Saturday, January 17, 2026

 [1/17, 12:23] +91 94414 35409: *Madras High Court – FCRA Ruling (Core Meaning)*

The Madras High Court ruled that teaching or promoting the Bhagavad Gita, Vedanta, and Yoga does not constitute “religious activity” under Indian law, and therefore cannot be used as a ground to deny or cancel foreign funding under the FCRA (Foreign Contribution Regulation Act).

*What the Court clarified*

The Court made three crucial legal distinctions:

*1. Bhagavad Gita*

The Court held that the Gita is primarily a work of moral philosophy and ethical guidance, not a sectarian religious text.
It teaches:
Duty (dharma)
Self-discipline
Self-realization
Ethical action

Therefore, teaching the Gita is education in moral science, not religious preaching.

*2. Vedanta*

Vedanta was classified as a philosophical system concerned with:
Consciousness
Reality
Self-knowledge

It is comparable to Western philosophy, not to religious ritual or worship.

*3. Yoga*

Yoga was held to be a civilisational and scientific discipline, dealing with:
Physical health
Mental discipline
Psychological well-being

*It is not religious instruction.*

*Why this matters:*

Under the Foreign Contribution Regulation Act (FCRA):
Foreign money cannot be used for religious propagation, but can be used for education, research, culture, and social development.

*The Court ruled that:*

Teaching Gita, Vedanta, or Yoga falls under education and cultural activity, not religion.

So NGOs teaching these subjects are legally entitled to receive foreign funding.

*Constitutional significance*

The judgment reaffirmed that:
India’s civilisation predates modern religions
Its philosophical traditions are part of national culture, not sectarian faith
The State must not misclassify Indian knowledge systems as “religion” to suppress them

*In one sentence:*

The Madras High Court held that Gita, Vedanta, and Yoga are civilisational systems of knowledge—not religious preaching—and therefore cannot be restricted under India’s FCRA.
===============================
👏👏👏 *When was this ruling made pronounced?* 

*Finally some sense prevails. But it should, alongside, be freely allowed to be taught in schools and other such institutions. Let's hope that is the next steps.*
[1/17, 12:33] +91 88977 91635: *తెలుగు అనువాదం*

*మద్రాస్ హైకోర్టు - FCRA తీర్పు (ముఖ్య అర్థం)*:- భగవద్గీత, వేదాంత మరియు యోగాను బోధించడం లేదా ప్రచారం చేయడం భారత చట్టం ప్రకారం "మతపరమైన కార్యకలాపాలు" గా పరిగణించబడదని మరియు అందువల్ల FCRA (విదేశీ సహకార నియంత్రణ చట్టం) కింద విదేశీ నిధులను తిరస్కరించడానికి లేదా రద్దు చేయడానికి దీనిని ఒక ఆధారంగా ఉపయోగించలేమని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

*కోర్టు స్పష్టం చేసినది*:- కోర్టు మూడు కీలకమైన చట్టపరమైన వ్యత్యాసాలను చేసింది:

(1) *భగవద్గీత*:- గీత ప్రధానంగా నైతిక తత్వశాస్త్రం మరియు నైతిక మార్గదర్శకత్వం యొక్క రచన అని, ఒక మతపరమైన మత గ్రంథం కాదని కోర్టు అభిప్రాయపడింది. ఇది ఇలా బోధిస్తుంది: విధి (ధర్మం), స్వీయ - క్రమశిక్షణ, స్వీయ - సాక్షాత్కారం, నైతిక చర్య. అందువల్ల, గీతను బోధించడం నైతిక శాస్త్రంలో విద్య, మతపరమైన బోధన కాదు.

(2) *వేదాంతాన్ని*:- వేదాంతాన్ని వీటికి సంబంధించిన తాత్విక వ్యవస్థగా వర్గీకరించారు: చైతన్యం, వాస్తవికత, స్వీయ - జ్ఞానం. ఇది పాశ్చాత్య తత్వశాస్త్రంతో పోల్చవచ్చు, మత పరమైన ఆచారం {లేదా} ఆరాధనతో కాదు.

(3) *యోగా*:- యోగా ఒక నాగరిక మరియు శాస్త్రీయ విభాగంగా పరిగణించబడింది, దీనితో వ్యవహరించేది: శారీరక ఆరోగ్యం, మానసిక క్రమశిక్షణ, మానసిక శ్రేయస్సు, ఇది మతపరమైన బోధన కాదు.

*ఇది ఎందుకు ముఖ్యమైనది*:- విదేశీ విరాళ నియంత్రణ చట్టం (FCRA) కింద: విదేశీ డబ్బును మత ప్రచారం కోసం ఉపయోగించకూడదు, కానీ విద్య, పరిశోధన, సంస్కృతి మరియు సామాజిక అభివృద్ధికి ఉపయోగించవచ్చు.

*కోర్టు ఇలా తీర్పు ఇచ్చింది*:- గీత, వేదాంత లేదా యోగా బోధించడం మతం కింద కాదు, విద్య మరియు సాంస్కృతిక కార్యకలాపాల కిందకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలను బోధించే NGO లు చట్టబద్ధంగా విదేశీ నిధులను పొందేందుకు అర్హులు.

 *రాజ్యాంగ ప్రాముఖ్యత*:- తీర్పు ఈ క్రింది వాటిని పునరుద్ఘాటించింది: భారతదేశ నాగరికత ఆధునిక మతాల కంటే ముందే ఉంది. దాని తాత్విక సంప్రదాయాలు జాతీయ సంస్కృతిలో భాగం, మతపరమైన విశ్వాసం కాదు. రాజ్యం భారతీయ జ్ఞాన వ్యవస్థలను అణచివేయడానికి వాటిని "మతం" గా తప్పుగా వర్గీకరించకూడదు

*ఒక వాక్యం* లో:- గీత, వేదాంత మరియు యోగా అనేవి నాగరిక జ్ఞాన వ్యవస్థలు - మతపరమైన బోధన కాదు - కాబట్టి భారతదేశ FCRA కింద వాటిని పరిమితం చేయలేమని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.

*ఈ తీర్పు ఎప్పుడు వెలువడింది*?. 

*చివరగా కొంత భావం* ప్రబలంగా ఉంటుంది. కానీ దానితో పాటు, పాఠశాలలు మరియు ఇతర సంస్థలలో దీనిని స్వేచ్ఛగా బోధించడానికి అనుమతించాలి. తదుపరి దశ అదేనని ఆశిద్దాం.
 రిటైర్మెంట్ (కథ) 
కృష్ణమూర్తి నిన్ననే రిటైరయ్యాడు. మర్నాడు పొద్దున్నే లేచి హడావిడిగా మంచం దిగుతుంటే గుర్తొచ్చింది. 
‘అంత దూకుడెందుకు మూర్తీ? లేచి ఏం పీకుతావట’ మనసు వెక్కిరిస్తుంటే ‘నిజమే, ఏం చెయ్యాలి? అసలు ఇకపై ఏం చేసేది?’ అనుకున్నాడు. ఇన్నేళ్ళూ ఉద్యోగంతో బిజీ. ఇప్పుడు పూర్తి ఖాళీ. మళ్లీ పక్కమీదికి చేరి హాయిగా నిద్రపోయి ఎప్పటికో లేచాడు. ఇంట్లో భార్య కనిపించలేదు. పిల్లల గదుల్లోకి చూశాడు. ఎవరూ లేరు. 
“ఇంత పొద్దున్నే బలాదూర్లకు పోయారా?” కోపమొచ్చింది.     
కిచన్లోకెళ్ళి స్వయంగా కాఫీ కలుపుకున్నాడు. హాల్లో కొస్తుంటే గేట్లోంచి వార్తాపత్రిక దూసుకొచ్చి పడింది. పేపరు తెరిచి తీరుబడిగా వార్తలు చదవడం రిలీఫ్ అనిపించింది. అరగంట పోయాక స్విగ్గీలో టిఫిన్ తెప్పించుకు తిన్నాడు. ఇక తర్వాతేమిటనుకున్నాడు. దినమంతా తనదే. ఇష్టమొచ్చింది చెయ్యొచ్చు. కానీ ఏం చెయ్యాలి? 
భార్యతో కబుర్లు చెపుదామంటే ఇంట్లో లేదు. పెళ్ళాం తనతో కాస్త టైము స్పెండ్ చెయ్యనందుకు చిరాకేసింది. కానీ ఎన్నో యేళ్లుగా తనెప్పుడైనా ఆమెతో ఓ పావుగంట సరదాగా గడిపాడా అనేది గుర్తుచేసుకోలేదు. 
టీవీ రిమోట్ తీసుకొని ఓమారు అన్ని ఛానల్స్ చుట్టేసి విసుగుతో ఆపేశాడు. రాక్ లోంచి పుస్తకం తీసి చదివే ప్రయత్నం చేశాడు. అదీ చేయలేక కొద్దిసేపటికే పక్కన పెట్టేశాడు. ఒకప్పుడు పుస్తకాల పురుగు. బుక్ పట్టుకుంటే తిండి ధ్యాస కూడా ఉండేది కాదు. అంతేకాదు, అప్పట్లో కొంచెం పేరున్న రచయిత కూడా. భవిష్యత్తులో గొప్ప రైటర్ అవ్వాలనుకున్నాడు. కానీ ఉద్యోగంలో చేరాక క్రమంగా రచనకు దూరమై చివరికి దాని విషయమే మర్చిపోయాడు.
కృష్ణమూర్తికి హఠాత్తుగా తను ఒంటరైనట్టు అనిపించింది. భార్యాపిల్లలు ఎక్కడి కెళ్లారో తెలియదు. నిన్న సాయంత్రం ఆఫీసులో జరిగిన ఫేర్వెల్ గుర్తుచేసుకున్నాడు. సర్వీసులో చివరిరోజు. సహోద్యోగులు గొప్పగా వీడ్కోలు చెప్పారు. తన సమర్థతనూ, నిబద్ధతనూ ప్రశంసించారు. రిటైర్మెంట్ లైఫ్ హాయిగా, ప్రశాంతంగా గడపాలని విష్ చేశారు. 
అతనికి ఇక ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. బయటికొచ్చి రోడ్డెక్కాడు. చిన్నగా నడుస్తూ సెంటరు దాకా వెళ్ళాడు. 
అదే జనం.. అదే రద్దీ. మార్పులేదు. రోడ్డుకు ఇరువైపులా సహపంక్తి భోజనం చేస్తున్నట్టు వరుసగా తెరచివున్న దుకాణాలు. ముందుకు వెళుతుంటే లైబ్రరీ కనిపించింది. కాలేజీ రోజుల్నుంచి పుస్తకాలతో తన అనుబంధం గుర్తొచ్చింది. 
ఎంత కాలమైంది వెళ్ళక..? లోపలికి నడిచాడు. రీడింగ్ రూంలో అందరి చేతుల్లో ఏదో పత్రిక. ఒకప్పుడు లైబ్రరీలో కూర్చుని గంటలు గంటలు చదువుతూ గడిపేవాడు. ఇప్పుడు పది నిమిషాలు కూడా ఉండలేక బయటపడ్డాడు.
కోణార్క్ థియేటర్ రోడ్డులోకి తిరిగినప్పుడు రెండేళ్ల క్రితం రిటైరైన మేనేజర్ కనిపించాడు.
“నమస్కారం సర్” తనే ముందు విష్ చేశాడు. 
ఆయన ఇటుచూసి “హల్లో కృష్ణమూర్తి.. ఎలా ఉన్నావు? రిటైర్మెంట్ ఎంజాయ్ చేస్తున్నావా?” అన్నాడు.
తను రిటైరైన సంగతి అప్పుడే ఈయన దాకా వచ్చిందా అనుకొని “అవును సర్, హ్యాపీ. కానీ రోజంతా ఖాళీ. బోర్ కొడుతోంది.”
“మొదట్లో అలాగే అనిపిస్తుంది. అయినా ఇంకేం చేస్తావయ్యా.. ప్రశాంతంగా బతికేయ్”
“అవును సర్.. అలాగే” అన్నాడు ఏమనాలో తెలియక. బై చెప్పి ఆయన వెళ్ళిపోయాడు.
ఒక గమ్యం అంటూ లేకుండా తిరిగి కృష్ణమూర్తి అలసిపోయాడు. దగ్గరివాళ్ళెవరినైనా కలవాలనుకున్నాడు. కానీ అతనికి మంచి దోస్తులుగానీ చుట్టాలుగానీ లేరు. ఎప్పుడూ ఎవరితోనూ కలిసిమెలిసి లేడు. ప్రత్యేక అభిరుచులంటూ కూడా లేవు. దేనిమీదా పెద్దగా ఆసక్తి లేదు. ఉపయోగకరం కాదనుకున్నదేదీ తనకి నచ్చదు. ఎప్పుడో కాస్సేపు పుస్తక పఠనం తప్ప ఆటాపాటా, ఎంటర్టేన్మెంటు వంటి వాటికి దూరంగా ఉన్నాడు. 
కమ్యూనిటీ హాలు వరకెళ్లి కాలనీ పెద్దల్ని కలిశాడు. వాళ్లతన్ని చూసి కర్టెసీగా పలకరించారు తప్ప ఎవర్లోనూ పెద్దగా ఇంటిమసీ కనిపించలేదు. అందరూ రిటైరీలే. కాస్సేపటికే వాళ్ళ మాటలు, ఆలోచనాధోరణి, అభిప్రాయాలు రుచించలేదు. అర్థంపర్థం లేని ఆధ్యాత్మిక భావాలు, మూఢ విశ్వాసాలు, ఇతరుపై అసూయద్వేషాలు, సిల్లీ పాలిటిక్స్, కుళ్లిన జోకులు, అవసరం లేకున్నా ఎక్కడో సెటిలైన తమ సంతానం గురించి గొప్పలు పోవడం. 
అక్కణ్ణుంచి బయటపడి మధ్యాహ్నం రెండు తర్వాత ఇల్లు చేరుకున్నాడు. భార్య అప్పుడే బయటకెళ్లడానికి రెడీ అవుతోంది. తనని చూడగానే “ఈరోజు కుక్ రాలేదు. వంటచేసి టేబులు మీద సర్దిపెట్టాను, వడ్డించుకొని తినండి” అంది ముక్తసరిగా.
పొద్దున తను లేచేసరికే బయటికి పోయింది. ఇప్పుడు మళ్ళీ తయారైంది. ముఖం చిట్లిస్తూ “ఎక్కడికి బయల్దేరావు?” అన్నాడు.
“కొత్తేముంది.. రోజూ వెళ్ళేచోటికే” అంటూ చెప్పుల్లో కాళ్లు పెట్టింది.
ఆమె జవాబులో నిర్లక్ష్యం కనిపించి నొచ్చుకున్నాడు “నీకు తెలుసా, నేను నిన్నే రిటైరయ్యాను” 
తెలుసన్నట్టు తలూపి, అయితే ఏంటన్నట్టు చూసింది. మరే రియాక్షనూ లేదు.
ఆమె గుమ్మం దాటుతుంటే “అసలెక్కడికి పోతున్నావు? ఎందుకీ హడావిడి?” అన్నాడు. అయినా ఆగకుండా వెళ్ళిపోయింది.
అసలే తిక్కగా ఉన్న కృష్ణమూర్తి ఇగో బాగా హర్టయింది. 
‘ఇంట్లో ఏం జరుగుతోంది? ఎవరేం చేస్తున్నారు? ఎక్కడికెళుతున్నారు?’ అర్థంకాక గింజుకున్నాడు. ఆకలవుతుంటే వెళ్ళి వడ్డించుకొని తిన్నాడు. తర్వాత ఏం చెయ్యాలని మళ్ళీ మొదటి కొచ్చాడు. 
సాయంత్రం ఆరున్నరకు భార్య వస్తూనే వంటగదిలో దూరింది. పావుగంటలో వేడిగా కాఫీ ఇచ్చింది. ఒక నవ్వులేదు, మాటలేదు. మొక్కుబడిగా చేస్తున్నట్టు. అప్పటికే ఎన్నో గంటలుగా ముళ్లమీద కాలం గడిపిన అతనిక సహించలేక నిలదీశాడు. 
“పొద్దుగూకింది. నువ్వేమో బయట తిరిగి ఇప్పుడొచ్చావు. పిల్లలు ఏ బలాదూర్లు పోయారో ఉదయం నుంచి కనిపించలేదు. అసలేం చేస్తున్నారు మీరంతా?”
“ఎవరూ బలాదూర్లు పోలేదు. అంతా పనులమీదే వెళ్లారు. మీకు తెలియపోతే నేనేం చెయ్యను?”
“ఏమిటా పనులు? ఏం పొడిచేస్తున్నారు మీరంతా?”
“నేను బొటిక్ సెంటర్ నడుపుతున్నా. నేను వెళ్ళింది అక్కడికే. పిల్లలేమో వాళ్ళ ఆఫీసులకు పోయారు. ఇందులో కొత్తేముంది?”
“ఏనాడూ గడపదాటని నువ్వు బొటిక్ నడుపుతున్నావా? ఈ సంగతి నాకెప్పుడూ చెప్పలేదే?”
“చెప్పడానికి ఇంట్లో ఎప్పుడు సరిగా ఉన్నారు? మీకు వినే తిరికేది?”
“పిల్లలు ఆఫీసులకు వెళ్లడమేంటి? అసలు వాళ్ళేం చేస్తున్నారు?”
“అబ్బాయి సొంతంగా బిజినెస్ పెట్టుకున్నాడు. అమ్మాయి ఉద్యోగం చేస్తుంది”
“ఈ విషయాలేవీ నాకు తెలియవే?” కోపగించాడు.
“తెలుసుకునేందుకైనా వినేందుకైనా మీకు తీరుబడి, పట్టింపు ఉండాలిగా”
భార్య మాటల్లో వెటకారానికి మండుకొచ్చింది.“సరే.. వాళ్ళెప్పుడొస్తారు ఇంటికి..?” అన్నాడు. 
“ఖచ్చితమైన టైమంటూ లేదు, ఎప్పుడైనా రావచ్చు”
“ఇదికూడా తెలియపోతే ఎట్లా? నీకసలు బుద్ధుందా? తల్లివి ఆమాత్రం బాధ్యత లేదూ?”
“ఇందులో బాధ్యతేముంది? అయినా బాధ్యత గురించి మీరేనా అడిగేది? ఈ ప్రశ్న మిమ్మల్ని వేసుకోండి”
కృష్ణమూర్తి బిత్తరపోయాడు. భార్య ధోరణి హద్దు మీరినట్టు భావించాడు. తను కసురుకున్నా, కోపంతో ఎన్ని మాటలన్నా మౌనంగా భరించే ఆమె ఇప్పుడిలా లాజిక్కులు మాట్లాడ్డం నచ్చలేదు.
“నామీదే వెటకారమా? నాకు బాధ్యత లేదా? లేకుండానే ఇన్నాళ్ళూ ఇల్లు నడిచిందా? భారమంతా నువ్వే మోసినట్టు చెప్తున్నావు” 
“నేనలా అనలేదు. తండ్రిగా ఇంతకాలం మీకు పిల్లల బాధ్యత కొంచెం కూడా తెలియదు. ఇప్పుడేందుకీ ఆరాలు?”
భార్య తనకు ఎదురుతిరిగినట్టు ఫీలయ్యాడు. ఆవేశంగా ఏదో అనబోయి ఆగి మరేం మాట్లాడక గదిలోకి వెళ్ళిపోయాడు.
                                      ***
రిటైర్మెంట్ తర్వాత ఏం చెయ్యాలో కృష్ణమూర్తి ఎప్పుడూ ఆలోచించుకోలేదు. దీనిపై భార్యతో యేనాడూ చర్చించలేదు. ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇవ్వాలని, పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా గడపాలని ఊహాల్లోకి కూడా రాలేదు. ఎప్పుడూ తన పద్ధతిలో నడుచుకోవడమే తప్ప ఎవర్ని గురించి పట్టించుకోలేదు. తను గీసుకున్న వృత్తంలో గడిపేశాడు.
ఊరుకు వందల మైళ్ళ దూరంలో ఉద్యోగం. దాదాపు వారంలో ఆరురోజులు అక్కడే. వీకెండ్ ఇంటికి రావడం. అప్పుడప్పుడు అదీలేదు. మనసుకు తట్టకో, తీరికలేకనో ఫోన్ చేసి ఇంట్లోవాళ్ళతో ముచ్చటించాలన్న ధ్యాస కూడా ఉండేది కాదు. క్రమేపీ ఇల్లు చిన్న మజిలీ అవుతూ వచ్చింది. ఇంటి యాజమానిగా బాధ్యతల్ని వొదిలేశాడు. ఇల్లు ఎట్లా నడుస్తోంది చూడలేదు. బరువు భార్య మీదికి నెట్టేశాడు. అట్లా ఉద్యోగ జీవితమంతా తనను తాను వేరుచేసుకొని గడిపాడు.  
ఇంట్లోనే కాదు, బయటా అంతే. స్నేహితులు, చుట్టాలకు తనెప్పుడూ అందుబాటులో లేడు. రిలేషన్స్ నిలుపుకోలేక అందరికి దూరమయ్యాడు. ఉద్యోగ పర్వంలో విశ్రాంతిగాని, వినోదంగాని లేకుండా గడిపాడు. యువకుడినిగా కొలువు ప్రారంభించి రిటైర్మెంట్ వరకు సమయాన్ని సర్వీసుకే ధారపోశాడు. చేసింది పెద్ద ఉద్యోగమ. అయితే అతడేమీ అంతరిక్షంలో చెయ్యలేదు. ఎడాపెడా డబ్బు సంపాదించాడా అంటే  లేదు. అవకాశాలున్నా చేతకాలేదు. చాకిరి తప్ప చొరవలేకపొయింది. కెరీర్లో ఎగరాలనే తాపత్రయం. ఒక చట్రంలో ఉంటూ ఎంతచేసినా ఏఅద్భుతాలు జరగవని, గొడ్డుచాకిరితో గోల్స్ నెరవేరవని గ్రహించలేదు. 
పెళ్ళయిన తొలినాళ్లలో భార్య నిలదీసింది తనతో కొంచెం టైము కూడా గడపడం లేదని. కృష్ణమూర్తి పట్టించుకోలేదు. పైగా చిరాకుపడ్డాడు. “నాకేం వేరే పనిలేదా?” అన్నాడు. పిల్లలు పుట్టాక కూడా మార్పులేదు. భార్య క్రమంగా అతని పరిధిలోంచి బయటపడింది. భర్త దైనందిన జీవితంలోకి తొంగిచూడటం మానేసి ఇంటి సంరక్షణ తలకెత్తుకుంది. దృష్టి పిల్లల మీదికి మళ్లించింది. ఏ సమస్య వచ్చినా అన్నీ తానై చూసుకుంది. వాళ్ళ బాగోగులు, అవసరాలు, చదువులు, ఆరోగ్య సమస్యలు అన్నిటిని ఆమెనే పర్యవేక్షించింది. అండగా నిలబడింది. స్కూల్లో పేరెంట్స్ మీటింగ్స్ మొదలు కాలేజీ ఫీజుల వరకూ అన్నీ ఆమెనే. అలాగని భర్తను నిర్లక్ష్యం చేయలేదు. ఇద్దరి నడుమ దగ్గరితనం లేనందున గొడవలూ రాలేదు. ఆమె తను కోరుకున్న విధంగా పిల్లల సంరక్షణ చేసింది. డబ్బుకు మరీ ఇబ్బంది ఉండేదికాదు. అవసరాలకు అడిగితే కొంత కృష్ణమూర్తి ఇచ్చేవాడు. ఫ్యాషన్ డిజైనింగులో తనకున్న ప్రావీణ్యంతో ఆమె సొంతంగా బొటిక్ ప్రారంభించింది. ఆమె పట్టుదల, కష్టం ఫలించి అది బాగా డెవలప్ అయింది. పిల్లలు చదువుకొని స్థిరపడ్డారు. చిత్రమేమిటంటే ఇంటి యజమాని అయిన కృష్ణమూర్తికి ఇవేవీ అవగాహనలో లేవు. తన డ్యూటీ, మీటింగులు, క్యాంపులు, కాన్ఫరెన్సులు, ఫోన్లలో బిజీ. తప్పనిసరైతే భార్యతో రెండు మాటలు. పిల్లలతో గడిపిన, దగ్గరికి తీసిన సందర్భాలు లేవు. 
కృష్ణమూర్తికి ఖాళీ సమయం యాతనకు గురిచేస్తోంది. ఏంచెయ్యాలో, దేంట్లో ఎంగేజ్ కావాలో తెలియట్లేదు. ఇంట్లో ఏ మార్పులేదు. ఆంటీముట్టనట్టు భార్య.. అపరిచితుల్లా పిల్లలు ఉంటున్నారు. అందరి మధ్యనే ఒంటరితనం, వెలితి, అసహనం పిచ్చిలేస్తుంది. 
రాత్రి ఎనిమిదిన్నరకి ఇల్లు చేరిన కుమార్తెను నిలబెట్టి కేకలేశాడు. “ఎందుకింత ఆలస్యం? ఇప్పుడు టైమెంతో తెలుసా?”
అద్భుతమేదో జరిగినట్టు ఆమె తండ్రిని ఎగాదిగా చూసి అంది. “అదేమిటి.. కొత్తగా అడుగుతున్నారు. నాకిది మామూలే” 
కూతురు జవాబులోనూ కృష్ణమూర్తికి నిర్లక్ష్యమే కనిపించింది. 
“ఆడపిల్లవి, ఇంత రాత్రిదాకా బయట తిరగటం మామూలేంటి? బుద్ధుండే మాట్లాడుతున్నావా?”
“నేనేం బయట తిరగడం లేదు, ఆఫీసు నుంచి వస్తున్నా”
“అసలిప్పటిదాకా ఏం చేస్తున్నావు?”
“మా కంపెనీ ఇక్కడికి చాలా దూరం. ట్రాఫికులో రెండు గంటలు పడుతుంది. ఐనా ఇవన్నీ మీకెందుకు? ఎప్పుడూ లేనిది కొత్తగా ఆరాలేమిటి? ఇంత కన్సర్న్ ఎందుకు?”
కూతురు ఎదురుచెప్పటం నచ్చలేదు. అంత పొగరేమిటని అనుకున్నాడు. 
“ఇంటికి పెద్దవాణ్ని, తండ్రిని, నాకుగాక ఇంకెవరికి ఉంటుంది కన్సర్న్?” అన్నాడు కోపంగా.
“ఇంతకాలానికి మీరింట్లో ఉండటం, పిల్లల గురించి పట్టించుకోవడం ఆశ్చర్యమే. అయినా మీరేం వర్రీ కాకండి. మా  బాగోగులు చూసేందుకు అమ్మ ఉంది”
ఆమె సమాధానం కృషమూర్తి మైండ్ బ్లాక్ చేసింది. కుతకుతలాడి పోతూ భార్యకు ఫిర్యాదు చేశాడు.
“ఏమండీ... ఏనాడూ ఇంట్లో ఏదీ పట్టించుకోని మీకిప్పుడెందుకు ఆరాటం? వాళ్ళేం చిన్నపిల్లలు కారుకదా”
తననే ఎత్తిపొడిచినట్టున్న ఆమె ధోరణి అవమానంగా, తనను అద్దం ముందు నిలబెట్టినట్టు అనిపించింది. 
“నీకసలు బుద్ధి ఉందా? పెళ్ళికాని ఆడపిల్ల ఇంతరాత్రి దాకా బయటుంటే మందలించక వెనకేసుకొస్తావా? అసలు దానికి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరమేంటి? పెళ్లిచేసుకొని అత్తవారింటికి పోయేది”
“ఎవరు చేస్తారండీ పెళ్లి? కూతుర్ని అత్తారింటికి పంపే బాధ్యత ఎవరిది? తండ్రిగా మీకీ విషయం గుర్తుందా? ఎప్పుడన్నా ఇంట్లో కుదురుగా ఉండి ఏదైనా పట్టించుకున్నారా? నెలకు ఇంత డబ్బు మా ముఖాన కొడితే సరిపోతుందా? పిల్లలేం చేస్తున్నారు? వాళ్ళ చదువులేమిటి? ఇల్లెట్లా నడుస్తోంది? పెళ్ళాం అనేది ఉందా? అసలు మనింట్లో ఏనాడైనా ఒక పండగో.. ఫంక్షనో జరుపుకున్నామా? మనకు సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయా? సరదాలు, సంతోషాలేవైనా తీర్చుకోవడం జరిగిందా? మన నలుగురం కలిసి కనీసం భోజనమైనా చేశామా? గుర్తుచేసుకొని చెప్పండి” 
ప్రవాహంలా ముంచెత్తిన భార్య ఎదురుదాడికి కృష్ణమూర్తి తలొంచుకున్నాడు, బడులుచెప్పలేదు. కొడుకు చేసే వ్యాపారంలో ఏదైనా  సాయం చేద్దామని చూశాడు. ఈ మాటే కొడుకుతో చెప్పాడు.
కానీ తండ్రిని నిర్మొహమాటంగా దూరం పెడుతూ “ఈ వయసులో మీకెందుకులెండి శ్రమ” అన్నాడు.
ఆ మాటలో తనపట్ల గౌరవం కంటే వెటకారం ఎక్కువ ధ్వనించింది. అయినా తమాయించుకొని తన నైపుణ్యం, అనుభవం  వ్యాపారంలో ఉపయోగపడతాయని కన్విన్స్ చేయబోయాడు.
“అవసరం లేదు.. నా వ్యాపారం నేను చూసుకోగలను. ఎవరి జోక్యమూ వొద్దు” కుండబద్ధలు కొట్టాడు.
“నేను నీతండ్రిని. పోనీ బిజినెస్ ఒక్కటే కాదు, నీ వ్యక్తిగత సమస్యలేవైనా ఉంటే నాతో షేర్ చేసుకోవచ్చు”
“హఠాత్తుగా ఇంత కన్సర్న్ ఎందుకు? నాకేం సమస్యల్లేవు. ఏదైనా ఉంటే అమ్మతో షేర్ చేసుకుంటా”
కొడుకు అంత నిక్కచ్చిగా మాట్లాడుతాడని కృష్ణమూర్తి ఊహించలేదు. బాధ కలిగింది. 
భార్య ముందీ ప్రస్తావన తెచ్చి“వాళ్ళకా పొగరేమిటి? అంత గొప్పోళ్లయి పోయారా? నా జోక్యం వద్దంటారా?” అన్నాడు. 
ఆమె విని ఊరుకుంది. సమాధానం చెప్పలేదు.
“మాట్లాడవేం? వాళ్ళకు తండ్రి అవసరమే లేదా? అంతా అమ్మనేనా? ఇదంతా నీ శిక్షణే కదా”
“అదేంలేదు, పిల్లలు పెద్దోళ్లయ్యారు. వాళ్ళకన్నీ తెలుసు. మిమ్మల్నేమీ ధిక్కరించలేదు. మీపట్ల కోపమూ లేదు. వాళ్ళకు తండ్రి  అవసరమైనప్పుడు మీరెప్పుడైనా తోడున్నారా? ఆసరాగా నిలిచారా? కాస్తంత టైమైనా ఇచ్చారా?”
“ఏంటి నువు మాట్లాడేది..? ఏం తక్కువ చేశాను? అన్నీ సమకూర్చాను కదా”
“అన్నీ అంటే అవసరాలకు డబ్బులు ఇవ్వడమేనా? ఒక తండ్రిగా, ఇంటిపెద్దగా బాధ్యత అంతేనా? మనుషులతో పనిలేదా?”
                                         ***
మనశ్శాంతి లేక తల్లడిల్లుతున్నాడు కృష్ణమూర్తి. గడచిన జీవితాన్ని రివైండ్ చేసుకుంటే ఉద్యోగానికి వెలుపల తనెప్పుడూ జీవించలేదని అర్థమైంది. కుటుంబంతో గడపలేకపోయాడు. బంధుమిత్రుల్లో ఉనికినే కోల్పోయాడు.  
ఇంట్లో అందరితో కలిసి ఎప్పుడు భోంచేశాడో జ్ఞాపకం లేదు. కలిసి పండగ చేసుకున్నదీ, సరదాగా బయటికెళ్ళి గడిపిన సందర్భం ఒక్కటైనా లేదు. తన పెళ్లిరోజో, పిల్లల పుట్టినరోజులో కృష్ణమూర్తి ఊహక్కూడా అందనివి. 
ఎప్పుడూ కెరీర్ గురించే. పైకిపోవాలని శ్రమించాడు తప్ప తనవాళ్ళకి దూరమయ్యేది గ్రహించలేదు. ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది..  తనకే ఆనందాల్లేవు. ఆత్మీయతల్లేవు. అనుభూతులు అసలు లేవు. మూడు దశాబ్దాల కొలువుతో సాధించిందీ లేదు. 
ఒక్కోరోజు గడుపుతుంటే కృష్ణమూర్తిని డిప్రెషన్ ఆవహిస్తోంది. 
భార్యతో సహా ఇంట్లో అంతా బిజీగా ఉన్నారు. తనను వాళ్ళలో కలుపుకోవడం లేదన్న ఫీలింగ్ బాధపెడుతోంది. బయట కూడా ఎవరూ పట్టించుకోరు. తనకన్నా ముందు రిటైరైన కొందరు మిత్రులిప్పుడు వివిధ వ్యాపకాల్లో ఉన్నారు. కుటుంబాలతో, గ్రాండ్ చిల్డ్రన్ తో హాయిగా గడుపుతున్నారు. చూట్టాలతో కలుస్తున్నారు. పర్యటనలకు వెళుతున్నారు. కొందరు ఆధ్యాత్మిక చింతనలో, కొందరు సోషల్ వర్కులో, ఇంకొందరు రాజకీయాలూ వ్యాపారాల్లో మునిగారు.  
కృష్ణమూర్తికి ఇవేవీ అనుభవంలో లేనివి. ఆటల్లో ప్రవేశం లేదు. సినిమాలు చూసే అలవాటు లేదు. పరిచయస్థులు, బంధువులతో చొరవగా కలిసిపోవడం రాదు. వివిధ ప్రాంతాలు తిరిగినా కంపెనీ పనులపై, డ్యూటీలో భాగంగా తప్ప సరదా కోసం కాదు.  
ప్రస్తుతం టైము గడవక నిమిషాలు లెక్కిస్తున్నాడు. ఇదేం జబ్బు కాదు డాక్టరుకు చూపించుకోడానికి. కంఠం మీది కొచ్చిన సమస్య కాదు సాయమడిగేందుకు. తన పరిస్థితి ఎక్కడా చెప్పుకోవడం అతనికి ఇష్టంలేదు. ఏమనుకుంటారో.. చిన్నచూపు చూస్తారన్న సందేహం.
అతనికి భార్య మీద అసూయ కలిగింది. ఇంటి పట్టునుండే సీదాసాదా గృహిణి, ఇప్పుడేమో తన కిష్టమైన వ్యాపకంతో హ్యాపీగా ఉంది. పిల్లలు ప్రయోజకులయ్యారు. తానెప్పుడూ వాళ్ళను పట్టించుకోలేదు. ఇప్పుడేమో వాళ్ళూ దూరం పెడుతున్నారు. 
ఓరోజు రాత్రి కుటుంబ సభ్యులతో కూర్చొని డిన్నర్ చేస్తుంటే అతనికి కొత్తగా అనిపించింది. 
కొడుకు మౌనంగా తింటున్నాడు. భార్యా కూతురూ భోంచేస్తూ మధ్యమధ్య చిన్నగా ముచ్చట్లాడుతున్నారు. కృష్ణమూర్తి గొంతు సవరించుకున్నాడు. “మీరు ముగ్గురూ నేను చెప్పేది కొంచెం వినాలి” అన్నాడు. అలా అని చెప్పడం మొదలుపెట్టాడు.
రిటైర్మెంట్ తరువాత కొన్నిరోజులుగా తను పొందిన అనుభవాలు, వ్యాపకమేదీ లేక ఖాళీగా ఉంటూ పడిన మానసిక సంఘర్షణ, కాలం ఎంత యాంత్రికంగా, దుర్భరంగా గడుస్తున్నదీ తన ఇగోని పక్కనపెట్టి వివరించాడు.
“నా పరిస్థితి అర్థం చేసుకొని మీరేదైనా సలహా ఇవ్వండి. మనసులో మాట నిస్సంకోచంగా చెప్పండి. నేనేమీ అనుకోను” నిజాయితీగా అభ్యర్థించి ముగ్గురి వంక ఆత్రంగా చూశాడు. ఈ పరిస్థితిలో వాళ్ళు తనను నిందిస్తారని, ఎగతాళి చేస్తారని భయపడ్డాడు. కానీ అట్లా జరగలేదు. కృష్ణమూర్తి చెప్పింది ముగ్గురూ సానుకూలంగా విన్నారు. 
ముందుగా కొడుకు నోరు విప్పాడు: “ఇదేం పెద్ద ప్రాబ్లెం కాదు డాడీ..! మీకు నచ్చిన ఏ యాక్టివిటీనైనా ఎంచుకొని అందులో ఎంగేజ్ అయిపోండి. ఖర్చు గురించి ఆలోచించకండి. మీ సంతోషానికి ప్రయారిటీ ఇవ్వండి. దానికోసమే వెతుక్కొండి. ఏ విషయంలోనూ టెన్షన్ పడొద్దు. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అందరితో వేరుగా ఉండకుండా కలివిడిగా కలిసిపోవడం అలవర్చుకోండి. ముఖ్యంగా అమ్మతోనూ, మాతోనూ ప్రేమనీ.. ఆత్మీయతనీ పంచుకోండి, స్నేహంగా మెలగండి” అన్నాడు.
కుమార్తె మాట్లాడుతూ “యూ ఆల్వేజ్ బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ డాడీ..! అన్నిటికంటే ముందు మీరు మన ఫ్యామిలీ మెంబరుగా ఉండటం అలవాటు చేసుకోండి. ఇంతకాలం తెలియని ఆరాటంలో బతికేశారు. ఇప్పుడైనా అందరితో కలిసి ఉంటూ సంతోషంగా గడపండి. అమ్మతో కలిసి ఎటైనా తిరిగిరండి. పర్యటనలు చేయండి. చూట్టపక్కాలను కలవండి. ఇంకా మీరు గతంలో చేద్దామనుకొని మానేసిన ఏవైనా అభిరుచుల్ని ఇప్పుడు వెలికితీసి మొదలుపెట్టండి. వాటిని ఫుల్ ఫిల్ చేసుకోండి” చెప్పింది.
“నువ్వేమీ చెప్పవా... నీ సలహా ఏంటి?” భార్యని అడిగాడు.
“మీకు నేనేం చెప్పగలనండీ? ఆలోచిస్తే ఏం చెయ్యాలో, దేన్ని ఎంచుకోవాలో మీకే అవగాహనొస్తుంది. మగవాళ్లకి తమ ఆసక్తులను, అభిరుచులను సుసంపన్నం చేసుకునేందుకు ఆఫ్టర్ రిటైర్మెంట్ సరైన సమయమని చెపుతుంటారు. ఇప్పుడు మీకా అవకాశం వచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత ఎవరైనా తమ అభిరుచి మేరకు ఆనందంగా జీవించాలంటే అందుకు డబ్బే ప్రధానం కాదు. ఉద్యోగ కాలమంతా బిజీగా గడిపిన చాలామందికి రిటైర్మెంట్ తర్వాత తక్షణం అమలుచేసే ప్రణాళిక అంటూ ఉండకపోవచ్చు. అందువల్ల ఈకారణంతో కొద్దిరోజులు గుర్తింపు సంక్షోభాన్ని అనుభవిస్తారు. ఒకవిధమైన ఒంటరితనం, విసుగు, ఉద్ధేశరాహిత్యం వల్ల మనోవ్యాకులత ఏర్పడతాయి. అయితే ఒక్కటి మాత్రం మరవొద్దు. పదవీ విరమణ అంటే అదో ముగింపు కాదు, సరికొత్త ప్రారంభం. జీవితంలో సెకెండ్ ఇన్నింగ్ లాంటిది. నాకు తెలిసి మన పెళ్ళయిన కొంతకాలం వరకూ మీరు సాహిత్యంలో ఉన్నారు. రచనలు చేసేవారు. రచయితగా పాపులర్ అవుతున్న టైములో ఉద్యోగంలో మునిగిపోయి రచనా వ్యాసంగాన్ని వదిలేశారు. ఇంకేం ఆలోచించక రైటింగ్ మొదలుపెట్టండి. అపారమైన జీవితానుభవం, ఎన్నో జ్ఞాపకాలు మీకున్నాయి. ఇప్పుడు మరింత పరిపక్వతతో రచనలు చేయగలరు. 
ఈ వ్యాపకం వల్ల మీకు ఆనందమూ, సంతృప్తి దొరుకుతయి. ఇది వద్దనుకుంటే ఇందాక పిల్లలు చెప్పినట్టు ఇంకేదైనా యాక్టివిటీ ఎంచుకోండి. అన్నిటికంటే ముఖ్యం... మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఒక నిర్ధిష్టమైన జీవనశైలిపై శ్రద్ధ పెట్టండి. పొద్దునే వాకింగ్ వెళుతుండండి. గేమ్స్ ఆడండి. ఏదైనా ఎన్జీవోలో చేరి సోషల్ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగం పంచుకోండి. లేదా మీకు మంచి అకడమిక్ బ్యాక్ గ్రౌండ్ ఉంది గనుక స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పండి. ఇట్లా మీరు అనుకోవాలేగానీ ఎన్నో ఆప్షన్లు ఉన్నాయ్”
భార్య మాటల్ని ఆశ్చర్యపోతూ విన్నాడు కృష్ణమూర్తి. ఎంత బాగా చెప్పింది అనుకున్నాడు. ఆమెకున్న అవగాహనకు విస్మయం చెందాడు.  
కొద్దిరోజులుగా దారీ తెన్నూ లేక సతమతమైన తనకిప్పుడు కొత్త దారులు తెరుచుకున్నట్టయింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా అర్థవంతంగా గడిపేందుకు నిన్నటి వరకూ మార్గం కనిపించలేదు. కానీ ఇప్పుడు తనముందు ఎన్నో ఆప్షన్లు కనిపిస్తున్నాయి. నచ్చింది ఎంచుకొని సాగాలి. అన్నిటికంటే ముందు సుదీర్ఘకాలంగా తనకు కుటుంబంతో ఏర్పడ్డ గ్యాప్ భర్తీ చేసుకోవాలని భావించాడు. 
ఆ మర్నాడు ఉదయం కృష్ణమూర్తి హుషారుగా నిద్రలేచాడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు.                                                                                                                                                        
----------------------
                                                                                                      (స్వాతి మాసపత్రిక, జనవరి, 2026)
 *పండగలు ముగిసాయ్, వాటితో సెలవులూ ముగిసాయ్...*

*హృదయాలు బరువు అయ్యాయ్, జేబులు ఖాళీ అయ్యాయ్...*

*అత్త గారిళ్ళు బోసి పోయాయ్, స్టాండ్లు, స్టేషన్లు పోటెత్తాయ్...*

*రాము అని పసి హృదయాలు ఘోషించాయ్, మళ్ళీ ఉగాది కొద్దామని మాతృ హృదయాలు ఊర డించాయ్...* 

*పందేలలో గెలిచిన పుంజులు హీరో లయ్యాయ్... ఓడిన పుంజులు కూర లయ్యాయ్...*

*పేకాటలో ఓడిన డబ్బులతో ఏడుపు లొచ్చాయ్... గెలిచిన డబ్బులతో పార్టీలు చేసుకొన్నారు.*

*ఏడిస్తే క్రీడా స్ఫూర్తి లేదన్నారు... గెలిస్తే టైం బాగుందన్నారు...*

*ఈ మూడు రోజుల పండుగ ఆనందం మన మనసులో పదిలం.*

*ఈ ఆనంద సౌరభం ఏడాదంతా మనసున నిలుపుకొని వచ్చే పండుగ కోసం ఎదురు చూద్దాం మిత్రులారా.*

*పండుగ శుభాకాంక్షలు తెలిపిన మీకు కృతజ్ఞతలు.*

*┈┉━❀꧁ఉషోదయం꧂❀━┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁
 *🔔     🔔*
   
            *మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు.*
         *దానిని ఎవరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నించ వలసిన అవసరంలేదు.*

🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞
 అమ్మో...ఎక్కాల పుస్తకం...! 

ఎవరు కనిపెట్టారో కాని చిన్నతనంలో నూటికి కనీసం 70 మంది పిల్లల్ని భయపెట్టేది ఈ పుస్తకం. ప్రతీ పుస్తకానికీ గైడ్లు వున్నాయి. కానీ దీనికి లేవు. అలా అంకెలు నేర్చుకుని ఒకటో తరగతి నించి రెండో తరగతిలోకి అడుగు పెట్టామో లేదో ఈ పుస్తకం పుస్తకాల సంచీలోకి చేరిపోయేది. అందులో పట్టుమని 10 పేజీలు లేకపోయినా లావుపాటి తెలుగు, సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రము లాంటి పుస్తకాల కంటే ఎక్కువ భయపెట్టేది. 

ఈ ఏడాది పుస్తకాలన్నీ మారిపోయాయి. కొత్త పుస్తకాలు కొనండి అని ఇంట్లో గొడవ పెడితే అన్నీ కొనేవారు కాని, ఎక్కాల పుస్తకం మాత్రం కొనేవారు కాదు. ఏ అక్కో, అన్నో వాడేసి చిరిగి శల్యావస్థ లో వున్న పుస్తకం వాడుకోమనే వారు. ఎందుకంటే ఎక్కాల పుస్తకం ఏమీ మారదు కదా అనేవారు. ఇదొక యునివర్సల్ పుస్తకం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా ఏ ఖండంలోనైనా రెండు రెళ్లు నాలుగే – ఒక్క తెలుగు సినిమాలో తప్ప. అక్కడ మాత్రం “రెండు రెళ్లు ఆరు”.  
 
అందరికీ  బై డిఫాల్ట్ ఒకటో ఎక్కం వచ్చేస్తుంది కదా.  రెండో తరగతిలో రెండో ఎక్కంతో మొదలయ్యేవి పాట్లు. “ రెండొకట్ల రెండు, రెండ్రెళ్ళు నాలుగు, రెండు మూళ్ళు ఆరు ...”  అంటూ ఒక ప్రత్యేక రాగం లో మాస్టారు పాడితే మనం కూడా అనాలన్న మాట. వేదాలు నేర్చుకునే వాళ్ళు కూడా అంత చక్కగా  ఒకే రాగంలో మంత్రాలు చదవలేరన్నట్లుగా సాగేది ఆ రాగం.  ఈ  ఎక్కాల రాగాన్ని కర్ణాటక సంగీతంలో ఎందుకు చేర్చలేదో ఇప్పటికీ అర్ధం కాదు. దీని గొప్పతనం ఏమిటంటే ఈ రాగంలో పాడితేనే ఎక్కం సరిగ్గా వచ్చేది. కాని దాని శృతి/రాగం/తాళం ఏమాత్రం మార్చినా ఆ ఎక్కం నోటికి వచ్చేది కాదు. అసలు అది  బుర్రలోకి అంత సులభంగా ఎక్కదు కాబట్టే దానికి “ఎక్కము” అనే పేరు వచ్చి వుంటుంది. 

అసలు ఎక్కాలు అంటే గుణకారాలేనని తెలియడానికి ఓ రెండు మూడు ఏళ్లు పట్టేది. అసలు ఇవి ఎందుకు కంఠతా పట్టాలి మాస్టారూ అని అడిగితే “పెద్దయ్యాక ఉపయోగిస్తాయిరా” అనే సమాధానం వచ్చేది. 

ఇరవై ఇరవైలు దాకా కంఠస్థ పడితే కాని పైక్లాస్ కి పంపము అని ప్రతీ క్లాస్ లోనూ అందరికీ ఓ మాస్ వార్నింగ్ లాంటిది ఇచ్చేవారు.  ప్రతీ ఎక్కం ఇరవై దాకానే ఎందుకుంటుంది, అలాగే పుస్తకంలో  20వ ఎక్కం దాకానే ఎందుకుంటుంది అన్నది అప్పట్లో అంతుచిక్కని ప్రశ్న. బహుశా మన సామర్ధ్యం ఇరవైల దాకానే అని వాళ్ళు నిర్ధారించుకుని వుంటారు.

ఏ పనికైనా వాయిదా పద్ధతి వున్నట్లు రెండో క్లాస్ లో పది పదుల దాకా చాలు అనేవారు. ఒక్కో క్లాసు పెరిగే కొద్దీ పన్నెడు పన్నెడులు, పదహారు పదహార్లు, చివరికి ఇరవై ఇరవైలు దాకా సాగేది. ఎక్కాలు అప్పజెప్పే సమయంలో అందరికీ గుండెలు దడ దడ లాడేవి. అప్పటి దాకా చదివినదే అయినా మాస్టారి దగ్గరకి వచ్చే సరికి  ఆరు ఆర్లు  కాస్తా నలభై రెండు అయిపోయేది. ఓ రెండు బెత్తం దెబ్బలు కొట్టి మళ్ళీ మొట్టమొదటి నించీ చదివి అప్పజెప్పు అని లైన్ లో చివరికి పంపించే వారు. 

నెక్స్ట్ స్టేజ్ లో కూడా ఎక్కాలు మోసం చేసేవి. అన్నీ చక్కగా అప్పచెప్తూ  ఆరార్లు  ముప్ఫై ఆరు అని చెప్పగానే మాస్టారు కోపంగా “ముప్ఫై ఆరా ?”  అని గద్దించే సరికి సెల్ఫ్ డౌట్ వచ్చి నలభై రెండు అనడం, రెండు దెబ్బలు తినడం, మళ్ళీ లైన్ లో చివరికి వెళ్ళడం నిమిషాల్లో జరిగిపోయేది. 

అప్పట్లో వీడియోలు లేవు కానీ ఈ ఎక్కాల క్లాస్ వీడియో తీస్తే ఒక హారర్ రీల్ గా వైరల్ అయిపోయేది. చేతులు దండకట్టి శూన్యంలోకి చూస్తూ మధ్య మధ్య మాస్టారి బెత్తం వైపు బెరుకు చూపులు చూస్తూ అప్పజెప్తుంటే  భలే వుండేది. ఇక ఆడపిల్లలైతే రాగం బ్రేక్ అయిపోయి ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. ఏడెనిమిదులు.. అంటూ కళ్ళు ఆకాశం వైపు పెట్టి దైవ సహాయానికై అర్ధించేవాళ్ళు. దేవుడు మాత్రం సహాయం మాట అటుంచి  రెండు చిన్న బెత్తం దెబ్బలు మాస్టారి ద్వారా ప్రసాదించేవాడు. 

ప్రతీ క్లాస్ లోనూ ఒకరిద్దరు ఐన్స్టీన్ లు వుంటారు కదా. వాళ్ళు ఎప్పుడు కంఠస్థ పడతారో  తెలిసేదికాదు గాని టక టకా అప్పజెప్పేసే వాళ్ళు. ప్రపంచాన్ని జయించినంత గర్వంతో మిగతా వాళ్ళ వైపు జాలిగా చూస్తుండేవారు. మనకి వళ్ళు మండిపోతున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయత. 

సరే, రాగాన్ని ప్రాక్టీస్ చేసో, కొండగుర్తులు పెట్టుకునో, బండగా బట్టీ పట్టో మొత్తానికి  ఇరవై ఇరవైల దాకా  అప్పజెప్పామనుకోండి, వెంటనే మాస్టారు రూల్స్ మార్చేసేవారు. ఈసారి తలక్రిందుగా అప్పజెప్పాలి అనే వారు. అంటే ఇరవై ఇరవైలు నాలుగొందలు  నించి రెండు ఒకట్ల రెండు దాకా అన్న మాట. పట్టుదలగా అదీ సాధిస్తే ఈ సారి రాండమ్ గా అడిగే వారు. పదమూడు పదిహేళ్లెంత అనో, పద్దెనిమిది పదమూళ్లెంత అనో ఆడగ్గానే మనసులో రాగం పాడుకోడానికి టైమ్ పట్టేది. 

 స్కూల్లో మాష్టర్లే కాదు, ఇంటికొచ్చిన చుట్టాలు,పక్కాలు కూడా కనబడితే చాలు “ఎన్నో క్లాస్ రా నువ్వు ?  ఎన్ని ఎక్కాలు వచ్చు ?  పన్నెడు పద్నాలుగులు ఎంత ?”  లాంటి ప్రశ్నలతో వేధించే వాళ్ళు. అందుకే వాళ్ళని తప్పించుకుని తిరగవలసి వచ్చేది.  
  
ఈ ఎక్కాల పుస్తకంలో ఎక్కాలే కాక ఇంకా ఎన్నో వుండేవి. అవి చాలా ఇంటరెస్టింగ్ గా వుండేవి. ప్రతీ  పేజీలోనూ క్రింద ఒక మంచి సుభాషితమో, సామెతో, వేమన పద్యమో వుండేది. అవన్నీ చక్కగా కంఠతా వచ్చేసేవి.  చివరి పేజీలలో అన్ని భాషల లోనూ తెలుగు వారాల పేర్లు,నెలల పేర్లు,ఋతువులు,తిధులు,నక్షత్రాల పేర్లు వుండేవి. తెలుగుతో బాటు తమిళ, హిందీ భాషలలొ కూడా వుండేవి.  భాను వారము, ఇందు వారము .. చిత్తి , వయ్యాశీ.. ఇలాగ. నిజానికి తెలుగు రాష్ట్రాలలో పల్లెటూళ్ళలో వుండేవారికి  దేశంలో తెలుగుతో బాటు వేరే భాషలు కూడా వుంటాయని మొదటి సారి పరిచయం చేసేది ఈ ఎక్కాల పుస్తకమే. అవి చదివేసిన విద్యార్ధులు బహుభాషా కోవిదుల్లా ఫీలైపోయేవారు.  

మొత్తానికి ఈ ఎక్కాల పుస్తకం ఒక మైక్రో బాలశిక్షలా పనిచేసేది. ఇది చదివినందువల్లే అప్పటి పిల్లలకి తెలుగు నెలలు, తిధుల పేర్లు తెలిసేవి. ఇప్పటి బాలలని ఎవరిని అడిగినా ఇవి సరిగ్గా చెప్పలేరని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి. 

ఇంతటి ఘన చరిత్ర వున్న ఎక్కాల పుస్తకం ఈనాటి కాలిక్యులేటర్లు, అబాకస్ లు, టాబ్లెట్ ల ధాటికి తట్టుకోలేక మాయమైపోతోంది. దానితోబాటే మన  పిల్లలకి తెలుగు సంస్కృతిని చిన్నతనం నించీ నేర్పే అవకాశం కూడా మృగ్యమైపోతోంది. ఐ మిస్ యు  -  ఎక్కాల పుస్తకం !!

ఇది చదివిన తర్వాత మీరు కూడా మిస్సవుతున్నారు కదూ? వెంటనే బజారుకెళ్ళి ఓ ఎక్కాల పుస్తకం కొనుక్కుని ఇరవై ఇరవైల దాకా తలక్రిందుగా కంఠస్థం చేయండి. మొబైల్లో  పాడు రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసేకంటే అదే మంచిది. మైండ్  ఆరోగ్యంగా, ఉత్సాహంగా వుంటుంది.

*సేకరణ🙏*
 1323 C.E.. శ్రీరంగం..
తమిళ మాసం వైకాసి సందర్భంగా శ్రీరంగంపై ఢిల్లీ జీహాడీ దురాక్రమణదారులు  దాడి చేశారు. శ్రీరంగం ద్వీపంలో దాదాపు 12,000 మంది హిందువులు ఆలయ రక్షణ కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించారు. జీహాడీ మూకలు ఆలయంపై దాడి చేసి రంగనాథ స్వామి ఆభరణాలు, ఆలయ బంగారం ఎత్తుకెళ్లారు.
బలగాలు విష్ణుమూర్తిని కూడా స్వాధీనం చేసుకోవాలనుకున్నాయి.. ఆ పిశాచ మూక పెరుమాళ్ విగ్రహం కోసం వెతికారు కానీ వైష్ణవ ఆచార్య, పిళ్ళైలోకాచార్య పెరుమాళ్ ను తీసుకొని ఆ జీహాడీ మూకాలను తప్పించుకొని మదురైకి చేరుకున్నారు..
(1323లో శ్రీరంగం నుండి బయలుదేరిన నంపెరుమాళ్ అని పిలువబడే విష్ణుమూర్తి 1371లో మాత్రమే తిరిగి వచ్చారు).
విగ్రహం జాడ తెలియని సుల్తానేట్ జీహాడీ దళాలు ఆలయ అధికారులను చంపి, పిళ్లైలోకాచార్య మరియు నంపెరుమాళ్ కోసం భారీ వేట ప్రారంభించాయి..
బలగాలు ఆచార్యుడిని మరియు ప్రతిమను బంధిస్తాయనే భయంతో, ఆలయ నర్తకి (దేవదాసి) వెల్లాయి దళాల కమాండర్ ముందు ఒక నృత్యాన్ని ప్రదర్శించింది.. 
తద్వారా పిళ్ళైలోకాచార్య చిత్రంతో తప్పించుకోవడానికి సమయం చిక్కింది..
ఆమె నృత్యం గంటల తరబడి సాగి చివరకు సేనాపతిని తూర్పు గోపురం వద్దకు తీసుకెళ్లి నిలువెల్లా మొహంతో నిండిపోయిన ఆ జీహాడీ పిశాచాన్ని కిందకు తోసి  అతన్ని చంపిన తరువాత ఆ అపర మోహినీ అవతారమైన వెల్లాయి రంగనాథర్ నామాన్ని జపిస్తూ తూర్పు ముఖద్వారం యొక్క గోపురం పైనుంచి నుండి దూకి చనిపోయింది.
ఇక్కడ జీహాడీ సేనల దాడులను గురించి తెలుసుకున్న విజయనగర సైన్యాధిపతి కెంపన్న ఆఘమేఘాల మీద శ్రీరంగం చేరుకొని జీహాడీ మూకాలను ఊచకోత కోసి శ్రీరంగాన్ని రక్షించాడు..వెల్లాయి చేసిన త్యాగానికి అచ్చెరువొందిన కెంపన్న ఆమె పేరు మీద ఆవిడ ఏ గోపురంనుంచైతే ఆత్మార్పణం చేసిందో ఆ గోపురానికి వెల్లాయి గోపురం అని పేరు పెట్టాడు.. ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ గోపురం తెల్లగా సున్నం వేస్తారు..ఇప్పుడు దీనిని వెల్లై గోపురం అని పిలుస్తారు..
హిందూత్వం కోసం నాటి మహిళలు సైతం ప్రాణాలకు తెగించి పోరాడిన ఫలితమే నేడు మన హిందువులు అనుభవిస్తున్న ఈ మత స్వేచ్ఛ..
మతం మారి అటువంటి త్యాగధనుల త్యాగాలను అవహేళన చేయకండి..
జైరంగనాధ..
 *_నేటివిశేషం_       
*_𝕝𝕝ॐ𝕝𝕝 ముక్కనుమ - సావిత్రి గౌరీదేవి వ్రతo 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈*
*‘ముక్కనుమ’ నాడు సావిత్రి గౌరీదేవి వ్రతం చేస్తే చాలా మంచిది...!!*
   కనుమ మరుసటి రోజుని *'ముక్కనుమ'* గా పిలుచుకుంటూ వుంటారు.

ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు, సావిత్రి గౌరీదేవి వేదమాత.
ఈ దేవతను గూర్చి వరహ , బ్రహ్మవైవర్త , పద్మ పురాణాలు , దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి.
దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి  బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. 

ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. 
వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు.
ముత్తయిదువులను పేరంటానికి పిలిచి , మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు.
అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు , తాంబూలం వాయనంగా ఇస్తారు. 

ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. 
కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. 
ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది            పేకేటి మణికంఠ శర్మ 9490323624          *_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
 *శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం*

*గురవే సర్వలోకానాం*
*భిషజే భవరోగిణాం*
*నిథయే సర్వవిద్యానాం*
*శ్రీ దక్షిణామూర్తయే నమః*

*ప్రథమం* దక్షిణామూర్తి నామ 
*ద్వితీయం* వీరాసనస్థితం
*తృతీయం* వటవృక్షనివాసంచ 
*చతుర్ధం* సనకసనందనాదిసన్నుతం
*పంచమం* నిగమాగమనుతంచ 
*షష్ఠం* బ్రహ్మజ్ఞానప్రదం
*సప్తమం* అక్షమాలాధరంశ్చ 
*అష్టమం* చిన్ముద్రముద్రం
*నవమం* భవరోగభేషజంశ్చ 
*దశమం* కైవల్యప్రదం
*ఏకాదశం* భాషాసూత్రప్రదంశ్చ  
*ద్వాదశం* మేధార్ణవం ||

*సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు*

Friday, January 16, 2026

 _*శ్రీమల్లికార్జున అష్టోత్తరశతనామావళీ -26 (101 - 104)*_
[శ్రీశైలఖండాంతర్గమ్ - నందీశ్వరేణ ప్రోక్తం]
✍️ శ్రీ శ్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మా
🙏🔱⚜️🔱⚜️🕉️🔱⚜️🔱⚜️🙏

101. _*ఓం యోషిత్పుంభావవిగ్రహాయ నమః*_ 

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి యోషిత్–పుంభావవిగ్రహుడిగా -స్త్రీ–పురుషతత్త్వాల సమన్వయస్వరూపంగా, శివ–శక్తుల ఏకత్వాన్ని ప్రతిబింబించే పరమేశ్వరునిగా భావించబడతాడు. 

🔱 ‘యోషిత్’ అనగా స్త్రీ, ‘పుంభావ’ అనగా పురుష, ‘విగ్రహ’ అనగా రూపం -అనగా స్త్రీ–పురుష తత్త్వాల ఏకరూపత. మల్లికార్జునస్వామి యోషిత్–పుంభావవిగ్రహంగా శివ–శక్తుల ఏకత్వాన్ని, ప్రకృతి–పురుష తత్త్వ సమతుల్యతను, ఆధ్యాత్మిక సమగ్రతను వ్యక్తపరచుతాడు. మల్లికార్జునస్వామి రూపం అద్వైత తత్త్వానికి, ధర్మ స్థాపనలో సమన్వయానికి, జీవ–శక్తి ఏకత్వానికి ప్రతీక. 

🔱 ఈ నామము శివుని సమతుల్య తత్త్వాన్ని, శక్తితో అన్యోన్యతను, ఆత్మ–ప్రకృతి సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి ఏకత్వ తత్త్వానికి కార్యరూపం, స్త్రీ–పురుష తత్త్వాలను జీవనంలో సమన్వయపరచే శక్తి, ఆధ్యాత్మిక సమతుల్యతను అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి యోషిత్–పుంభావవిగ్రహంగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  ఏకత్వాన్ని భక్తుల జీవితాల్లో ధర్మంగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల లింగ–శక్తి తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల సమగ్రత మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
      ‌🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

     
102. _*ఓం స్మేరప్రసన్నవదనాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి స్మేరప్రసన్నవదనుడిగా-చిరునవ్వుతో, శాంతియుతంగా, అనుగ్రహభరితంగా భక్తులను దర్శించే స్వరూపంగా భావించబడతాడు. 

🔱 ‘స్మేర’ అనగా చిరునవ్వు, ‘ప్రసన్న’ అనగా ఆనందభరితమైన, ‘వదన’ అనగా ముఖం. మల్లికార్జునస్వామి స్మేరప్రసన్నవదనుడిగా శాంతిని, ఆనందాన్ని, దయను తన ముఖంలో ప్రతిబింబిస్తూ భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మల్లికార్జునస్వామి రూపం ఆత్మవిశ్రాంతికి, భక్తి పరిపక్వతకు, ధ్యానానికి మార్గం. ఈ నామము శివుని అనుగ్రహ స్వరూపాన్ని, శాంతియుత ధర్మాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు 

🔱 ఈ నామస్మరణతో ఆత్మవిశ్వాసాన్ని, శాంతిని, ఆనందాన్ని పొందగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి ప్రసన్న తత్త్వానికి కార్యరూపం, ఆనందాన్ని జీవనంలో ప్రవహింపజేసే శక్తి, శాంతిని అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి స్మేరప్రసన్న వదనుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  ఆనందాన్ని భక్తుల జీవితాల్లో ధర్మంగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల అనుగ్రహ తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైలశాంత మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
      🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

103. _*ఓం సర్వలోకేశ్వరేశ్వరాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి సర్వలోకేశ్వరేశ్వరుడిగా - అన్ని లోకాలకు అధిపతిగా, దేవతలకే అధిపతిగా, విశ్వాన్ని నియంత్రించే పరమేశ్వరునిగా భావించబడతాడు. 

🔱 ‘సర్వలోకేశ్వరేశ్వర’ అనగా లోకాధిపతులకే అధిపతి.
మల్లికార్జునస్వామి సర్వలోకేశ్వరేశ్వరుడిగా భూత, భవిష్యత్, వర్తమాన లోకాలకు, దేవతలకే, ధర్మ చక్రానికి అధిపతిగా వెలుగుతాడు. మల్లికార్జునస్వామి రూపం ఆధ్యాత్మిక పరిపూర్ణతకు, ధర్మ నియంత్రణకు, సర్వశక్తుల సమాహారానికి ప్రతీక. 

🔱 ఈ నామము శివుని విశ్వాధిపత్యాన్ని, తత్త్వ శ్రేష్ఠతను, ధర్మ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తన జీవితాన్ని విశ్వ ధర్మబద్ధంగా, శాంతియుతంగా నడిపించగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి లోకాధిపత్య తత్త్వానికి కార్యరూపం, ప్రపంచ ధర్మాన్ని జీవనంలో ప్రవహింపజేసే శక్తి, ఆధ్యాత్మిక ప్రభావాన్ని అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి సర్వలోకేశ్వరేశ్వరుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని భక్తుల జీవితాల్లో ధర్మంగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల విశ్వాధిపత్య తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల లోకేశ మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
      🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

104. _*ఓం కల్యాణదాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి కల్యాణదాయుడిగా - భక్తులకు శుభాన్ని, ధర్మాన్ని, మంగళాన్ని ప్రసాదించే స్వరూపంగా భావించబడతాడు. 

🔱 ‘కల్యాణ’ అనగా శుభం, ఆనందం, ధర్మ ఫలితం.
మల్లికార్జునస్వామి కల్యాణదాయుడిగా భక్తుల జీవితాల్లో శుభతను, ఆత్మవికాసాన్ని, ధర్మ మార్గాన్ని ప్రసాదిస్తాడు. మల్లికార్జునస్వామి రూపం ఆనందానికి, శాంతికి, ఆధ్యాత్మిక విజయానికి ప్రతీక. 

🔱 ఈ నామము శివుని మంగళప్రదతను, ధర్మ ఫలదాయకతను, ఆత్మ శ్రేయస్సును ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో శుభ మార్గంలో స్థిరమై, ఆత్మవిశ్వాసాన్ని పొందగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి కల్యాణతత్త్వానికి కార్యరూపం, శుభతను జీవనంలో ప్రవహింపజేసే శక్తి, ఆనందాన్ని అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి కల్యాణ దాయుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  శుభతను భక్తుల జీవితాల్లో ధర్మంగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల మంగళ తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల కల్యాణ మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*

🙏⚜️🔱⚜️🔱🕉️⚜️🔱⚜️🔱🙏
 *శ్రీ శివ మహా పురాణం*
*402.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం) ఇరువది ఒకటవ అధ్యాయం* 

*భద్రగణములు దక్షయజ్ఞములో బీభత్సమును సృష్టించుట* 

*వాయువు ఇట్లు పలికెను:* 

అపుడు విష్ణువు, ఇంద్రుడు మొదలైన ఆ దేవప్రముఖులు అందరు భయభీతులై కంగారుపడి పారిపోయిరి. తమ అవయవమలు ఏవియు చెక్కు చెదరకుండగనే దేవతలు పారపోవుచుండుటను గాంచి, గణాధ్యక్షుడగు వీరభద్రుడు శిక్షార్హులకు శిక్ష పడుట లేదని భావించి, కోపించెను. అపుడు గొప్ప బాహువులు గల వీరభద్రుడు సర్వలయకరుడగు రుద్రుని శక్తిని ప్రతిఫలించే త్రిశూలమును తీసుకొని, పైకి చూస్తూ నోటినుండి నిప్పులను గ్రక్కుచూ, సింహము ఏనుగులను వలె దేవతలను తరిమి గొట్టెను. పారిపోవుచున్న వారి వెనుక పరుగెత్తుచున్న ఆ వీరభద్రుని పరుగు మదించిన ఏనుగుయొక్క పరుగు వలె చాల సుందరముగా, మనోహరముగా నుండెను. తరువాత బలశాలియగు వీరభద్రుడు నీలము బూడిద రంగు మరియు ఎరుపు రంగుల కాంతులను వెదజల్లుతూ, ఏనుగుల గుంపునకు నాయకుడగు మహాగజము పెద్ద సరస్సును వలె, ఆ విశాలమైన దేవసైన్యమును కల్లోలపరచెను. బంగారముతో మరియు ముత్యములతో ప్రకాశించే పెద్దపులి చర్మమును వస్త్రముగా ధరించియున్న వీరభద్రుడు దేవతల గుంపులయందు నరుకుతూ, పగులగొడుతూ, రక్తధారలతో తడుపుతూ, చీల్చుచూ, పచ్చడి చేయుచూ, ఎండుగడ్డిని తగులబెట్టే అగ్నిహోత్రము వలె సంచరించెను. శూలమును చేతబట్టి అక్కడక్కడ మహావేగముతో సంచరించుచున్న వీరభద్రుడు ఒక్కడే అయిననూ, దేవతలకు వేయిమంది వీరభద్రులు ఉన్నట్లుగా కన్పట్టెను. అతిశయించిన బలగర్వముచే యుద్ధము కొరకు ఉరుకులు పెట్టుచున్న భద్రకాళి కూడ నిప్పులు గ్రక్కే శూలముతో యుద్దమునందు దేవతలను చీల్చి చెండాడెను. రుద్రుని కోపమునుండి పుట్టిన వీరభద్రుడు భద్రకాళితో గూడి, చంచలము మరిము పొగతో కప్పబడి బూడిద రంగును కలిగియున్నది అగు జ్వాలతో ప్రకాశించే ప్రళయకాలాగ్ని వలె శోభిల్లెను. ఆ సమయములో యుద్ధములో దేవతలను తరిమి గొట్టిన భద్రకాళి కల్పాంతమునందు జగత్తునంతనూ తగులబెట్టే ఆదిశేషుని విషాగ్నిజ్వాలవలె ప్రకాశించెను. రుద్రగణములలో అగ్రేసరుడగు వీరభద్రుడు ఆ సమయములో గుర్రములతో సహా సూర్యుని మరియు రుద్రులను శీఘ్రముగా ఎడమకాలితో అవలీలగా తన్నెను. జితేంద్రియుడగు వీరభద్రుడు కత్తలతో అగ్నిని, పట్టిశములతో యముని కొట్టెను.

ఆయన గట్టి శూలముతో రుద్రులను, గట్టి ముద్గరములతో వరుణుని, పరిఘలతో నిరృతిని, స్వయముగా గొడ్డళ్లను చేతపట్టి వాటితో వరుణుని కొట్టెను. వీరుడగు ఆ గణాధ్యక్షుడు యుద్ధములో సమస్తదేవతాగణములను మరియు శంభునకు విరోధులగు మునులను వెనువెంటనే అవలీలగా దనుమాడెను. ఇంతేగాక, తరువాత ఆ వీరభద్రదేవుడు దేవతలకు తల్లియగు సరస్వతియొక్క మిక్కిలి అందమైన ముక్కు కొనను వ్రేలిగోటితో త్రుంచి వేసెను. అతడు అగ్నియొక్క దండమువంటి చేతిని గొడ్డలితో నరికెను. దేవమాతయగు అదితియొక్క నాలుకను కొనలో రెండు అంగుళములను అతడు త్రుంచివేసెను. ఇంతే గాక, ఆ వీరభద్రదేవుడు స్వాహాదేవియొక్క కుడి ముక్కుపుటమును, ఎడమ స్తనాగ్రమును వ్రేలిగోటితో దునిమి వేసెను. ఆయన పూషమొక్క ముత్యాల వరుస వలె ప్రకాశించే దంతముల వరుసను ధనస్సుయొక్క అగ్రభాగముతో పగులగొట్టగా, ఆ కారణముగా అతని పలుకులలో స్పష్టత లోపించెను. తరువాత వీరభద్రదేవుడు కాలి బొటన వ్రేలితో అవలీలగాక్షణకాలముతో చంద్రుని పురుగును వలె తొక్కి పెట్టి నేలపై రాపాడించెను. వీరిణి (దక్షుని భార్య) ఆక్రోశించుచుండగా, వీరభద్రుడు మహాకోపముతో దక్షుని తలను దునుమాడి, దానిని భద్రకాళికిచ్చెను. ఆ దేవి మహానందముతో తాటిపండువంటి ఆ తలను తీసుకొని యుద్ధరంగములో బంతులాటను ఆడెను.

తరువాత దక్షుని భార్యయగు సోమిదేవమ్మను, దుష్టమగు శీలము గలభార్యలను భర్తలు వలె, గణాధ్యక్షులు కాళ్లతో మరియు చేతులతో కొట్టిరి. బలవంతులు, సంహము యొక్క పరాక్రమము గలవారు నగు గణాధ్యక్షులు అరిష్టనేమిని, చంద్రుని, ధర్మప్రజాపతిని, అనేక పుత్రులు గల అంగిరసుని, కృశాశ్వుని మరియు కాశ్యపుని కంఠమునందు పట్టుకొని లాగి పరుషమగు వాక్కులతో భయపెడుతూ, తలపై పిడికిళ్లతో మోదిరి. కలియుగమునందు విటులు కులస్త్రీలను బలాత్కరించు విధముగనే, భూతములు మరియు వేతాళములు భార్యలను మరియు కోడళ్లను బలాత్కరించిరి. పగులగొట్టబడిన కలశమలు గలది, విరుగగొట్ట బడిన యూపములు గలది, నశించిన పండుగ వాతావరణము గలది, తగులబెట్టబడిన ప్రధానశాల గలది, విరుగగొట్టబడిన ద్వారములు ఆర్చీలు గలది, పెకిలంచి వేయబడిన దేవబృందములు గలది, చితకగొట్టబడిన తపశ్శాలురు గలది, సద్దు మణిగిన వేదఘోషలు గలది, చల్లారిన జనసమ్మర్దము గలది, పీడింపబడుచున్న స్త్రీల ఆక్రందనలతో నిండినది, పాడుచేయబడిన సకలసామగ్రి గలది అగు ఆ యజ్ఞవాటిక పీడకు గురియై అరణ్యము వలె శూన్యముగా నుండెను. శూలముచే వేగముగా పొడువబడిన నరుకబడిన చేతులు మరియు వక్షఃస్థలములు గలవారు, పెరికివేయబడిన తలలు గలవారు అగు దేవశ్రేష్ఠులు నేలపై పడియుండిరి. ఆ దేవతలు వేల సంఖ్యలో సంహరించబడి నేలపై బడియుండగా, క్షణకాలములో గణాధ్యక్షుడగు వీరభద్రుడు ఆహవనీయాగ్ని (హోమములను ప్రధానముగా చేసే అగ్ని; మూడు అగ్నులలో ఒకటి) వద్దకు వచ్చెను.

యజ్ఞశాలలో ప్రవేశించిన ప్రళయకాలాగ్నిని బోలియున్న ఆ వీరభద్రుని చూచి మరణము వలన భయపడిన యజ్ఞపురుషుడు మృగదేహమును ధరించి పరుగెత్తెను. ఆ వీరభద్రుడు దృఢమైన నారిత్రాటియొక్క ధ్వనిచే భయమును కలిగించుచున్న పెద్ద ధనస్సును టంకారము చేయుచూ, పారిపోవుచున్న ఆ యజ్ఞపురుషుని వెనుక బాణములను ప్రయోగిస్తూనే పరుగెత్తెను. చెవి వరకు పూర్తిగా నారిత్రాటిని లాగి విడిచినప్పుడు ఆ ధనస్సు చేయు ధ్వని మేఘగర్జనను పోలియున్నది. నారిత్రాడు స్వర్గలోకము ఆకాశము మరియు భూమి అంతటా కంపించునట్లు చేయుచుండెను.  ఆ పెద్ద ధ్వనిని విని తాను మరణించినాననియే తొట్రుపాటు పడుచున్న పాదములు గలవాడై వణికి పోతూ, కాంతిని కోల్పోయి లేడి రూపములో పరుగిడుతున్న ఆ యజ్ఞపురుషుని తలను వీరభద్రుడు నరికి వేసెను. సూర్యునినుండి పుట్టిన యజ్ఞపురుషుడు ఈ విధముగా అవమానింబడుటను గాంచిన విష్ణువు మహాకోపమును పొందినవాడై యుద్ధమునకు సన్నద్ధుడాయెను. సకలపక్షలకు రాజు, పాములను భక్షించువాడు అగు గరుడుడు వంగిన సంధి గల భుజముతో విష్ణువును మహావేగముగా మోయుచుండెను. దేవతలలో మరణించగా మిగిలిన వారు ఇంద్రుని ముందిడుకొని ప్రాణములను వీడుటకు సంసిద్ధులైనారా యన్నట్లు ఆ విష్ణువునకు సహాయపడుచుండిరి. రుద్రగణములకు అధిపతి, సింహము వంటి వాడు అగు వీరభ్రదుడు విష్ణువుతో కూడియున్న దేవతలను చూచి, నక్కలను చూచిన సింహమువలె భయము లేనివాడై, నవ్వెను.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో వీరభద్రుడు దేవతలను శిక్షించుటను వర్ణించే ఇరువది ఒకటవ అధ్యాయము ముగిసినది.*
 💐33శ్రీ లింగ మహాపురాణం💐

🌼క్షుప దధీచిల సంవాదం🌼

#ముప్పై మూడవ భాగం#

సనత్కుమారుడు నందిని "మహాత్మా! శివ భక్తుడైన దధీచి మహర్షి విష్ణువుని జయించాడు అని చెప్పారుకదా.ఆసంఘటన ఎందుకుజరిగిందిఎలాజరిగిందివివరించండి" అని అడిగాడు.

నంది వివరించ సాగాడు :

"పూర్వము బ్రహ్మదేవుని పుత్రుడైన క్షుపుడు తన బల పరాక్రమాలతో భూమండలాన్ని సుక్షత్రియుడైన మహారాజుగా పరిపాలిస్తున్నాడు. దధీచి మహర్షితో క్షుపునికి స్నేహము ఏర్పడింది. ఇరువురు అనేక ఆధ్యాత్మిక, వేద శాస్త్ర సంబంధ విషయాలపైచర్చించుకునేవారు
ఒకసారి వారిరువురికి "రాజు అందరికన్నాగొప్పవాడు.ప్రజలకు దేవుడి వంటివాడు" అనే విషయం చర్చకు వచ్చింది. క్షుపుడు"క్షత్రియుడుఅష్టదిక్పాలకుల అంశలతో,మహావిష్ణువు అంశంతో జన్మించి రాజుగా ప్రజలను పరిపాలిస్తాడు.ప్రజలు రాజునిదేవునిగాభావించిపూజిస్తారు. కనుక రాజు గొప్పవాడు" అని వాదించాడు.

దధీచి మహర్షికి  క్షుపుని వాదన నచ్చలేదు.  "మానవులందరు బ్రహ్మదేవుడు సృష్టించినవారే! నీవే స్వయంగా బ్రహ్మదేవుని నాసిక నుంచి తుమ్ము ద్వారా జన్మించావు. బ్రహ్మదేవుడు వేదాలు, వేదవిధానాలు, ధర్మ వ్యాప్తికి,పరిరక్షణకుమానవులను నాలుగు వర్ణాలుగా చేశాడు. ఒకరు గొప్ప, మరోకరు తక్కువ లేదు" అంటూ మందలిస్తున్నట్టు క్షుపునికి తలపై  ఎడమచేతితో కొట్టాడు.

క్షుపునికి కోపం వచ్చింది. రాజు అని చూడకుండా తనపై చేయి చేసుకున్నందుకు ఇంద్రుడు ప్రసాదించిన వజ్రాయుధంతో దధీచిని రెండు ఖండాలుగా ఖండించి వెళ్లి పోయాడు.శరీరం రెండు భాగాలై మరణించబోయే ముందు దధీచి తన గురువైన శుక్రచార్యుని తలచుకొన్నాడు.  శుక్రచార్యుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై దధీచిమహర్షిశరీరపు రెండు భాగాలను కలిపిఒకటిగా చేసి మృతసంజీవని విద్యతో ప్రాణాలు పోసి బ్రతికించాడు.

పునర్జీవుతుడైతనకునమస్కరించినదధీచినిచూసి"నాయనా!దధీచీపరమేశ్వరునిఆరాధించి ఎవరు నిన్ను సంహరించకుండా మృత్యువుపైవిజయంసంపాదించు!శివభక్తులకుమృత్యుభయం ఉండదు.ఈశ్వరుడుఅనుగ్రహంతో నాకు ప్రసాదించిన మృత సంజీవని విద్య ద్వారానే మరణించిననిన్నుబ్రతికించగలిగాను. మృత సంజీవని అయిన త్ర్యంబకమంత్రాన్నిఉపదేశిస్తాను" అని ఉపదేశించాడు.

మృత్యుంజయ మహా మంత్రం :

" త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం
  ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్"

ముల్లోకాలకు తండ్రి ఐనవాడు, జీవుల ప్రాణమనే సుగంధం కలిగినవాడు, దేవతలకు, జీవులకు పుష్టిని (ప్రాణశక్తి) పెంపొందించేవాడు,మృత్యువన్నదేలేనివాడుఅయినపరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మహా దేవుడు దోసతీగ నుండి పండిన దోసపండు విడిపోయినట్లు, మృత్యుపాశం నుండి నన్ను విడిపోయేటట్టు చేయు గాక"

దధీచి మహర్షీ! శివ సన్నిధిలో మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించిన నీరు త్రాగి, మృత్యుంజయ మంత్రంతో హోమం చేస్తే అపమృత్యు (అకాల మృత్యు) భయం ఎన్నటికి కలుగదు" అని శుక్రచార్యుడు బోధించి వెళ్లి పోయాడు.

దధీచి మహర్షి శుక్రచార్యుడు చెప్పినట్టు మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ హోమం చేసి శివానుగ్రహంపొందాడు.ఆయన శరీరంఅవధ్యత్వాన్ని(ఖండించబడకుండా ఉండటం),  శరీర అస్థికలు (ఎముకలు) వజ్రం లాగా ధృడత్వాన్ని పొందాయి.

క్షుపుడి దగ్గరకు వెళ్లి తనను సంహరించినందుకు ప్రతిగా క్షుపుని తలపైకాలితోతన్నాడు. క్షుపుడు తన వజ్రాయుధాన్ని దధీచి మహర్షి వక్షస్థలం పై ప్రయోగించాడు.వజ్రాసమానమైనదధీచిశరీరంతగిలివజ్రాయుధంవంకరపోయింది.శివానుగ్రహం పొందిన దధీచి మహర్షిని తను ఏమి చేయలేనని తెలుసుకునిక్షుపుడుఅవమానంతో అడవికి వెళ్లి తన ఆరాధ్య దైవమైన మహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేశాడు. 

చాలా కాలం కఠోర తపస్సు తరువాత విష్ణువు ప్రసన్నుడై ప్రత్యక్షమైనాడు. క్షుపుడు విష్ణు స్తుతి చేసి ఆయన పాదాలకు ప్రణమిల్లాడు. నారాయణుడు ప్రసన్నుడైవరంకోరుకోమన్నాడుక్షుపుడు చేతులు జోడించి "ప్రభూ! నా స్నేహితుడైన దధీచి మహర్షికి నాకు వాగ్వివాదం జరిగింది. నన్ను రాజునని చూడకుండా అవమానిస్తే నేను శిక్షించాను.అతనుశివానుగ్రహంతో వజ్రకాయుడై వచ్చి నన్ను కాలితో తన్నాడు. "శివానుగ్రహం పొందినవాడిని. నన్ను ఏమి చేయలేవు" అని గర్వంగా వెళ్లిపోయాడు.స్వామీ! నేను అతనినిఎలాగైనాఓడించాలి. అందుకు తగిన శక్తిసామర్థ్యాలు ఇచ్చే వరం ప్రసాదించుము"  అని కోరాడు.

విష్ణువు మనస్సులో శివుని స్మరించి "రాజా! శివభక్తులు దేనికిభయపడరు.శివానుగ్రహం వారినిసదారక్షిస్తుంది.శివభక్తితో దధీచి మహర్షి సంహరింప లేని వజ్రశరీరం పొందాడు. కనుక దధీచిని నీవు జయించడం అవ్వదు.  అయినాభక్తిశ్రద్థలతో నన్నుకొలిచావుకనుకనీతరపున నేను వెళ్ళి నీ విజయం కోసం ప్రయత్నిస్తాను"అనిఅదృశ్య
మయ్యాడు. క్షుపుడు తన నగరానికి వెళ్లాడు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.

🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
 1️⃣1️⃣9️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

మొదటిది ప్రణిపాతము. జ్ఞానము నేర్చుకోడానికి గురువు దగ్గరకు వెళ్లిన సాధకుడు ముందు గురువుగారికి సాష్టాంగ నమస్కారము చేయాలి. దానినే ప్రణిపాతము అని అంటారు. గురువుకు సాష్టాంగ నమస్కారము చేస్తున్నాడు అంటే సాధకుడు తనలో ఉన్న గర్వము, అహంకారము, దర్పము, అభిమానము అంతా విడిచిపెట్టినట్టు లెక్క. లేకపోతే గురువు గారి పాదములకు నమస్కరించడు. దేహాభిమానము ఉన్నంత వరకు విద్య రాదు. గురువు చెప్పినది తలకెక్కదు. ఎందుకంటే "ఈ గురువుకు ఏం తెలుసు. నా కన్నా ఈయనకు బాగా తెలుసా?" అని మనసులో అహంభావము, అభిమానము ఉంటే, ఆ శిష్యుడు ఏమీ నేర్చుకోలేడు. కాబట్టి సాధకుడికి వినయము ముఖ్యము. పోనీ నిలబడి దండంపెడితే చాలదా... నేల మీద సాష్టాంగ పడాలా... అని కొందరు అనుకుంటారు. గురువుగారి పాదములను తాకడం వలన అహంకారము నశించి వినయం, శ్రద్ధ గురువుగారి మీద భక్తి పెరుగుతాయి. గురువు ఎప్పుడూ శిష్యుడు తనకు ఇలా నమస్కారం చెయ్యాలి అని అనుకోడు. శిష్యుడిలో ఉన్న వినయము, విధేయత, భక్తి, విశ్వాసము, గురువు మీద నమ్మకము ఈ సాష్టాంగ ప్రణామంతోనే తెలిసిపోతాయి.

ఇంకా వివరంగా చెప్పాలంటే మానవుడు గొప్ప వాడు కావచ్చు, చక్రవర్తి కావచ్చు. గొప్ప అధికారి కావచ్చు. అపరిమితమైన అధికారాలు కలిగి ఉండవచ్చు కాని భగవంతుని ముందు, గురువుల ముందు, తత్వవేత్తల ముందు సామాన్యుడే, పరమాత్మ దృష్టిలో ఈ ప్రాపంచికమైన, వ్యావహారికమైన పదవులకు, హోదాలకు విలువ లేదు. ఎందుకంటే ఇవన్నీ ఈ శరీరానికి చెందినవి. పైగా కొంత కాలానికి పరిమితం అయ్యాయి. ఈ శరీరం శాశ్వతంకాదు. ఈ పదవులు శాశ్వతం కాదు. శాశ్వతమైన పరమాత్మ ముందు అశాశ్వతములైన పదవులకు హోదాలకు విలువ లేదు. బ్రహ్మ బలమే నిజమైన బలము హూదా, అధికారము అన్నీ.

ఉదాహరణకు విశ్వామిత్రుడు తనకు ఎంతో బలగము, హోదా, కీర్తి, పరాక్రమము ఉండి కూడా వశిష్టుని, బ్రహ్మ బలాన్ని గెలువలేకపోయాడు. తుదకు వశిష్టునికి సాష్టాంగ నమస్కారము చేసి ఆయనచేత బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాడు. పూర్వ కాలంలో కూడా చక్రవర్తులు, రాజులు తమ తమ రాణులతో కలిసి వనములకు వెళ్లి అక్కడ ఉన్న మునులను దర్శించి వారికి ప్రణిపాతము చేసి వారి ఆశీర్వచనములను పొందారు అని వింటూ ఉంటాము. ఈ రోజుల్లో కూడా ధనవంతులు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు, ఉన్నత పదవులలో ఉన్న వారు రమణ మహర్షికి పరమాచార్యకు ప్రణిపాతము చేసిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి గురువుల ముందు గర్వమును అహంకారమును వదిలిపెట్టి ప్రణిపాతము చేయాలి.

ఇంక రెండవది పరిప్రశ్నేన. గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామము చేసిన తరువాత తనలో ఉన్న జిజ్ఞాసను, తపనను ఎలా ప్రకటించాలి అంటే గురువు గారు ప్రసన్నుడిగా ఉండగా చూచి, ఆయనను తనలో ఉన్న సందేహములను గురించి ప్రశ్నించాలి. దానినే పరిప్రశ్న. కటువుగా కాకుండా, వాద ప్రతివాదముల రూపంలో కాకుండా, వితండ వాదంగా కాకుండా, సౌమ్యంగా, భక్తిభావంతో గురువుగారిని ప్రశ్నించాలి. తానే వేయబోయే ప్రశ్న గురువు గారిని అడగవచ్చునా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి అప్పుడు అడగాలి. ఆయన ఇచ్చిన సమాధానములను భక్తితో అర్థం చేసుకోవాలి. అంతే కానీ "నీకేం తెలుసు నీ కన్నా నాకే బాగా తెలుసు" అనే భావన మనసులో రానీయకూడదు.

మూడవది.. సేవయా... అంటే గురువుకు సేవ చేయాలి. అది ఈ రోజుల్లో సాధ్యం అయ్యేది కాదు. పూర్వము గురుకులములో ఉండే శిష్యులు గురువుకు సేవ, శిశ్రూష చేసే వాళ్లు. సేవ చేయడం అంటే గురువుకు దగ్గర అవడం. అప్పుడు గురువు గారికి నీ తత్వము, నీ స్వభావము అర్ధం అవుతుంది. నీకు ఎలా చెబితే అర్థం అవుతుందో గురువు గారికి అర్థం అవుతుంది. అంతే కాకుండా, గురువుగారి అనుగ్రహము, కటాక్షము పొందాలంటే శుశ్రూష చేయాలి. గురువుగారి కటాక్షము లేనిదే ఆధ్యాత్మికంగా శిష్యుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ అని అన్నారు. గురు సేవ, దైవ సేవ రెండు ప్రతి మానవుడికి అవసరమే. కాబట్టి గురువు గారి వద్ద విద్య నేర్చుకోడానికి ప్రణిపాతము, సేవ, పరిప్రశ్న గురించి పరమాత్మ ఈ శ్లోకంలో వివరించాడు.

మరి గురువు బాధ్యత ఏమిటి. గురువు శిష్మునికి ఏమి ఉపదేశించాలి అని అంటే ఉపదేక్ష్యన్తి అంటే గురువు శిష్యునికి జ్ఞానమును ఉపదేశిస్తాడు. అజ్ఞానము అనే అంధకారంలో ఉన్న వాడిని జ్ఞానము అనే వెలుగులోకి తీసుకొని వెళతాడు. (అడిగాడు కదా అని తనకు తెలిసీ తెలియని విషయాలు అన్నీ చెప్పి, శిష్ముడిని మరింత అంధకారంలోకి నెట్టకూడదు) ఏది సత్యము ఏది అసత్యము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అనే విషయాన్ని ఉపదేశిస్తాడు. గురువు గారు ఉపదేశించిన జ్ఞానమును శ్రద్ధాభక్తులతో విని, ఆకళింపు చేసుకొని, ఆచరించడం శిష్యుడి కర్తవ్యము. ఈ మొత్తం ప్రక్రియను జ్ఞానయజ్ఞము అని అంటారు.

ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ముందు శ్లోకాలలో అర్జునుడు కృష్ణునితో కృష్ణా నాకు ఏమీ తోచడం లేదు. నా బుద్ధి పనిచేయడం లేదు. నన్ను నీ శిష్యునిగా స్వీకరించి నాకు జ్ఞానమును ఉపదేశించు అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి జ్ఞాన కర్మయోగముల గురించి చెప్పి ఇంకా పైవిధంగా అన్నాడు. అర్జునా! సాధకుడు మంచి గురువు వద్దకు పోయి ఆయనకు ప్రణిపాతము చేసి ఆయనకు సేవ చేసి జ్ఞానమును పొందాలి అని అన్నాడు. అంటే జ్ఞానము కేవలము గురుశిష్య పరంపరగావస్తుందే కానీ, స్వంతంగా శాస్త్రములను అధ్యయనం చేయడం వలన రాదు అని చెప్పాడు కృష్ణుడు.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P275
 _*శ్రీమల్లికార్జున అష్టోత్తరశతనామావళీ -25 (97-100)*_
[శ్రీశైలఖండాంతర్గమ్ - నందీశ్వరేణ ప్రోక్తం]
✍️ శ్రీ శ్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మా
🙏🔱⚜️🔱⚜️🕉️🔱⚜️🔱⚜️🙏

_*97. ఓం శరణాగతకామదుహే నమః*_

🔱 ఈ నామమ. ద్వారా మల్లికార్జునస్వామి శరణాగతకామదుహుగా - శరణాగతుల కోరికలను తీరుస్తూ, భక్తులకు ఆశ్రయంగా, దయామయ స్వరూపంగా భావించబడతాడు. 

🔱 ‘శరణాగత’ అనగా ఆశ్రయాన్ని కోరినవాడు, ‘కామదుహ’ అనగా కోరికలను తీరుస్తున్న దివ్యశక్తి.
మల్లికార్జునస్వామి శరణాగతకామదుహుగా భక్తుల ఆశయాలను, ధర్మ కోరికలను, ఆత్మవికాస తపస్సును తీర్చే పరమేశ్వరునిగా వెలుగుతాడు. మల్లికార్జున స్వామి స్వరూపం దయకు, ఆశ్రయానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. 

🔱 ఈ నామము శివుని శరణాగత రక్షణ తత్త్వాన్ని, భక్తి ఫలదాయకతను, ఆధ్యాత్మిక అనుగ్రహాన్ని ప్రతిబింబి స్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తన కోరికలను ధర్మబద్ధంగా తీర్చుకునే మార్గాన్ని పొందగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి శరణాగత తత్త్వానికి కార్యరూపం, ఆశయాలను కార్యరూపం లోకి తీసుకెళ్లే శక్తి, దయను అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి శరణాగత కామదుహుగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని భక్తుల జీవితాల్లో అనుగ్రహంగా మారుస్తుంది.ఇది శివ–శక్తుల ఆశ్రయ–ఫలదాయక తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైలదయా మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

_*98. ఓం శ్రీశైలశిఖరావాసవిలాసినే నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి శ్రీశైలశిఖరావాసవిలాసిగా-శ్రీశైల శిఖరంలో వెలిగే, లీలామయంగా విహరించే, భక్తులకు దర్శనమిచ్చే స్వరూపంగా భావించబడతాడు. 

🔱 ‘శిఖరావాస’ అనగా శిఖరంలో నివాసం, ‘విలాసి’ అనగా లీలామయంగా విహరించేవాడు.
మల్లికార్జునస్వామి శ్రీశైలశిఖరావాసవిలాసిగా శ్రీశైల పర్వత శిఖరంలో, శక్తితో సమన్వయంగా, ధర్మాన్ని, భక్తిని, లీలను ఆవిష్కరిస్తూ వెలుగుతాడు. మల్లికార్జునస్వామి స్వరూపం ఆధ్యాత్మిక శిఖరానికి, భక్తి పరిపక్వతకు, శివ–శక్తుల ఏకత్వానికి ప్రతీక. 

🔱 ఈ నామము శివుని శ్రీశైల స్థితిని, లీలామయ స్వరూపాన్ని, భక్తి–ధ్యాన మార్గాన్ని ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి శిఖరావాస తత్త్వానికి కార్యరూపం, శక్తిని శిఖర స్థితిలో అనుభూతిగా ప్రవహింపజేసే ప్రకృతి, లీలను భక్తి రూపంలో అనుభూతి పరచే శక్తి. మల్లికార్జునస్వామి శ్రీశైలశిఖరావాసవిలాసిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  లీలను భక్తుల జీవితాల్లో ధర్మంగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల శ్రీశైల స్థితి తత్త్వ సమన్వయాన్ని, శిఖర దర్శన మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

_*99. ఓం విశ్వమంగలాయ నమః*_ 

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి విశ్వమంగలుడిగా -సర్వ జగత్తుకు మంగళాన్ని ప్రసాదించే స్వరూపంగా, శుభతత్త్వానికి ప్రతీకగా భావించబడతాడు. 

🔱 ‘విశ్వ’ అనగా ప్రపంచం, ‘మంగళ’ అనగా శుభం, ఆనందం, ధర్మం. మల్లికార్జునస్వామి విశ్వమంగలుడిగా ప్రపంచానికి శుభాన్ని, ధర్మాన్ని, శాంతిని ప్రసాదించే పరమేశ్వరునిగా వెలుగుతాడు. మల్లికార్జునస్వామి స్వరూపం ఆధ్యాత్మిక శుభతకు, ధర్మ స్థాపనకు, భక్తి పరిపక్వతకు ప్రతీక. ఈ నామము శివుని విశ్వహిత తత్త్వాన్ని, శాంతి–ధర్మ సమన్వయాన్ని, ఆత్మవికాస మార్గాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తన జీవితాన్ని మంగళమయంగా, ధర్మబద్ధంగా నడిపించగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి మంగళతత్త్వానికి కార్యరూపం, శుభతను జీవనంలో ప్రవహింప జేసే శక్తి, ఆనందాన్ని అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి విశ్వమంగలుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  శుభతను భక్తుల జీవితాల్లో ధర్మంగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల విశ్వహిత తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల మంగళ మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
      🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷
   
_*100. ఓం బ్రహ్మేంద్రాది సురోపాస్యాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి బ్రహ్మేంద్రాది సురోపాస్యుడిగా -బ్రహ్మ, ఇంద్ర, ఇతర దేవతల ఆరాధ్య స్వరూపంగా, తత్త్వబలంలో శ్రేష్ఠుడిగా భావించబడతాడు. ‘ఉపాస్య’ అనగా ఆరాధించదగినవాడు, ‘సుర’ అనగా దేవతలు.
మల్లికార్జునస్వామి బ్రహ్మేంద్రాది సురోపాస్యుడిగా దేవతలే ఆరాధించే తత్త్వముగా, వేదసారానికి మూలంగా, ఆధ్యాత్మిక శ్రేష్ఠతకు ప్రతీకగా వెలుగుతాడు. మల్లికార్జునస్వామి రూపం దేవతల ధ్యానానికి, వేదమార్గానికి, తపస్సుకు మార్గం. 

🔱 ఈ నామము శివుని దేవతలలో శ్రేష్ఠతను, ఆరాధ్యతను, ఆధ్యాత్మిక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో తపోమార్గంలో స్థిరమై, ఆత్మజ్ఞానాన్ని పొందగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి ఉపాస్య తత్త్వానికి కార్యరూపం, ఆరాధనను అనుభూతిగా మార్చే ప్రకృతి, ధ్యానాన్ని జీవనంలో ప్రవహింపజేసే శక్తి. మల్లికార్జునస్వామి బ్రహ్మేంద్రాది సురోపాస్యుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని భక్తుల జీవితాల్లో అనుభూతిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల ఆరాధ్యత తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల తపో మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*


🙏⚜️🔱⚜️🔱🕉️⚜️🔱⚜️🔱🙏
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(291వ రోజు):--
       ప్రశ్న :- అందరూ ఒకేవిధమైన ప్రయత్నం చేసి నట్లనిపించినా, ఈ సత్యాన్ని కొందరు మాత్రమే గ్రహిం చడం, మిగిలిన వారు గ్రహించక పోవడం ఎందుకు జరుగుతోంది?
       స్వామీజీ :- ప్రయత్నం మనో పరి కరాన్ని సిద్ధం చేయటం కోసం చెయ్యాలి. ఆత్మ నిగ్రహాన్ని అతిగా వాడితే, ప్రకృతికి విరుద్ధంగా పోరాడి నట్లే. అణగద్రొక్క కూడదు. అణగద్రొక్కడం పరిపూర్ణత అనిపించు కోదు. మనసునూ, బుధ్ధి నీ అధిగమించ డానికి నిజంగా ప్రయత్నించ డానికి ముందు, మొదట వాటిని సిద్ధపరచాలి. ఉత్త మోత్తమమైన సందేశాన్ని అందు కొనే టందుకు వీలుగా మనోపరికరాన్ని శృతి చేయాలి. అలా చెయ్యకపోతే, ఫలితం అంతరిక్షం లోకి క్షిపణులను పంపడానికి మన దేశంలో చేస్తున్న ప్రయత్నాలలా ఉంటుంది. అంతా సిద్ధమౌతారు, మీట నొక్కుతారు, పెద్ద వెలుగు మెరుపులా మెరుస్తుంది, పొగ గాలి లోకి లేస్తుంది. కాని, పొగ పోయాక చూస్తే, క్షిపణి నేలమీదనే ఉంటుంది! 
      అమెరికాలో నైతే అవి అంతరిక్షం లోకి పరుగులు తీస్తాయి ; ఇక్కడ మాత్రం అవి చేసేది పెద్ద చప్పుడు, మెరుపు, పొగ మాత్రమే. తేడా ఎందులో ఉంది ? పరికరాన్ని సిద్ధం చేయటానికి చేసిన ప్రయత్నం లోనూ సాఫల్యం కోసం పడిన శ్రమలోనూ ఉంది. సరైన ప్రయత్నం చేస్తే, ఇక్కడ కూడా అవి సరిగానే ఎగురుతాయి. అందుచేత, కావలసినది పరిపూర్ణ మైన, పరిశుద్ధమైన క్రమశిక్షణతో ఉన్న మనసు. 
       ప్రశ్న :- నేను నాలుగు సంవత్స రాల నుంచీ ధ్యానం చేస్తున్నాను. ఐనప్పటికీ, ఉపన్యాసాల్లో మీరు చెప్తున్న సత్యం గురించి నాకు కొంచ మైనా తెలియదు. నా కాలం వృధా చేశానని నాకిప్పుడని పిస్తోంది. నా మనసును తగినంతగా పరిశుద్ధం చేయక పోవటమే దీనికి కారణమా? 
        స్వామీజీ :- అదే కాకపోవచ్చు. మనసును ప్రాపంచిక విషయాల నుంచి వేరు చేశారు కాని, దానిని ఎటువైపు మరల్చాలో మీకు తెలియ లేదు. మీ మార్గం నిర్దేశించు కోడానికి మీరు వెతుకుతున్నది దేనికోసమో మీకు తెలియాలి. ఎలా ఎగరాలో ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీరు! 
       ప్రశ్న :- క్షిపణి ఎప్పుడు ఎగురు తుందనేదే ప్రశ్న. 
        స్వామీజీ :- అది జరిగినప్పుడే! భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఈ వస్తు ప్రపంచ మంతటికీ ఆధారభూత మైన దేమిటో సూచించాడు. ఆ ఏకత్వాన్ని మీరు గ్రహించినపుడు క్షిపణి యొక్క మొదటి స్థాయిని ప్రయోగించి నట్లు. ఉన్నత స్థానాన్ని చేరినపుడు, ప్రపం చం లోని వస్తువులన్నీ ఒకటిగానే కనిపిస్తాయి ; ఇది క్షిపణి యొక్క రెండవ స్థాయిని ప్రయోగించి నట్లు. పూర్తి గ్రహింపు కలిగినపుడు, మీరు రెండు తీరుల్లోనూ ప్రపంచాన్ని చూడ గలుగుతారు : ఒక్కనిలో సర్వమూ, సర్వంలో ఒక్కడూ. 
      ప్రశ్న :- ఈవిధమైన చిత్రీకరణలో 'భగవంతుని కృప' అనే భావనకు స్దాన మెక్కడుంది ? 
       స్వామీజీ :- భగవంతుని కృప మనందరికీ సమానం గానే అందుతోంది. పెట్రోలు చాలానే ఉన్న ప్పటికీ కారు దారిలో ఆగిపోతే, పెట్రోలును నిందించ గలమా ? నిందించలేము. సమస్య ఉన్నది వాహనం తోనే. 
        సూర్యరశ్మి అంతటా ఉంది - గులాబి తోట, కూస్తున్న కోయిల, దోమ, చెత్తకుప్ప - వీటన్నిటికీ వెలుతురు నిస్తూ, జాతి వర్ణ భేదాన్ని, ప్రయోజనాన్నీ పట్టించు కోకుండా. సూర్యుని కృప ఉంది. కాని మీరు ఇంట్లో తలుపులూ, కిటికీలూ మూసుకొని కూర్చొని, చీకటిగా ఉంద ని ఫిర్యాదు చేస్తున్నారు. కిటికీలు తెరవండి ; సూర్యరశ్మి దానంతటదే లోనికి వస్తుంది. 
       ప్రశ్న:- ఈ దివ్యమైన స్థితియొక్క అనుభవం మీకు ఎప్పుడూ ఉంటుందా ?
       స్వామీజీ :- అనుభవం శరీర మనో బుద్దులకు సంబంధించినది. నేను ఆత్మను ; అనుభవాన్ని కాను. నా చుట్టూ అనుభవాల నుండనిస్తా నంతే. శూన్యంలా సూక్ష్మమైన వాడిని నేను; ఏదీ నన్నంటదు. 
        నేను దాని లోపల ఉన్నానో, బయట ఉన్నానో చెప్పటం సాధ్యం కాదు ; కాని, దాని నుంచి దూరంగా ఎన్నడూ లేను. 
                      --***--
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ 🌺
 *శ్రీ శివ మహా పురాణం*
*401.భాగం*

*వాయవీయ సంహిత (పూర్వ భాగం)-ఇరవైయ్యో అధ్యాయం* 

*దక్ష యజ్ఞ విధ్వంసనము* 

*వాయువు ఇట్లు పలికెను:* 

అపుడు విష్ణువు మొదలగు సాటిలేని తేజస్సు గల దేవతలు పాల్గొనే, రంగు రంగుల ధ్వజములు మరియు సామగ్రి గల గొప్ప యజ్ఞమును వీరభద్రుడు చూచెను. చక్కని పొడవైన దర్భలచే పరచబడి యున్నది, చక్కగా ప్రజ్వరిల్లే అగ్నులు గలది, మెరిసే బంగరు యజ్ఞభాండములతో అలంకరింపబడినది. యజ్ఞమును చేయుటయందు సమర్థులు, యథావిధిగా యజ్ఞప్రయోగమును నిర్వహించువారు అగు ఋషులచే వేదమునందు చెప్పబడిన విధిని అనుసరించి చక్కగా అనుష్ఠించబడే అనేకయజ్ఞాంగముల క్రమము గలది. వేలాది దేవతా స్త్రీలతో శోభిల్లునది, అప్సరసల గణములచే సేవింపబడునది, వేణునాదముతో మరియు వీణావాదనముతో ఉల్లాసమును కలిగించునది. వేదఘోషలతో ఆకాశమును నింపుచున్నది. అగు యజ్ఞమును దక్షుని యజ్ఞశాలలో చూచి వీరుడు, ప్రతాపము గలవాడు అగు వీరభద్రుడు అపుడు దట్టని మేఘము వలె సింహనాదమును చేసెను. తరువాత గణాధ్యక్షులు యజ్ఞశాలయందు పెద్ద సముద్రఘోషను ధిక్కరిస్తూ ఆకాశమును పూరించుచున్నవా యన్నట్లు కిలకిల శబ్దములను చేసిరి. ఆ పెద్ద శబ్దమును తాళలేక దేవతలందరు వస్త్రములు మరియు ఆభరణములు జారిపోవుచుండగా అన్నివైపులకు పరుగులెత్తిరి. గొప్ప మేరుపర్వతము విరిగి పడు చున్నదా యేమి? భూమి పగిలిపోవుచున్నదా యేమి? ఇది యేమి? అని దేవతలు కంగారుగా కేకలను వేయుచుండిరి. మానవులు ప్రవేశింప శక్యము కాని అడవిలో సింహముల నాదమును విన్న ఏనుగులు వలె కొందరు భయముతో ప్రాణములను విడచిరి.

పర్వతములు పగిలెను. భూమి కంపించెను. గాలులు సర్వమును పెకలించి వేసెను. సముద్రము కల్లోలమాయోను. అగ్నులు మండుట మానవేసెను. సూర్యుడు ప్రకాశంచుట ఆగిపోయెను. గ్రహములు, నక్షత్రములు, ఇతరములగు ప్రకాశించే గోళములు ప్రకాశించుట మానివేసెను. ఇదే సమయములో వీరభద్ర భగవానుడు భద్రగణములతో మరియు భద్రకాళితో కూడి ఆ ప్రకాశించే యజ్ఞవాటికను చేరుకొనెను. ఆయనను చూచి దక్షుడు చాల భయపడిననూ, దృఢముగా నున్నాడా యన్నట్లు నిలబడి, కోపముతో నిట్లు పలికెను. నీవెవరివి? నీకిచట పని యేమి?  దుర్బుద్ధియగు దక్షుని ఆ మాటను విని, గొప్ప తేజశ్శాలి, మేఘగర్జనవలె గంభీరమగు స్వరము గలవాడు అగు వీరభద్రుడు చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు ఆ దక్షుని, దేవతలను మరియు ఋత్విక్కులను చూచి, కంగారు పడకుండగా గంభీరమగు అర్థము గలది, మరియు సముచితమైనది అగు వచనమును పలికెను.

*వీరభద్రుడు ఇట్లు పలికెను:* 

మేము అందరము సాటిలేని తేజస్సు గల లయకారకుడుగు శివుని అనుచరులము. మేము యజ్ఞములో భాగములను పొందగోరి వచ్చియుంటిమి. మాకు భాగములనిడు. అట్లు గాక, యజ్ఞములో మాకు భాగములనీయక పోయినచో, దానికి కారణమును చెప్పుడు. లేదా, దేవతలతో కలసి యుద్ధమునుచేయుడు. ఆ గణాధ్యక్షుడు ఇట్లు పలుకగా, దక్షుని ముందిడుకున్న దేవతలు ఇట్లు పలికిరి: ఈ విషయములో మంత్రములు మాత్రమే ప్రమాణము. ఇది మా ఆధీనములో లేదు. మంత్రములు ఇట్లు పలికినవి: ఓ దేవతలారా! మీ బుద్ధులు అజ్ఞానముచే కప్పివేయబడినవి. ఏలయనగా, యజ్ఞములో మొట్టమొదటి భాగమునకు అర్హుడగు మహేశ్వరుని మీరు పూజించకుంటిరి. మంత్రములీ విధముగా చెప్పిననూ, ఆ దేవతలందరు వ్యామోహముతో నిండిని బుద్ధి గలవారై, వీరభద్రుని త్రోసివేయగోరి, ఆయనకు యజ్ఞభాగమునీయలేదు. తాము పలికిన హితకరము మరియు సత్యము అగు వచనములు వృథాయగుటను గాంచి, అపుడు మంత్రుములు ఆ స్థానమును విడిచిపెట్టి శాశ్వతమగు బ్రహ్మలోకమునకు మెల్లగా వెళ్లినవి. అపుడు గణాధ్యక్షుడగు వీరభద్రుడు విష్ణువు మొదలగు దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను: బలముచే గర్వించియున్న మీరు మంత్రముల వచనములను ప్రమాణముగా స్వీకరించకుంటిరి. అందు వలననే, ఈ యజ్ఞములో మేము దేవతలచే ఈ విధముగా అవమానించ బడినాము. కావున, మీ గర్వమును మరియు దానితో బాటు మీ ప్రాణములను నేను తొలగించి వేసెదను. వీరభద్ర భగవానుడు ఇట్లు పలికి కోపించి శివుడు త్రిపురములను వలె విశాలమగు భవనమువంటి ఆ యజ్ఞశాలను తన కంటినుండి పుట్టిన అగ్నితో దహించెను. తరువాత పర్వతముల వలె విశాలమైన దేహములు గల గణాధ్యక్షులు అందరు యూవస్తంభముల నూడబెరకి హోత ( యజ్ఞములోని ఋత్విక్కు ) ల కంఠములయందు త్రాళ్లతో కట్టి, రంగు రంగుల యజ్ఞపాత్రలను పగులగొట్టి, పొడి చేసి నీటిలో కరిగించి, యజ్ఞసాధనములన్నింటినీ తీసుకొని గంగాప్రవాహములో పారవైచిరి.

అచట పర్వతములవంటి దివ్యములగు అన్నములు రాశులు, మధురపానీయములు చెరువులు, అమృతప్రవాహములనదగిన పాల నదులు, చిత్తడి నేలలవలె విశాలమైన గెడ్డ పెరుగుల సముదాయములు. రుచికరములైన పరిమళభరితములైన మాంసముల చిన్న పెద్ద గుట్టలు, రసవంతములైన ఆసవములు, పచ్చళ్లు, హల్వాలు ఉండెను. వీరులు వాటిని నోటియందుంచుకొని నమిలి భక్షించి చెల్లాచెదరుగా పారమేయు చుండిరి. వీరభద్రుని దేహమునుండి పుట్టిన బలవంతులగు ఆ వీరులు వజ్రములు, చక్రములు, పెద్ద శూలములు, శక్తులు, పాశములు, పట్టిసములు (గదల వంటి ఆయుధములు), రోకళ్లు, కత్తులు, గొడ్డళ్లు, భిందిపాలములు (ఒక రకమైన ఆయుధములు), గండ్ర గొడ్డళ్లు అనే ఆయుధములతో, లోకపాలురనందరినీ ముందిడుకొని గర్వించియున్న దేవతలను చావగొట్టిరి. నరుకుము, పగులగొట్టుము, త్రోసివేయుము, వేగముగా చంపుము, చీల్చుము, లాగుము, దెబ్బ తీయుము, పీకి వేయుము, పెకిలించి వేయుము మొదలైన క్రూరములగు, కర్ణకఠోరములైన, యుద్ధమునకు తగియున్న, హడావుడినుండి పుట్టే శబ్దములను గణాధ్యక్షులు అక్కడక్కడ మహావేగముతో ఉచ్చరించుచుండిరి. కొందరు కోరల వంటి దంతములతో పెదవులను అంగుడులను కొరుకుతూ కన్నులను గిరగిర త్రిప్పుచుండిరి. వారు తపస్సే ధనముగా గల, ఆశ్రమములయందు ఉన్న తపశ్శాలులను గట్టిగా లాగి కొట్టుచుండిరి. వారి స్రువము (హోమసాధనము) లను అపహరించి, వారి అగ్నిహోత్రములను నీళ్లలో పారవేసిరి. వారి కమండలములను పగులగొట్టి, మణులు పాదిగిన అరుగులను పగులగొట్టి, వారు పాడుతూ, గర్జిస్తు, అదే పనిగా నవ్వుచుండిరి (35). ఆ గణనాయకులు ఎర్రని ఆసవమును త్రాగుచూ నాట్యమును చేసిరి.

గొప్ప ఎద్దుతో పెద్ద ఏనుగుతో మరియు సింహముతో సమానమగు బలము గలవారు, సాటిలేని ప్రభావము గలవారు అగు గణనాయకులు ఇంద్రునితో సహా దేవతలను చితకగొట్టి, శరీరమునకు గగుర్పాటును కలిగించే అనేకచేష్టలను చేసిరి. వారిలో కొందరు గణనాయకులు ఆనందించుచుండిరి; కొందరు కొట్టుచుండిరి; కొందరు పరుగెత్తుచుండిరి; కొందరు వాగుచుండిరి; కొందరు నాట్యమాడుచుండిరి; కొందరు అధికముగా నవ్వుచుండిరి; కొందరు బలముగా గెంతుచుండిరి. కొందరు వర్షజలముతో నిండియున్న మేఘములను పట్టుకొనుటకు యత్నించుచుండిరి; కొందరు సూర్యుని పట్టుకొనుటకై పైకి ఎగురుచుండిరి; కొందరు భయంకరాకారులగు గణనాయకులు ఆవాశమునందున్నవారై వాయువుతో సమానముగా వీచుటకు యత్నించుచుండిరి. గరుడ పక్షులు పెద్ద పాములను వలె కొందరు పర్వతశిఖరమును బోలి యున్న గణనాయకులు శ్రేష్ఠమగు ఆయుధములను ఎత్తి పట్టుకొని దేవతలను కూడ తరుముచూ అంతరిక్షమునందు గిరిగిర తిరుగుచుండిరి. నల్లని మేఘములను పోలియున్న కొందరు గణనాయకులు పై కప్పులతో కిటికీలతో మరియు అరుగులతో సహా ఇళ్లను పెకిలించి పెకిలించి నీటి మధ్యలో పారవేసి పారవేసి సంహనాదములను చేయుచుండిరి. ఆశ్చర్యము! ద్వారములను తలుపులను ఊడబెరకి, గోడలను పగులగొట్టి, శాలలను పై కప్పులకు ఆధారముగానుండే బల్లగొడుగులను మరియు కిటికీలను విధ్వంసము చేసి వారు, రక్షించే నాథుడు లేని ఆ యజ్ఞశాలను అసత్యవాక్యమును వలె భగ్నము చేసిరి. వారు ఇళ్లను పెకిలించుచుండగా, ఓ నాథా! తాతా! తండ్రీ! కుమారా! సోదరా! మాయమ్మా! మామయ్యా! మొదలైన, రక్షకులు లేని వారు చేసే పలువిధముల ఆక్రందనములను స్త్రీలు చేయుచుండిరి.

*శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో పూర్వభాగమునందు దక్షయజ్ఞవిధ్వంసమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).*