🕉నిర్మలమైన భక్తితో మోక్షం
( భక్తి కథలు)
పూర్వం ఒక గ్రామంలో నిత్యం విష్ణు పూజ చేసే విష్ణు భక్తుడు ఉండేవారు.
నారాయణ నామ స్మరణ చేయకుండా మంచి నీళ్ళు కూడా ముట్టుకోని మహా భక్తుడు..
కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబ పోషిoచు కునే వారు.. నిత్య అనుష్ఠానపరుడు విష్ణునామమే ఊపిరిగా బతికే ఆ విష్ణు భక్తుడు ఏ పని చేసిన నారాయణ నామ స్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సు అయ్యింది.
అతనికి రకరకాల పూలతో విష్ణుమూర్తిని అలంకారం చేసి మురిసిపోవడం పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది.
వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారి లాగా పూజ చేయలేక పోయిన నారాయణ నామ స్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు.
వారిలాగా మంత్రాలతో అనుష్ఠానం చేయలేను కనుక కనీసం వారు చేసే పూజలో ఎదో రూపంలో పాలు పంచుకోవాలి అని ఆశతో ఒక రోజు విష్ణు గానం చేస్తూ అనేక రకాల పూలు చెట్టల్లో సేకరించి విష్ణు భక్తుని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి ...స్వామి నేను మీలాగా మంత్రాలతో కీర్తనలతో స్వామి కి పూజ చేసి మెప్పించ లేను నాకు అంత చదువు లేదు నారాయణ నామ స్మరణ తప్ప ఇంక ఏమీ తెలియదు మీరు చేసే విష్ణు పూజ నాకు చాలా ఇష్టం ఈ పూలను విష్ణు పూజకు ఉపయోగిస్తే స్వామి కరుణించాడని సంతోషిస్తాను ..
మీరు అనుమతిస్తే ప్రతి రోజు మీ పూజకు పువ్వులు సేకరించి సేవ చేసుకుంటాను అని వేడుకున్నాడు..
మహా భక్తుడు అయిన ఆయన అతన్ని గమనిస్తున్నారు ఆ గొల్లవాని మొహంలో అమాయకత్వం తప్ప అసూయ అహంకారం లేదు చదువు లేకున్నా మాటలో సంస్కారం ఉంది,
పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు పైగా నారాయణ నామ స్మరణతో పువ్వులు తెస్తాను అంటున్నాడు ఇస్తున్నది విష్ణువుకే కదా అని చాలా సంతోషం అలాగే కానివ్వు అని ఒప్పుకున్నారు,.
విష్ణువే వరం ఇచ్చినట్టుగా అతను పొంగిపోయాడు .
ప్రతి రోజు నారాయణ నామ స్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చే వాడు పూజ జరిగే సమయంలో కిటికీ లోనుండి చూసి నారాయణ నామ స్మరణతో పొంగిపోయే వాడు.
ఇలాగే కాలం గడిచింది ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది విష్ణు భక్తుడి కోసం విష్ణు గణాలు వచ్చారు , ఆ గొల్ల వాని కోసం విష్ణువు పూల పల్లకిని పంపిస్తాడు.
అది గమనించిన విష్ణు భక్తుడు ఆ గొల్లవాన్ని తీసుకొని వెళ్లడానికి ఆ పల్లకీ వచ్చింది ఎందుకు అని అడుగుతారు .
అతను మహా విష్ణు భక్తుడు నారాయణ నామ స్మరణతో ప్రతి నిత్యం నామ స్మరణ చేస్తూ ఒక మహా విష్ణు భక్తుడు చేసే విష్ణు పూజకు భక్తిగా పూలు సమర్పించే వాడు అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు విష్ణు పాదాల చెంతకు చేరేవి అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మల నుండి విముక్తి కలిగి ఆ విష్ణువే పూల పల్లకీ పంపారు' అని వివరించారు.
ఆ విష్ణు భక్తుడికి ఆశ్చర్యం తో పాటు నిస్వార్ధమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనంద పడ్డారు..
విష్ణు గణాలతో వెళ్లిన విష్ణు భక్తుని కన్నా ముందే పుష్ప పల్లకీలో ఆ గొల్లవాడు విష్ణువు సన్నిధి చేరుకున్నాడు.
*తోడు తొడటన్న తొడనే ఉన్నాడు*
*లేడు లేడటన్న...లేనె లేడు.*
*కాదు కాదటన్న ..కానేకాడు,*
*విశ్వదాభిరామ వినురవేమ !!*
భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మనివారు కొందరు, అటు ఇటుగా కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు.
నారాయణుడు ఉన్నాడు అని పూర్తిగా నమ్మి, సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎపుడైనా ఆపద వచ్చినప్పుడు నారాయణా నీవే దిక్కు అని తలిస్తే చాలు తప్పకుండా ఆదుకుంటాడు.
అదే విధంగా లేదు అన్న వారికి లేనట్లుగాను, కాదు అన్న వారికి కానట్లుగాను ఉంటాడు.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు..నన్ను ఎవరెవరు ఏవిదంగా తలిస్తే వారిని నేను ఆవిధంగానే గానే అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా.
No comments:
Post a Comment