Sunday, July 13, 2025

 శనగపిండి లేకుండా కరకరలాడే "జంతికలు" - ఇలా చేస్తే గుల్లగా, క్రిస్పీగా - నూనె పీల్చవు! - SNACK RECIPE JANTHIKALU
- మినప్పప్పుతో ఇలా మురుకులు చేసుకోండి - భలే టేస్టీగా ఉంటాయి



Snack Recipe Janthikalu: "జంతికలు" చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని మురుకులు అని కూడా పిలుస్తుంటారు. పండగలప్పుడు, శుభకార్యాలప్పుడు చాలా మంది ప్రిపేర్​ చేస్తుంటారు. అంతేకాకుండా పిల్లలకు స్నాక్స్​గా పెట్టడానికి కూడా ఇంట్లో అమ్మలు అప్పుడప్పుడు ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే వీటిని చేయడానికి మెజార్టీ పీపుల్​ శనగపిండి ఉపయోగిస్తారు. ఇది అందరికీ సరిపడదు. గ్యాస్​ట్రబుల్​ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి శనగపిండి లేకుండా కూడా మురుకులు చేసుకోవచ్చు. పైగా ఇవి క్రిస్పీగా, గుల్లగా వస్తాయి. ఇక ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే నూనె కూడా ఎక్కువ పీల్చుకోవు. మరి కరకరలాడే కమ్మని మురుకులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:

మినప్పప్పు - 1 కప్పు
బియ్యప్పిండి - 3 కప్పులు
వాము - 1 టేబుల్​స్పూన్​
నువ్వులు - అర టీస్పూన్​
ఉప్పు - సరిపడా
బటర్​ - 3 టేబుల్​స్పూన్లు
పచ్చిమిర్చి - 6
జీలకర్ర - 1 టీస్పూన్​

తయారీ విధానం:

ప్రెషర్​ కుక్కర్​లోకి మినప్పప్పు తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి విజిల్​ ఉంచాలి.
స్టవ్​ ఆన్​ చేసి ఈ కుక్కర్​ పెట్టి మీడియం ఫ్లేమ్​లో 5 విజిల్స్​ వచ్చే వరకు కుక్​ చేసి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
ఆవిరి పోయే లోపు ఓ పెద్ద వెడల్పాటి ప్లేట్​లోకి బియ్యప్పిండి, వాము, నువ్వులు, ఉప్పు వేసి మిక్స్​ చేసుకోవాలి.
ఆ తర్వాత బటర్​ వేసి అది మొత్తం పిండికి పట్టేలా మిక్స్​ చేసుకోవాలి.
ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. మిక్సీజార్​లోకి పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర వేసి ఓ సారి గ్రైండ్​ చేసుకోవాలి.
అనంతరం అందులోకి ఉడికించిన మినప్పప్పు వేసి వీలైనంత మెత్తని పేస్ట్​లా గ్రైండ్​ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్​ చేసుకున్న మినప్పప్పు మిశ్రమాన్ని బియ్యప్పిండిలో వేసి కలుపుకోవాలి.
పిండిని బాగా కలుపుకోవాలి. ఒకవేళ నీళ్లు ఏమైనా అవసరమైతే లైట్​గా చిలకరించుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి.
పిండిని కలుపుకున్న తర్వాత తడి క్లాత్​ కప్పి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
ఈలోపు స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగేలోపు జంతికల గొట్టం తీసుకుని లోపల మీకు నచ్చిన షేప్​లో బిళ్లను సెట్​ చేసుకుని లైట్​గా ఆయిల్​ అప్లై చేయాలి.
ఇప్పుడు అందులోకి కొంచెం బియ్యప్పిండిని ఉంచి క్లోజ్​ చేసుకోవాలి. తడి కాటన్​ క్లాత్​ మీద జంతికల గొట్టంతో పిండిని ఒత్తుకోవాలి.
ఇలా ప్రిపేర్​ చేసుకున్న జంతికలను నిధానంగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి రెండువైపులా ఫ్రై చేసుకోవాలి.
జంతికలు వేగి లైట్​ గోల్డెన్​ కలర్​ వచ్చిన తర్వాత తీసి ఓ ప్లేట్​లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని జంతికలుగా ఒత్తుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి.
ఇవి కాస్త చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేస్తే సరి. కరకరలాడే జంతికలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి

మినప్పప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బియ్యప్పిండి తీసుకోవాలి.
బియ్యప్పిండిలో వెన్న కలిపిన తర్వాత కొంచెం పిండి తీసుకుని ముద్దలాగా చేసినప్పుడు విరగకుండా పర్ఫెక్ట్​గా వస్తే బటర్​ సరిపోయినట్లు. అలా కాకుండా ఉంటే మరికొంచెం బటర్ యాడ్​ చేసుకుని మిక్స్​ చేసుకోవాలి.
మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. లో ఫ్లేమ్​లో పెట్టి వేయిస్తే నూనె పీల్చడం, హై ఫ్లేమ్​లో అయితే రంగు మారతాయి, కానీ లోపల పిండి ఉడకదు.
పిల్లలకు బలాన్నిచ్చే "రాగి చిమ్మిలి లడ్డూలు" - పావుగంటలో రెడీ - టేస్ట్​ సూపర్​!

బియ్యప్పిండితో క్రిస్పీ "వడలు" - నూనె పీల్చవు, పప్పు రుబ్బేపని లేదు! - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

No comments:

Post a Comment