Friday, September 26, 2025

 🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀

*ఈరోజు శ్రీశైలంలో...*
(శ్రీశైలభ్రమరాంబికామాత) 
*స్కందమాతా దుర్గా అలంకరణ* 

🌻🌻🌻🌻🌻🌻🌻🌻

స్కందమాత దుర్గా , నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కంధమాత దుర్గాదేవి అవతారాలలో 5 వ అవతారం. 
కార్తికేయుని మరో పేరు స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. 
నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.

🌻 *రూపం*

నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. 
చేతిలో కమలం , జలకలశం , ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా , స్కందుడు(కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతా దేవి.

🌻 *విశిష్టత*

ఈ అమ్మవారు మోక్ష , శక్తి , ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రాసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్ధ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ , పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం , మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెబుతుంది. 
ఈ అమ్మవారిని పూజించినప్పుడు , ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తునిచేత పూజింపబడతాడు. దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులూ భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం. 
ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారట. 

స్కందమాతా దుర్గా దేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. 
ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా.

🌻 *కథ*

తన కుమారుడు స్కంద /కార్తికేయ / కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాతా దుర్గాదేవి.
స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. 

శివ , పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల(కొన్ని కోట్ల సంవత్సరాలు) కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. 

వారిద్దరి శక్తి ఒకటైన తరువాత , వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు , ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. 

ఈ లోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. 
ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది. 
అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా , కుమారస్వామి జన్మిస్తాడు. 

ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. 

తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు , ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. 
తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండతూ ఉండమని , ఇది మంచి , ఇది చెడూ అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమనీ శాపం ఇచ్చింది. 

ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమనీ , కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా , ఆ తేజస్సు తనది కాబట్టీ ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాశానికి తెచ్చుకుంటుంది. 

కృత్తికలు పెంచారు కాబట్టీ కార్తికేయుడనీ , రెల్లు పొద(శరవణాలు)లో ఉన్నాడు కాబట్టీ శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. 

అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ , పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని , అతనిపై యుద్ధం ప్రకటించి , దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమవుతాడు. 

ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. 
అలా దేవ సేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. 

తిరిగి శంభు , నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది.

🙏 *ధ్యాన శ్లోకం*

*"సింహాసనగతా నిత్యం* 
*పద్మాశ్రిత కరద్వయా* 
*శుభమస్తు సదా దేవి* 
*స్కందమాతా యశస్వినీ"*

🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀

No comments:

Post a Comment