Tuesday, December 9, 2025

 *👉ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు*🙏

👉 *ఒకటి మనశ్శాంతి.*🙏

👉 *రెండు సంతృప్తి.*🙏

👉 *ఈ రెండింటిని సంపాదించుకున్న వాళ్ళు ప్రతి క్షణం అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు.*🙏

👉 *సంపాదించుకోవటానికి కష్టపడక్కర్లేదు. ఎంతో ఆనందంగా సంపాదించుకోవచ్చు*🙏

👉 *కులదైవ(ఇలువేలుపు) నామ స్మరణ చేస్తే చాలు.ఆ వెలకట్టలేని రెండు సంపదలనూ ఇస్తాడు.*🙏

👉 *ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి.*🙏

👉 *అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి.* 🙏

 👉 *ఏ నామాన్నయితే మనం స్మరిస్తున్నామో ఆ దేవుడికి సంబంధించిన రూపాన్ని* 
 *మన మదిలో నిలుపుతాయి.* 
*నామం ఆధ్యాత్మిక శబ్ద తరంగం.*🙏

 *👉”బెల్లం బెల్లం”అంటే బెల్లం రుచి మనకు తెలియదు.తేనె తేనె” అంటే కూడా తేనె రుచి* 
 *మనకు తెలియదు.* 🙏

👉 *బెల్లాన్ని కొరికి తినాలి.*
*తేనెను నోటిలో వేసుకొని చప్పరించాలి.అప్పుడే ఆ మాధుర్యం మనకు అనుభవమవుతుంది.*🙏

👉 *దైవనామం, దైవం వేరు కాదు.*ఆ పేరు స్మరించగానే అతడు మన దగ్గరుంటాడు.ఇది అనుభవైకవేద్యం.*🙏

👉 *నామం చెబుతాం. శబ్దం వినిపిస్తుంది. మన రూపంలాగా రూపం కనిపించదు.*🙏

👉 *ఎంతకాలం నిరీక్షించాలి.* *ఎప్పుడు భగవంతుడు కనిపిస్తాడని సందేహం.*
*అందుకే కొంతకాలం నామస్మరణ చేసి విసిగిపోయి విడిచి పెట్టేస్తారు.*🙏

👉 *అక్కడే మనం నిలబడాలి.దైవం ఒక అనుభవం.*
*ఇనుపముక్కను బాగా కాలిస్తే అందులోకి ఉష్ణం వ్యాపిస్తుంది.ఆ ఉష్ణం ఇనుపముక్క ఎంతవరకు విస్తరించి ఉందో అంతవరకు వ్యాపిస్తుంది.*🙏

👉 *అందులో వేడి కనిపించకపోవచ్చు.*
*ముట్టుకుంటే చుర్రుమనిపిస్తుంది.* 🙏

👉 *నామస్మరణతో మనసును పదేపదే భక్తిపూర్వకంగా సాధనలో ఉంచుతుంటే దేహమంతా ఆధ్యాత్మిక తరంగ ప్రవాహంగా మారిపోతుంది.*🙏

👉 *నామస్మరణ చేయగా చేయగా వెదురు ముక్క లాంటి శరీరం వేణువవుతుంది.బృందావనంలో శ్రీకృష్ణుడు ఆలపించిన నాదమవుతుంది.ముల్లోకాలూ తిరిగి ‘నారాయణా! నారాయణా!’ అని స్మరించే నారదుడి చేతిలో తంబుర అవుతుంది.*🙏

👉 *భక్తి-ప్రేమలను నింపి చేసే నామస్మరణకు మించిన యోగం లేదు.పూర్వజన్మ పుణ్యంవల్లనే ఆ భాగ్యం కలుగుతుంది.*🙏

👉 *దాన్ని దక్కించుకున్నవారు తుకారాం, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, ప్రహ్లాదుడు లాంటి భక్తులు. వారే సజీవ సాక్ష్యంగా కాలంలో నిలిచి నామ మాహాత్మ్యాన్ని విశ్వానికి చాటారు.*🙏

👉 *పురాణాల్లో శాస్త్రాల్లో చదివాము ఆ మహానుభావుల గురించి.* *మనం కూడా అనుభవంలోకి తెచ్చుకోవచ్చు* *అందుకు సాధనయే తరుణోపాయం*,🙏

👉 *పూజ కోసం సామగ్రి కొనాలి*
*ఎన్నోకొన్ని నియమాలు పాటించాలి. వ్రతాలకు, నోములకు అయితే కఠోర నియమాలుంటాయి.యజ్ఞాలకు, క్రతువులకు శక్తియుక్తులుండాలి. శాస్త్రం తెలిసి ఉండాలి. దోష రహితంగా చెయ్యాలి.*🙏

👉 *అందుకే కలియుగంలో నామస్మరణను మించింది లేదని చెప్పారు.*🙏

👉 *ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మనసును లగ్నం చేసి నామం స్మరించుకోవచ్చు.*🙏

👉 *పనికి ముందు, పనిచేసుకుంటూ నామస్మరణ, పని తరవాత మళ్ళీ నామస్మరణ చేస్తూ ఉంటే ఆ చేసే పని పవిత్రమవుతుంది.అందులోని దోషాలు హరించిపోతాయి.*🙏

👉 *ఆ విధంగా చేసే కర్మ భగవదర్పణ కర్మ అవుతుందని భగవద్గీత చెబుతోంది.*🙏

👉 *ఎవరి పేరు వాళ్లకు ఇష్టం.* *మనందరికీ మనల్ని సృష్టించినవాడి పేరు ఎందుకు ఇష్టంగా ఉండదు? తప్పక ఉంటుంది.*🙏

👉 *భయంలో,బాధలో,సుఖంలో, సంతోషంలో పాలలో తేనెను కలుపుకొన్నట్లు జీవితంలో నామాన్ని కలుపుకోవాలి*🙏

👉 *దైవం ఎప్పుడూ మనతో కలవడానికి త్వరపడుతూనే ఉంటాడు. నామస్మరణ ఈ రోజు మొదలుపెడితే ఇప్పుడే ఆయన మనకు చేరువవుతాడు.*
*సందేహమే లేదు.*🙏

👉 *నిరంతర భగవన్నామ స్మరణమేఆధ్యాత్మిక జీవితానికి బంగారుబాట.*

         *జై శ్రీరామ్.*💥🙏

No comments:

Post a Comment