*ఆచార్య దేవోభవ!*
*ప్రపంచ దేశాల్లో భారతదేశానిది ఆచార్య స్థానం. మన దేశ ఆధ్యాత్మిక గురు పరంపర అందుకు మూల కారణం.*
*ఈ దేశం- మహర్షులు నిర్మించిన బడి. జీవన మార్గదర్శక సూత్రాలకు వారిదే ఒరవడి.*
*గురువు మనకు దైవంతో సమానం. 'ఆచార్య దేవోభవ' అనేది వేదాల నిర్దేశం. 'ఆధ్యాత్మిక ఆచార్యుడు నాతో సమానుడు. ఆయన నాకు అన్యుడు కాడు. ఆయనను చూసి అసూయపడరాదు, తాను మానవమాత్రుడని పొరబడకూడదు' అనిజీవితాన్ని గడుపుతూ ఇంద్రియాల్ని నిగ్రహిం చినవాడు), రాగద్వేషాలకు అతీతుడు, అహింసను వ్రతంగా కలిగినవాడు, వేదాంతశాస్త్ర పారంగతుడు, శిష్యుల పట్ల వాత్సల్యంగలవాడు సద్గురువు కాగలడని మనువు పేర్కొన్నాడు. భారతదేశంలో పరంపరాగతంగా సాక్షాత్తు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుడే ఈ లోకానికి వెల్లడించాడు.*
*'గురువు, గోవిందుడు ఒకేసారి నా ఎదుట పడితే నేను మొదటగా గురువుకు నమస్కరిస్తాను' అని కబీర్ ప్రకటించాడు. గురువును మన పురాణాలు 'నడిచే దైవం'గా అభివర్ణించాయి. అద్వితీయ స్థానాన్ని కట్టబెట్టాయి. 'గురుతర బాధ్యత'వంటి పదప్రయోగాలతో- అన్నింటికన్నా ఘనమైనది, బరువైనది, అత్యంత అధికమైనది, ఎత్తుగా ఉన్నది అనే అర్థాలు వచ్చేలా 'గురు' శబ్దాన్ని ఈ జాతి ఉపయోగిస్తూ వచ్చింది. గురు శబ్దానికి గొప్ప గౌరవాన్ని ఆపాదించింది.*
*జీవితంలోని వివిధ దశల్లో మనిషికి ఎందరో గురువులతో అవసరం ఏర్పడుతుంది. విద్యాబుద్ధులు నేర్పే గురువు- సూచక గురువు. సంస్కృతీ సంప్రదాయాలు, వివిధ ఆశ్రమ ధర్మాల్ని అధ్యయనం చేయించేది-వాచక గురువు. మంత్రోపదేశం చేసినాయన బోధక గురువు. జ్ఞానమార్గం అలవరచేది-విహిత గురువు. పరమాత్మతో సంధానాన్ని కూర్చేది- పరమ గురువు.*
*గురువు శిష్యుణ్ని తరింపజేసే మార్గాలూ రకరకాలు. దీక్షలు వాటికి ముఖ్య సాధనాలు. మంత్ర దీక్ష, స్పర్శ దీక్ష, ధ్యాన దీక్ష. చూపుతోనే తన శిష్యుణ్ని దీక్షితుణ్ని చేసే దృక్ దీక్షవంటి పద్ధతుల్ని గురువులు అనుసరిస్తారు. సనకసనందనాదులకు దక్షిణామూర్తి, ఎందరో శిష్యబృందానికి రమణ మహర్షి మౌనంతోనే ఉపదేశం అందించారు. 'నేను ఇరవై నాలుగుమంది గురువుల నుంచి జ్ఞాన సముపార్జన చేశాను' అని దత్తాత్రేయుడు ప్రకటించాడు.*
*సత్యవాది, సంయమి (నియమ నిష్ఠలతో జీవితాన్ని గడుపుతూ ఇంద్రియాల్ని నిగ్రహించినవాడు), రాగద్వేషాలకు అతీతుడు, అహింసను వ్రతంగా కలిగినవాడు, వేదాంతశాస్త్ర పారంగతుడు, శిష్యుల పట్ల వాత్సల్యంగలవాడు సద్గురువు కాగలడని మనువు పేర్కొన్నాడు. భారతదేశంలో పరంపరాగతంగా అనేకమంది సద్గురువులు ప్రభవించారు. ఆర్ష సంస్కృతికి ఆలంబనగా, సమాజానికి వేగుచుక్కలుగా, జ్ఞానదీపధారులుగా ఈ నేలను పావనం చేశారు. మార్కండేయ పురాణంలోని తాంత్రిక పరంపర దేవాది దేవుడైన పరమశివుణ్ని 'ఆదిగురువు'గా వర్ణించింది. లోకం శ్రీకృష్ణుణ్ని 'జగద్గురువు'గా ఆరాధించింది.*
*గురుశిష్య పరంపర అనాదిగా ఈ జాతికి జ్ఞానభిక్షను ప్రసాదించిది. దైవానుగ్రహానికి పాత్రులు కావాలంటే ముందుగా గురు కటాక్షం లభించి తీరాలి. సద్గురువు కోసం వెతుక్కోవడమే మన పద్ధతి కాదు. సరైన శిష్యుడిగా రూపొందడానికి ఎవరికివారే ముందుగా కృషి చేయాలి. శిష్యుడు కాదగిన యోగ్యత సిద్ధించగానే, గురువు ఏదో ఒక రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు. ఇది ఎందరి విషయంలోనో ఎన్నోసార్లు నిరూపణ అయిన సత్యం. ఇదే ఆధ్యాత్మిక గురు పరం పరకు చెందిన మూల సూత్రం.*
*అలా అందరూ తయారుకావాలన్నదే సద్గురువుల ఆకాంక్ష!*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🌼🌻🌼 🙏🕉️🙏 🌼🌻🌼
No comments:
Post a Comment