Friday, February 18, 2022

నేటి మంచిమాట. క్రోధం, కోరికలు అధికమైనపుడు క్రోధం తీవ్రరూపం దాలుస్తుంది.

నేటి మంచిమాట.

మనిషి పతనానికి కారణమైన వాటిలో మొదటిది క్రోధం. కోరికలు అధికమైనపుడు క్రోధం తీవ్రరూపం దాలుస్తుంది.

మనిషి ఒక్కసారి కోపమునకు గురయ్యాడంటే మూడు మాసముల పాటు తినడంవలన లభించే శక్తిని కోల్పోతాడు!

కోపం వలన విచక్షణ నశిస్తుంది. ఏమి చేస్తున్నాడో వానికే తెలియకుండా చేస్తుంటాడు. ఫలితంగా జీవితం నాశనంలోకి కూరుకుపోతుంది.

కోపం ఉండకూడదా అంటే ఉండొచ్చు. అయితే మాటలలో మాత్రమే ఉండాలి తప్ప మనసులో ఉండకూడదు.

అవతల వ్యక్తిలో మంచి జరుగుతుందంటే కోపం పడినా పర్వాలేదు.

అయితే కోపం పదిహేను క్షణాల కన్నా ఎక్కువసేపు ఉండకూడదు.

మన కోపం మనలోని ప్రశాంతతను భంగపరచకుండా ఉండేలా చూసుకోవాలి.

చివరిగా కోపం ఒక నటన మాత్రమే తప్ప నష్టం కాకూడదు అని గ్రహించి పరిస్థితిని బట్టి ప్రవర్తించాలి

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment