మీకు తెలియకుండా activate చేస్తున్నారు if you activate this chakra in your body@nandurihemamalini
https://youtu.be/_e-OtqdpxEg?si=ZmjUIiFn-EJaPAam
శ్రీమాత్రే నమః ఈరోజు మనం ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందాం. నేను మొన్న వీడియో చేసినప్పుడు చక్రాల గురించే చెప్పండి అని అన్నారు. అందుకే ఈరోజు ఆజ్ఞ చక్రం యాక్టివేట్ అయితే ఏం జరుగుతుంది అసలు ఇంట్లోకి రాని సమయంలో బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు శబరిమాల ఆలయానికి ఆడవాళ్ళని ఎందుకు వెళ్ళకూడదు అంటారు మగవాళ్ళు వెళ్తే ఎలా వెళ్ళాలి అసలు ఆజ్ఞా చక్రం గురించి ఏంటి అనేది మనం ఈ వీడియోలో కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరంలో 100కు పైచిలుకు చక్రాలు ఉన్న అందులో ప్రధానమైన ఆరు చక్రాలు మేరుదండంలోని వివిధ స్థానాల్లో ఉంటాయి. మేరుదండం అంటే ఏంటి వెన్నుముక అన్నమాట. సామాన్యంగా చక్రాలన్నీ నిద్రాణ స్థితిలోనే ఉంటాయి. వాటిని క్రియాన్వితం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగ? యోగ సాధన ద్వారా మంత్రోచ్చరణ ద్వారా ఒక్కొక్క చక్రాన్ని మనం జాగృతం చేసుకునే అవకాశం ఉంటుంది. అలా జాగృతం చేసుకోవచ్చు కూడా. ప్రాణ ప్రతిష్ట చేయబడిన పవిత్ర ప్రదేశాలైన దేవాలయ సందర్శనం వల్ల కూడా నిర్దిష్టమైన చక్రము చక్రాలని జాగృతం చేసుకోవచ్చు. మన శరీరంలో ఆరు చక్రాలు ఉన్నాయి. ఈ ఆరు చక్రాల ప్రభావానికి లోనయ్యే శరీరాంగాలు అలాగే ఈ చక్రాలని యాక్టివేట్ చేస్తే ఏం జరుగుతుంది? అలానే కొన్ని కొన్ని చక్రాలని యాక్టివేట్ చేసే ఆలయాల గురించి అన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్న చక్రాలు ఏంటి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞ చక్రము, సహస్రారము. ఈరోజు మనం ఈ వీడియోలో ఆజ్ఞ చక్రం గురించి తెలుసుకుందాం. ఆజ్ఞ అంటే ఏంటి? ఉత్తరవు లేదా ఆదేశము అని అర్థం. ఎవరిలో ఆజ్ఞా చక్రం చురుగ్గా ఉంటుందో వాళ్ళు మనస్సుని ఆదేశించే శక్తిని కలిగి ఉంటారన్నమాట. అంటే వారి మనసు వారి స్వాధీనంలో ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది కనుబొమ్మల మధ్య ప్రాంతంలో ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు బొట్టు పెట్టుకోమని చెప్తారు బొట్టు పెట్టుకుంటే ఆజ్ఞ చక్రం యాక్టివేట్ అవుతుంది కానీ ఇంట్లోకి రాని సమయంలో ఇంట్లోకి రాని ఆడవాళ్ళు మాత్రం బొట్టు పెట్టుకోవద్దు అని అంటారు. నేను అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటాను ఇంట్లోకి రాని సమయంలో బొట్టు పెట్టుకోకూడదు అని బొట్టు పెట్టుకోకూడదు అంటే వెంటనే అంటారు అమ్మో బొట్టు పెట్టుకోకపోతే ఎలా అండి పెట్టుకోవాలి కదా పుణ్యస్త్రీ బొట్టు పెట్టుకోకపోతే తప్పు కదా అని ఇంట్లోకి రాని సమయంలో బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అంటారంటే ఇక్కడ ఆజ్ఞ చక్రం బాగా యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట అలా అన్నాను అనుకోండి వెంటనే అంటారు ఆ పూర్వకాలంలో అయితే అక్కడ వృద్ధి రుద్ది రుద్ది రుద్ది బొట్టు పెట్టుకునేవారు కాబట్టి ఆజ్ఞ చక్రం యాక్టివేట్ అయ్యేది ఇప్పుడు పరిస్థితులు అలా ఏం లేవు కదా జస్ట్ స్టిక్కర్ అంటించుకుంటున్నాం అంతే కదా ఏం పర్వాలేదు పెట్టుకోండి అని చెప్పేసి మనల్ని బాగా మూర్ఖత్వంలోకి మూఢాచారంలోకి మనం ఏదో ఆధునికత వైపు ప్రయాణిస్తున్నాము అని చెప్పి అనుకుంటూ మనల్ని ఆరోగ్యాన్ని భ్రష్టు పట్టించే కొంతమంది భ్రష్టు పట్టించే విధానాలని చెప్పేస్తున్నారు. అయితే ఇప్పుడు మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది మనం ఎదురుగుండానే మనం చూస్తాం ఎగ్జాంపుల్ ఈ సెల్ ఫోన్ లో మనకి కావలసిన యాప్ లోకి వెళ్ళాలి అనుకోండి ఆ స్క్రీన్ ని టచ్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది. అంటే స్మూత్ గా టచ్ చేస్తేనే ఒక ఫోన్ ని మనం యాక్టివేట్ చేయగలుగుతున్నామే అలాంటిది శరీరం ఎన్నో నాడుల సమ్మేళనం అలాంటి శరీరాన్ని జస్ట్ టచ్ చేస్తే చాలు యాక్టివేట్ అవుతుంది. ఆజ్ఞ చక్రం ఉన్న ప్రదేశంలో స్టిక్కర్ తో అంటించుకుంటాం కదా బొట్టు మనది అలాగే అంటుకుని ఉంటుంది. అలాగే అంటుకుని ఉండడం వల్ల ఖచ్చితంగా అక్కడ మార్పులు వస్తాయి. అందుకే చూడండి ఈ మధ్యకాలంలో చూస్తే ఎంతమందికి పిసిఓడి పిసిఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి గర్భానికి సంబంధించిన ఎన్నో సమస్యలన్నీ వస్తున్నాయి ఇదివరకు కాలంలో ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ లేవు అందుకే మన పెద్దలు చెప్పింది మనం పాటించాలి సరే ఇది పెద్దల కోణంలో కూడా చూడకండి సైన్స్ పరంగా చూడండి ఎందుకంటే మనం మన ఋషులు చెప్పిన దాన్ని ఎప్పుడూ పట్టించుకోం కానీ సైన్స్ చెప్పిందంటే మాత్రమే మనకు నమ్మకం వస్తుంది అఫ్కోర్స్ ఈ సైన్స్ కి సంబంధించి కూడా ఇప్పుడు కొట్టి పారేస్తున్నారు అనుకోండి మన వెసులుబాటికి ఏ విధంగా ఉంటే దాన్ని మనం మార్చేసుకుంటున్నాం. ఆజ్ఞ చక్రానికి శక్తినిఇచ్చే దేవాలయాలు భౌతిక స్థాయిలో పిట్యూటరీ గ్లాండ్ సక్రమంగా పనిచేయడం కోసం దోహదం చేస్తాయి. శబరిమల ఇలాంటి ప్రసిద్ధ దేవాలయాలు అలాగే అనేక శివాలయాలు ఆజ్ఞ చక్రాన్ని క్రియాన్వితం చేస్తాయన్నమాట. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే భక్తులకు ముందుకు సాగడానికి తోడ్పాటుని అందిస్తాయి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. వీలున్నప్పుడల్లా ఇంకా మిగతా చక్రాలతో ఆధారపడి ఉన్న ఆలయాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు శబరిమల ఆలయానికి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అంటారు కదా అసలు ఎందుకు వెళ్ళకూడదు ఏంటి అనేది సైంటిఫికల్ గా మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ శబరిమాల ఆలయం ఆజ్ఞా చక్రంతో ముడిపడి ఉంటుందన్నమాట. అసలు శబరిమలకి వెళ్ళేటప్పుడు గనక ఏడు చక్రాలకు సంబంధించిన ఆలయాలు ఉంటాయి అవి ఒక ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మనం దర్శించుకున్నట్లయితే చక్కగా ఈ ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయి కాకపోతే గురువు ద్వారా మనం ఈ ఏడు చక్రాల ఆలయాలని దర్శించుకోవాల్సి ఉంటుందన్నమాట దీనిని చాలా చక్కగా పరిశోధన చేసి ఉమెన్ ఇన్ శబరిమల అని చెప్పి సిను జోసెఫ్ గారు ఒక పుస్తకం రాశరన్నమాట చాలా అద్భుతమైన పరిశోధన చేశారు అని చెప్పి చెప్పొచ్చు ఈవిడకి కూడా మూలాధార చక్రం ఆలయాన్ని కి వెళ్ళినప్పుడు మూలాధార చక్రం యాక్టివేట్ అయిందని స్వ అనుభవపూర్వకంగా జరిగింది ఆ విషయాలన్నీ కూడా ఆవిడ చెప్తారు. అవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. ఈరోజు శబరిమల ఆలయానికి ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అంటారు. అసలు మగవాళ్ళు కూడా ఎవరు వెళ్ళకూడదు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శబరిమల అంటే అర్థం ఏంటి? శబరి కొండ అనే కదా అర్థం. కొన్ని యుగాల ముందు భక్తురాలైన శబరి కొండ మీద దీర్ఘకాలం తపస్సు చేసిందని చెప్పి చెప్తారు. ఆ దీర్ఘకాలం తపస్సు చేసిన ఈ కొండ మీదే అయ్యప్ప స్వామి వారు శాస్త్ర విగ్రహంలో లీనమైపోతారు. ఒక స్త్రీ మూర్తి పేరుతో పిలవబడే ప్రదేశంలో భక్తురాలు ఎందుకు అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళకూడదు అంటారు అందరికీ సహజంగా తలెత్తే ప్రశ్నే కదా శబరిమలలో స్త్రీల ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేయాలనే కేసు నడుస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే కొంతమంది న్యాయమూర్తులు ప్రతివాదన చేశారన్నమాట అయ్యప్ప స్వామి ఏమో నైష్టిక బ్రహ్మచారి స్వరూపులు కాబట్టి స్త్రీల సమక్షం స్వామి వారి ఆజన్మ బ్రహ్మచర్యానికి భంగపాటును కలుగజేస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు అంటారుని చెప్పి వాళ్ళేమో వాదనని వినిపించారు. అసలు ఒక సాధారణ మహిళ ఎలా స్వామివారి ఆ జన్మ బ్రహ్మచర్యాన్ని భంగపాటును కలిగించేలా చేస్తుంది చెప్పండి అంటే స్వామి వారిని మనతో సమానంగా మనం పరిగణించేసాం కాబట్టి అలాంటి ఆలోచన వచ్చింది అసలు బ్రహ్మచర్యము అంటే ఏంటి ఇంద్రియాల మీద పరిపూర్ణమైన నియంత్రణ అదే కదా బ్రహ్మచార్య యొక్క ప్రధాన లక్షణము భావోద్వేగాలపై పూర్తి నియంత్రణ అలాగే దృఢమైన నిశ్చలమైన వ్యక్తిత్వం ఇవన్నీ బ్రహ్మచర్ చారి లక్షణాలు ఇవన్నీ సాధన చేస్తే అలవాటు పడతాయి. అంతే తప్ప నియంతృత్వము అనే పదం వాడడం ఇక్కడ సరికాదు ఆడవాళ్ళని వెళ్ళకుండా చాలా అణచి వేశారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేది ముందు మనం తెలుసుకుని కదా నియంతృత్వము అని చెప్పి అనే పదాన్ని మనం వాడాలి. ఇతర విషయాలు అలాగే స్త్రీల మీద వ్యామోహం లేనప్పుడు అణచివేతన్న ఊసే తలత్తదు కదా అసలైన బ్రహ్మచారి స్వాభికంగానే నిశ్చలంగా ఉంటాడు. ఆ నిశ్చల స్థితిని సాధించిన తర్వాత ఎవరి వల్ల దేని వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఆకర్షణ కూడా కలగదు భావోద్వేగాలకు అతీతమైన నిశ్చల తత్వానికి ప్రతీక అయ్యప్ప స్వామి వారు అయ్యప్ప స్వామి వారు నికాసైన నైష్టిక బ్రహ్మచారి ఎవరో స్వామి వారి దగ్గరికి రావటం వల్ల స్వామి వారికి కాదు నష్టం సరిైన నియమ నిబంధనలు పాటించకుండా స్వామి వారి దగ్గరికి వెళ్తే ఎవరైతే నియమ నిబంధనలు పాటించలేదో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి అసలు అసలు స్వామి వారి దర్శనం చేసుకోవాలి అంటే ఏం చెప్తారు 41 రోజుల వ్రత దీక్ష చేయమని చెప్పి చెప్తారు. ఆ 41 రోజుల వ్రత దీక్ష ఏంటి బ్రహ్మచర్యం పాటించాలి కఠోరమైన నియమనిష్టలు పాటించాలి. ఈ బ్రహ్మచర్యం పాటించకుండా ఉన్న పురుషులను కూడా ఈ 18 మెట్ల ద్వారా ఎక్కి స్వామి వారిని దర్శించుకోవడానికి అర్హత లేదనే చెప్తారు. అలాగే స్త్రీలకి కూడా ఈ 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి అర్హత లేదు అని చెప్తారు ఎందుకు చెప్తారు అంటే అది తెలుసుకోవాలి అంటే ముందు ఆధ్యాత్మికత అలాగే భౌతిక తత్వం అంటే మన శరీరానికి సంబంధించిన విషయం తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు మన శరీరంలో కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి కదా అంటే చాలా కంట్రోల్ గా ఉంటాం మనం ఎంత కంట్రోల్ గా ఉంటాము అంటే ఇలా ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు అసలు ఎవ్వరు ఏం చేసినా కూడా చలించని స్థితి వస్తుంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఉదాహరణకి శుక్రము సూక్ష్మమైన ఓజస్సుగా పరిణామం చెందుతుంది. మగవారిలో జన్యుద్రవం ఏంటి వీర్యం కదా ఆడవాడిలో ఏంటి ఋతుస్రావ రక్తం కదా మనం తినే ఆహారం ఏమవుతుందంటే ఆ ఆహారం యొక్క సారము ఓజస్సుగా మారి జన్యు శక్తిలో నిగూడంగా ఉంటుందన్నమాట ఇది సుశృత సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో చెప్పబడి ఉంటుంది. ఓజస్సు ఉంటేనే కణాలలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. అలాగే కాంతి కూడా ప్రకటితమ అవుతుంది అన్నమాట. ఈ కాంతి అంటే అర్థం ఏంటి? మనిషి యొక్క వర్చస్సు ఒక మనిషిని చూడగానే మనమే అంటాం ఏం వర్చస్ అండి ఏం తేజస్ అండి అని అది ఎందుకు వచ్చింది ఎవరైతే సాధన చేస్తారో సాధన చేసిన బ్రహ్మచారిలో ఇటువంటి తేజస్సు చాలా ఎక్కువగా ఉండి మనకి ప్రస్పుటంగా కనిపిస్తుందన్నమాట అంటే కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుందన్నమాట ఈ బ్రహ్మచర్యంలో ఏం చేస్తారు శుక్రాన్ని నియంత్రిస్తారు కదా ఈ నియంత్రించిన శుక్రాన్ని సూక్ష్మ శక్తిగా రూపాంతరం చేస్తే ఆ శక్తి ఏమవుతుందంటే చక్రాలు గుండా ఊర్ధ్వ దిశగా అంటే పైకి ప్రయాణం చేస్తుందన్నమాట ఈ ప్రక్రియ బ్రహ్మచర్య సాధనలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి ఆధ్యాత్మిక అనుభూతిని పూర్తిగా పొందాలి అంటే మగవాళ్ళు తప్పక పాటించవలసింది ఏంటి సంభోగానికి దూరంగా ఉండడము స్కలన స్రావాన్ని నిరోధించటము అన్నమాట పునరుత్పత్తి వయసులో ఉన్న స్త్రీలకు ఋతుస్రావ సమయంలో బీజము అసంకల్పితంగా విడుదల అవుతుంది అది స్త్రీలలో జరుగుతుంది. అయితే ఈ పురుషులలో వీర్య నిరోధము అనే ప్రక్రియ స్త్రీలలో రుతుస్రావము యొక్క నిరోధము రెండూ సమానమైనవే అంటే వాళ్ళు ఎలా అయితే నిరోధిస్తారో ఆడవాళ్ళలో కూడా రుతుస్రావం నిరోధించడం ఈ రెండు ఒకటే అయితే ఇది సాధన పద్ధతి ద్వారా చాలా అరుదుగా నేర్పుతారన్నమాట తంత్ర సాధకులు నేర్పుతారు ప్రతి నెల బహిష్టు సమయంలో ప్రాణశక్తి వృధా కాకుండా పదిలిపరుచుకుని వాళ్ళ యొక్క లైంగిక శక్తులను రూపాంతరం చేసి భద్రపరిచే మార్గాలని తంత్ర సాధకులు నేర్పుతారు కానీ ఇది ఎప్పుడూ చేయకూడదు అసహజమైన పద్ధతుల్లో గనుక మనం దీన్ని నియంత్రణిస్తే అనేకమైన దుష్పరిణామాలని ఎదుర్కొంటాం. ఋతుస్రావాన్ని ఎప్పుడు అసహజ ప్రక్రియల ద్వారా నిరోధించకూడదు అందుకే ఏ పూజ ఉన్నా వ్రతం ఉన్నా సరే గబుక్కున మాత్రలు వేసేసుకునే వాళ్ళకి డాక్టర్స్ చెప్తారు మీరు అలా చేస్తే మీ ఆరోగ్యానికే ప్రమాదము అని చెప్పి అసలు ఎప్పుడూ అలాంటి పనులు చేయకూడదు. అంటే ఇక్కడ మనం మాత్రల ద్వారా ఎలా అయితే నిరోధిస్తున్నామో ఆధ్యాత్మికంగా కూడా అలాగే నిరోధించొచ్చు కానీ అలా నిరోధించడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి అందరికీ అలా నిరోధించే పద్దతులని సాధకులు నేర్పించకూడదు ఆ ప్రక్రియలు చాలా కష్టం ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన స్థితుల్లో మాత్రమే అలాంటివి నేర్చుకోవాలన్నమాట ఇలాంటి సాధన ఎలా ఉంటుంది అంటే నిప్పుతో చెలగాటం లాంటిది అన్నమాట ఇలాంటి సాధనలు గురువు లేకుండా మన ఇష్టం వచ్చినట్లు ఏదో సాధించేద్దాం కుండల్ని జాగృతం చేసేసుకుందాం అని గనక చేస్తే మొత్తానికి మనక ప్రాణానికే ప్రమాదం ఒక్కొక్కసారి పిచ్చి వాళ్ళు అయిపోతూ ఉంటారున్నమాట అందుకని ఇలాంటివి మనం చేయకుండా దూరంగా ఉండి ఇలాంటి సాధన చేయడానికి మన వాళ్ళకి అందరికీ కష్టంగా ఉంటుంది కాబట్టే 41 రోజుల దీక్ష అనేది పెట్టారు. ఈ 41 రోజులు వ్రత సమయంలో నియమనిష్టలు పాటించాలన్న అంశలు శబరిమల ఆలయం రూపొందించింది ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తులకు ఆధ్యాత్మిక వికాసాన్ని ఆస్వాదించడానికి అవకాశం కల్పించాలని ఉద్దేశంతోటే ఈ 41 రోజుల వ్రత దీక్ష అనేది చెప్పారన్నమాట ఈ 41 రోజుల వ్రతదీక్ష లోనూ ఖచ్చితంగా లైంగిక శక్తి మానవ బీజం యొక్క నియంత్రణ ఉండి తీరాలన్నమాట మరి ఇదే గనుక ఈ 41 రోజులు ఆడవాళ్ళు గనక చేస్తే ఏం జరుగుతుంది వాళ్ళు సంతానోత్పత్తి వయసులో ఉంటారు కదా ఆ స్త్రీలు గనుక నియమాలన్నింటిని పాటిస్తే వాళ్ళ ఋతుక్రమం బలవంతంగా ఆపడం జరుగుతుంది. అది వాళ్ళ ఋతుక్రమము పునరుత్పత్తి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఈ శబరిమల ఈ 41 రోజుల దీక్ష ఏదైతే ఉందో అది ఈ మెన్సెస్ వచ్చే స్త్రీలని వేసుకోకూడదు అని చెప్పి చెప్పారు. ఈ శబరిమల ఆలయం ఆజ్ఞ చక్రంతో ముడిపడి ఉంటుంది. మనసుకి బుద్ధికి ఆదేశాలు ఇచ్చే కేంద్రం అన్నమాట. ఈ ఆజ్ఞ చక్రం. పై నుంచి గురువాజ్ఞ అక్కడికి ప్రసారం అవుతుంది. ఈ చక్రం పై నియంత్రణ సాధించడం అంటే బ్రహ్మచారిల పరివర్తన చెందటం అన్నమాట. బ్రహ్మచర్యాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయి ఉండి ఉంటుందన్నమాట. అలా ఆజ్ఞా చక్రం గనుక యాక్టివేట్ అయితే వాళ్ళ దగ్గరికి ఎంతో మంది జనాలు ఆకర్షణ చెందుతూ ఉంటారు. తండోప తండాలుగా అక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ చక్ర అధిష్టాన దేవత అంటే ఆజ్ఞ చక్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే హాకిని అన్నమాట. ఆవిడకి ఆరు ముఖాలు ఉంటాయి. చిత్తశుద్ధి వరప్రదాయిని అలాగే భయహారిని వరాలనిస్తుంది చిత్తాన్ని శుద్ధి చేస్తుంది భయాన్ని హరిస్తుంది అన్నమాట. ఇక్కడ హంస రూపంలో పరమేశ్వరుడు అధిష్టించి ఉంటారు. ఒక్కొక్క చక్రానికి ఒక స్త్రీ దేవత ఒక పురుష దేవత కూడా ఉంటారన్నమాట. అవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం. అయితే ఇక్కడ పరమేశ్వరుడు అమ్మవారితో ఐక్యమై ఉంటాడు అన్నమాట. ఇడా పింగళ సుషుమన అనే ఈ మూడు నాడులు కలిసి పైకి పురోగమిస్తాయి. నివృత్తి మార్గంలో ఆధ్యాత్మిక కాంక్ష కోరికలను అధిగమించి విశ్వంతో మమైకం చెందే ప్రాంతం ఏదైతే ఉందో అది ఎడా పింగళ సుషుమ్న మూడు నాడులు కలిసే ప్రదేశం అన్నమాట అయ్యప్ప భక్తులు ఇన్ని నియమాలను సక్రమంగా అనుసరించి షడ్చక్ర ఆలయాల ద్వారా కుండలిని జాగరణ పొందితే శబరిమల గుడిలో వాళ్ళు స్వామి వారితో వాళ్ళు అంతిమ కలయికను పొందొచ్చు అని చెప్తారు. ారు కానీ దానికి ఎన్నో నియమాలు పాటించాలన్నమాట అవన్నీ కష్టం కాబట్టే ఈ 41 రోజుల దీక్ష అని చెప్పారు కానీ ఆ 41 రోజుల దీక్షలోన ఏం చేస్తారు అంటే అనవసరమైనవి చూస్తూ ఉంటారు అనవసరమైన చోట తింటూ ఉంటారు అన్ని పనులు చేస్తూ ఉంటారు అన్ని చేసేస్తూ ఉన్నప్పుడు మాల వేసుకున్న ఉపయోగం ఏముంది చెప్పండి ఇన్ని నియమాలు పాటిస్తే అయ్యప్ప స్వామితో మనం లీనమైనట్లే అని చెప్పి చెప్తారన్నమాట అయితే అయితే కుండలిని జాగరణ ఆజ్ఞ చక్ర ప్రేరేపణ పురుషులలో ఒకలా ఉంటుంది స్త్రీలలో ఒకలా ఉంటుంది. ఆజ్ఞ చక్రము పిట్యూటరీ గ్లాండ్ మీద పనిచేస్తుందన్నమాట. ఈ పిట్యూటరీ గ్రంధి ఏం చేస్తుందంటే స్త్రీ పురుష పునరుత్పత్తిలో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది. అది లూటినైజింగ్ హార్మోన్ అలాగే ఫోలికల్ స్టిములేటింగ్ హార్మోన్ అనే రెండు హార్మోన్ లని ఉత్పత్తి చేస్తుంది. ఈ పిట్యుటరీ గ్లాండ్.ఆర్ ఆజ్ఞ చక్రం ఎప్పుడైతే జాగృతం అయిపోతుందో అలా జాగృత అయిన ఆజ్ఞ చక్రం వల్ల ఈ పిట్యూటరీ గ్రంధి ఉంది కదా అది చురుగ్గా పనిచేస్తుంది. అది ఎప్పుడైతే చురుగ్గా పనిచేస్తుందో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి చాలా సజావుగా జరుగుతుందన్నమాట. పురుషులలో ఎల్హెచ్ వృష్ణాల మధ్యంతర కణాల నుంచి టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది పురుషులలో సమస్య కాదు. స్త్రీలలో టెస్టోస్టేరాన్ ఎముకల బలానికి మరియు సంతోనోత్పత్తికి అవసరమైన లైంగిక లిబిడోని పెంచడానికి ముఖ్యమైనది అన్నమాట అయితే స్త్రీలకి కూడా టెస్టోస్టిరాన్ అవసరమే కానీ ఎక్కువ మోతాదులో ఉండటం మాత్రం మంచిది కాదు ఈ టెస్టోస్టిరాన్ అండోసర్గ సమయంలో మాత్రమే పెరుగుతుంది. టెస్టోస్టిరాను అలాగే ఇతర అడ్రినల్ హార్మోన్ల నుంచి స్త్రీ హార్మోను ఈస్ట్రోజన్ తయారవుతుందన్నమాట అంటే టెస్టోస్టిరాన్ తగినంతగా లేకపోతే స్త్రీ శరీరాలు ఈస్ట్రోజన్ ను తయారు చేయలేవు అంటే అండోత్సర్గము బహిష్టు ఇవన్నీ దేనివల్ల జరుగుతాయి ఈస్ట్రోజన్ వల్ల కలుగుతాయి అందుకే చూడండి పోస్ట్పోన్ టాబ్లెట్లు ఇచ్చిన ఎవరికైనా ఎక్కువగా రక్తస్రావం జరుగుతున్న ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇలాంటి హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు ఎందుకంటే మనకి ఏదైతే తక్కువయిందో దాన్ని బ్యాలెన్సింగ్ చేయడం కోసమే ఇస్తూ ఉంటారు అందుకే హార్మోనల్ టాబ్లెట్స్ ఎక్కువ వాడితే అది వాళ్ళ యొక్క గర్భం మీద పనిచేస్తుంది డాక్టర్ యొక్క అనుమతి లేకుండా ఇవన్నీ వాడకూడదు అని చెప్పే కారణం ఇదన్నమాట శబరిమల వంటి ప్రదేశాలు ప్రధానంగా ఆజ్ఞా చక్రం మీద పనిచేస్తాయి. స్త్రీలకి స్వాధిష్టానము అలాగే మూలాధారం కూడా సరిగ్గా చురుకుగా లేకుండా ఆజ్ఞ చక్రం మాత్రమే శక్తివంతమైతే ఏం జరుగుతుందంటే ఈ అండాశయాలు రాను రాను బలహీనపడిపోయి చివరికి పనిచేయటం మానేస్తాయ అన్నమాట అలా పని చేయటం మానేస్తే టెస్టోస్టెరాన్ ను స్త్రీ హార్మోనులుగా మార్చలేవు. అంటే అండాశయాల ద్వారా తగినంత ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవ్వదన్నమాట. ఒక్కోసారి అయితే పూర్తిగా ఉత్పత్తి అవ్వదు టెస్టోస్టిరాన్ మాత్రం అధనంగా ఉండిపోతుంది. టెస్టోస్టిరాన్ పెరుగుదల వల్ల పురుషులకి పెద్దగా హాని కలగదు గానీ స్త్రీ శరీరంలో మాత్రం టెస్టోస్టెరాన్ కొంచెం పెరిగితే సాధారణ ఋతుస్రావం ఆగిపోతుందన్నమాట. అండోత్సర్గం జరగదు. ఋతుచక్రంలో అండాశయాల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ లూప్ ఏదైతే ఉందో ఆ ఫీడ్బ్యాక్ లూప్ వల్ల పిట్యూటరీ గ్రంధి నుంచి హార్మోన్ల విడుదల ప్రభావితం అవుతుంది. ఒకవేళ ఈ అండాశయాలు పనిచేయకపోతే ఇటువంటి ఫీడ్బ్యాక్ లూప్ ఆగిపోతుంది అన్నమాట. అలా ఆగిపోతే ఏమవుతుందంటే ఈ పిట్యుటరీ అదరపు ఎల్హెచ్ ని తద్వారా అదరపు టెస్టోస్టిరాన్ని నిన్ని ఉత్పత్తి చేస్తుంది. స్త్రీలలో టెస్టోస్టిరాన్ అధికంగా ఉంది అని అనుకోండి ముఖం మీద వెంట్రుకలు వస్తాయి పురుష స్వరాన్ని పోలిన స్వరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ సింటమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. పిసిఓడి పిసిఓఎస్ అని చెప్తూ ఉంటారు కదా ఇలాంటి రుగ్మతలు తలెత్తుతాయి. అందువల్ల సంతానోత్పత్తి ఆగిపోయే అవకాశం ఉంది. శరీరంలో కొన్ని నిర్దిష్ట దోషాలు జీర్ణక్రియ అలాగే విసర్జన వంటి ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. చురుకైన ఆజ్ఞా చక్రం ఏం చేస్తుంది అంటే అంతర్గత దోషాలని అవి పని చేసే తీరును కూడా మారుస్తుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండేవాళ్ళు కఠినమైన ఆహార నియమాలు పాటించాలి అని చెప్పి చెప్తారు. లేదు అంటే వాళ్ళ జీర్ణక్రియ విసర్జనలో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీలలో అపాను వాయువు ఋతు రక్తాన్ని కిందకి మరియు బయటికి ప్రవహించేలా చేస్తుంది. చురుకైన ఆజ్ఞ చక్రం ఉన్న స్త్రీలకు అపాన వాయువు మార్పు చెందుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఋతుస్రావణలో ఇబ్బంది ఏర్పడుతుంది. అంతేకాదు ఈ చక్ర ప్రభావంతో సూక్ష్మ శరీర శక్తులలో కాలక్రమేణ కొన్ని మార్పులు కూడా వస్తాయి. అందువల్ల ఈ అపానవాయం ఏమవుతుంది? తిరోగమనం జరుగుతుందన్నమాట. దిశ తిరోగమనంలో జరుగుతుంది. అలా జరిగితే ఏమవుతుంది ఎండోమెట్రియాసిస్ వంటి జబ్బులు వస్తాయి అంటే ఋతురక్తం శరీరంలో కిందకి పారకుండా పైకి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అందుకే శబరిమల ప్రవేశానికి ఋతుక్రమంలో ఉన్న మహిళలపై అంక్షలు విధించారు అని చెప్పి సిను జోసెఫ్ తన పరిశోధనలో చెప్పారు. అంటే ఇప్పుడు ఎందుకు ఆడవాళ్ళని వెళ్ళద్దు అన్నారు అలాగే బ్రహ్మచర్యం పాటించిన వాళ్ళని కూడా ఈ 18 మెట్లు ద్వారా ఎందుకు వెళ్లొద్దు అన్నారు అంటే ఆజ్ఞ చక్రంతో ముడిపడి ఉంది కాబట్టి శబరిమల ఆలయం ఆజ్ఞ చక్రం యొక్క చురుకుతనం ఎక్కువైపోతే స్త్రీలలోనూ పురుషులలోనూ ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కాబట్టి అనవసరంగా మనం పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని కొట్టి పారేయకుండా వాళ్ళు ఏం చెప్పారో దాన్ని విన్నాము అని అనుకోండి మన ఆరోగ్యము బాగుంటుంది మనం కూడా బాగుంటాం
No comments:
Post a Comment