🔔 *సత్సంగం* 🔔
*శ్రీ రమణ మహర్షి బోధనలు:*
ప్ర: "సోహం" అనుకోవటమూ, 'నేనెవరిని' అని అడగటమూ ఒకటేనా?
ఈ రెంటిలోనూ 'అహం' సామాన్యమైన అంశంగా ఉంది. ఒకటి సోహం రెండవది కోహం రెండూ భిన్నం. 'సోహం' అని ఎందుకంటూండాలి? అసలైన 'నేను'ని కనుక్కోవాలి. 'నేనెవరిని' అన్న ప్రశ్నలో 'నేను' అంటే అహంకారం దాని మూలాన్ని వెతకటంతో దానికి ప్రత్యేకమయిన అస్తిత్వం లేదనీ, అది అసలైన 'నేను'లో విలీనమై పోతుందనీ గ్రహిస్తాం.
ఇక్కడ సమస్య ఇది విచారణ పద్ధతి “శివోహం" అనో "సోహం" అనో ధ్యానించటం కన్నా భిన్నం.
ఆత్మజ్ఞానానికే నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. ప్రపంచం గురించీ, ఈశ్వరుని గురించి తెలుసుకునే ముందు నీ గురించి నీకు ఎరుక ఉండటం ముఖ్యం. '
సోహం' అంటూ ధ్యానం చేయటం గాని, 'అహం బ్రహ్మాస్మి' అంటూ ధ్యానం చేయటం కాని, మానసిక భావనే, వ్యాపకమే, ఇంచుమించు.
నేను చెప్పే ఆత్మవిచారం మాత్రం సూటి అయిన పద్ధతి, ధ్యానంకన్నా ఉత్తమమైనది. నువ్వు ఆత్మకోసం అన్వేషణ మొదలు పెట్టి లోతుగా వెళ్తున్న కొద్దీ, నీ ఆత్మ నిన్ను తనలో కలుపుకోవటానికి ఎదురు చూస్తుంది. ఆ తరువాత ఏమి జరుగుతుందో, ఏది జరిపిస్తుందో నీ చేతుల్లో లేదు.
ఈ పద్ధతిలో అన్ని సంశయాలూ చర్యలూ వాటంతటవే మాయమవుతాయి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు అన్ని బాధలనూ మనిషి మరిచినట్లే.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment