Tuesday, May 6, 2025

 🌹 *గురు పాదాల విలువ*🌹
                  

*భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరకి, హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్‌ వచ్చి, హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు.*

*ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా చెప్పాడు…*

*”హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప.”*

*“ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది? ".*

*“పాద నమస్కారాలు.      శిష్యులు గురువుగారి పాదాలనాశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి.      శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే.         అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు, అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బావుండేది అనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ళ నించి గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమౌతాడని చదివాను.   కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది?" అడిగాడా అమెరికన్‌ సీరియస్‌గా.*

*స్వామీజీ చిన్నగా నవ్వి ..... “అలా నదివద్దకి వెళ్ళి మాట్లాడుకుందాం పద.”*

*ఇద్దరూ నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు.*

*నీళ్ళల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు. వలలో చేపలు పడ్డాక, వాటిని పట్టుకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు.*

*“జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి? వారి పాదాల వద్ద ఉన్నవా? లేక దూరంగా వున్న చేపలా?” ప్రశ్నించాడు స్వామీజీ.*

*“దూరంగా ఉన్నవే” చెప్పాడు అమెరికన్‌ వినమ్రంగా.*

*“భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు.*

*గురు పాదాలను ఆశ్రయించకుండా, వాటికి దూరంగా వుండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూంటారు." వివరంగా చెప్పారు స్వామిజీ.*

*గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్ధ్యములు ఎవ్వరికీ లేవు.*
```
🙏 *సర్వేజనా సుఖినోభవంతు* 🙏

No comments:

Post a Comment