*“ఈశ్వరేచ్ఛ” అంటే...ఏంటి???*
*ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఆయన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. దాన్నే మనం "ఈశ్వరేచ్ఛ" అంటాం.*
*దీని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం..*
*ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్య పాలనానికి ఆయా ఫలితాలు పొందుతున్నాం.*
*ప్రతి మనిషికీ ప్రతీ సంఘటనకీ తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని అతిక్రమించకూడదు.*
*అంతస్థు అంటే ధనం, ఐశ్వర్య సంబంధితం కాదు. ఉద్యోగం చేస్తున్నచోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మం కాదు. (అవతల వ్యక్తి సేవకా వృత్తిలో ఉన్నప్పటికీ) ఒకరు సేవ్యుడు, ఒకరు సేవకుడు. అంతవరకే. ఆ హద్దు మీరవద్దు. ఏ అంతస్థులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్నిఅతిక్రమించిన దోషం కలుగుతుంది.*
*శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు. మానవుడుగా జీవించాడు. యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే, ఆ "ఈశ్వర" అంశ అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడు గానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిథి దాటలేదు. తన పరిథిని అతిక్రమించలేదు.*
*శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిథేమిటో తెలియవచ్చేలా చేసాడు. భీష్ముడు దైవీశక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. వసువులలో ఒకడు.*ఆదిత్యయోగీ*
*కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళుమరచి తన దైవీశక్తులను ప్రకటిస్తూ, పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు. భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిథిని మించి దైవీ శక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు.*
*భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు.*
*సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిథిని మీరలేదు.*
*గీతలో "నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం , ఓడితే స్వర్గం" అన్నాడు తప్ప.. “ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడతా" అని చెప్పలేదు.*
*నువ్వు చేయవలసింది, నీ పరిథిలో చేయమని చెప్పాడు. ’ధర్మంపాటించు’ అన్నాడంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు.*
*కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు...”నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు. నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. మీరు రాజ్యం చేస్తారు" అని చూపించాడే తప్ప “నేను మీకిచ్చేస్తున్నాను" అని చెప్పలేదు. అలా ఐతే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా…! అలా చేయలేదు.*
*అంటే... మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది. “ఈశ్వరేచ్ఛ" అంటే కూడా అదే. ఏ కర్మకు ఏ ఫలితాన్నివ్వాలో నిర్దేశించడం తప్ప మరోటికాదు..*
.
శివ గుణాలు లోకానికి సందేశాలు.........!!
‘శివ’ శబ్దం మంగళాత్మకం. అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాల్ని సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే! అనేక గుణాలకు నిలయుడైనవాడు శివుడు. ఆయనను లోకమంతా ఆరాధిస్తుంది. శివ నామాన్ని జపిస్తుంది. ఆయన దర్శనం కోసమే తపిస్తుంది. అదీ శివుడి విశిష్టత.
త్రినేత్రుడు...
శివుడి అనంత గుణాల్లో త్రినేత్రత్వం ఒకటి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని- శివుడి మూడు కళ్లు. అలా మూడింటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత. అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది. సూర్యుడు ఆరోగ్యానికి, చంద్రుడు జీవన కళకు, అగ్ని తేజోగుణానికి నెలవులు. ఆ మూడూ ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రత్వం చెబుతోంది.ఆదిత్యయోగీ.
భస్మధారి ....
భస్మాన్ని శరీరమంతటా ధరించడం వల్ల శివుడు భస్మధారి అయ్యాడు. లోకంలో చివరికి బూడిద తప్ప ఏదీ మిగలదు. ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది. అన్నీ నశించేవే అనడం దాని పరమార్థం.
అర్ధనారేశ్వరుడు...
శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకు ఇవ్వడం వల్ల అర్ధనారీశ్వరుడయ్యాడు. ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం.
గరళకంఠ ....
ఆయన గరళ కంఠుడు. అంటే, కంఠంలో విషాన్ని దాచుకొన్నవాడు. అది కాలకూట విషం. అత్యంత ప్రమాదకరం. అయినా శివుడు చలించకుండా లోక రక్షణార్థం గొంతులో ధరించాడు. మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనే రూపం అది.
శ్మశాన వాసి .....
జీవుడి అంతిమ యాత్ర ముగిసేది శ్మశానంలోనే. దాన్ని శివుడు విహారభూమిగా చేసుకొన్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ ఏదో ఒకనాటికి అక్కడికి చేరక తప్పదన్న జీవన సత్యానికి అది సూచిక.ఆదిత్యయోగీ..
గంగా ధరుడు ....
నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగ. ఆ గంగనే తలపై ధరించిన గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం. ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత, పవిత్రత లభిస్తాయి. శివుడి గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం.
చంద్రశేఖరుడు....
చంద్రశేఖరుడు- అంటే, తలపై చంద్రుణ్ని ధరించినవాడు శివుడు. శరీరంలో అగ్రభాగం శిరస్సు. అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే, జీవితం వెలుగుతుందని అంతరార్థం.
నంది వాహనదారి ....
శివుడు నంది వాహనుడు. ‘నంది’ అంటే ఆనందింపజేసేది. వాహనం ఆనందాన్ని కలిగించాలని, జీవన యాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తోంది ఆ నంది.
సర్పహారి ....
సర్పహారి శివుడు. అంటే పామును మెడలో వేసుకునేవాడు. గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని, సర్పాన్ని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కాని, భయపడి పారిపోకూడదని నాగాభరణత్వం తెలియజేస్తుంది.
నటరాజు ....
శివుడు తాండవ ప్రియుడు. జీవితం ఒక రంగస్థలం. దానిపై నిత్యమూ ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తాడాయన.
ప్రమధా దీసుడు ....
ప్రమథ గణాలకు నాయకుడు శివుడు. లోకంలో ప్రతి వ్యక్తీ ధర్మాన్ని నిలపడానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తుల్ని సమకూర్చుకోవాలి. వాటిని లోక క్షేమం కోసం వాడుకోవాలన్నదే దీనిలో అంతరార్థం.
తనలో తాను రమిన్చువాడు
ఆయన మహా తపస్వి. లోక క్షేమం కోసం చేసే తపస్సు అది. ఏ మంచి పనినైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని, దేనికీ చలించరాదని ఈ శివతత్వం బోధిస్తోంది.
ఇలా శివగుణాలు అనేకం. ఇవన్నీ లోకానికి సందేశాలు అందించేవే. దైవాన్ని మనిషి తన జీవనమార్గ లక్ష్యంగా చేసుకుంటే, అంతటా శివం (మంగళం) వెల్లివిరుస్తుంది
!ఓం నమః శివాయ
ఓం శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏
శ్రీ ఆదిత్య నారాయణ్*
.
No comments:
Post a Comment