తెలుగు లో ఒక సామెత వుంది ఎవరి నోట్లో నైనా మాట దాగ కుంటే వాడికి చెప్పకు చెప్తే 'గుఱ్ఱం మూతికి బట్ట గట్టినట్లే' అంటారు. ఇది ఏ గుఱ్ఱం సంగతో తెలుసు కుందాం
ఒకానొక రోజు రాయల వారు తన ముద్దుల భార్య చిన్నాదేవి మందిరానికి వెళ్ళారు. ఆమెను ముద్దు పెట్టుకుందామని ముందుకు వంగారు అప్పుడు ఆవిడ పెద్దగా తుమ్మిందట. శకునం బాగా లేదని రాయలవారు వెళ్లిపోయారట. ఈ విషయం దాసీలు పసి గట్టారు. విషయం బయటికి పొక్కగూడదని రాణీ గారు దాసీలను ఆజ్ఞాపించారు. అయితే ఒక దాసీ మాత్రం ఆపుకోలేక తన కూతురికి చెప్పిందట. దాసీ కూతురు రామకృష్ణుని ఇంట్లో పని చేస్తుందట. అది పని చేసుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వుంటే రామకృష్ణుడికి అనుమానం వచ్చి విషయమేమిటని గద్దించి అడిగే సరికి అది నిజం చెప్పేసింది. రామకృష్ణుడు అంతటితో ఆగక తన గుఱ్ఱం నోటికి బట్ట గట్టి విజయనగర వీధుల్లోకి తిప్పుతున్నాడు. చూసిన వారంతా దాని మూతికి బట్ట ఎందుకు కట్టవని అడుగు తుంటే ఏం
చెప్పమంటారు?నిన్న రాత్రి అంతఃపురం లో రాజుగారు ముద్దు పెట్టుకోపోతే రాణీ గారు తుమ్మారు, అది ఈ గుఱ్ఱం వినింది. దీని నోట మాట దాగదు అందుకని దీని మూతికి బట్ట కట్టి పెట్టాను. అని అందరితోనూ చెప్పాడు. ఈ విషయం రాయలకు తెలిసి నాకు నీ ముఖం చూపించకు అని ఆజ్ఞా పించారు. తర్వాత ఏదో చమత్కారం చేసి రాయల అనుగ్రహం పొందాడు అది వేరే కథ. అప్పటినుండీ 'గుఱ్ఱం మూతికి బట్ట గట్టినట్లు' అనే జాతీయం వచ్చింది.
-------------------- శుభసాయంత్రం --------------------
No comments:
Post a Comment