*శరీరంలో ఏ టైంలో*
*ఏం జరుగుతుంది?.*
రాత్రి 07 నుంచి 09 గంటల మధ్య సమయం లో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైం లో రాత్రి
భోజనాన్ని కచ్చితంగా ముగించాలి. మెదడు, ప్రత్యుత్పత్తి అవయవాలను పెరికార్డియం ఈ సమయంలో యాక్టివేట్ చేస్తుంది. రాత్రి 09 తర్వాత నుంచి 11 గంటల మధ్య సమయంలో భోజనం చేయకూడదు. థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు బాగా పనిచేస్తాయి. ఇవి శరీర మెటబాలిజం ప్రక్రియను చురుగ్గా సాగేలా చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీక రిస్తాయి. కణాలకు శక్తి అందేలా చూస్తాయి. రాత్రి 11 నుంచి 1 గంట మధ్య సమయంలో మూత్రా శయం యాక్టివ్ గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్నవారికి ఆ సమయంలో సాధారణం గా నొప్పి వస్తుంటుంది. రాత్రి 1 నుంచి ఉదయం 3 మధ్య సమయంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివర్ పనితనం దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమయంలో కచ్చితంగా నిద్రపోవాల్సిందే. లేదంటే కాలేయం సరిగ్గా పనిచేయదు.వ్యర్థాలు బయటికి వెళ్లవు. ఉదయం 3 నుంచి 5 మధ్యలో ఊపిరి తిత్తులు యాక్టివ్ గా ఉంటాయి. ఆ సమయంలో దగ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష పదార్థాలను బయటకు పంపుతున్నాయని అర్థం చేసుకోవాలి.
No comments:
Post a Comment