*జన్మ ద్వారా ఎవ్వడూ బ్రాహ్మణుడు కాడు...* ```
“జన్మనా జాయతే శూద్రః!
కర్మణా జాయతే ద్విజః!!
వేదపాఠం తు విప్రాణాం!!
బ్రహ్మజ్ఞానంతు బ్రాహ్మణాః “!!
సర్వజనములును జన్మచే శూద్రులుగనే పుట్టి, కర్మలచే ద్విజత్వము నొందుచున్నారు. వారిలో కొందరు వేదాధ్యయనముచే విప్రులయి బ్రహ్మజ్ఞానమును పొంది బ్రాహ్మణులైరి.
పుట్టుకతో ఎవరైనా శూద్రులే;
చేసేపను(కర్మలు) ద్వారా మాత్రమే ద్విజుడౌతాడు!” అని అర్థం.
1.శరీర స్థాయిలో మాత్రమే... జీవితాన్ని గడిపేవాడు “శూద్రుడు,”
2. శరీర, మనో స్థాయిలు... రెండింటిలో జీవితాన్ని గడిపేవాడు “వైశ్యుడు,”
3. శరీర, మనో, బుద్ధి స్థాయిలు… మూడింటిలో జీవితాన్ని గడిపేవాడు “క్షత్రియుడు,”
4. శరీర, మనో, బుద్ధి, జ్ఞానంతో … అన్ని స్థాయిలలోను జీవితాన్ని గడిపేవాడు “బ్రాహ్మణుడు.”```
మనిషి తన జన్మపరంపరలో క్రమక్రమంగా ఈ నాలుగు పరిస్థితులనూ అనుభవించి, జనన-మరణ చక్రంలోంచి చివరికి విముక్తడవుతాడు.
No comments:
Post a Comment