శ్రీరాముడు అడవికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, లక్ష్మణుడు కోపగించుకుంటాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడిని శాంతింపజేస్తూ ఈ మాటలు చెబుతాడు. మనిషి జీవితంలో జరిగే మార్పులు, లాభనష్టాలు అన్నీ కేవలం మానవ ప్రయత్నం వల్లనే కాకుండా, వెనుక ఉండి నడిపించే ఒక అదృశ్య శక్తి (దైవం/విధి) వల్ల జరుగుతాయని దీని సారాంశం.
శ్లోకం 1:
సుఖ దుఃఖే భయక్రోధౌ లాభాలాభౌ భవాభవౌ |
యచ్చ కించిత్త థాభూతం నను దైవస్య కర్మ తత్ ||
అర్థం:
సుఖం, దుఃఖం, భయం, కోపం, లాభం, నష్టం, పుట్టడం మరియు గిట్టడం (మరణించడం).. ఇంకా ఇలాంటివి ఏవైనా సంభవిస్తే, అవన్నీ కూడా దైవ నిర్ణయం (విధి) వల్లనే జరుగుతాయని దీని అర్థం.
పదాల వివరణ:
భవాభవౌ: పుట్టుట మరియు మరణించుట.
యచ్చ కించిత్త థాభూతం: మరియు ఇటువంటివన్నీ (జరిగే పరిణామాలు).
నను దైవస్య కర్మ తత్: వెనుక నుంచి దైవం శాసిస్తూ ఉంటుంది (ఇది దైవ సంకల్పం).
శ్లోకం 2:
అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే |
అర్థం:
మనం అనుకోకుండా లేదా ఊహించకుండా అకస్మాత్తుగా ఏదైనా జరిగితే, అది దైవ ప్రేరితమైనదే. అంటే మనం ఒక ప్రణాళిక వేసుకున్నప్పటికీ, దానికి భిన్నంగా ఏదైనా జరిగితే అది మన ప్రమేయం లేకుండా దైవం ద్వారా జరిగిందని అర్థం.
http://youtube.com/post/UgkxAgufwHzhqmMfOrHcMN7pg1TBBvamBf5M?si=SdmqIbIB-r6YfdSM
No comments:
Post a Comment