బొప్పిల లెక్క
----------------------
ఇల్లంతా చుట్టాలతో బంధువులతో గందరగోళంగావుంది.వర్ధనమ్మగారు కాలంచేసిపన్నెండురోజులైనసందర్భంగా వచ్చిన పైవాళ్ళంతాతిరుగుప్రయాణం హడావిడిలోవున్నారు
ఎందుకంటే, కడుపునపుట్టినవాళ్ళా,ఆవిడపోయేముందుగా వచ్చినవాళ్ళూతప్పమరెవరూ వుండకూడదన్న శాస్త్రంవుందికదా!
అలా బయటనుండివచ్చినబంధుజనాలు వెళ్ళిపోయాకా అమ్మ వర్థనమ్మగారు లేనిలోటు కొట్టవచ్చినట్లు కనిపించిందిపిల్లలకు.
అమ్మలేనిలోటు మనకే ఇంతగావుందంటే ఇంక నాన్నగారేముండగలరు ఇంత ఇంట్లో వంటరిగా ,అందుకని భార్యలతో మాట్లాడి నచ్చచెప్పి
తండ్రిని తమతోతీసికెళ్ళిపోవాలని వర్థనమ్మగారి కొడుకులు నలుగురూ ఎవరికివారే మనసులో నిశ్చయించుకొన్నారు.
తెల్లవారితే ప్రయాణాలు అన్నదమ్ములవి.ఆరాత్రి బాగా ప్రొద్దుపోయేదాకా అన్నదమ్ములు అనేకవిషయాలు మాట్లాడుకొన్నతరువాత నేలమీద ఒక జంపకానాపరుచుకొని తలగడాలు తలక్రిదపెట్టుకొని నిద్రకొరిగారు.
అప్పటిదాకా అన్నదమ్ములు ఏంమాట్లాడుకొంటున్నారో విందామని ఆ పరిసరాల్లోనే తచ్చాడుతున్న తోడికోడళ్ళకు
ఆఅన్నదమ్ములమాటలు వినీవినిపించనట్లు వినిపించాయి. ఆఖరికోడలు దుర్గ ఆ నలుగురన్నదమ్ముల్లో నాల్గవవాడైన తనభర్త ఎక్కడ
పడుకున్నాడో ఆరాగా గమనించింది.అతడు జంపకానాకి ఒక కొసని పడుకోవడంటసింది.
తనుకూడా వెళ్ళిమిగిలినతోడికోడళ్ళదగ్గర
పక్కమీద చివరగా పడుకొంది.
దుర్గకి నిద్దరరావటంలేదు. ఈ పదిపదిహేనురోజులఖర్చులూ అన్నదమ్ములు తెల్లారి లెఖ్ఖలుచూసుకొంటారు.మంచిఉద్యోగస్తుడైన తనభర్తమీద ఎక్కువ వాటాపడుతుందేమోనని మొదటనుంచీ భయపడుతూవుంది.పైగా అత్తలేని మావగారు ఆఖరికొడుకుపై మమకారం ఎక్కుకనుక ఎక్కడతనఇంటిపైవచ్చివాలతాడోనని ఆమెకుభయంపట్టుకొంది.
పదిపదిహేనురోజులనుంచీ సరైన నిద్రలు లేకుండా వున్న వర్థనమ్మకొడుకులంతా గుర్రులు పెట్టి నిద్రపోతున్నారు.
కొంచంసేపటితరువాత తోడికోడళ్ళుకూడా అలసిపోయి వున్నారేమో వళ్ళుమరచినిద్రపోతున్నారని గ్రహించింది.మగవాళ్ళు హాలులో లైట్లుఆర్పిపడుకొన్నారేమో,బెడ్ లైట్ డిమ్ వెలుతురులో నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ పిల్లిలా
భర్త బావగార్లూ పడుకొన్న జంపకానాదగ్గరికివచ్చి,చివరగా ముసుగేసుకుపడుకున్న భర్తదగ్గరకువచ్చి,నిమ్మదిగాముసుగుకొంచెంగా తొలగించి,గుండుమీద సవరించి చూసుకొంది.అప్పుడెప్పుడో సరదాగా అప్పడాలకర్రతో తలమీద ఇలాఅంటే అలాబొప్పికట్టిన బొప్పిని సరిజూసుకొని,మొద్దునిద్రపోతున్న భర్తచెవిలో జడచివర్లతోగరగరలాడించింది.భర్తకు మెలకువవచ్చిందని గ్రహించి,మాట్లాడవద్దన్నట్లుగా నోరుమూసి,చెవిలోరహస్యంగాఅతడికి మాత్రమే వినపడేలా చెప్పడం మొదలెట్టింది.
"మారుమాట్లాడకుండావినండి.
మళ్ళీ తెల్లారితే మందనించి తప్పించుకొని మాట్లాడ్డంకుదరదు.అందుకనే ఇప్పుడు మాట్లాడుతున్నాను.రేపు మీ అన్నదమ్ములు ఈ పది పదిహేనురోజులఖర్చులగురించిట్టాపద్దులు చూసుకొంటారుకదా!మీరుకడసారంపిల్లాడుగనుక నాకువాటావేయొద్దని ఖచ్చితంగా చెప్పండి.అలాగే మీనాన్నగారిబరువును కనుక నెత్తికెత్తుకున్నారా నేను రేపే ఉరేసుకుచస్తాను,మీ పెద్దన్నయ్యమాటలకు అన్నింటికీ గంగిరెద్దులా తలాడిస్తే కుదరదుగాకకుదరదు.ముందే చెపుతున్నాను "అంటూ ఆమె పిల్లిలానడిచి వెళ్ళపోతుంటే,"దుర్గా !కొంచెం పెద్దలైట్ స్విచ్ వేసివెళ్ళమ్మా!"
అన్నపెద్దబావగారి గొంతువిన్న దుర్గ గతుక్కుమనిపోయింది.
"అమ్మా ! ఇంతసేపూ మీ ఆయననుకొని విషయసూచిక నాచెవిలో వూదేవు.అక్కడకీ నువ్వు ముందుజాగ్రత్తగా తలమీదబొప్పితడిమిచూసుకొనే మొదలెట్టేవు. మీ ఆయనకేకాకుండా,పెళ్ళైన ప్రతిమగవాడికీ తలమీద ఒకటో రెండో బొప్పిలుంటాయని తెలికపోవడం నీ అమాయకత్వం" అటూ బావగారుచెపుతుంటే దుర్గనిచ్చేష్టురాలైపోయింది.మాటల సందడికి లేచిన దుర్గమగడు అయోమయంగా
అన్నకేసీ భార్యకేసీ చూస్తు బుర్రగోక్కుంటూ వుండిపోయాడు.
జంపకానా కొసనపడుకున్నతమ్ముడు గచ్చుమీదదొర్లిపోతుంటే చలేస్తుందని ,తమ్ముడిని తనుపడుకొన్న చోటుకి రమ్మని,
తమ్ముడుపడుకొన్నచోటుకి తనుమారాడని దుర్గకు చెప్పకపోవడంతో "అసలిలా ఎలాజరిందబ్బా!" అనుకుంటూ,తడబడే అడగులతో అక్కడనుంచి నిష్క్రమించింది తెలుకుట్టినదొంగలా దుర్గ.
సత్యవాణి కె
No comments:
Post a Comment