును గమనించారు.

ఆమెను ఓదార్చడమే కాదు.,
ఆమె భవిష్యత్తును తిరిగి ఆవిష్కరించారు.

కోలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండీకి ఆమెను తీసుకెళ్లారు.
అది మగవాళ్ల కోట.
అప్పటికి  మగాడు మాత్రమే అడుగుపెట్టగల స్థలం.
అలా అనుకున్నారంతా.

కానీ ఆమె అడుగుపెట్టింది.

_1943._
ఆమె ఇలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో బయటికి వచ్చింది.
భారతదేశపు మొట్టమొదటి మహిళా ఇంజినీర్.
ఎటువంటి కోటాలు లేవు.
ఎటువంటి ఉద్యమాలు లేవు.
_కేవలం ధైర్యమే._

ఇతరులు గుసగుసలాడినప్పుడు..
ఆమె భాక్రా నంగల్ ప్రాజెక్ట్ కోసం ట్రాన్స్‌మిషన్ లైన్లను డిజైన్ చేసింది.

దేశాలు గోడలు కడుతున్నప్పుడు 
ఆమె వెలుగు అందిస్తూ భవిష్యత్తును నిర్మించింది.

ఆమె AEI (అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్),
కోల్కతాలో చేరింది. ముప్పై ఏళ్లపాటు పని చేసింది.
సిస్టమ్స్ రూపొందించింది. లోపాలను సరిచేసింది.
ఇంగ్లీషు యంత్రాలను భారతీయ కలలతో కలిపింది.

విధవలైనవారు ప్రయాణించకూడదు అన్న దురాచారాల వల్ల సైట్ విజిట్లు ఆమెకు లభించలేదు.
కానీ ఆమె ప్రతిభ ప్రయాణించింది.

ఆమె టేబుల్ మీదే విద్యుత్ లైన్లను తీర్చిదిద్దింది.

ఆమె గొంతెత్తి మాట్లాడలేదు.
వాదించలేదు.

ప్రతి రోజు తన పనితో చరిత్రను మలిచింది.

1964, న్యూయార్క్.
మహిళా ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తల మొదటి అంతర్జాతీయ సమావేశం.ఆమె అక్కడ ఉంది.
ఒక చీరలో, ఆమెకు పేరే తెలియని దేశం తరపున.

1966 నాటికి,
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ (లండన్)కి పూర్తి సభ్యురాలిగా ఎంపికైంది.
ఇది కేవలం భారతీయ గాథ కాదు 
_ప్రపంచానికి చెప్పే సందేశం._

కానీ మీరు మన పాఠ్యపుస్తకాలను అడగండి,
ఇంజినీరింగ్ కాలేజీలను అడగండి,
డ్యామ్‌లను, గ్రిడ్‌లను అడగండి –
వారు వోల్టేజ్‌ను గుర్తుపెట్టుకుంటారు.
ఆమె పేరు మర్చిపోతారు.

కాబట్టి మళ్లీ ఎవరైనా అడిగితే –
'ఇంజనీరింగ్ రంగం మొదటినుంచీ పురుషులదేనా?'
వెచ్చగా చిరునవ్వుతో చెప్పండి –
'ప్యానెల్లు, పాలసీలు రాకముందే –
లలితాదేవి ప్రవాహాన్ని చీల్చింది' ...

ఆమె తిరుగుబాటు చేయలేదు –
తిరుగుబాటు అంటే ఏమిటో తిరిగి నిర్వచించింది.
పోరాటం లేదు.
_కేవలం పరిపూర్ణత._

        🙏💐💐🙏

No comments:

Post a Comment