*ఆచార్య సద్బోధన:*
➖➖➖
```
*మనం ఏ పనిచేసినా ముందు దేవునికి నమస్కరించి చేయాలి.
*దాని వలన గొప్ప భారము కూడా తేలికైపోతుంది.
*దేనిలోనైనా ప్రయత్నంతో పాటు భగవంతుని యందు విశ్వాముంచాలి. భారము వహించమని వేడుకోవాలి.
*భగవంతుని యందు విశ్వాసం ఉంచుట చేత సాధించలేనిది అంటూ ఏదీ లేదు.
*హనుమంతుడు కొండను ఎత్తినాడన్నా, అర్జునుడు యుద్ధమున గెలిచినాడన్నా అంతా దేవుని యందు విశ్వాసము చేతనే!
*వారిలో ఉండిన అచంచల విశ్వాసమే వారితో అట్లాంటి అద్భుతాలు చేయించింది.
*భగవంతుని చిత్తశుద్ధితో నమ్మి, ఆయన చరణములను ఆశ్రయించిన వారికి ఇట్టి అద్భుతాలు అనుభవంలోకి వస్తాయి.```
.
*శుభమస్తు*
🌷🙏🌷```
No comments:
Post a Comment