Sunday, July 13, 2025

 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

           *హనుమంతుడు* 

హనుమంతుని విగ్రహాన్ని మహిళలు ఎందుకు తాకకూడదు.
ఈ ఆచారం వెనక ఒక మతపరమైన కథ దాగి ఉంది. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి. అయితే కొన్ని గ్రంథాల ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగిందని, పుత్రుడు కూడా ఉన్నాడని చెబుతారు. అయితే హనుమంతుడి వివాహం చేసుకున్నాడు కానీ అతను వైవాహిక ఆనందం కోసం పెళ్లి చేసుకోలేదు. ఆధ్యాత్మికంగా బలపడేందుకు చేసుకున్నాడు. నాలుగు ప్రధాన జ్ఞానాలు సంపాదించుకోవడం కోసం వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే వివాహితులు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలరు.
సూర్య భగవానుడు హనుమంతుడికి తొమ్మిది ప్రధాన విద్యలలో ఐదు నేర్పించారు. మిగిలిన నాలుగు విద్యల గురించి అడిగితే అవి కేవలం పెళ్లయిన వ్యక్తులకు మాత్రమే నేర్పించాలని సూర్య దేవుడు చెప్తాడు. అయితే హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఆలోచనలో పడతాడు. విద్యలు నేర్చుకునేందుకు తన గురువు ఆజ్ఞ పాటించి పెళ్లికి సిద్ధమవుతాడు.
సూర్యదేవుడు తన అందమైన కుమార్తె సువర్చలతో హనుమంతుడి వివాహాన్ని జరిపించాడు. సువర్చల గొప్ప తపస్వి. వివాహమైన వెంటనే ఆమె తపస్సులో మునిగిపోయింది. వివాహం జరగడంతో హనుమంతుడు సూర్యుడు దగ్గర నుంచి మిగతా నాలుగు విద్యలను నేర్చుకున్నాడు. అలా తన కోరిక నెరవేర్చుకున్నాడు. హనుమంతుడు పెళ్లి చేసుకున్నప్పటికీ అతని బ్రహ్మచర్యం విచ్ఛిన్నం కాలేదు. హనుమాన్ బ్రహ్మచారి అయినప్పటికీ ఒక కుమారుడుని కలిగి ఉన్నాడని అతని పేరు మకరద్వజుడు అని పురాణాలు చెబుతున్నాయి.

హనుమంతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు. ఆడవాళ్ళకి తల్లి హోదా కల్పించాడు. జీవితాంతం బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు. ప్రతి స్త్రీలో తన తల్లిని చూసుకున్నాడు. తల్లిగా భావించే ఆడవాళ్ళు కొడుకు పాదాలు స్పురించరాదని అంటారు. అందుకే మహిళలు హనుమంతుని విగ్రహాన్ని తాకరు. ఆచారాల ప్రకారం మాత్రం పూజ చేయవచ్చు. దీపాలు వెలిగించవచ్చు. అలాగే హనుమాన్ చాలీసా పఠించవచ్చు కానీ పాదాలు మాత్రం మొక్కకూడదు.

హనుమంతుడిని ఆరాధిస్తే శనీశ్వరుడి అనుగ్రహం కూడా పొందుతారు. పురాణాల ప్రకారం శని పట్టని దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు. అందుకే అంజనేయుడిని పూజిస్తే శని అనుగ్రహం కూడా ఉంటుంది.

ఇది సేకరణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment