Friday, April 4, 2025

 


*UP లో మరో లవ్ జిహాద్ కేసు..*

*అంజనా తివారీ ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది, అయేషా గా పేరు మార్చుకుని మతం మార్చుకుంది.*

*UP అసెంబ్లీ వెలుపల ఆత్మహత్యకు ప్రయత్నించింది*

*చికిత్స  పోందుతూ ఆసుపత్రిలో మరణించింది.*

*అయేషా  (అంజనా) ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. యూపీ  అసెంబ్లీ సమీపంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటనలో  మహిళ తనను తాను దహనం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళను కాపాడటానికి యూపీ  పోలీసులు తమ వంతు కృషి చేశారు.  వీడియోలో UP పోలీసులు కాలిపోతున్న మహిళ వైపు పరుగెత్తుకుంటూ వెళ్లి మంటలను ఆర్పుతున్నది చుడవచ్చు.  ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ విధానసభ వెలుపల జరిగింది. ఆ మహిళను ఆసుపత్రికి తరలించగా  అక్కడ ఆమె చికిత్స పోందుతూ మృతి చెందింది.*

*అంజనా మొదట  అఖిలేష్ తివారీని వివాహం చేసుకుంది. కానీ వారి  కాపురం ఎక్కువ కాలం కొనసాగలేదు.  ఆమె తన భర్త నుండి విడాకులు తీసుకుంది. తర్వాత అంజనా ఆసీఫ్‌ ను ప్రేమించి, మతం మార్చి, ఇస్లాం స్వీకరించి, అయేషా గా మారి ఆసీఫ్‌ ను వివాహం చేసుకుంది. అయేషా  తన అత్తమామలను వేధిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఫిర్యాదు చేయలేకపోవడంతో ఆమె విధాన సభకు వెళ్లి సీఎం యోగిని కలిసేందుకు వెల్లింది. యోగీ కలిసే పరిస్థితి లేక పోవడం తో అసెంబ్లీ గేటు వద్దే ఆమె తనను తాను నిప్పంటించు కుంది. ఆయేషా ఆసుపత్రిలో మరణించింది.  స్థానిక మీడియా కధనాల  ప్రకారం, విడాకుల తర్వాత, అంజనా తన సోదరి పక్కనే ఉన్న ఒక దుకాణంలో పనిచేయడం ప్రారంభించింది.  అక్కడ  ఆసిఫ్ ఆమెను ప్రేమలో దింపి పెళ్లికి ఒప్పించి ఒక ముస్లీం మత  పెద్ద సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఆసిఫ్ కుటుంబం ఆమెతో వివాహం  ఒప్పుకోక పోవడంతో వారు అద్దె ఇంట్లో నివసిస్తూ  జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం కలిసి జీవించిన తర్వాత ఆసీఫ్  చెప్పా పెట్టకుండా  సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు.*

No comments:

Post a Comment