Friday, March 27, 2026

 🔱ఓం నమః శివాయ🔱:
*🧘‍♀️శక్తియే ఆది దైవం- ఆది పరాశక్తి🧘‍♀️*

*హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తి మంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది.*


 *🧘‍♀️ఆది పరాశక్తి🧘‍♀️*


*ఆది పరశక్తి, దేవీ, మాత, పరబ్రహ్మ, విశ్వ మాత నివాసం మేరు పర్వతం, కైలాస పర్వతం , వైకుంఠం. మంత్రం...ఐం హ్రీం క్లీం- ఆయుధములు సకల ఆయుధములు, అవతారాలు..*


*సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి తండ్రి సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి తల్లి సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి రాజవంశం సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి తరువాతి వారు సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి అంతకు ముందు వారు సతీదేవి, పార్వతి, మహావిద్య, నవదుర్గ, అష్టమాత్రిక, లక్ష్మీ, సరస్వతి.*


*సాక్షాత్ పరమశివుని స్త్రీ రూపమే శక్తి.*

*శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి. ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు), ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి.*


 *దుర్గా దేవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము.*


*ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి దానికై అదే సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది.*


*హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.*


*సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక, ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.*


*శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తి మంతురాలిగా పూజించ బడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతుంది.*


*శక్తియే ఆది దైవం. ఆది పరాశక్తిని అంటే భువనేశ్వరి  సకల చరాచర సృష్టి ఆమెకే స్వంతం,తానే అఖండ సత్యం. స్త్రీ రూపంలో తాను చలనశీల శక్తి, పురుష రూపంలో అచలన శక్తి. ఆ యొక్క శక్తితో ఈ సృష్టిని త్రిమూర్తులు ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు త్రిమూర్తులు కాగా,  స్త్రీ రూపాలు ఆది శక్తి. ఆది శక్తి రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు తన లోనే ఇమిడి ఉన్నాయి ఆమె  శాశ్వతమైన, అపరిమిత శక్తి.*


*బ్రహ్మాను ఈ విశ్వానికి సృష్టికర్త గా నియమించి జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే శక్తి లోని రూపాంతరము శారదా దేవి (సరస్వతి) గా బ్రహ్మకు భార్య బ్రహ్మదేవుడు  భార్య తో కలసి ఈ విశ్వాన్ని సృష్టించే కార్యం చేస్తున్నారు.*


*విష్ణువును ఎదురులేని, మరణం లేని ఆత్మ. అమ్మవారి మాయ స్వరూపం రూపం లేకున్ననూ రూపాన్ని పొందుతాడు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ విష్ణువే అధిపతి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత విష్ణువు దే ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి  వివిధ రూపాంతరాలని చెందుతాడు. విష్ణువు నాభి నుండి బ్రహ్మని సృష్టించారూ.  బ్రహ్మ ఇతర దేవదేవతలని సృష్టిస్తాడు. యోగమాయ (ఆదిశక్తి)  అంతర్భాగమైన  మహాకాళి విష్ణువు యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. విష్ణు  పరమాత్మ వెలుగుకి ప్రతిరూపమైన, ఆదిశక్తి యొక్క మరొక రూపాంతరము శ్రీదేవి విష్ణువు భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే, పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే ది మహావిష్ణువు.*


*రుద్రుడు మూర్తీభవించిన కాలగతికి చిహ్నం అయినది. శివుడు రూపంలో లేనపుడు కాలం స్థంభిస్తుంది. అది శక్తియొక్క శక్తితో శివునిలో చలనము కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడు అవుతాడు. మహాశక్తిని అయిన ఆది శక్తి శివుని కి భార్య. లక్ష్మీ సరస్వతి కూడా ఆదిశక్తి లోని రూపాంతరాలు. ఆమె పరిపూర్ణ రూపం మహా శక్తి.

శివుడు  ధ్యాన శక్తి వలన ఆది శక్తి యొక్క అన్ని రూపాంతరాలని మించిపోతారు. అప్పుడే ఆది శక్తి శివుని  ఎడమ భాగం నుండి అవతరించింది.*


*దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం"ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆది శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడింది. సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము.*


*శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ, ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉంది. ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునఃసృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం, చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి. లలితా దేవి అండపిండబ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో మహా విస్ఫోటంకి పోలికలు ఉన్నాయి. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.*


*సకల జీవాలలోనూ దైవము అచేతన రూపంలోనూ, చేతన రూపంలోనూ ఉంది. దైవం యొక్క అచేతనాంశం పరమాత్మ కాగా, చేతనాంశం ఆది పరాశక్తి. మనుష్యులలోని ఈ చేతన శక్తినే కుండలినీ శక్తి అని అంటారు. జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలినీ శక్తియే ప్రాథమిక మూలం. మన నిత్యకృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంది. ధ్యానం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేయటం వలన అదృష్టం వరించటమే కాక, భావోద్రేకాల నియంత్రణపై పట్టు కూడా సాధించవచ్చును.*


*అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నది. కృష్ణుడు, శివుడు శక్తిమంతులయితే వారికంటే ముందే ఉనికి గల, వారిలో అస్థిత్వం కల సర్వ శక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది. కావున శివుడు, విష్ణువు ఇరువురూ సృష్టికి ఆద్యులు కారు. శక్తియే ఆదిమం. మనం చేసే ఆరాధన, మన నిత్యకృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం. శక్తి లేనిదే సృష్టి, సంరక్షణ , వినాశనాలు లేవు. ఆత్మని శరీరంలోనికి ప్రవేశపెట్టాలన్నా, ఈ రెంటినీ కాపాడుకోవాలన్నా లేదా ఆత్మ శరీరాన్ని విడివడిపోవాలన్నా, శక్తి అవసరం. కుండలినీ శక్తిని వేరు చేసినచో శివుడంతటి వాడు కూడా శవంతోనే సమానం.*


*ఆది పరాశక్తి భౌతిక శక్తి, విద్యా శక్తి, మాయా శక్తిగా తనని తాను విభజించుకొని అవతారములు ఎత్తినది. దైవ క్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి నుండి, దశావతారాలలో ఒకటైన కాళి విద్యా శక్తి నుండి వెలువడినవి. మాయా శక్తి నుండి యోగమాయ, మహామాయ, మాయలు అవతరించి, జీవులని భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చూస్తుంది.*


*దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటామే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది.*

*ఆది పరాశక్తి*

*శ్రీమద్ దేవీ భాగవత పురాణంలో త్రిమూర్తులకు దేవి యొక్క ఆజ్ఞలు మరియు సూచనలు ఇవ్వబడ్డాయి.*


*శక్తి, తన గురించి - "నేను ఆది పరాశక్తిని. భువనేశ్వరిని. సకల చరాచర సృష్టి నా స్వంతం. అఖండ సత్యాన్ని. స్త్రీ రూపంలో నేను చలనశీల శక్తిని, పురుష రూపంలో అచలన శక్తిని. నా యొక్క శక్తితో ఈ సృష్టిని మీ ముగ్గురు పాలిస్తారు. అఖండ సత్యం యొక్క పురుష రూపాలు మీరు ముగ్గురు కాగా, దాని స్త్రీ రూపాన్ని నేనే. నేను రూపరహితం. సర్వానికి అతీతం. అన్ని దైవ శక్తులు నాలోనే ఇమిడి ఉన్నాయి. నేను శాశ్వతమైన, అపరిమిత శక్తిని."*


*బ్రహ్మతో - "ఓ బ్రహ్మా! ఈ విశ్వానికి సృష్టికర్త నీవే. జ్ఞానానికి, సంగీతానికి గుర్తింపబడే నా రూపాంతరము శారదా దేవి (సరస్వతి) నీ భార్య. నీ భార్య తో కలసి ఈ విశ్వాన్ని సృష్టింపుము."*


*విష్ణువుతో - "ఓ నారాయణా! నీవు ఎదురులేని, మరణం లేని ఆత్మవి. నీకు రూపం లేకున్ననూ రూపాన్ని పొందుతావు. భౌతిక రూపాన్ని పొందే దేవతలందరికీ నీవే అధిపతివి. ఈ విశ్వాన్ని సంరక్షించే బాధ్యత నీదే. ఈ సృష్టిలో జీవాలని రక్షించటానికి నీవు వివిధ రూపాంతరాలని చెందుతావు. నీవు బ్రహ్మని సృష్టించావు. బ్రహ్మ ఇతర దేవదేవతలని సృష్టిస్తాడు. నా యొక్క అంతర్భాగమైన శక్తి అయిన మహాకాళి నీ యొక్క యోగ నిద్ర నుండి అవతరించినది. నీవే పరమాత్మవి. వెలుగుకి ప్రతిరూపమైన, నా మరొక రూపాంతరము శ్రీ నీ భార్య. జీవం ఉద్భవించే సమయానికి ఈ విశ్వాన్ని పరిశీలించే, పరిరక్షించే బాధ్యతలని నిర్వర్తించే విష్ణువు యొక్క రూపాన్ని నీవు పొందుతావు."*

*శివునితో - "ఓ రుద్రా! మూర్తీభవించిన నీ రూపం, కాలగతికి చిహ్నం. నీవు రూపంలో లేనపుడు కాలం స్థంభిస్తుంది. నా యొక్క శక్తితో నీలో చలనము కలుగుతుంది. ఈ శక్తి ద్వారానే విశ్వ వినాశనానికి, దాని పునర్నిర్మాణానికి కారకుడవు అవుతావు. మహాశక్తిని అయిన నేనే నీ భార్యను. లక్ష్మీ సరస్వతులు కేవలం నాలోని భాగాలు. నా రూపాంతరాలు. నా పరిపూర్ణ రూపం మహా శక్తి. నీ ధ్యాన శక్తి వలన నా యొక్క అన్ని రూపాంతరాలని నీవు మించిపోతావు. అప్పుడే నేను నీ ఎడమ భాగం నుండి నేను అవతరిస్తాను.   దేవీ భాగవత పురాణం ప్రకారం బీజ మంత్రమైన "క్లీం"ని జపిస్తూ శివుడు ఆదిశక్తి పై దృష్టి కేంద్రీకరించి వేల యేళ్ళ కొలదీ ధ్యానం చేసాడు. శివుడి ఎడమ భాగం నుండి సిద్ధిధాత్రిగా రూపాంతరం చెంది శివుడికి ఆది శక్తి ప్రత్యక్షమైనది. అందానికి, శక్తికీ దేవత అయిన పార్వతి ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమని (మానవ రూపం) తెలుపబడింది.*


 *సత్వ, రజో, తమో గుణములు కలిగిన పార్వతీ దేవి, ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము. ఆధునిక వైఙ్ఞానికావిష్కరణలలో శక్తి యొక్క భావము, పురాణాలలోనిదే. శక్తి దేని పైనా ఆధారపడకున్ననూ,ఈ అనంత విశ్వం సర్వం శక్తి పైనే ఆధారపడి ఉంది.*


*ఈ విశ్వం వినాశనమైపోయిననూ శక్తి మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. కృష్ణశక్తి సృష్టి వినాశనానికి నాంది కాగా, శూన్య శక్తి సృష్టి పునర్నిర్మాణానికి నాంది. వినాశనానికి తర్వాత, పునః సృష్టికి ముందు చైతన్యంగా ఉండే శక్తిని పవిత్ర శక్తి (Sacred Energy, Zero Energy) లేదా మహోన్నత మేధస్సు (Supreme Intelligence) అని అంటారు. దేవీ భాగవత పురాణం మరియు చతుర్వేదాలు కాళినిని కాలంతో బాటు ముందుకు తీసుకువెళ్ళి నాశనం చేసే కృష్ణశక్తితో పోలుస్తాయి.*
 

*శ్రీ లలితా దేవి అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించటం, అది విస్ఫోటం చెందుట, తర్వాతి కాలంలో ఈ విస్ఫోటమే విశ్వంగా అవతరించే ప్రక్రియ విఙ్ఞాన శాస్త్రంలో మహా విస్ఫోటంకి పోలికలు ఉన్నాయి. అంటే, ఆది శక్తియే శూన్య శక్తి, పవిత్ర శక్తి, మహోన్నత మేధస్సు అని అర్థం.*
        

  *సకల జీవాలలోనూ దైవము అచేతన రూపంలోనూ, చేతన రూపంలోనూ ఉంది. దైవం యొక్క అచేతనాంశం పరమాత్మ కాగా, చేతనాంశం ఆది పరాశక్తి. మనుష్యులలోని ఈ చేతన శక్తినే కుండలినీ శక్తి అని అంటారు. జీవకోటి యొక్క సకల కార్యకలాపాలకు ఈ కుండలినీ శక్తియే ప్రాథమిక మూలం. మన నిత్య కృత్యాలలో ఈ శక్తి నిగూఢంగా ఉంది. ధ్యానం ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేయటం వలన అదృష్టం వరించటమే కాక, భావోద్రేకాల నియంత్రణపై పట్టు కూడా సాధించవచ్చును.*
 

*దేవీ పురాణంలో ఇలా వ్రాయబడినది: మునులు, మహామునులు అందరూ కృష్ణుని వద్ద పురాణాలని తెలుసుకొన్న సుతుడిని శక్తిని గురించిన పలు సందేహాలను నివృత్తి చేయమని కోరారు.*


*శివ పురాణం, విష్ణు పురాణం వంటి వాటిలో త్రిమూర్తులే శాశ్వతమని, బ్రహ్మాండాన్ని మించినది లేదనీ, త్రిమూర్తులందరూ ఒక్కరేననీ, ఒక్కరే త్రిమూర్తుల రూపాలని తెలియజేయడమైనది. మరి మీరు ప్రస్తావించే ఆది పరాశక్తి ఎవరు? తాను ఎప్పుడు ఎలా జన్మించినది? మాకు అర్థమయ్యేలా తెలియచెప్పండి.         అని విన్నవించుకొన్నారు.సుతుడు ఇలా సమాధానం ఇచ్చాడు.*


*ఈ ప్రశ్నలకి సమాధానం ఎవ్వరూ ఇవ్వలేరు. బ్రహ్మ, నారద మహర్షుల వంటి గొప్ప వారినే ఈ ప్రశ్నలు అయోమయానికి గురి చేస్తాయి. శ్రీ మహావిష్ణువే సకల శక్తులు కలిగినవాడు, సర్వాంతర్యామి అని కొందరు భావించి అతనిని పూజిస్తారు. మరి కొందరు అర్థ నారీశ్వరుడే గొప్పవాడు అని అంటారు.*
 

*వేదాలలో సూర్యుడే పరమాత్మ కావటం వలన సూర్యుడిని ఆరాధించటమే ఉత్తమం అని తెలుపబడినది. కొందరు బ్రాహ్మణులు అవగాహన, హేతువు మరియు వేద మంత్రాలను వీటికి ఆధారాలుగా చూపితే మరికొందరు పోలిక, పరిస్థితులు, సత్యశోధన, సూత్రాలు మరియు సాక్ష్యాలని ఆధారంగా చూపారు. కానీ పరమాత్మ, సృష్టి మూలాల గురించి తెలుసుకొనటానికి ఈ ఆధారాలు ఏ మాత్రం ఉపయోగపడవని వేదాంతం తెలుపుతుంది. అయితే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందరూ శక్తిని మాత్రం స్మరిస్తున్నారు.*


 *అతి సూక్ష్మ కీటకం నుండి అతి విశాల విష్ణు స్వరూపం వరకు శక్తియే సర్వాంతర్యామిగా వ్యాపించి ఉన్నది. కృష్ణుడు, శివుడు శక్తిమంతులయితే వారికంటే ముందే ఉనికి గల, వారిలో అస్థిత్వం కల సర్వ శక్తియే వారిని శక్తిమంతులుగా చేస్తుంది. కావున శివుడు, విష్ణువు ఇరువురూ సృష్టికి ఆద్యులు కారు. శక్తియే ఆదిమం. మనం చేసే ఆరాధన, మన నిత్యకృత్యాలన్నీ శక్తితోనే సాధ్యం. శక్తి లేనిదే సృష్టి, సంరక్షణ మరియు వినాశనాలు లేవు. ఆత్మని శరీరంలోనికి ప్రవేశపెట్టాలన్నా, ఈ రెంటినీ కాపాడుకోవాలన్నా లేదా ఆత్మ శరీరాన్ని విడివడిపోవాలన్నా, శక్తి అవసరం. కుండలినీ శక్తిని వేరు చేసినచో శివుడంతటి వాడు కూడా శవంతోనే సమానం.*

*ఆది శక్తి నవగ్రహాలని అన్నింటినీ నియంత్రిస్తుంది. ఆది పరాశక్తి భౌతిక శక్తి, విద్యా శక్తి మరియు మాయా శక్తిగా తనని తాను విభజించుకొని అవతారములు ఎత్తినది. దైవ క్రమాన్ని నడిపించే నవగ్రహాలు భౌతిక శక్తి నుండి, దశావతారాలలో ఒకటైన కాళి విద్యా శక్తి నుండి వెలువడినవి. మాయా శక్తి నుండి యోగమాయ, మహామాయ, మాయలు అవతరించి, జీవులని భ్రాంతుల నుండి రక్షించి పరమాత్మ వైపు నడిపించేలా చూస్తుంది.*


*దుర్గాశక్తి నుండి విభజించబడిన నవదుర్గలు నవగ్రహాలకి దిశానిర్దేశం చేయటామే కాక వాటికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది.*


*సూర్యుడు - కూష్మాండ శక్తి,*

*రాహువు - మహాగౌరి,*

*శని - కాళరాత్రి,*

*కేతువు - సిద్ధిధాత్రి,*

*బృహస్పతి - కాత్యాయిని,*

*మంగళ - బ్రహ్మచారిణి,*

*చంద్రుడు - శైలపుత్రి,*

*బుధుడు - స్కంద మాత,*

*శుక్రుడు - చంద్రఘంట.*

*నవరాత్రులు నవగ్రహాలని పూజించినచో చెడు ప్రభావాలని దూరం చేస్తుంది.    శ్రీ దేవీ భాగవత పురాణం ప్రకారం విద్యా శక్తి మరల 10 భాగాలుగా విడిపోతుంది. వీటినే జ్ఞాన దేవలతలందురు. తంత్రాల దశావతారాలకి ఈ దేవతలే మూలాలు.*


*మత్స్యావతారం - ధూమవతి,*
*కూర్మావతారం - బగళాముఖి,*
*వరాహావతారం - భైరవి,*
*నరసింహావతారం - ఛిన్న మస్తా,*
*వామనావతారం - త్రిపురసుందరి,*
*పరశురామావతారం - మాతంగి,*
*రామావతారం - తార,*
*కృష్ణావతారం - కాళి,*
*బుద్ధావతరం - కమలా,*
*కల్కి అవతారం - భువనేశ్వరి.*


  *మాయాశక్తిగా జీవకోటి (ఉపదేవతల, జీవాల మరియు భూతాల)తో సాహచర్యము.*
 

*ఆదిశక్తి తనని తాను యోగమాయ, మహామాయ మరియు మాయగా విభజించుకొన్నది. యొగమాయ మహామాయని, మహామాయ మాయని నియంత్రిస్తాయి.*


*ఆది పరాశక్తి  హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత. పరబ్రహ్మ స్వరూపం. శాక్తేయంలో ఆది పరాశక్తే పరమసత్య స్వరూపంగా గుర్తింపబడింది. దేవి భాగవత పురాణములో ఈ సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు మరియు వినాశకారి ఆది పరాశక్తే అని సూచించబడింది. శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి శూన్యబిందు, అనగా దివ్యమైన శూన్య స్త్రీ శక్తి.*


*ఈ శక్తి యొక్క సార్వత్రిక ఆత్మ (పురుషుడు) మరియు ప్రకృతి శక్తికి జన్మించిన అంశములు. దుర్గా దేవి ఆది పరాశక్తి యొక్క సమీప రూపాంతరము. ఆది పరాశక్తి యొక్క మానవ రూపమే శక్తికి, సౌందర్యానికి దేవత అయిన దుర్గా దేవి. దుర్గా దేవి సాత్విక, రాజసిక మరియు తామసిక గుణాలు మూడూ కలసిన ఆది పరాశక్తి యొక్క భౌతిక రూపము అయితే, అనంత విశ్వానికి అధినేత్రి అయిన ఆది పరాశక్తి రూపం లేనిదీ, నిర్గుణ బ్రహ్మ అనే వాదన కూడా ఉంది. ఈ వాదన ప్రకారం ఆది పరాశక్తి ఒక దివ్యమైన, స్వచ్ఛమైన, శాశ్వతమైన చైతన్యము. ఆదిమ శక్తి తనే కావటం మూలాన ఇతర దేవతలకి కూడా తనే మూలము. కావున ఆది పరాశక్తే అఖండ సత్యం. ఈ శక్తి సంపూర్ణం. ఆది పరాశక్తి భర్త లేనిది. కానీ ఈ జగత్తుకి శివుడిని ఆహ్వానించటానికి తాను స్త్రీ రూపంలో జన్మనెత్తినది.*


*హిందూ మతంలో ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. స్త్రీ యొక్క సృజనాత్మక శక్తికి దైవత్వాన్ని ఆపాదించే ఒక భావన. భూభాగం పై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించిననూ పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది.*


*సృష్టికే కాక, సకల మార్పులకీ కూడా శక్తే మూలం. శక్తే దైవత్వానికి ఉనికి. శక్తే విముక్తి. మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే శక్తి యొక్క రూపాంతరమైన కుండలిని శక్తికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ ఆధారం అవసరం లేకుండా, స్వతంత్రంగా ఉండటంలోనూ, సమస్త సృష్టిపై ఆధారితమై ఉండటంలోనూ శక్తే కీలకం.*


*శక్తి ఆరాధన లోనూ శైవము లోనూ ఆది పరాశక్తి సర్వశక్తిమంతురాలిగా పూజించబడుతోంది. సాక్షాత్ పరమశివుడి స్త్రీ రూపమే ఆది పరాశక్తిగా, ఈ రూపమే మహాదేవిగా, పార్వతీ దేవిగా గుర్తింపబడుతోంది.*
              

   *ఆది పరాశక్తి అనగా నిత్య మరియు అపరిమిత శక్తి. ఆది శక్తి ఈ సృష్టిని మించిన శక్తి. యావత్ సృష్టి యొక్క పుట్టుకకి మరియు వినాశనానికి కారకమైన క్రియాత్మక అదృశ్య శక్తి.*         

   *శ్వేతాశ్వతరోపనిషత్తు - చతుర్థాధ్యాయం - మొదటి పద్యం ఆమె గూర్చి ఈ క్రింది విధంగా వర్ణించబడింది.*


*య ఏకోవర్ణో బహుధా శక్తియోగాద్!వర్ణననేకాన్నిహితార్థో దధాతి! విచైతి చాంతే విశ్వమాదౌ చ దేవ స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు!!*

*తాత్పర్యం:-  రంగు లేనిది బహువిధ శక్తి గలది, సృష్టిని అంతం చేసే ప్రక్రియలో అనేక రంగులని సృష్టించేది, అన్నీ ఉద్భవించేది తన నుండే, అన్నీ కలసిపోయేది తన లోనే, తనే మనకి శుభాన్ని, అవగాహనని కలిగిస్తుంది.*
                           

*పార్వతీ దేవిగా అవతరించే ముందు ఆది పరాశక్తి హిమాలయ పర్వత మహారాజుకి ప్రత్యక్షమై తనని తాను పరిచయం చేసుకొని అతనికి దివ్యోపదేశము చేసి అనంత జ్ఞానాన్ని ప్రసాదించినది. వేదములలోని పదములతో పరాశక్తి అయిన తనకి ఆద్యంతాలు లేవని వివరించినది. విశ్వంలో తానే అఖండ సత్యమని తెలిపినది. ఈ విశ్వమంతయు తన సృష్టియేనని, తనే పరబ్రహ్మ స్వరూపము అని రహస్యము తెలిపినది.

జయం, విజయం తానేనని, వాటి రూపాంతరాలు కూడా తానేనన్న సత్యము తెలిపినది. బ్రహ్మ తన స్పష్టమైన రూపాంతరమేనని, విష్ణువు తన అస్పష్టమైన రూపాంతరమని, శివుడు తన అతిశయ రూపాంతరమని తెలిపినది. ఎవరూ కని, విని, ఎరుగని తన రూపాన్ని హిమాలయ పర్వత మహారాజుకి చూపినది.*
 

*సత్యలోకాన్ని తన నుదుట, విశ్వాన్ని తన కురులలో, సూర్యచంద్రులను తన కళ్ళుగా, నాలుగు దిక్కులను తన కర్ణాలుగా, వేదాలనే తన పలుకులుగా, మృత్యువు, అనురాగం మరియు భావోద్రేకాలను తన దంతాలుగా, మాయను తన చిరునవ్వుగా చూపినది.*

 
*సప్తమాతృకలు అయిన బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, కౌమారి, వారాహి మరియు చాముండిలు బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, స్కందుడు, వరాహుడు మరియు నరసింహు ల సహధర్మచారిణులు మరియు శక్తిస్వరూపాలు. అసురులతో శక్తి చేసిన యుద్ధానికి సప్తమాతృకలు సహాయసహకారాలనందించారు.*


*దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళ నాడు మరియు కేరళ లలో ఆది పరాశక్తి అమ్మలగన్న అమ్మగా, పెద్దమ్మ తల్లిగా పూజలందుకొంటోంది. ఆది పరాశక్తి యొక్క వివిధ అవతారాలకి దక్షిణ భారతదేశంలో పలు ప్రదేశాలలో పలు ఆలయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రజలు అమ్మవారే గ్రామాన్ని రక్షిస్తుందని, ఊరి బాగోగులని చూసుకొంటుందని, దుష్ట శిక్షణ చేస్తుందని మరియు రోగాలని నయం చేస్తుందని నమ్ముతారు.*


*సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతరలని అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. గంగమ్మ తల్లి, కామాక్షమ్మ, కనకదుర్గ, లక్ష్మీ దేవి, మీనాక్షి, మారియమ్మ, ఎల్లమ్మ, పోలేరమ్మ, పేరంటాళ్ళమ్మ వంటివన్నీ ఆది పరాశక్తి యొక్క రూపాంతరాలకి కొన్ని ఉదాహరణలు.*
         
         
    *శక్తి ఆరాధన మినహాయించి "ఆది శక్తి" ఎక్కడా ఆ పేరుతో సంబోధించబడలేదు. కానీ, పరోక్షంగా అన్ని పురాణాలు శక్తినే మహోన్నతంగా ఆరాధిస్తాయి.                         వైష్ణవులు ప్రత్యేకంగా శక్తిని ఆరాధించకపోయిననూ మాయని, యోగమాయని నమ్ముతారు. రాధని మూల ప్రకృతిగా ఆరాధిస్తారు.*


 *మహాలక్ష్మి రాధ యొక్క వైశాల్య రూపమని భావించటం వలన విష్ణుపురాణం మరియు భాగవత పురాణం లలో కూడా ఎక్కడా ఆది శక్తి ప్రస్తావనలు లేవు.                        బ్రహ్మ పురాణం మాత్రం వీటికి విరుద్ధంగా ఆది పరాశక్తి అనే బీజము తనని తాను పురుషుడు మరియు ప్రకృతిగా విభజించుకొన్నదని తెలుపుతుంది. ఆది బీజం కృష్ణుడుకి మరియు కాళికి జన్మనిచ్చినది. తర్వాత కాళి లలితా త్రిపుర సుందరిగా అవతరించి, రెండు బుడగలని సృష్టించినది. మొదటి బుడగ నుండి విష్ణువు అవతరించి బ్రహ్మకి, గౌరికీ జన్మనివ్వగా, గౌరి సతిగా, పార్వతిగా రూపాంతరం చెందినది. రెండవ బుడగ నుండి శివుడు మరియు రాధ అవతరించారు. రాధ తర్వాత లక్ష్మిగా, సరస్వతిగా మరియు గంగగా అవతరించినది.*


 *1.ఆది బీజపు పురుష భాగం కృష్ణుడు,*
  *2.ఆది బీజపు ప్రకృతి భాగం కాళి,*
 *3.కాళి త్రిపుర సుందరిగా అవతరించినది,*
 *4.త్రిపుర సుందరి విష్ణువుని సృష్టించినది,* 
*5.త్రిపుర సుందరి, శివుణ్ణి సృష్టించినది,*
*6.త్రిపుర సుందరి రాధని సృష్టించినది,* 
*7.విష్ణువు బ్రహ్మని సృష్టించాడు.*
      

*శివ పురాణంలో శివుని ఎడమ సగభాగం నుండి ఆది పరాశక్తి పరమ ప్రకృతిగా అవతరించినట్లు ఉంది.*


*లింగ పురాణంలో ఆది శక్తి యొక్క సగుణ స్వరూపమైన పార్వతి పానవట్టముగా, శివుడు లింగంగా అవతరించి వీరి సంగమమే శివలింగం గా పూజింపబడుతూ జీవోద్భావన గావించినట్లు తెలుపుతుంది. స్కంద పురాణం మరియు మార్కండేయ పురాణం దుర్గ లేదా చండి సకల జగత్తుకీ ఆది దేవత అనీ, ఈ రూపాంతరమే ఆది శక్తి యొక్క భౌతిక రూపమనీ తెలుపుతున్నవి.*


*శ్రీ ఆదిశంకర విరచితమైన సౌందర్యలహరిలోని 1వ శ్లోకం - భావము:-*

*1) శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం*
*న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|*
*అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి*
*ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి||*

**తాత్పర్యము / భావం:-*

*అమ్మా! పరమశివుడే అయినా నీతో కలసి ఉన్నప్పుడు మాత్రమే సర్వశక్తిమంతుడై లోకవ్యవహారములు చేయ గలుగు తున్నాడు. అదే నీతోడు లేనినాడు శంకరుడే అయినా ఇసుమంత కూడా కదలలేడు కదా. (శక్తితో ఉంటే శివం-కదలగలిగేది,శక్తి లేకుంటే శవం - కదలలేనిది) శివరూపమైన లింగం శక్తిరూపమైన పానమట్టం లేనిదే నిలబడలేదుగా. అంత శంకరుడే పరాధీనతతో నీ ఆధారముతో నిలువగా ఇక సామాన్యులు నినువిడచి జీవించుట ఎట్లు సాధ్యం. నిన్ను నిత్యము శివుడు, విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.*



*అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా.*


*పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరునిలో శక్తి ఉంటుంది. ఆ దివ్యశక్తి తోడు లేకుంటే పరమశివుడు అయినను కదలుటకు కూడా శక్తిహీనుడే. కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి, స్థితి, లయలకు కారణ భూతులైనారు.*

*పుణ్యం లేనివారెవ్వరూ ఆ జగన్మాతను స్తుతించటానికి అర్హులు కానేరరు.  'నాకు శక్తి ఉంది' అనటం మనం తరచూ వింటూ ఉంటాం. ఆ శక్తి అనేక రకాలు. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, కొందరికి అభినయించే శక్తి, ఇలా ఏ శక్తి అయినా ఆ ఆదిశక్తి అంశ అని తెలుసుకోవాలి.*


*ఈ భౌతిక జగన్నిర్మాతలు - తల్లిదండ్రులు, (అమ్మవారు - అయ్యవారు) ఈ ఇద్దరి కారణంగానే సృష్టి జరుగుతుంది. అంటే ఈ జగత్తంతా వారి దాంపత్య ఫలితమే!* 


*అయితే వీరిలో అయ్యవారు నిర్గుణుడు, నిరాకారుడు. అమ్మవారు మూల ప్రకృతి. సంస్కృత అక్షరం 'ఏ' ఆమె యోని రూపం. వీరిద్దరి కలయిక తో సృష్టికి గుణమైన లక్షణం ఏర్పడుతుంది. ఇదంతా వ్యక్తము. గుణముతో కూడినది. అంటే,... జరిగిన సృష్టిలో సైతం 'సగుణాత్మక' చిహ్నాలు గలవి కొన్ని ఉత్పత్తి అవుతాయి. ఇవి తిరిగి నిర్గుణ లింగాకృతిని కూడి జగత్ విస్తరణకు దోహదపడతాయి.*

*శ్లోకము:-*

*సృష్టి స్థితి వినాశానాం - శక్తి భూతే సనాతని౹౹*
*గుణాశ్రయే గుణమయి - నారాయణి నమోఽస్తుతే౹౹*

*అంటూన్నది మార్కండేయ పురాణం. ఈ ప్రకారం శ్రీదేవిని ప్రస్తుతించాలన్నా - పూజాదికాలు జరిగించాలన్నా, బహుజన్మార్జిత పుణ్యములు అపారంగా కలిగిన వారికి మాత్రమే అర్హత ఉంటుంది.*

*కాళిదాస కవీంద్రుని రచన అయిన 'చిద్గగన చంద్రిక' లో -*

*శ్లోకము:-*
*అంబతావక పదద్వయార్చకస్త్వన్మయో భవతి నాత్ర విస్మయః ౹*
*యస్త్వయైవ వివశో వశీకృతః భక్తి రేవ సమ భూచ్ఛివః స్వయమ్ ౹౹*

*(జగన్మాతా! నీ పాద కమల ద్వయాన్ని అర్చించే వాడు తప్పక తన్మయుడవుతాడు. అందులో ఆశ్చర్యపడడానికేమీ లేదు. నిజానికి శివుడు - వశీకృతుడు, పరవశుడు. అయినప్పటికీ-శక్తుడు కూడా!)*


*మొత్తం మీద ఈ శ్లోక భావం ఇలా చెప్పవచ్చును!....*

*శ్రీ పరమేశ్వరి అనంత బ్రహ్మాండానికి తానే శాసకురాలు అగును. అందుచే తనను శాసించేవాడు ఇంకొకడు ఎవడును ఆమెకు లేడు. సర్వమూ తానే అయి, తన కంటె అభిన్నముగా ఉండే (ఇతరములేని) పరాశక్తికి శాసకుడుగానీ శాసము అనగా శాసింపదగినదిగానీ లేదు అనియు తలంపదగును. ఈ ప్రపంచాన్ని ప్రకృతి పురుషులు కలిసి నడుపుతున్నారు. వీరిలో ఎవ్వరికి ఎవ్వరు ప్రభువులు కారు. “ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీ ఉభావపి" సకల చరాచర జగత్తునకు తానే కారణముకానీ, తనకు కారణము లేనిది.*


*ఈశ్వరులందరికీ వారివారి కర్మలను బట్టి అధికారము ప్రసాదించు పరమేశ్వరుడే ఈ పరదేవత. ప్రకృతి- పురుషులే సర్వ ప్రపంచాన్ని నడిపిస్తుంటే, వారిపై అధికారులు ఎవరుంటారు? అందుచేత శ్రీదేవి 'నిరీశ్వరా' యనబడును.* *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment