Friday, January 29, 2021

తెలంగాణ ఘన కీర్తి

తెలంగాణ ఘన కీర్తి

నరనారాయణులు ఉన్నది రెండే క్షేత్రాలలో....
1). బద్రీనాథ్ మరియు లింబాద్రి గుట్ట, భీంగల్, నిజామాబాద్ జిల్లా. ఇది బ్రహ్మ దేవుడే తపస్సు చేసి నృసింహ స్వామిని మెప్పించిన క్షేత్రం.

2) సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..
కాశ్మీర్.. బాసర (తెలంగాణ)..

3) బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో...
పుష్కర్ (రాజస్థాన్).. ధర్మపురి (తెలంగాణ)..

4) త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..
అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. కాళేశ్వరం (తెలంగాణ)

5) ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు..
నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)
గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)

లింబాద్రిగుట్ట
తెలంగాణ లోని నిజామాబాదు జిల్లాలో లింబాద్రిగుట్ట కు ప్రత్యేక స్థానం వుంది. ఉత్తరాఖండ్, బద్రీనాథ్ తర్వాత ఆంతటి విశిష్ఠత కలిగిన క్షేత్రం లింబాద్రిగుట్ట.
యావత్ భారత దేశంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి మరియు "నర నారాయణులు " ఓకే గర్బాలయంలో స్వయంభువు గా కొలువుదీరిన మహపుణ్యక్షేత్రం.

ధర్మపురి:-
యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే..
(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా) బ్రహ్మదేవుడు (సృష్టి) నరసింహుడు, (స్థితి) శివుడు, (లయం) యముడు, (కాలం)
అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది

కాళేశ్వరం:-
ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది.. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది.. సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే..

వేములవాడ:-
అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)

మెదక్:-
సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది..

యాదగిరి:-
అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం..

కొండగట్టు:-
శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం..

బాసర (వ్యాసపురి):-
వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం..

భద్రాచలం:-
శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం.

చెన్నూర్:-
గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం.

మంథని:-
మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోధనకై అగస్త్య మహాముని ఏర్పాటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే.

బోధన్:-
బోధనపురి అసలు పేరు. మంథనిలో అభ్యసించి అర్హత సాధించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.

🙏 మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment