Friday, May 1, 2020

వరమా - శాపమా

వరమా - శాపమా

సిక్కుల మత గురువు గురునానక్ తన శిష్యులతో
కలసి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ దేశమంతా తిరుగుతూ ఉన్న సమయంలో ఎదురైనా
జరిగిన రెండు సంఘటనలు
వాటిని వారికి శిష్యులకు వివరించిన తీరు గురించి తెలుసుకుందాం.

గురునానక్ వారి శిష్య బృందం
ఒక ఊరి ని సందర్శించారు,
ఆ ఊరిలోని ప్రజలు వీరిని ఆదరించ కపోగా, కనీసం అతిథులను మర్యాద కూడా వీరి పట్ల చూపించక వీరిని దుర్భాషలాడిన, రాళ్లతో కొట్టి ఆ ఊరి నుండి తరిమివేశారు.

గురునానక్ గారు ఆ ఊరు వెలుపలికి వెళ్ళిన తర్వాత ఈ ఊరిలోని వారు ఎక్కడికీ పోకుండా ఇక్కడే ఉందరు గాక అని దీవించి వెళ్ళాడు.

అలాగే మరుసటి రోజు వీరు మరొక గ్రామం చేరుకోవడం జరిగింది ఆ గ్రామంలో వీరిని
సాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేకూర్చి వీరు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలను జాగ్రత్తగా
వినడం జరిగింది.
వీరు తిరుగి పోతూ ఉంటే గ్రామ పొలిమేరలో దాకా వచ్చి వీరిని సాగనంపి వెళ్లారు.

వారు వెళ్ళిన తర్వాత గురునానక్ గారు ఈ ఊరిలోని ప్రజలు చెల్లా చెదురు అయి పోదురుగాక అని చెప్పి వెళ్ళిపోయాడు.

బృందంలో ఉన్న కొందరికి ఈ మాటలు అంతగా రుచించలేదు అంతేకాక వారిని కొంచెం బాధించాయి కూడా ఉండబట్టలేక గురువుగారు మీరు చేసినటువంటి పనులు మాకు ఏమీ అర్థం కావడం లేదు.

మనల్ని అవమానించిన వారిని దీవించారు మనల్ని ఆదరించిన వారిని శాపించారు
ఎందుకలా చేశారు కొంచెం వివరంగా చెప్పగలరా అని అడిగారు.

నాయనా మొదటి ఊరివారు వారికి తెలిసిందే వేదాంతముం అని అనుకుంటున్నా అజ్ఞానులు ఆచార వ్యవహారాలు తెలియని మహా మూర్ఖులు.

వీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ వీరి అజ్ఞానపు చేష్టలతో, తగాదాలు వివాదాలు సృష్టిస్తారు, వీరు మిగిలిన ప్రజలందరినీ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తారు.
కాబట్టి ఇలాంటి మూర్ఖులు ఇక్కడ ఉండడమే ప్రజహితం.

ఇక రెండో ఊరి వారి గురించి వారు చాలా గొప్పవారు ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నవారు అతిది మర్యాదలు తెలిసిన ఉత్తములు వారు ఎక్కడ ఉంటే అక్కడ
చక్కటి సంస్కృతి అలవడుతుంది మంచి మర్యాదలు పదిమందికి నేర్పుతారు కాబట్టి వారు అవసరం ప్రపంచానికి ఉంది అందుకనే వారిని ఆ విధంగా వీ ఆశీర్వదించ వలసి వచ్చింది.

ఈ రెండు సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత వ్యవహారాల కు చైనా, భారత్ కు చక్కగా సరిపోతాయి.

తాగి తాను చెడ్డ కోతి వనం అంత పాడు చేసింది అన్నట్లు చైనా వారు వారి విషసంస్కృతి తో వారు
చెడింది కాక
ప్రపంచాన్నంతటినీ అతలాకుతలం చేశారు.

ప్రపంచ దేశాలన్నీ నేడు వీరిని చూసి ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాయి.

ఇకా భారత దేశం గురించి!

తులసి మొక్క లాంటి వారు
భారతీయులు,తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ ఆయుష్షు ఆరోగ్యం రెండూ పంచి పెడుతుంది.
భారతీయులు కూడా అలాంటి వారే.

తులసి ఆకులు తిన్న తులసి నీళ్లు తాగిన ఆరోగ్యం పదింతలు మెరుగుపడుతుంది భారతీయులతో స్నేహం
చక్కని సంస్కృతితో పాటు మంచి వైద్య విధానాన్ని కూడా అలవాటు చేస్తుంది.

ఇది నిజం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కరోన కు
టీకాలను భారతదేశం తొందరగా సృష్టిస్తే మంచిదని
వారి పత్రిక మరియు ప్రసార మాధ్యమాలలో ప్రచురించు కుంటున్నారు.

అంటేనే మన గొప్పతనం ఏంటో తెలుస్తుంది.

ఈ కథలోని నీతి ఏమిటంటే మనం మన పిల్లలకి సంపద ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ చక్కని సంస్కారం నేర్పాలి.

అది లేకపోతే మనం వారికి
ఇచ్చిన సంపద బూడిదలో పోసిన పన్నీరు తో సమానంగా
సర్వ నాశనం అయిపోతుంది.

భావితరాలకు వారసులు వారు వారిని చక్కగా పెంచుకుందాం
భారతీయ గొప్పదనాన్ని కాపాడుకుందాం.

No comments:

Post a Comment