Saturday, June 26, 2021

ఫాల్స్ ప్రిస్టేజ్ కు పోయి టిప్పు విగ్రహ ఏర్పాటుకు పూనుకోవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు!

ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఒక విన్నపం! ముస్లిం మతానికి చెందిన గొప్ప వారి విగ్రహాలు ఏర్పాటు చెయ్యాలనుకొంటే దయచేసి అబ్దుల్ కలాం గారి విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యండి! అందరం ఆ మహానుభావునికి చేతులెత్తి మొక్కుతాము! అంతేకానీ టిప్పు సుల్తాన్, అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బీన్ తుగ్లక్, మహమ్మద్ గజనీ, మహమ్మద్ ఘోరీ, ఔరంగేబు లాంటివారి విగ్రహాలు అవసరం లేదు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిప్పు విగ్రహం ఒక్కటైనా ఉన్నదా? ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర ప్రదేశ్ క్రీ.శ. 1954 లో విడిపోగా ఆనాటి నుండి ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పేంతవరకూ ఆంధ్రులకెవ్వరికీ టిప్పు స్వాతంత్య్ర పోరాట యోధుడని తెలియకుండా పోయిందా? భారత (కాంగ్రెస్) చరిత్రకారుల మాటలు నమ్మి టిప్పు సుల్తాన్ కడపలో వివాహం చేసుకున్నాడని ఎమ్మెల్యే గారు చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యే గారు చెపుతున్నది తప్పు వాస్తవమేమంటే టిప్పు తండ్రి హైదర్ ఆలీ కడప కోటలో గవర్నర్ గా పనిచేస్తున్న మైనుద్దీన్ కుమార్తెను వివాహం చేసుకొన్నాడు. టిప్పు సుల్తాన్ తల్లి ఫక్రున్నీసా (ఫాతిమా) కు కడపతో సంబంధం వుంది.

ఎమ్మెల్యే గారూ! దయచేసి సంజయ్ ఖాన్ నటించిన టీవీ సీరియల్, కాంగ్రెస్ పాలనలో రచించిన చరిత్రను చూసి టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుపై నిర్ణయాలు తీసుకోకండి!

ప్రొద్దుటూరులో విగ్రహం ఏర్పాటు చెయ్యొద్దని ప్రజలు కోరుతుంటే కాంగ్రెస్ హయాంలో బెంగుళూరులో నిర్మించిన టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని తొలగించగలరా అని ఎమ్మెల్యే గారు మాట్లాడడం వితండవాదం అవుతుంది. ఎమ్మెల్యే గారూ! కర్నాటకలోని మేల్కోటే లో వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజలు దీపావళి పండగను ఎందుకు నిషేధించారో మీరు మెచ్చుకొంటున్న భారత (కాంగ్రెస్) చరిత్రకారులు వ్రాశారా వ్రాయలేదా?

ఎమ్మెల్యే గారూ! మీరు చెబుతున్న భారత (కాంగ్రెస్) చరిత్రకారుల కళ్ళకు టిప్పు 17 సంవత్సరాల పాలనలో కొడగు (కూర్గ్), చిత్రదుర్గ, మేల్కోటే, మంగళూరు, మలబార్ తీర ప్రాంతాలలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనలు కనిపించలేదా? ఎమ్మెల్యే గారూ! దయచేసి చరిత్రలను పక్కనపెట్టి ఒక్కసారి కూర్గ్, మేల్కోటే, చిత్రదుర్గలకు మీరే స్వయంగా వెళ్లి అక్కడి ప్రజలను విచారించండి! అప్పుడుకూడా మీకు ప్రజలు చెప్పేది తప్పని భారత (కాంగ్రెస్) చరిత్రకారులు వ్రాసిందే ఒప్పని అనిపించిందంటే ఈ విషయాన్ని ప్రజలు మీ విచక్షణకే వదిలేస్తారు!

టిప్పు తండ్రి హైదర్ ఆలీ మైసూర్ రాజుల దగ్గర పనిచేసేవాడు! నమ్మకంతో వారు హైదర్ ఆలీని శ్రీరంగపట్నానికి సామంతరాజును చేస్తే కొంత కాలానికి ఎదురుతిరిగి శ్రీరంగపట్నాన్ని మరికొంత కాలానికి మైసూర్ పై దాడి చేసి మైసూర్ ను వశపరచుకొన్నాడు! వీలులేక మైసూర్ వడియార్ రాజులు బ్రిటీషు వారిని ఆశ్రయించారు!

ఎమ్మెల్యేగారేమో టిప్పు చరిత్రను బ్రిటీషు వారు వక్రీకరించారంటున్నారు మరి పోర్చుగీస్ వారు వ్రాసిన చరిత్ర మాటేమిటి? పోర్చుగీస్ చరిత్రకారుడు ఫాదర్ బెర్తులోమియా వ్రాసిన చరిత్ర కూడా అబద్దమేనా? టిప్పు తన సేనాధికారులకు వ్రాసిన ఉత్తరాలూ అబద్దమేనా? మేల్కోటేలో ఆనాడు దుర్మరణానికి గురైన వారి వారసులు అబద్దాలు చెపుతున్నారని మీ అభిప్రాయమా? చిత్రదుర్గ, కూర్గ్ ప్రాంత ప్రజలు చెప్పేవి కూడా అబద్దాలేనా?

ఏ చరిత్రకారుడు కాదనలేని సత్యమేమంటే యుద్దంలో టిప్పు మరణించిన తర్వాత బ్రిటీష్ వారు శ్రీరంగపట్నం, మైసూర్ లను వడియార్ రాజులకే అప్పగించారు! తర్వాత బ్రిటీష్ వారు భారతదేశం గర్వించదగ్గ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశరయ్య ఆధ్వర్యంలో మైసూర్ రాజుల కోసం మైసూర్ ప్యాలెస్ ను, మైసూర్ రాజుల అభ్యర్థన మేరకు కృష్ణరాజసాగర్ డ్యాం మరియు బృందావన్ గార్డెన్స్ ను నిర్మించారు! బ్రిటీష్ వారు మంచివారని చెప్పడం కోసం ఈ మాటలు చెప్పడం లేదు! కేవలం జరిగిన చరిత్ర చెప్పడం జరిగింది!

ఇక టిప్పు విషయానికొస్తే భారతదేశంపైకి దండెత్తి రావాలని, అందరం కలిసి భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మారుస్తామని ఆఫ్గనిస్తాన్ రాజు జమాన్ షా కు టిప్పు అనేక ఉత్తరాలు వ్రాశాడు. అలాంటి వ్యక్తి స్వాతంత్య్ర సమరయోధుడు ఎలా కాగలడు? కేవలం బ్రిటీష్ వారితో యుద్ధం చేసినంత మాత్రాన టిప్పు సుల్తాన్ భారత స్వాతంత్య్ర పోరాటవీరుడు కాదు ఎందుకంటే టిప్పు నిజాం నవాబులతో, మరాఠా రాజులతో, కేరళ రాజులతో యుద్దాలు చేశాడు. దీన్నిబట్టి టిప్పుకు వున్న అనేకమంది శత్రువులలో బ్రిటిష్ వారు కూడా ఒకరు అంతే.

బ్రిటిష్ చరిత్ర కారుడు లూయీస్ రయిస్ వ్రాసిన మైసూర్ గజెట్, మలబార్ గజెట్ ల ప్రకారం టిప్పు తన 17 సంవత్సరాల పరిపాలనలో 99.9% హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగొట్టడం, సంపదను దోచుకోవడం చేసినట్లు నమోదుచేశారు. లూయిస్ రయిస్ లెక్క ప్రకారం దాదాపు 8000 ఆలయాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే శ్రీరంగపట్నంలోని రంగనాథాలయం మరియు ఇంకో ఆలయం జోలికి టిప్పు వెళ్ళలేదు. కారణమేమంటే ఈ ఆలయాల్లో ప్రతిరోజు పూజలు చెయ్యడం వలన టిప్పుకు మేలు కలుగుతుందని కొందరు బ్రాహ్మణ జ్యోతిష్యులు చెప్పి వుండడం, ఆమాటలను టిప్పు విశ్వసించడం. టిప్పు లాంటి వ్యక్తికి అంతగా నమ్మకం కలిగించి శ్రీరంగపట్నంలోని రెండు ఆలయాలను కాపాడిన ఆ బ్రాహ్మణ జ్యోతిష్యులు మహాఘటికులని చెప్పవచ్చు. శ్రీరంగపట్నంలోని రంగనాథాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ గైడ్ ఈ విషయం చెప్పాడు.

కొందరు కాంగ్రెస్ మూర్ఖులు టిప్పు సుల్తాన్ ను కన్నడ భాషాభిమానిగా భావిస్తారు. అయితే వాస్తవం ఏమంటే టిప్పు తన పరిపాలనా భాషగా పార్శి భాషను ప్రవేశపెట్టాడు. ఈరోజుకు కూడా కర్ణాటక రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే టిప్పు ప్రవేశపెట్టిన ఖాతా, బగర్ హుకుం లాంటి పదాలు కనిపిస్తాయి. టిప్పు మైసూర్ పేరును నజరాబాద్, కాలికట్ ను ఇస్లామాబాద్ గా, సక్లేష్పూర్ ను మంజ్రాబాద్ గా మార్చాడు. టిప్పు పతనం తరువాత ఆ పేర్లన్నీ తిరిగి తమ పాత పేర్లతో పిలువబడుతున్నాయి. టిప్పు ఆనాటి హిందూ క్యాలెండర్ ను రద్దు చేసి ఇస్లామిక్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టాడు. టిప్పు ప్రవేశపెట్టిన క్యాలెండర్ ప్రకారం ఏడాదికి 350 రోజులు మాత్రమే ఉండేవి.

నిస్సందేహంగా టిప్పును నరహంతకుడుగా, విచక్షణ లేనివానిగా, హిందూ ద్రోహిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఇతర రాజ్యాలపై యుద్ధం చేసి గెలిచినట్లైతే అక్కడ పట్టుబడిన అందమైన హిందూ స్త్రీలను శ్రీరంగపట్నానికి పంపమని మరియు ఎంతమంది హిందువులను ఇస్లాం మతంలోకి మార్చారో వివరాలు చెప్పమని తన సేనాధిపతులకు ఉత్తరాలు వ్రాసేవాడు. ఈ ఉత్తరాలన్నీ ప్రస్తుతం లండన్ లోని భారత కార్యాలయంలో వున్నాయి. పోర్చుగీస్ చరిత్రకారుడు ఫాదర్ బెర్తులోమియా వ్రాసిన చరిత్రలో టిప్పు ఆనాడు హిందువులపై సాగించిన అరాచకాలను వివరించాడు. హిందువులపై టిప్పు చేసిన అకృత్యాలను ఇంకొకరితో పోల్చవలసివస్తే అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ ఘోరీ, మహమ్మద్ గజని, ఔరంగజేబులతో పోల్చవచ్చని బ్రిటిష్ చరిత్రకారుడు విలియం లార్డ్ మలబార్ గజెట్ లో పేర్కొనడం జరిగింది.

ఎమ్మెల్యే గారూ! టిప్పుసుల్తాన్ క్రీ.శ. 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా? లేక మీరు మెచ్చుకొంటున్న భారత (కాంగ్రెస్) చరిత్రకారులు వ్రాయలేదా?

క్రీ.శ. 1790 లో టిప్పు సుల్తాన్ దురాక్రమణ: తన అత్యంత క్రూరమైన సహాయకులు, సైన్యం కలిసి టిప్పు మేల్కోటే ఆలయానికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ఆలయంలో 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగను, ఊరేగింపును జరుపుకుంటున్నారు. టిప్పు ఆలయ తలుపులు, ప్రధాన ద్వారాలు మూసివేసి 1000 మందిలో 800 మందిని ఊచకోత కోశాడు. పసిపిల్లలు అని కూడా దయ చూపలేదు. 200 మంది సుందర స్త్రీలను బంధించాడు. మరుసటి రోజు ఉదయం అంటే దీపావళి రోజున టిప్పు మేల్కోటే ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలకు మూడు రోజులు సమయం పట్టింది.

టిప్పు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు. ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ మైసూరు మేల్కోటే ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు.

ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ భారతీయ చరిత్రను ఎలా మార్చి టిప్పును పొగుడుతూ పిల్లల పాఠ్యపుస్తకాల్లో అబద్దాలు వల్లించిందో అందరూ గమనించాలి.

టిప్పుచే దోచుకోబడ్డ కొన్ని దేవాలయాల జాబితా..👇

త్రిపాంగోట్, త్రిచెంబరం, తిరునవయ, తిరువన్నూర్, కాలికట్ తాలి, హేమాంబికా ఆలయం, పాల్ఘాట్ లోని జైన దేవాలయం, మామియూర్, పరంబతాలి, వెంకటంగూ, పెమ్మాయనడు, తిరువంజుకులం, తేరుమనవ, తైమళూన్, తెమపనుమ, వడకళ కేరళీశ్వర, త్రిక్కండియూర్, సుకాపురం, భగవతి ఆలయం, మరణేహి ఆలయం, వెంగర ఆలయం, టికులం, రామనాథక్రా, అజింజలం.

టిప్పు ప్రధాన పండుగ రోజులలో ఊచకోత కోయడానికి మరియు దోపిడీ చేయడానికి ఎంచుకునేవాడు. కారణం ఆ రోజున అధిక భక్తులు దేవాలయాలకు చేరుకుంటారు మరియు హిందూ దేవుళ్ళ విగ్రహాలను బంగారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలతో అలంకరించేవారు. అప్పట్లో అధిక సంపద దేవాలయాల ఆధ్వర్యంలోనే ఉండేది.

ఎమ్మెల్యే గారూ! ఒక్క విషయం ఆలోచించండి మీరు ఎన్నో విగ్రహాలు పెట్టించారు ఎవరైనా అభ్యంతరం తెలిపారా లేదే! ఇప్పుడు కూడా అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టించండి లేదా పోతులూరి వీరబ్రమ్హేంద్రస్వామి గారి శిష్యుడు సిద్దయ్య గారి విగ్రహం పెట్టించండి ఎవ్వరూ వద్దనరు! దయచేసి ఫాల్స్ ప్రిస్టేజ్ కు పోయి టిప్పు విగ్రహ ఏర్పాటుకు పూనుకోవద్దని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు!

(లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు యొక్క వాస్తవ చిత్రాన్ని చూడండి)

Source - Whatsapp Message

No comments:

Post a Comment