Tuesday, March 17, 2020

ఒక సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు.

ఓం నమశ్శివాయ🙏

ఫ్రెండ్స్
ఒక సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు.
ఎలాగయినా సాధన చేసి మూడవకన్ను (జ్ఞాననేత్రం) తెరుచుకునేలా చేసుకోవాలని
చాలా ఆశగా ఉన్నాడు.
ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న
గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.
గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి
చిన్నవెలుగు కనిపించింది.
దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ
చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది.
ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి
ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు.

ఆ పిలుపు విన్న గురువుగారు
ఎవరది అని అడిగారు.
మీ అనుగ్రహం కోసం వచ్చాను
అని సాధకుడు చెప్పేడు.
ఆ గురువుగారు ఆ గుహలో
కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు.
ఈ సాధకుడిని పరీక్షించాలని
అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు.
సాధకుడు ప్రయత్నించినా అది వెలగలేదు.
అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి,
కాని దీపం వెలగడం లేదు అని
సాధకుడు గురువుగారితో చెప్పాడు.

అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి వెలిగించమని చెప్పారు.
సాధకుడు అలా ప్రయత్నించినా కూడా
అది వెలగలేదు.
అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు.
అలా చేసి సాధకుడు దీపం వెలిగించగలిగాడు.
ఈసారి తనని అనుగ్రహించమని
గురువుగారిని అడిగాడు.

గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు.
అప్పుడు సాధకుడు తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు.
గురువుగారు ఈ విధమగా వివరించారు.

నీ హృదయం అనే ప్రమిదలో
వత్తి అనబడే ఆత్మ ఉంది.
అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన
దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.
అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని
వెలిగించ లేకపోతున్నావు.

అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని
ప్రేమ,కరుణలతో నింపు.
ఆత్మని విచక్షణతో సాధన అనే ఎండలో ఆరబెట్టు.
హృదయాన్ని సాధన(ధ్యానం)
నమ్మకం అనే నూనెతో నింపు.
అప్పుడు నీకు జ్ఞానదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది.” అని జ్ఞాన బోధ చేసారు ఆసాధకునకు.

నీతి:🙏
మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది.
కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను
నిండిపోవడం వల్ల దానిని గుర్తించ లేకపోతున్నాము.

మన అజ్ఞానం ఎంతంటే?
దీపం వెలిగించమన్నప్పుడు నీటికీ నూనెకు తేడా తెలియనటువంటి చీకటి స్ధితిలో ఉన్నాము.
మరి ఈచీకటి స్థితి నుంచి బయటపడి
జ్ఞానదీపాన్ని వెలించుకోవాలంటే
మంచి సద్గురువు చాలా అవసరం.
ఆ గురువు సాన్నిధ్యంలో
కామ,క్రోధ,లోభ,మోహ, మద, మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహంకారాన్ని విడిచిపెట్టి
ధ్యాన సాధన చేస్తే హృదయం పవిత్రమవుతుంది.

అప్పుడు ఆ పవిత్రమైన హృదయంలో
జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.
ఫ్రెండ్స్ అది ఎప్పుడైతే సాధ్యమయిందో
అప్పుడు మన హృదయంలో
ఆ పరమాత్మ కొలువై ఉంటాడు
ఆయన పాదాల చెంత చేరే వరకు మనతో ఉంటాడు మన చెయ్యిపట్టి నడిపిస్తాడు ఆ పరమాత్ముడు

🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment