*హిందూ ధర్మం - 26*
------------------------------
*మహాభారతం - అరుదైన గ్రహణం*
మనకు ఎప్పుడైనా గ్రహణాలు సంభవించప్పుడు, ఇది చాలా అరుదుగా ఏర్పడే గ్రహణం, ఇలా 100 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుందని, లేదా 150 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, దీన్ని తప్పక వీక్షించండి అని నాసా మొదలైన సంస్థలు, భారతదేశంలో ఉండే మరికొన్ని సంస్థలు ప్రకటనలు జారీ చేస్తాయి.
ఈ గ్రహణం కూడా అలాంటిదే, చాలా అరుదుగా ఏర్పడేది. ఈ గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది.
*1*. జ్యేష్ఠా నక్షత్రంలో అమావాస్య రావడం 19 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
*2.a*. అదే సమయంలో జ్యేష్ఠాలో సూర్యగ్రహణం 340 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడుతుంది.
*2.b*. అదీగాక, శని రోహిణిలో ఉండటం 7000 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
ఈ అరుదైన కూటమి మహాభారత యుద్ధం తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఏర్పడలేదు. ఈ గ్రహణం, మహాభారతంలో చెప్పిన గ్రహకూటములు కోసం వెనక్కు లెక్కించుకుంటూ వెళ్తే, యుద్ధం సరిగ్గా 22 నవంబరు BCE. 3137 ప్రారంభమైందని తేలుతుంది.
మనిషి లెక్కించటంలో తప్పులుండవచ్చు కానీ, గ్రహాలు, భూమి కదలికలు చాలా ఖచ్చితమైనవి.
ఇక్కడ ఒక సందేహం వస్తుంది....
ప్రతి 7000 సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఏర్పడుతుంది అన్నారు కదా, మరి మహాభారతం BCE.3137 లోనే జరిగిందని ఎలా నిర్ధారణకు వచ్చారు?
అంతకంటే ముందు కూడా కూటమి ఏర్పాడి ఉండచ్చు కదా?
అని అనిపిస్తుంది. కానీ ఈ ఖగోళవింతకు ఇంకో అరుదైన వింత తోడయ్యింది. విచిత్రమేంటంటే ఈ రెండు గ్రహణాలు కేవలం 13 రోజుల వ్యవధిలో ఏర్పడ్డాయి. చంద్రుడు భూమికి ఉపగ్రహం. చంద్రుడు 360 డిగ్రీలు తిరుగుతాడు. చంద్రుడి గమనంలో ప్రతి 12 డిగ్రీల మార్పును ఒక తిధిగా పరిగణిస్తారు. చంద్రుడు, భూమి, సూర్యుడు ......... ఈ ముగ్గిరిలో భ్రమణం కారణంగా, చంద్రుడిపై భూమి నీడ పడినప్పుడు కనిపించని ప్రాంతాన్ని బట్టి చంద్రుడి ఎదుగుదల, క్షీణించడం కనిపిస్తాయి. సాధారణంగా అమావాస్య, పూర్ణిమకు మధ్య 15 రోజులు వ్యవధి ఉంటుంది. కానీ ఈ విశేష సంఘటన (వింత) జరిగడానికి కారణం చంద్రుడు తన కక్ష్యలో 180 డిగ్రీలు (అంటే పూర్ణిమ నుంచి అమావాస్య వరకు లేదా అమావాస్య నుంచి పూర్ణిమ వరకు) తిరగటానికి సాధారణంగా 12 డిగ్రీల వేగంతో పరిభ్రమిస్తాడు. అప్పుడు అమావాస్య, పూర్ణిమలకు మధ్య 15 రోజుల వ్యవధి ఉంటుంది. కానీ ఈ ఖగోళ వింత ఏర్పడినప్పుడు చంద్రుడు తన సాధారణ వేగానికి భిన్నంగా 13-17 డిగ్రీల వేగంతో తిరిగడం వలన 13 రోజుల వ్యవధిలోనే ఇలా జరిగింది. దీన్ని ఆధునిక సాఫ్ట్వేర్ల ద్వారా పరిశీలించి, భారతీయులు, విదేశీయులు ............ అనేకులు ధృవపరచటం జరిగింది.
ఇలా జరగడానికి భారతీయ ఖగోళశాస్త్రంతో పాటు, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా కారణాలు వివరించారు. ఈ వింత మహాభారతం జరిగిందని ధృవపరచటానికి ఒక సాక్ష్యం. ఇటువంటివే అనేకం మహాభారతంలో ప్రస్తావించటం జరిగింది. వాటిని ఆధారంగా చేసుకుని Astronomical dating చేసినప్పుడు పైన చెప్పిన తేదీలలో మాహాభారతం జరిగిందని నిర్ధారించారు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment