Friday, June 20, 2025

****మనో నిగ్రహానికి మేలైన సాధన

 *మార్గదర్శి.....* 

*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా... 18వ రోజు* 

📿🪔📿 *మనో నిగ్రహానికి మేలైన సాధన* 📿🪔📿

*ఏకాగ్రత కుదరటానికి భగవంతుడు భగవద్గీతలో 6వ అధ్యాయపు 26వ శ్లోకములో ఓ అద్భుతమైనటువంటి సాధన మనకి అందించాడు. నిజానికి దాన్ని మనం అభ్యసించగలిగితే మనస్సు మనం చెప్పినట్లు వినడానికి ప్రయత్నం చేస్తుంది. భగవద్గీతలో 6వ అధ్యాయానికి 'ఆత్మ సంయమయోగం' అని పేరు. ఆత్మ = మనస్సు, సంయమం = నిగ్రహించడం, స్వాధీనం చేసుకోవడం. ఆ మనస్సులని స్వాధీనం చేసుకోవడం వల్ల కలిగేటటువంటి లాభం చాల గొప్పది కనుక దాన్ని ఎట్లా స్వాధీనం చేసుకోవచ్చో ఆ వివరాలన్నీ ఇస్తాను అని అర్జునుడికి కృష్ణుడు చెప్పింది 6వ అధ్యాయం.*

*అందులో ఈ వారపు శ్లోకం 26వది ఈ శ్లోకం చాల చిన్నది. కాని దీన్ని అభ్యసించడం భలే కష్టం. అభ్యసిస్తే కలిగే లాభం భలే గొప్పది. "యతో యతో నిశ్చరతి మన్య" మనసు ఎపుడు* *కుదురుగా ఉండదు. మనందరికి తెలుసును, చాల చంచలం. రకరకాల వాటి మీద వెళ్లిపోతూ ఉంటుంది. ఒక్కదాని మీద ఒక నిమిషం సేపు నిలకడగా ఉంటుంది అనే ప్రశ్నేలేదసలు. అందుకే, మనసును కోతి లాంటిది అన్నారు.*

*మనం ఇపుడు కూర్చొని కృష్ణా. కృష్ణా, కృష్ణా అనుకుంటున్నామను. కోండి. మొదటి క్షణం కృష్ణా, రెండవ క్షణం బయలుదేరి బజారు. 3వ క్షణంలో కృష్ణాతీరం. 4వ క్షణంలో గోదావరి తీరం, 5వ క్షణంలో గంగాతీరం, 6వ క్షణంలో అమెరికానో మరోదేశం, ఇంకోసారి ఇంకో చోటుకి వెళ్ళిపోయి మళ్ళీ 7వ, 8వక్షణంలోనైన కృష్ణుడిమీద నిలువవచ్చు.*

*అయితే వెళ్ళి వచ్చే వేగం చేత అది ఎపుడు వెళ్ళిందో అదిఎప్పుడు వచ్చిందో మధ్యలో ఇలాంటి విచ్చిత్తి ఏర్పడింది అని కూడ మనకు అన్పించదు. అంతవేగంగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అదికూడదు. ఏం చేయాలి?*

 *"యతో యతో నిశ్చరతి మనః"* 

*మనః=మనస్సు ఏ ఏ వైపు వెళ్లిపోతూంటుందో అలాంటి దానివైపే వెళ్తూ ఉండనీ, నువ్వు, ఎప్పుడూ నీ మనస్సు ఒక దాని వైపు వెళ్ళేటపుడు నువ్వు చెప్పినట్టురాదు. సరికదా! నిన్ను కూడా దాని వైపు వెళ్లిపోయేలా దాన్నే మళ్ళీ మళ్ళీ స్మరించేటట్లు చేస్తుంది. ఇదీ మనస్సుకుండే గొప్పతనం. అందుకోసమనే అది ఎటు ఎటు వెళ్ళుతుందో దాన్ని అక్కడ నుంచి వెనక్కి తేవాలనిగాని అది నీకు చెడ్డది అని అనిపించనివ్వకు. దాన్నే తలచుకునేటట్టుచెయ్, “యతో యతో నిశ్చరతి మనః చంచలం అస్థిరం". పోనీ అదికూడ ఒకదాని మీద నిలబడి ఉంటుందా అంటే స్థిరత అనేది లేకుండ అందులో కూడ మళ్లీ ఒకదానిమీద నుంచి ఒకదాని మీదకు మరో దాని మీదకు వెళ్ళిపోతుంటుంది. ఏం చేయాలి నువు?*

*"తత స్తతో నియమ్య”*

*వెళ్ళనీ కానీ, ఆ వెళ్ళేటపుడు నువు దేనినైతే తలచుకున్నావో దానిని కూడ తీసుకుంటూ వెళ్ళు, సృష్టిలో ఉండే ఏ వస్తువూ చెడ్డది కాదు. కనుక, నీ మనసు వెళ్ళినది కూడా మంచిదే అనేది నువ్వు స్మరించగలగాలి. దాన్ని నువు చూసినపుడు అందులో నీకు ఏ విధమైన మంచి లభిస్తుంది అనేదాన్ని గుర్తించే ప్రయత్నం చేయడం ద్వారా మనసుకి నీవు మంచి మార్గాన్ని చెప్పవచ్చు. ఉదాహరణకి పూజలో కూర్చున్నాము. అక్కడ కృష్ణుని పూజ చేస్తున్నాము. కళ్ళు మూసుకొని కూర్చోగానే మనసు బయల్దేరి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడ నుంచి Flower market, cloth shopకు, parkలోకి, అందులోంచి సినిమా థియేటర్లోకి వచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చింది. మనస్సా! అలా తిరుగకు అనకు. Flower marketకు వెళ్ళిందా! వెళ్ళనీ! కూడా నీవు నీ కృష్ణుడితో వెళ్ళు! చూడు ఆ పండ్లన్నీ, కృష్ణుడి దయవల్లే పెద్దవి అయినాయి. నీకు కావలసినవి తీసుకో కృష్ణుడు ఇచ్చాడని తీసుకొచ్చి కృష్ణునికి నివేదన చెయ్యి,*

*నీకు కావాల్సింది కృష్ణ సంబంధం కనుక ఇవన్నీ కృష్ణుడికి చెబితే, కృష్ణుడికి పెడితే, కృష్ణుడికి చూపిస్తే, అని నీవు అనుకోగానే నీకు కావాల్సిన కృష్ణుడు అక్కడికి వచ్చాడు. మనసుకు కావాల్సిన పండ్లు అక్కడికిచేరాయి. రెంటికీ నీవు సంబంధం కలిపావు. ఇపుడు మనస్సు సంతృప్తి చెందింది. నీ లక్ష్యం కృష్ణుడు చెదరలేదు. దానికి ఇష్టమైన సన్నివేశాలు చెబుతున్నావు. కనుక, నీ మాట వినడానికి అది వ్యతిరేకించదు. 'యతో యతో నిశ్చరతి' 'తతస్తతో నియమ్య' ఎంత అందంగా వాడాడో పదాల్ని. దేని దేని మీదకి నీ మనసు వెళ్ళిపోతుందో, ఎటు ఎటు అది వెడుతుందో దేని నుంచి దేని మీదికి అది ప్రయాణం చేస్తుందో అవన్నీ చేయనీ. అక్కడక్కడ నుంచి దాని దానితోటి ఆయా ఆయా సన్నివేశంతోటి "ఆత్మన్యేవ వశం నయేత్" నీవు కోరుకున్నది ఏదో దానితోటి నీవు కనుక సంబంధం కలిపావంటే అది నీ మాట వింటుంది. చంచలమై తిరిగే మనస్సుకి భగవత్ సంబంధాన్ని ఆయా ఆయా సన్నివేశంతోటి కలుపటం ద్వారా ఈసారి ఏది అవసరమైనా భగవంతుడి ద్వారా దాన్ని పొందవచ్చును అనే స్థితి ఏర్పడుతుంది. కనుక, తనకు కలిగే కర్మ వాసనా ప్రభావం చేత ఏర్పడే చాంచల్యాన్ని అది భగవంతుడి విషయంలోకి నడిపే ప్రయత్నం చేస్తుందన్న మాట. ఉదృతమైన నది ప్రవహిస్తుంటే, ఆ నదిని ఆపితే ఊర్లు మునిగిపోతాయి. నందిని వదిలేస్తే నీళ్ళు సముద్రంలో కలిసి పోతాయి. దానికి ఒక సేతువు నిర్మాణం చేసి కాలువలు తీసి దాంట్లో నుంచి నడిపించినట్లయితే తద్వారా నీళ్ళు ప్రవహిస్తాయి. అడ్డు కట్టావు. పంటలు పండుతున్నాయి. అందరికి క్షేమం కలిగినట్టే మనసుని దాని ఇష్టం వచ్చినట్టు పోనీవద్దు. క్రమపద్ధతిలో దాన్ని నడుపుతూ ఉంటే "ఆత్మన్యేవ వశం న యేత్”*

*తద్వారా మనసు మాట వినగలుగుతుంది. దీనికి 'ఛాందోగ్యం' పక్షిని దృష్టాంతంగా ఇచ్చింది. అందమైన పక్షి రెక్కలు విప్పి ఎగిరితే భలే సౌందర్యం. దాన్ని అలానే వదిలేస్తే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అందాన్ని చూసే అవకాశం లేదు. పోని పంజరంలో పెట్టేస్తే అది ఎగురలేదు కనుక అందం చూసే అవకాశం లేదు. ఒక కాలుకు తెగని త్రాడు కట్టి వదులుతే తాడు ఉన్నంత మేర ఎగురుతుంది. ఎగిరితే సౌందర్యాన్ని చూస్తావు. కావాలనుకుంటే మళ్ళీ త్రాడుతోటి సంబంధం ఉంది కనుక, దాన్నివెనక్కి తెచ్చి పంజరంలో పెట్టుకున్నట్టుగానే మనస్సు అనే ఒక అద్భుతమైన పక్షికి నీకుండే జ్ఞానమనే ఒక త్రాటిని, ప్రేమ త్రాటిగా, దానికి బస నిర్మాణం చేయి. అది ఎటు ఎటు ఎగిరితే తద్ సౌందర్యాన్ని అనుభవిస్తూ, దానిని స్వాధీనం చేసుకోగలుగుతావు.*

*"యథా శక్నుః సూత్రేన ప్రబద్ధః దిశం దిశం" అంటూ ఛాందోగ్యం చెప్పినమాట. దాన్నే శ్రీకృష్ణుడు అద్భుతమైనటువంటి ఒక సాధనగ మనకి ఈ శ్లోకంలో అందిస్తున్నాడు. కనుక, ఆహారనియమం పాటిద్దాం. తద్వారా మనసు యొక్క గతిని మనకు కావాల్సిన రీతిలో మలచుకునే ప్రయత్నం చేద్దాము.*

*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🪔🍁🍁🪔🍁

No comments:

Post a Comment