Sunday, January 25, 2026

 

 నేతాజీ కన్నీటి తీర్థయాత్ర: కాల పానీ గోడల వెనుక దాగి ఉన్న వీరగాథ!
---
త్రివర్ణ పతాకం ఎగురవేశాక.. నేతాజీ నేరుగా ఆ నరకకూపానికే ఎందుకు వెళ్లారు? కాల పానీలో ఆయన చేసిన నిశ్శబ్ద తీర్థయాత్ర! 
---
జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని మనం జరుపుకుంటున్న వేళ, ఆయన భయంకరమైన 'కాల పానీ'ని సందర్శించిన ఆ రోజును ఒకసారి గుర్తు చేసుకుందాం. 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్‌లో నేతాజీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత, ఉత్సాహంగా ఉన్న జనసమూహం నుండి కొంచెం దూరంగా జరిగి, అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు వైపు అడుగులు వేశారు. 'కాల పానీ శిక్ష' అనగానే భారతీయుల్లో ఒక రకమైన భయం, వేదన కలిగేది. నేతాజీ దీనిని "ఇండియన్ బాస్టిల్" (Indian Bastille) అని పిలిచేవారు. అది తరతరాల స్వాతంత్య్ర సమరయోధుల ఒంటరితనాన్ని, చిత్రహింసలను మౌనంగా భరించిన ఒక నరకకూపం. 

అసలు ఏమిటీ కాల పానీ?

నేతాజీ అడుగుపెట్టిన ఆ కాల పానీ జైలు, బ్రిటిష్ వారి క్రూరత్వానికి అత్యంత భయంకరమైన చిహ్నం. మనిషి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా దీనిని నిర్మించారు. ప్రతి ఖైదీ పూర్తి ఒంటరిగా ఉండేలా రూపొందించారు కాబట్టే దీనికి "సెల్యులార్" జైలు అనే పేరు వచ్చింది. దీనిలోని ఏడు విభాగాలు (Spokes) ఎంత చాకచక్యంగా నిర్మించారంటే, ఒక సెల్ ముందు భాగం మరో సెల్ వెనుక వైపుకు ఉంటుంది. దీనివల్ల ఏ ఇద్దరు ఖైదీలు ఒకరినొకరు చూసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ సాధ్యం కాదు. 

ఖైదీలను మరింత వేధించడానికి, జైలర్లు సెల్ తాళం వేసిన తర్వాత తాళం చెవిని సెల్ లోపలికి విసిరేవారు. కానీ ఆ తాళం లోపలి నుండి చెయ్యి అందనంత దూరంలో ఉండేది. ఇటు ఆ గదులు ఎంత ఇరుగ్గా ఉండేవంటే.. ఖైదీ కనీసం సరిగ్గా కాళ్లు చాచుకోవడానికి కూడా వీలుండేది కాదు. కిటికీలు చాలా ఎత్తులో ఉండటం వల్ల గాలి, వెలుతురు రావడం అసాధ్యం. అటువంటి చీకటి గదుల్లో ఖైదీలు కొరడా దెబ్బలు, ఆకలి మరియు ఏకాంతవాసాన్ని అనుభవించేవారు. కనీస పారిశుధ్యం లేకుండా కేవలం హింసించడానికే ఈ జైలును బ్రిటిష్ వారు రూపొందించారు. కాల పానీ అంటే కేవలం ఒక జైలు మాత్రమే కాదు.. భారత వీర విప్లవకారుల అస్తిత్వాన్ని, గౌరవాన్ని మరియు ఆశలను తుడిచిపెట్టేందుకు బ్రిటీష్ వారు చేసిన ఒక విఫలయత్నం. 

కాల పానీ గోడల వెనుక.. అమరవీరుల ఆత్మఘోషతో నేతాజీ మౌన సంభాషణ!

చీకటి నిండిన ఆ కారిడార్లలో నడుస్తున్నప్పుడు, నేతాజీకి కేవలం గోడలు, ఇనుప కడ్డీలు మాత్రమే కనిపించలేదు.. ఆ గదుల్లో బంధీలుగా ఉన్న మహనీయుల ఆత్మల స్పందన వినిపించింది. 

1911 నుండి 1921 వరకు రెండు జీవితకాల శిక్షలను అనుభవిస్తూ, భారత పునర్వైభవం కోసం నిరంతరం ధ్యానించిన వీర సావర్కర్ ఆయనకు తలపుల్లో మెదిలే ఉంటారు. 

లాహోర్ కుట్ర కేసులో 1929లో ఇక్కడికి బహిష్కరించబడిన బతుకేశ్వర్ దత్ నినాదాలు నేతాజీకి వినిపించే ఉంటాయి. 

అలీపూర్ బాంబు కేసులో 12 ఏళ్ల శిక్ష అనుభవిస్తూ, దొంగచాటుగా కొవ్వొత్తి వెలుగులో చిత్రపటాలు గీస్తున్న బారింద్ర కుమార్ ఘోష్ ఆయన కళ్లముందు కదలాడి ఉంటారు. 

ముజఫర్‌పూర్ బాంబు కేసు తర్వాత తప్పించుకునే క్రమంలో పట్టుబడి, కాల పానీ జైలు చీకటి గదుల్లో చిత్రహింసలకు గురైన ఉల్లాస్కర్ దత్.. గోడల మీద రాళ్లను రక్కుతూ తన నిరసనను తెలిపిన తీరు నేతాజీని కలచివేసి ఉంటుంది. అలాగే, పారిస్‌లో బాంబుల తయారీలో శిక్షణ పొంది, అలీపూర్ కుట్ర కేసులో జీవితకాల శిక్షను అనుభవిస్తున్న హేమచంద్ర కనుంగో వంటి మేధావులు ఈ నరకకూపంలో మగ్గిపోవడం చూసి ఆయన హృదయం ద్రవించి ఉంటుంది. ఏకాంతవాసం (Solitary Confinement) అనే భయంకరమైన శిక్షలో ఉన్నప్పటికీ, తన మనోబలాన్ని కోల్పోకుండా ఉండేందుకు.. ధర్మ శ్లోకాలను ఆ చీకటి గదుల గోడల మీద చెక్కిన ఉపేంద్రనాథ్ బెనర్జీ గుర్తుకొచ్చి ఉంటారు. భాయ్ పరమానంద్, దివాన్ సింగ్ ధిల్లాన్ లాంటి వీరుల శరీరంపై బ్రిటిష్ వారి కొరడాలు విరుచుకుపడుతున్నా, ఆ నొప్పిని ఏమాత్రం లెక్కచేయకుండా పంజాబీ వీర గీతాలను ఆలపించారు. రక్తం ఓడుతున్నా వారు పాడిన ఆ గీతాల ధైర్యం, ఆ కారిడార్లలో నేతాజీకి వినిపించి ఉంటుంది. ఆ వీరుల అజేయమైన సంకల్పమే నేతాజీని దేశ విముక్తి కోసం అంత పెద్ద పోరాటానికి సిద్ధం చేసి ఉంటుంది. 

1930లలో నిరాహార దీక్షలు, నిరసనలు చేపట్టిన యోగేంద్ర శుక్లా దృశ్యాలు కూడా కాల పానీ గోడలపై ముద్రించబడి ఉన్నాయి. అక్కడ పర్యటించిన నేతాజీకి, ఆ వీరుల అచంచలమైన స్ఫూర్తి తనను ముందుకు నడిపిస్తున్నట్లు అనిపించి ఉంటుంది. తాను ఎగురవేసిన త్రివర్ణ పతాకం కేవలం ఒక ముగింపు మాత్రమే కాదని, అది ఒక కర్తవ్య బోధ అని నేతాజీకి తెలుసు. సావర్కర్, దత్, ఘోష్, శుక్లా వంటి లెక్కలేనంత మంది త్యాగాలకు అర్థం చేకూరాలంటే, వారి అసంపూర్ణ పోరాటాన్ని కొనసాగించి స్వతంత్ర భారతాన్ని సాధించడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగారు.🙏... దయచేసి భారతీయులందరూ చదవండి...🙏
 *_“మాట హద్దు దాటితే — తప్పు._*
*_ఖర్చు హద్దు దాటితే — అప్పు._*
*_ఈ రెండూ హద్దులు దాటితే — మనశ్శాంతికే పెనుముప్పు.”_* 

*_“సాధించే వాడికి కోరిక మాత్రమే ఉంటుంది, విమర్శించే వాడికి తీరిక మాత్రమే ఉంటుంది._*

*_విజయ శిఖరాలు సోమరులకు అందవు, పట్టుదలతో కృషి చేసే వారికి అవి తలవంచుతాయి.”_*

*_“ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు, కానీ అధర్మం వైపు కన్నెత్తి కూడా చూడకు. కత్తి పోటుకన్నా — కర్మ పోటు చాలా తీవ్రమైనది.”_*

*_“దాచివున్న నీ శక్తిని బయటికి తీస్తే, దక్కవలసిన విజయాలు ఎన్నో నీ చేతికి వస్తాయి.”_*

*_“మన అవసరం ముగిసిన చోట మనకిచ్చే గౌరవమూ ముగుస్తుంది. అర్థం చేసుకుని అడ్డు తప్పుకోవాలి గానీ, అందని బంధాల కోసం ఆరాటపడకూడదు.”_*

    *_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🥰🌹 🌸🙇🌸 🌹🥰🌹
 



*నా ఉద్యోగం పోయినా, నా మాంగళ్యసూత్రాన్ని (పెళ్లి గొలుసు) తీయను... జనం జాగృతం కావాలి ఇలాంటి సనాతన వ్యతిరేక విధానాలను ఎదుర్కొండి. ఆ అమ్మాయిలో ఉన్న సనాతన ధర్మ పరిరక్షణ రాజకీయ నాయకులు మరియు అధికారులకు ఒక చెప్పుదెబ్బ.* 

*సనాతన హిందువులు ఇలాంటి అక్రమమైన విధానాలను ఎదుర్కోకుంటే మీరు జీవశవంలాంటివారు. బుర్కవాళ్ళను ఏమి చేయక కేవలం సనాతన హిందు మహిళలను మంగళసూత్రం తీసేయమనే మీరు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరం.*

*మన భారతీయురాలు తనయొక్క గౌరవాన్ని అదేవిధంగా భారతదేశం గౌరవాన్ని కాపాడిన వీర మహిళ తాను ప్రపంచమంతా మన వైపు చూస్తుంటే మనమేమో ఈ విధంగా చేయడం తప్పు ఒక స్త్రీ మంగళ సూత్రం తీయమని చెప్పడం చాలా తప్పు ప్రమాదకరం.*


Sekarana
 దైవకార్య పరమార్థం
దైవస్మరణ సహజంగానే ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మనసుకు నిరంతర ప్రశాంత తనిస్తుంది. దైవారాధన వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా 'పరీక్షలు'గా భావించి ఓపిగ్గా భరించే తత్వం అలవడుతుంది. ఆ దైవమే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందన్న దృఢవిశ్వాసం ఏర్పడుతుంది. దైవం మీద మనసు లగ్నం చేయడం, పూజావిధానం పట్ల శ్రద్ధ.... మనలో ఏకాగ్రతను పెంచుతాయి. దైవానికి అర్పించిన నైవేద్యం తిరిగి ప్రసాదమై మనకే శక్తినిస్తుంది.

దేవుడి ముందు దీపం వెలిగించడం అంటే, మనలోనూ మన చుట్టూ ఉన్న చీకటిని తరిమికొట్టడమే! ఆ వెలిగే దీపానికి, మరిన్ని దీపాలను వెలిగించే శక్తి ఉంటుంది. ఆ స్ఫూర్తితో ఆత్మలోని 'జ్యోతి'ని వెలిగించుకోగ లిగితే అదే చైతన్యం. 'ఉపవాసం' అంటే కడుపు మాడ్చుకోవడం కాదు. దైవానికి సమీపంలో ఉండటం. అయితే ఆహారం తీసుకుంటే భుక్తాయాసం కలగడం సహజం. ఆయాసంతో నిద్ర వస్తుంది. నిద్ర ఆవహిస్తే భగవంతునిపై ధ్యాస ఉండదు. పైగా కడు పును ఖాళీగా ఉంచడం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది. సాటి మనిషి 'ఆకలి' అన్న ప్పుడు ఆ 'క్షుద్బాధ'ను అర్థం చేసుకోగల శక్తిని ఈ ఉపవాసమే ఇస్తుంది. తద్వారా ఆకలితో మాడే కడుపునకు తిండి ఉపశ మనం కలిగిస్తుంది. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా మన మంచికే. దాని వల్ల ముఖ్యంగా రావి, వేప వంటి చెట్ల గాలులు చల్లగా మనని సేదదీరుస్తాయి. ఆరోగ్యానికి మేలుచేస్తాయి. మనసును ఉత్తేజపరుస్తాయి. ఆ ఉత్తేజం శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రకరకాల ధాన్యాలను 'దానం' ఇవ్వడం భగవంతునికి ప్రీతికరం. వాటిని వినియోగించి చేసే అన్నదానం ఎందరికో ఆకలి తీరుస్తుంది.
పండుగలూ శుభ దినాలకు ముందుగా బూజులు దులిపి ఇంటిని శుభ్రం చేసే అలవాటు వల్ల ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం లభిస్తుంది. దుమ్మూధూళీ పోయి చిన్నా చితకా అనారోగ్యాల బారిన పడటం తగ్గుతుంది. అలాగే బుర్రకు పట్టిన బూజులు కూడా వదిలించుకోవాలి. నిరంతర దైవ ప్రార్థన, సామూహిక భజనలు, ప్రసాద వితరణ లాంటి కార్యక్రమాల ద్వారా ఆ పని చేయవచ్చు. నిత్యానందం పొంద వచ్చు. ఇతరులకు పంచడం ద్వారా ఆ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. తులసి మొక్కను పూజించటం, సూర్య నమస్కారం చేయడం కూడా ఆరోగ్యకరమైన అంశాలు. పశువులకో, పక్షులకో ఆహారం వేశాకే మనం భుజించడం కూడా 'దైవా రాధన'లో భాగమే. ఇవన్నీ దైవ కార్యాలలో ఇమిడి ఉన్నాయి. అందుకే నిరంతరం దైవ అర్చనతో, స్తోత్రాలతో, మంత్రోచ్చారణతో, జపాలతో దేహాన్ని - మనసును ఓ పద్దతిలో నడిపించుకోవచ్చు. అప్పుడే మన అంతరంగంలోని దైవాన్ని ప్రతి వ్యక్తిలో చూడగలుగుతాం. అది అందరిలో సోదరభావాన్ని పెంపొందిస్తుంది. సమాజంలో ఐకమత్యం వెల్లివిరుస్తుంది. వ్యక్తి విశ్వనరుడి స్థాయికి ఎదుగుతాడు.
కె.వి.వి.సత్యప్రసాద్
 లోక రక్షామణి

సూర్యుడు జన్మించిన శుభదినం మాఘశుద్ధ సప్తమి. ఆయన విశాఖ నక్షత్రంలో అదితి, కశ్యపులకు జన్మించాడన్నది బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యజయంతినే రథసప్తమి అంటారు. సూర్యరథానికి ఏడు అశ్వాలు. కాబట్టి 'సప్తాశ్వరథారూ ఢుడు' అయ్యాడు. పగలు, ప్రాతఃకాలం, సంగమకాలం, మధ్యాహ్నం, సాయంకాలం-ఇవి పంచాయుధాలు. ఆరు రుతువులు చక్రంలోని ఆకులు. అర్థకామాలు ఇరుసులు. ధర్మమే రథ ధ్వజం. రథసారథి అనూరుడు.

ప్రాణికోటి అస్తిత్వమంతా సూర్యుడి మీదే ఆధారపడి ఉంది. అనాదిగా ఆయన మానవకోటికి ప్రత్యక్షదైవం, కర్మసాక్షి, ఓజస్సును, ఆయుష్షును, శక్తిని ప్రసాదించే సూర్య నారాయణమూర్తి. సర్వరోగనివారణ, సర్వబాధావిముక్తి ఆ స్వామి వల్లనే సాధ్యమవు తాయని వేదాలు ఘోషిస్తున్నాయి. రథసప్తమి నాటి పవిత్రస్నానం ముక్తికి ప్రధాన సోపానమంటారు. భానుడు ప్రాక్- పశ్చిమాలకు ప్రయాణిస్తూనే, యాజ్ఞవల్క్యుడికి, ఆంజనేయుడికి వేద శాస్త్ర వ్యాకరణాదులు నేర్పాడని, వనవాసంలో ఉన్న ధర్మరాజుకు అక్షయపాత్ర ప్రసాదించాడని ప్రతీతి. సూర్యుడు పన్నెండు మాసాల్లో ధాత, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన, పుషా, పర్జన్యుడు, భగ, తృష్ణా, విష్ణు, అంశుమాన్ అనే పేర్లతో ఆయా రుతువులను అనుసరించి లోకానికి వెలుగులు పంచుతున్నాడు.
రామరావణ యుద్ధ సందర్భంలో చింతా గ్రస్తుడై ఉన్న శ్రీరాముడికి అగస్త్య మహర్షి 'ఆదిత్య హృదయం' ఉపదేశించి గొప్ప ప్రేరణ కలిగించాడు. సత్రాజిత్తు సూర్యారా ధన చేసి 'శమంతకమణి'ని పొందగలి గాడు. ప్రస్కణ్వ మహర్షి సూర్యజపం చేసి, మయూరుడనే కవి సూర్యశతకం రాసి చర్మవ్యాధుల నుంచి విముక్తులయ్యారన్న కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాంభోజి దేశాధిపతి యశోధర్ముడు తన పుత్రుడితో రథసప్తమి వ్రతం చేయించి, పట్టాభిషిక్తుణ్ని చేసినట్లు భవిష్య పురాణ కథనం.

బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆవిష్కరించిన సూర్య సంబంధిత గాయత్రీ మంత్రం మానవజాతికి మహిమాన్విత మోక్షమార్గ దిగ్దర్శనం. సూర్య కృప కోసం అరుణ పారాయణం, సూర్యనమస్కారాలు చేస్తారు. శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబుడి సూర్యోపాసన అనన్య సామాన్యమైంది. అనేక పురాణాల్లో సూర్యప్రభ అభి వర్ణితమైంది. వైవస్వత మన్వంతరానికి మొదటి తిథి రథసప్తమే. ఈ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో గ్రహనక్షత్రాల సన్నివేశం సూర్యరథాకారంలో గోచరిస్తుంది. సూర్యుడికి పాయసం ప్రీతికరమైంది. అందుకే ఈ పర్వదినాన పాలు, కొత్తబియ్యం, బెల్లంతో పాయసం చేసి భానుడికి నివేదిస్తారు. ఆదిత్యుడికి అష్టోత్తరనామ జపం కూడా చేస్తారు. వ్రతచూడామణి, ధర్మసింధువు, నిర్ణయామృతం, మదనరత్నం మొదలైన గ్రంథాల్లో సూర్యవర్ణన విస్తారంగా ఉంది.

'నమస్కారప్రియః సూర్యః'- ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆదిత్యకృప సంప్రాప్తి స్తుంది. మనిషి తను చేస్తున్న పాపాలన్నీ ఎవ్వరూ చూడటం లేదని భ్రమపడతాడు. వేదపారాయణుడైన సూర్యనారాయణుడి చూపు సదా మనపై ఉంటుందన్న వాస్తవం గ్రహించి ధర్మబద్ధులమై నడుచుకోవాలి.

చిమ్మపూడి శ్రీరామమూర్తి
 *సండే స్టోరీ*

*విన్నపాలు*
✉️

రచన: నండూరి విఠల్


మా బామ్మ పోతూ పోతూ ఈ వీధిచివర ఉన్న మండువా యిల్లు మా యింటావిడ పేర రాసి మరీపోయింది. నాలుగు రాళ్ళు ఎక్కువిస్తానన్నాడని మనస్సు కీడు శంకిస్తున్నా దాన్ని ఓ ఆసామీకి అద్దెకిచ్చాను మా యింటావిడ సలహాపై.

ఆ ఆసామీ పేరు బండ వీరాసామి. వృత్తి  కుస్తీ పోటీలు.

ఆ వస్తాదు ఒక నెల ఎడ్వాన్సు ఇచ్చి అద్దెకు యిళ్ళు తీసుకునే అసామీలందరి లాగానే సలక్షణంగా యింట్లోకి ప్రవేశించాడు శిష్యగణంతో సహా. పదినెల్లయింది. నాటికీ నేటికీ అద్దెతాలూకు రాగి పైసాయివ్వలా. "తొమ్మిదినెలల అద్దె బాకీ పెడితే ఎవరూరు కుంటారండీ ? మనల్ని మరీ వాజమ్మల్నిచేసి ఆడిస్తున్నాడా వీరాసామి" అంటూ మా యింటవిడ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కొద్దీ నా సహనం నీరసించింది. ఆ 'వాజమ్మ' అనే విశేషణం నా తాలూకుదే నని మా శ్రీమతి నమ్మకమని నాకు అనుమానం కలిగింది.

ఆపై పౌరుష మొచ్చింది.

వచ్చి - బండ వీరాసామికి ఘాటుగా ఓ రిజిస్టర్ నోటీసు తగిలించాను. దాని నకలు తమ ముందుంచుతున్నా తప్పులుంటే చెప్పండి.

అది ఇది.

"ఘనమైన ఆయ్యా

కలియుగ భీములూ, వీరహనుమాన్ ప్రియ భక్తాగ్రేసరులూ, అఖిలభారత మల్లయుద్ధ పోటీలలో సువర్ణకంకణ విజేతలూ అయిన బండ వీరాసామిగారి దివ్యసన్నిధికి తమ వసతిగృహ యజమాని కట్టుకున్న భర్త సీతావతి వ్రాసుకున్న విన్నపాలు.

గత వారంరోజులుగా మన ఊరి చింతల తోపులో అర్భకులైన వేలాది ప్రజల సమక్షంలో చండప్రచండులైన, అఖిలభారత వస్తాదుల నెందరినో చిత్తుచేస్తున్న విషయం కర్ణాకర్ణిగా వినడమేగాని కనులారా చూసే భాగ్యానికి నోచుకున్నవాణ్ణి కాదు.

ఇందుకు కేవలం నా అనారోగ్యమే కారణం గాని తమయందుగల ఉపేక్ష మాత్రం ఎంతమాత్రం కారణంకాదంటే తమరు నమ్మగలరనుకుంటాను. తిరుగులేని భుజబలంగల తమబోంట్లు మా యింట్లో అద్దెకుండటమే మాకు కొండంత పెట్టు. ఒక్క మా కుటుంబానికేగాక, ఈ వీధికట్లు యావత్తుకు నిజానికి తమఉనికే ఒక శ్రీరామరక్ష.

ఒక చిన్న మనవి.

మరేమంత పెద్దవిషయం కాదనుకోండి…

తమరు గత పదినెలలుగా మా యింటి అద్దె చెల్లించలేదు. పెద్దమనుషులకు లక్షపనులు. పనుల వల్ల తీరిక లేక మరిచిపోయి వుంటారు. మరీ పేరుకుంటున్న అద్దె బాకీ విషయం, లోగడ పోస్టు బంట్రోత్తు పీరు సాయిబు ద్వారా తమకి గతంలో నాలుగైదు సార్లు వర్తమానాలు పంపుకున్నాను.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
నా విన్నపాలను తమకు అందించడం అలగాడూ మరిచిపోయివుంటాడు.

మరో స్వల్ప విషయం.....

మన యింటి దూలాలను తమరు  కొన్నింటివి పీకినట్లున్నూ, వాటితో మన పెరట్లో బస్కీలు తీయించేటందుకు నిచ్చెనల పోలికలున్న ఏదో కట్టడాన్ని నిర్మించినట్లు న్నూ ఓ గాలివార్త నా చెవిలో పడింది.

తమరు ఏదో సదుద్దేశంతోనే యింతటి ఘనకార్యాన్ని తలపెట్టివుంటారనే విషయం తెలియనివాణ్ణికాదు. కాని నా మనస్సులోని భయాన్ని తమ ముందుంచడం నా విధి.

తమరుంటున్న వసతిగృహం మా ఇంటావిడ కి వాళ్ళ బామ్మ పోతూపోతూ ఇచ్చిపోయిన తాతలనాటి పెంకుటిల్లు. అసలు ఎన్నడో కూలిపోవలసిన పాతకొంప. అయినా తమకు జడిసి అలా నిలిచివుంది.

మనవిచేసేదేమిటంటే మరో పోటీ పెట్టకుండా ఆ దూలాలుపీకితే అది ఆద్ధంతరంగా కూలి తమ నెత్తినపడే ప్రమాదముంది. మరి తమకేదన్నా జరిగితే ఈ వాడకట్టుకేగాక యావత్తూ భారతదేశానికే తీరనినష్టం. మీకు అటువంటి ఆపదరాకుండా పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించుగాక. 

చిట్టచివరి మనవి…

అద్దె బాకీ యావత్తూ ఒకేసారి తమరు అనుగ్రహించినా ఒక్కసారి నేనేం చేసుకుంటాను గనుక. నెలకు నాలుగైదు రూపాయల వంతున తమరు పంపినా తమ ఖాతాలో కట్టుకుంటాను. ఆ రేటున తమ పదినెలల అద్దె బాకీ యావత్తూ తీరటానికి కనీసం ఓ పుష్కరం పడుతుంది గనుక ఈ లావాదేవీల పుణ్యమా అని మా యిల్లు మీరు ఖాళీచేసినా మన స్నేహ బాంధవ్యాలు పదికాలాల పాటు దిమ్మిసాచేసినట్లు నిలిచి వుండే సదవకాశం కలుగుతుందని సంబరపడుతున్నా.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
అన్నట్లు తమ శిష్య పరమాణువు భజరంగ పహిల్వాన్ గారిని మొన్న కూరగాయల అంగడిలో కలుసుకునే భాగ్యం కలిగింది. ఇరుకైన కారణంగా మనయిల్లు ఖాళీ చేయాలనే తలంపు తమకు ఆ మధ్య కలిగినట్లు విన్నాను.

తమకు తగిన వసతిగల యింట్లోనే తమరు సుఖశాంతులతో హాయిగా బ్రతకాలని  త్రికరణశుద్ధిగా కోరుకునే తమ శ్రేయోభిలాషుల్లో నేనొకణ్ణి. మన పార్థసారధి స్వామి కోవెల వెనుకగల పరాంకుశంగారి మండువా యిల్లు తమకు తగినంత వసతి గానే వుంటుందిమరి.

తమరు మన యిల్లు ఖాళీ చేసేటప్పుడు... యిల్లు తాళం వేసి ఆ తాళంచెవిని పోస్టు బంట్రోతు పీరుసాయిబు ద్వారా నాకు ముట్టచెబితే అదే పదివేలు. తమరు మహానుభావులైన పెద్దలు. తమరే స్వయంగా తాళంచెవి యివ్వడానికి రావడం జరిగితే అది నేను పెద్దలపట్ల చేసిన అపచారమే గదా మరి.

ఇంతే సంగతులు

ఇట్లు:

తమ శ్రేయోభిలాషి

మన వసతిగృహ యింటియజమాని

సీతాపతివ్రాలు. 
🙏
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 *25.01.2026 ఆదివారం - రథసప్తమి, భానుసప్తమి, సూర్యజయంతి, అభోజ్యార్కవ్రతం, నర్మదా జయంతి, బ్రహ్మసావర్ణి మన్వాది*
☀️

*రథసప్తమి/సూర్య జయంతి*

ఇది సూర్య జయంతి తిథి. మన్వాది దినంగానూ ప్రసిద్ధి. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. మన్వాది నాడు చేయాల్సిన తర్పణాదులను ఈరోజు చేయాల్సి ఉంటుంది.

ఈ వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు ఈ దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది. తెలుగు దేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా ఉంటున్నాయి. నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళ వారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి నాడే పడతారు.

వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి ఇన్ని వ్రతాల ప్రారంభదినమైన రథసప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు.

చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు ఆచరించదగిన మంత్ర సహితమైన అనేక వ్రతాలను గురించి పేర్కొంది. ప్రాయకంగా అవన్నీ సూర్యునికి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవి అయి ఉన్నాయి. ప్రాచీక కాలంలో ఇది మనకు ఉగాదిగా ఉండినా, ఉండకపోయినా మిక్కిలి ప్రాచీనమైన మన పండుగలలో రథ సప్తమి ఒకటి.
📖

*పద్ధతి*

ప్రతి ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడుకాయల తో చేసిన దానిని సూర్యరథం అంటారు.

*జిల్లేడు ఆకులు*

జిల్లేడు ఆకుల్ని రథసప్తమి నాడు నెత్తి మీద పెట్టుకోవడంలో ఆంతర్యం ఉంది. సూర్యుడు తన కాంతితో, వేడితో, విద్యుత్తు తో, ఆకర్షణ శక్తితో పదార్థాన్ని కాల్చివేస్తాడు. గ్రహాలను బట్టి జీవులకు కామ క్రోధాది గుణాలు కలుగుతుంటాయి. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఇతర గ్రహాలు జీవులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సూర్యుడు ఉత్తరాయణ గతుడైనపుడు గ్రహాల పలుకుబడి మనుషులపై అంతగా ఉండదు. రథ సప్తమి సూర్యుని ఉత్తరగతిని సూచించే పండుగ. ఈ పర్వం సందర్భంలో జిల్లేడులను తలపై ఉంచుకుని స్నానం చేస్తూ వాటిని జారవిడవడం కామ క్రోధాది గుణాల విసర్జనకు సూచన అని అనుకోవచ్చు.

జిల్లేడు మంచి వీర్యవంతమైన మూలిక. ఈ ఆకులు పైన నునుపుగా, కింద నూగుగా ఉంటాయి. ఇది సంవత్సరంలోని అన్ని రోజుల్లో పుష్పిస్తుంది. జిల్లేడు ఆకులు తుంచినా కొమ్మలు విరిచినా తెల్లని పాలు కారతాయి. ఆ పాలల్లో ఉప్పు కలిపి పట్టిస్తే పంటిపోటు ఇట్టే పోతుంది. జిల్లేడు చిగుళ్ల రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. జిల్లేడు ఆకులు వెచ్చబెట్టి ఆముదం రాసి పైన వేస్తే కడుపునొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఎరుపు, నీలి వర్ణాలు కలిసిన జిల్లేడు పువ్వుల కంటే తెల్ల జిల్లేడు పూలు శ్రేష్ఠమైనవి. పక్షవాతం, కుష్ఠు, మూర్ఛ, విష జంతువుల కాట్లు మున్నగు దుష్ట సాధ్యాలైన రోగాలలో కూడా జిల్లేడు బాగా పనిచేస్తుంది. జిల్లేడు బొగ్గు తీక్షణమైనది. దీనికి సంస్కతం లో సూర్యాహ్వాయ, అర్క, రవి అనే పేర్లు ఉన్నాయి. ఈ నామాలు దీనికి సూర్యునితో గల సంబంధాన్ని తెలియచేస్తున్నాయి. రథ సప్తమి సూర్యునికి సంబంధించిన పండుగ కాబట్టి ఆనాడు జిల్లేడు ఆకులకు ప్రాధాన్యం వచ్చి ఉండవచ్చు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇక, రథ సప్తమినాడు రేగుపండ్లు నెత్తి మీద పెట్టుకోవడంలో కూడా ఆంతర్యం ఉంది. భవిష్యోత్తర పురాణంలో రథ సప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులు కానీ, రెండు రకాల ఆకులు కానీ తలపై పెట్టుకుని స్నానం చేయాలని ఉంది. కానీ, ఆంధ్రదేశంలో జిల్లేడు ఆకుల దొంతర మీద రేగుపండ్లు ఉంచుకుని స్నానం చేయడమే ఆచారం. శిశిర రుతువైన మాఘ ఫాల్గుణ మాసాల్లో రేగుపండ్లు విస్తారంగా దొరుకుతాయి. 'ఫలశైశిర' అని రేగుకు సంస్కృత నామం ఉంది. రథ సప్తమికి ఇంచుమించు ఒక నెల ముందు వచ్చే సంక్రాంతి భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు రేగుపండ్లు తలపై పోసి దిగబారేలా చేస్తారు. అలా పోయడం వల్ల పీడ వదిలిపోతుందని మనవాళ్ల నమ్మకం. ఆనాడు రేగుపండ్ల మూలకంగా ఒక్క చిన్నపిల్లలకే జరిగే మంచి.. రథసప్తమి నాడు అందరికీ జరుగుతుందని అనుకోవాల్సి ఉంటుంది.

ఇక, చిక్కుడు కాయల విషయానికి వస్తే.. రథసప్తమి నాడు చేసే పూజలో చిక్కుడు కాయలతో పాటు ఆకులనూ వాడతారు.

చిక్కుడు కార్తికమాసం నాటికి కదురంత మొక్క ఉంటే మాఘమాసం నాటికి నా మహిమ చూపుతానన్నట్టు విస్తరిస్తుందని పెద్దలు అంటారు. ప్రకృతిని ఆరాధించే మన పెద్దలు మాఘ మాసంలో బాగా పూచి, కాచే చిక్కుడును కూడా మాఘ మాసపు పర్వాల లో చేర్చి రథ సప్తమి నాటి ఆరాధన ద్రవ్యాలలో ఒకటిగా చేర్చారు. ఈనాడు చిక్కుడు కాయలతో, వెదురు పుల్లలతో రథాన్ని చేసి దాని మీద చిక్కుడు ఆకుల్ని పరిచి నైవేద్యానికి ఆధారపాత్రగా ఉపయోగించే ఆచారం ఉంది. నైవేద్యం పెట్టడానికి వేడి పొంగలి చిక్కుడు ఆకు మీదనే వేసి చల్లార్చడం చేత ఆకులో ఉండే పసరు, ఆర్ద్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనిక మార్పు వస్తుంది. ఆ పదార్థ సేవనం ఆరోగ్య వర్థకం అవుతుంది.
📖

*సూర్య జయంతి*

రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని రాజపుటానాలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, మరికొన్నిచోట్ల జయంతి సప్తమి అనీ, ఇంకొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది.

సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు. అయితే, జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చనేది పెద్దల అభిప్రాయం. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- సప్తమి తిథులు నెలకు రెండుసార్లు వస్తాయి. అనగా, ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమికి మహా సప్తమి అనే పేరు వచ్చిందని అంటారు.

ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుని గతి మారే శుభసమయం. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ కూడా రథాకారంగా ఉంటాయి. సర్వదేవమయు డైన ఆదిత్యుని సేవించడం వలన తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యాదులు ప్రాప్తిస్తాయి. స్నానం చేసేటపుడు సూర్యనారాయణుని ధ్యానించి, తలపై జిల్లేడాకులు, రేగు ఆకులు పెట్టుకోవాలని ధర్మశాస్త్ర వచనం. 

సూర్యభగవానుని విధివిధానంగా ఆరాధించి గోమయంతో చేసిన పిడకలమంటతో వండిన పాయసాన్ని చిక్కుడాకులలో నివేదించాలి. "సూర్యగ్రహణ తుల్యా తు శుక్లా మాఘస్య సప్తమీ” సూర్యగ్రహణంతో సమానమైన పవిత్ర సమయం కాబట్టి స్నాన, దాన, జపాలకు అత్యంత ముఖ్యమైనది. 
📖

*దానం* 

ఈ రోజున గుమ్మడికాయను దానంచేయడం మంచిది. సాక్షాత్తు పరమేశ్వరుని నుండి నర్మదాదేవి ఆవిర్భవించిన ఈ రోజున నర్మదాస్నానం అత్యంత విశేషమైనది. ఎవరి ఇంటిలో వారు కలశమందు నర్మదను ఆవాహన చేసి అర్చించుకోవచ్చు.

ఈరోజు *వైవస్వత మన్వాది*.పురాణ వచనం ప్రకారం ఈరోజు వైవస్వత మన్వంతరం ప్రారంభం అయిన రోజు. ప్రతి మన్వాది రోజు పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించడం సాంప్రదాయం.

ఈ రోజు *ఆరోగ్య సప్తమీ, విధాన సప్తమీ*. మాఘ మాస శుక్ల పక్ష సప్తమీ తిథి రోజున సూర్య కిరణాలలో ఔషధీ గుణాలు ఉంటాయి అని, శరీరానికి సూర్య కిరణాలు సొకటం వలన చర్మ వ్యాధులూ, ఇతర వ్యాధులూ త్వరగా నయం అవుతాయి అనే నమ్మకంతో ఈ సప్తమి రోజు ను *ఆరోగ్య సప్తమీ* అని పిలుస్తారు. భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి, సూర్య భగవాణున్ని శ్రీ సూర్య పంజర స్తోత్రం, అరుణం మహాసౌరం త్రిచ పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలతో పూజిస్తారు. 
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఈరోజు  *సూర్య జయంతి*, *రథ సప్తమి*, *అచలా సప్తమి, విశోక సప్తమి వ్రతం*. సూర్య భగవానుడు, కశ్యప ఋషికి,అదితి దంపతులకు మాఘ మాస శుక్ల పక్ష సప్తమి రోజు జన్మించాడు అని పురాణ వచనం. మహాభారత కథనం ప్రకారం సూర్య జయంతి మరుసటి రోజు,భీష్మ అష్టమి తిథి రోజు భీష్మాచార్యులు వారు మోక్షం పొందారు అని కథనం. భక్తులు తమ ఆరోగ్య మెరుగుదల కోసం అరుణం, మాహాసౌరం, త్రిచ లతో కూడిన సూర్య నమస్కారాలు ఆచరిస్తారు. కోణార్క్ సూర్య దేవాలయం లోనూ, అరసవిల్లి సూర్యనారాయణ మూర్తి దేవాలయంలోనూ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈరోజు *అభోజ్యార్క వ్రతం*. ఈరోజు భక్తులు తమ మానసిక ఆరోగ్యం కోసం, మానసిక వత్తిడుల నుండి బయట పడడానికి రోజంతా ఉపవాసం ఉండి, సూర్య చంద్రులను పూజిస్తారు.

ఈరోజు *నర్మదా జయంతి*. మాఘ మాస శుక్ల పక్ష సప్తమి రోజు నర్మదా నది జన్మించిన రోజని భక్తుల విశ్వాసం. జీవితంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయ నే నమ్మకంతో భక్తులు ఈరోజు నర్మదా దేవిని పూజిస్తారు. మధ్యప్రదేశ్ లోని అమర కంటక్ ప్రాంతంలో నర్మదా నది ఉద్భవించి నది అని, ఆ ప్రాంతంలో నర్మదా జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ఈరోజు *భాను సప్తమి*.(ఆదివారం, సప్తమీ తిథి). ఈరోజు సూర్య భగవానుడిని పూజించడానికి ప్రత్యేకమైన రోజు. దీర్ఘకాలంగా ఆరోగ్య, కుటుంబ, వృత్తి పరమైన సమస్యలతో బాధపడుతున్న భక్తులు సూర్య భగవానుని అనుగ్రహం కోసం ఈరోజు అరుణం, మహాసౌరం, త్రిచ పారాయణతో సూర్య నమస్కారాలు చేయడానికి అత్యంత అనుకూలం.

*సర్వార్థ సిద్ది యోగం* (ఆదివారం, అశ్వనీ నక్షత్ర కలయిక)ఈ రోజు మ.01.35 నుండి రేపు సూర్యోదయం వరకూ ఉంటుంది. ఈ యోగ సమయంలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలం.
🔆
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
 💦 *చందమామ కథలు (Chandamama Kathalu) - 354*

*🐥అత్యుత్తమ వరం!*

*ప్రాచీన గ్రీకులు, రోమనులు రకరకాల దేవుళ్ళను, దేవతలను పూజించేవారు. అటువంటి దేవతలలో మహిళలు పూజించిన వివాహాల అధిదేవత హీరా చాలా ముఖ్యమైనది. రోమను పురాణాలలో ఆ దేవతను జూనో అనేవారు. ఒక చిన్న కొండమీద హీరా దేవత ఆలయం ఉండేది. పర్వదినాలలో వందలాది మంది స్ర్తీలు ఆ దేవాలయూన్ని సందర్శించేవారు.ఆ సమయూలలో ప్రధాన పూజారిణి, మేళతాళాలతో దేవతకు చేసే ప్రత్యేక పూజలను తిలకించేవారు.*
 
*శుభప్రదమైన అలాంటి రోజుల్లో దేవతను దర్శించడం వల్ల స్ర్తీలకు, ముఖ్యంగా పెళ్ళికాని యువతులకు సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వసించేవారు. ఒకసారి ఆలయ ప్రధాన పూజారిణి తన ఇద్దరు కొడుకులతో కలిసి దూరంలో ఉన్న స్వగ్రామానికి వెళ్ళింది. ఆ సంవత్సరం ఆలయంలో జరిగే ఉత్సవం ప్రారంభమయ్యేలోగా వాళ్ళక్కడికి తిరిగి రావాలి. అయితే, అంతలో పూజారిణికి ఉన్నట్టుండి జబ్బు చేసింది.*
 
*అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ఆలయంలో ప్రధాన ఉత్సవానికి ఒక రోజు ముందు, అక్కడికి ఎలాగైనా చేరుకోవాలని బయలుదేరింది. ఆ స్థితిలో ఆమెకు అంతదూరం నడిచి వెళ్ళే ఓపిక లేదు. బండికోసం ఆమె కొడుకులు ప్రయత్నించారు. ఒక బండి అయితే లభించిందిగాని, దానిని లాగడానికి గుర్రాలు లేవు. ఎడ్లు కూడా బండిని లాగగలవుగాని, ఎంత ప్రయత్నించినప్పటికీ అలాంటి ఎడ్లు కూడా కనిపించలేదు.*
 
*పూజారిణిలో అసహనం పెరగసాగింది. పొద్దు పోయి, రాత్రి వచ్చేసింది. ఆలయూన్ని చేరుకోవడానికి కొన్ని గంటలు పడుతుంది. తెల్లవారేలోగా ఆమె ఎలాగైనా ఆలయూన్ని చేరుకోవాలి. వెళ్ళక పోతే దేవత ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ప్రధాన పూజారిణి నిర్వర్తించ వలసిన ప్రత్యేక పూజలను ఆమె సహాయకులు చేయలేరు గనక, ఆలయూనికి వచ్చే వందలాది భక్తులకు ఆశాభంగం కలగవచ్చు!*
 
*పూజారిణి కూమారులు బైటన్‌, క్లియోబిస్‌లు ఎంత ప్రయత్నించినా గుర్రాలనుగాని, ఎడ్లను గాని తేలేక పోయూరు. తల్లిని ఆలయూనికి చేర్చడానికి తీవ్రంగా ఆలోచించి, ఇద్దరూ చర్చించుకుని ఒక నిర్ణయూనికి వచ్చారు. తల్లిని బండిలోకి ఎక్కి కూర్చోమని చెప్పారు.*

*ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ‘‘మీరెలాగైనా బండిని లాగే జంతువులను తీసుకురాగలరనే నమ్మకంనాకున్నది,'' అంటూ బండిలోకి ఎక్కి కూర్చున్నది. చీకటిగా ఉండడం వల్ల బండికి ముందు ఏమున్నదీ ఆమెకు కనిపించలేదు. కొడుకులను బండిలోకి రమ్మన్నది. అయితే వాళ్ళు నడిచే వస్తామన్నారు. తమ కొడుకులు దృఢకాయులు గనక, వారి మాటను ఆమె కాదనలేదు.*
 
*పైగా బండిలో ఒకరే ఉన్నట్టయితే, ప్రయూణం మరింత వేగంగా సాగవచ్చని ఆమె ఆశించింది. బండి వేగంగా ముందుకు సాగింది. పూజారిణి కొంత సేపటికి బండిలో అలాగే నిద్రపోయింది. ఆమెకు మెలకువ వచ్చేసరికి తెల్లవారుతున్నది. కొడుకులు వస్తున్నారా అని ఆమె బండికి ఇరువైపులా చూసింది. ఎవరూ కనిపించలేదు. ఆ తరవాత ఆమె చూపులు ముందువైపుకు మళ్ళాయి. ఇద్దరు కొడుకులూ బండిని లాగుతున్నారు!*
 
*ఆ రాత్రంతా వాళ్ళే బండిని లాగారన్న మాట! వాళ్ళు అనుకున్న మహత్కార్యాన్ని సాధించారు. సూర్యోదయ మవుతూండగా ఆలయూన్ని సమీపించారు. ప్రధాన పూజారిణి స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వర్తించడానికి సిద్ధమయింది. ఆమె కుమారులు కూడా ఆలయం లోపలే ఉన్నారు. పూజాదిక్రతువులు పూర్తయ్యూక, ‘‘మహామాతా! నా బిడ్డల్లా బాధ్యతాయుతంగా నడుచుకునే బిడ్డలు ప్రపంచంలో ఎంతమంది తల్లులకు ఉంటారు!*
 
*వారి అద్భుత కృత్యానికి తగ్గ ఫలితం దక్కాలి. వాళ్ళిప్పుడు బాగా అలిసిపోయూరు. మునుముందు వారికి అలుపూ అలసటా కలగని వరమివ్వు. దేనికీ భయూందోళనలకు లోనుగాని విధంగా దీవించు. వారికి అత్యుత్తమ వరాన్ని ప్రసాదించు!'' అని భక్తితో ప్రార్థించింది. ‘‘ఇచ్చాను!'' అన్న కంఠస్వరం పూజారిణికి మాత్రం వినిపించింది. ఆమె ఆనందంతో కొడుకుల కేసి తలతిప్పి చూసింది.*
 
*అంతవరకు నిలబడి ఉన్న కొడుకులిద్దరూ నేలపై పడి ఉన్నారు. వారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. ఆ నిద్రకు అంతం లేకుండా పోయింది. చాలా సంవత్సరాల అనంతరం అన్నదమ్ములు నిద్రలోనే మరణించారు! భయూందోళనలు లేకుండా, మరెన్నడూ అలుపూ, అలసటా ఎరుగకుండా వాళ్ళు జీవించారనడంలో సందేహం లేదు!*
       💦🐋🐥🐬💦
 పతనానికి మొదటి మెట్టు

ఈర్ష్య నుంచి ద్వేషం జన్మిస్తుంది; ద్వేషం నుంచి కలహాలు పుట్టుకొస్తాయి. కలహాల వల్ల మనసు భ్రమపడుతుంది. చివరికి మనిషే పతనమవుతాడు.

మనిషి జీవితంలో ఉన్నతికి, లేదా పతనానికి ప్రధాన కారణం అతడి గుణాలే అని పురాణకాలం నుంచి ఎన్నో కథనాలు రుజువు చేస్తున్నాయి. కొన్ని చెడు ప్రవృత్తులు ముఖ్యంగా ఈర్ష్య, అసూయ మన ప్రగతికి అతిపెద్ద శత్రువులు. ఇవి నిప్పులా హృదయాన్ని కాల్చేస్తాయి. ప్రశాంతతను హరిస్తాయి. చివరికి చరిత్రహీనుల్ని చేస్తాయి. ఎన్ని దానధర్మాలు చేసినా, పూజలూ వ్రతాలూ ఆచరించినా, ఇతరుల విజయానికి ఈర్ష్య పెంచుకుంటే, ఇతరుల శ్రేయస్సును చూసి అసూయపడితే అది మనల్నే దహించి వేస్తుంది. ఏ దానాలు, పూజలు దానినుంచి రక్షించవు. దీనికి ఎన్నో ఉదా హరణలు ఉన్నాయి. రాముడిపై ఎంతో ప్రేమ కలిగిన కైకేయి కూడా, తన కొడుకు భరతుడు అన్నకి అనుయాయిగానే మిగి లిపోతాడన్న విషయాన్ని తట్టుకోలేక ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోయింది. తానె ప్పుడో గతంలో దశరథ మహారాజు దగ్గర పొందిన వరాలను ప్రయోగించి రాముణ్ని అడవికి పంపించింది. ఇంత చేసినా భర తుణ్ని రాజుగా చూసుకోలేకపోయింది. తన కొడుకును ఎలాగైతే చూడకూడదని అనుకుందో అలాగే చూడక తప్పలేదు ఆ తల్లికి. అసూయతో అన్యాయంగా ప్రవర్తిం చినా తాను కోరుకున్న ఫలితాన్ని పొందలే కపోయింది. చివరికి ఎవరి కోసమైతే తాను అంత దారుణానికి ఒడిగట్టిందో ఆ కన్న కొడుక్కే మానసికంగా దూరమై బాధపడింది.
అందుకే ‘ఈర్ష్యా వ్యాధిః శరీరస్యం, ధర్మ నాశస్య కారిణీ' అన్నారు పెద్దలు. మహా భారతంలో పాండవ పుత్రులను చూసి పసిప్రాయం నుంచి కళ్లలో నిప్పులు పోసుకున్నారు కౌరవులు. యుధిష్ఠిరుడు రాజసూయ యజ్ఞం నిర్వహించినప్పుడు, పాండవుల వైభవాన్ని కళ్లారా చూసిన దుర్యోధనుడు తీవ్రంగా అసూయ చెందాడు. పాండవుల ప్రతిభను, ధర్మాచరణను, విజయాన్ని తట్టుకోలేక వంచనకు పాల్పడ్డాడు. అతడు చేసిన కుట్రలు, కుతంత్రాలు కురుక్షేత్ర యుద్ధానికి దారితీశాయి. చివరికి దుర్యో ధనుడి అసూయ అతణ్నే కాదు, అతడి వంశం మొత్తాన్ని నాశనం చేసింది. శిశుపా లుడు తన జీవితమంతా కృష్ణుణ్ని ద్వేషిస్తూ గడిపాడు. ఆయన గొప్పదనాన్ని సహిం చలేకపోయాడు. రాజసూయ యజ్ఞంలో ఉన్నతమైన గౌరవాన్ని పొందుతున్న కృష్ణుణ్ని దూషించి సుదర్శన చక్రానికి బలయ్యాడు. అసూయ ఎంత పెరిగితే, అది అంతటి ముప్పు తెస్తుంది.

'అసూయా పాపస్య మూలం' అన్నది రుషి వాక్యం. అసూయ అన్నిరకాల పాపా లకు మూలమని దానర్థం. అందుకే ఇతరుల విజయాలను చూసి ఆనందించాలి. మన స్ఫూర్తిగా వారిని అభినందించాలి. చేతనైతే వారినుంచి స్ఫూర్తి పొంది విజయపథంలో ముందుకు సాగాలి.
మావూరు విజయలక్ష్మి
 విద్యాధనం

మన పూర్వీకులు పేర్కొన్న అప్లైశ్వర్యాలలో విద్య ఒక్కటే శాశ్వతమైనది. మిగతా ఏడు- పదవి, ధనం, జీవిత భాగస్వామి, సంతానం, వినయం, ధైర్యం, స్థైర్యం... ఏవీ స్థిరమైనవీ శాశ్వతమైనవీ కావు. అందుకే వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు, ధర్మశా స్త్రాలు, కావ్యాలు సందర్భోచితంగా విద్యా ప్రాశస్త్యాన్ని వెల్లడించాయి. 'విద్యయా అమృ తమశ్నుతే'- అమృతత్వం పొందడానికి విద్య ఒకటే మార్గమని ఈశావాస్యోపనిషత్ ప్రవచించింది. మానవాళికి జీవితాన్ని ప్రసాదించే విద్య పూజనీయమైనది, దైవ సమా నమైనదని విష్ణుపురాణం ఉద్బోధించింది. ప్రణోదేవీ సరస్వతీ... అని విద్యాధిదేవతను కీర్తించింది రుగ్వేదం. ఆ వాగ్దేవి ఆవిర్భవించిన రోజు మాఘ శుక్ల పంచమి. ఈ రోజు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం సంప్రదాయం.

అయిదో శతాబ్దికి చెందిన భర్తృహరి తన సుభాషిత త్రిశతిలో విద్యా ప్రాధాన్యాన్ని చక్కగా వివరించాడు. విద్య దొంగిలించడానికి వీలుకాని ధనం. ముఖానికి ఒక వర్చ స్సునిస్తుంది. కీర్తిని, సుఖాలను ప్రసాదిస్తుంది. గురువుగా, బంధువుగా నిరంతరం వెన్నంటి ఉంటుంది. ఎంతగా దానం చేస్తే అంతగా పెరిగే సంపద విద్య ఒక్కటేనని భర్తృహరి ఉపదేశిం చాడు. 'స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే' అని ఆర్యోక్తి. అందుకే అవతార పురు షులు శ్రీరామ శ్రీకృష్ణులు సైతం ఆశ్రమాలకు వెళ్లి గురువుల దగ్గర విద్యనభ్యసించారు. వేయి న్నర సంవత్సరాల క్రితం భారతావనిలో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా భాసించాయి. కొండవీటి రెడ్డి రాజుల ఆస్థానంలో కవిసార్వభౌముడు శ్రీనాథుడు విద్యాధికారిగా వ్యవహరించాడు. అంటే అప్పటికే విద్యకు సంబం ధించిన విభాగమొకటి పరిపాలనలో స్థిరపడిందన్న మాట. 'చదవిన సదసద్వివేక చతురత కల్గున్' అన్నాడు పోతన. 'చదువు చదువకున్న సౌఖ్యంబులును లేవు' అన్నాడు వేమన. సమాజ పరిణామక్రమంలో అన్ని కాలాలలో విజ్ఞులు విద్యనొక జీవితావసరంగా గుర్తిం చారు. గౌరవించారు. అదే పరమ సంపదగా భావించారు. విద్యతో వినయం, విద్యా వినయాలతో అర్హత, అర్హతతో ధనం, ధనంతో ధర్మం, ధర్మంతో సుఖం లభిస్తుంది. విద్య సకలార్థ ప్రదాయిని.
దైనందిన జీవితంలో పౌరసమాజం సంపద కన్నా విద్యకు ప్రాధాన్యమివ్వడం చూడ వచ్చు. మీరేం చదువుకున్నారు? పిల్లలేం చదువుతున్నారు? అని అడుగుతారే తప్ప ధన సాధన సంపత్తి గురించి ప్రశ్నించరు. అలాగే పేరుకు ముందో వెనకో విద్యార్హతలుంటాయి తప్ప కూడబెట్టిన సంపదల వివరాలు ఉండవు. డబ్బు, నగలు, భవనాలు, వాహనాలు.. మరణించాక అన్యాక్రాంతమవుతాయి. వాటిని సమకూర్చిన వారి పేరు కాలక్రమంలో కనిపించకుండాపోతుంది. విద్యాకీర్తి ఒక్కటే ఎన్నటికీ చెరిగిపోదు. కనుక విద్యాదీపం నిరం తరం కాంతులు వెదజల్లాలి. తల్లిదండ్రులు పిల్లలకిచ్చే అత్యంత విలువైన సంపద విద్య ఒక్కటే. విద్యార్థులు చదువే సర్వస్వంగా శ్రమించాలి. విద్యావ్యవస్థ పరిపుష్టికి ప్రభుత్వాలు యథాశక్తి సహకరించాలి. విద్యాధనం మహాధనం. విద్యాదానం మహాదానం అన్న ఆర్యోక్తి జనజీవన సంస్కృతిలో భాగం కావాలి.
డాక్టర్ అయాచితం శ్రీధర్
 ఏకాగ్రత

మనసును వానరంతో ఊరికే పోల్చలేదు పెద్దలు. కోతి కొమ్మల మీద ఎగిరినట్టు మనసు కోరికలతో అటు ఇటూ తిరుగుతూ ఉంటుంది. అయితే మెడలో గొలుసు వేసి కోతిని ఎక్కడోచోట కట్టేసి ఉంచవచ్చు. కానీ మనసు పరిస్థితి అట్లా కాదు. దాన్ని కట్టే యడానికి తాళ్లు ఉంటాయా అంటే- దైవ ప్రార్ధన, భజన, జపం, ధ్యానం ఇలాంటి మార్గాలను ముందు తరాల వాళ్లు చూపారు.

ధ్యానం చేయడం, మనసును ఒక విషయం మీద కేంద్రీకరించడం సాధన ద్వారా మాత్రమే వస్తుంది. మనం ఏ పని చేస్తుంటే ఆ పని మీద పూర్తిగా దృష్టి పెట్టిన ప్పుడే ఫలితం ఉంటుంది. పూజ దగ్గర నుంచి, ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పోసే వరకు ఏ పనిలోనైనా నిమగ్నం కావడం ముఖ్యం. పుస్తకం చదువుతున్న ప్పుడు మనసు ఆ కథలోనే లీనమవ్వాలి. వంట చేస్తున్నప్పుడు వంటింట్లో ఉండ కుండా మరెక్కడో ఉంటే కూరలో ఉప్పు బదులు పంచదార పడుతుంది. వంట చెడుతుంది. పరధ్యానంతో ఏ పని చేసినా అది పనికి రాకుండా పోతుంది. 'శ్రద్ధా వాన్ లభతే జ్ఞానం'- అని భగవద్గీతలో చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. మన సును అదుపులో ఉంచుకోవడం అలవాటుగా మారాలి. భగవంతుడి నామస్మరణ చేస్తున్నప్పుడు ఆ నామం మీదే దృష్టి ఉండాలి. పూజ చేస్తున్నప్పుడు మనసులో పరమాత్మ మాత్రమే ఉండాలి. ఒక పట్టణంలో పేరుపొం దిన లాయరు ఉండేవాడు. ఆయన ప్రతిరోజూ పంచాక్షరీ మంత్రాన్ని జపించేవాడు. ఒక రోజు ఆయన పూజగదిలో ఉండగా, అర్జెంటు కేసు తీసు కుని ఒక వ్యక్తి వచ్చాడు. 'అమ్మా! లాయరుగారు ఉన్నారా?' అని అక్కడున్న కోడలిని అడిగాడు. మామగారు పూజగదికి వెళ్లేముందు ఆమెకు ఏదో చెప్పాడు. కోడలు వచ్చిన వ్యక్తితో 'మా మామగారు చెప్పులు కుట్టే అతని ఇంట్లో ఉన్నారు' అని గట్టిగా చెప్పింది. ७ మాటలు విని బయటికి వచ్చాడు. 'ఏంటమ్మా! ఏమిటా మాటలు, నేను పంచాక్షరి జపిస్తుంటే ఇంకెక్కడో ఉన్నానని చెబుతావేంటి? నీకేమైనా మతిపోయిందా?' అని గట్టిగా అడిగాడు. ఆమె శాంతంగా 'మామగారూ! మీరు ఎన్నిసార్లు, పంచాక్షరిని జపిస్తూ 'అమ్మా! అతను నా చెప్పులు కుట్టి తెచ్చాడా' అని అడగలేదు? ఒకసారైతే 'చెప్పులు కుట్టడానికి ఇచ్చి వారం రోజు లైంది. ఇంకా తీసుకురాలేదు. రానీ, వాడి వీపు పగలగొడుతాను' అన్నారు. మీరు నిజంగా పంచాక్షరిని జపిస్తున్నారా! మీ చెప్పులను తలచుకుంటూ ఉన్నారా? చెప్పండి' అంది. తాను చేసిన తప్పును అతను తెలుసుకున్నాడు. కోడలి తెలివిని మెచ్చుకున్నాడు. లాయరు
దైవాన్ని ప్రార్థించేటప్పుడు మనసులోకి ఎటువంటి ఆలోచనలనూ రానీయకూడదు. ధ్యాసంతా భగవంతుడి మీద ఉండాలి. అందుకు నిరవధిక అభ్యాసం అవసరం. వృత్తి జీవితంలోనూ అంతే. మనసును అదుపులో ఉంచుకోవడం ద్వారా సర్వం సమకూరు తుంది. మనం తలపెట్టిన ఏ కార్యమైనా ఫలవంతం అవుతుంది.

శ్రీకృష్ణప్రియ
 2612a4;19d5;241f6;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀H2
సరస్వతీ కటాక్షం…

                   *సహనం!*
                 ➖➖➖✍️

ఒక విద్వాంసుడి పరీక్ష !
```
భారత దేశంలో ప్రముఖ సంస్కృత కవి కాళిదాసు.  ఆయన చరిత్రలోనే ఉత్తమ పండితుడిగా గౌరవించబడతారు. 
పురాతన పవిత్రమైన గ్రంధాలు, భారత పౌరాణిక కథల పైన ఆధారపడిన ఆయన కవిత్వాలు ధార్మికమైన పుణ్య గ్రంధాల మధ్య చోటును దక్కించుకున్నాయి. ఆయన జీవితం ప్రేరణ కలిగించడంలో ఘనమైనది. విద్వత్తు కలిగిన తత్వవేత్తగా ప్రఖ్యాతి చెందిన ఆయనను చంద్రగుప్త మౌర్య ఆస్థానంలోని తొమ్మిదవ ఆణిముత్యంగా గౌరవించారు. 

ఆయన కొన్ని లోకాతీతమైన అనుభవాలను కూడా ఎదుర్కున్నట్లుగా వృత్తాంతాలు ఉన్నాయి. ఒక మహిళతో ఆయన చేసిన సంభాషణ మన గురించి మనం ప్రశ్నించుకొని, మన అస్తిత్వం గురించి తిరిగి ఆలోచించుకొనే విధంగా ఉంటుంది. అది ఇక్కడ వివరించబడింది..

ఒకసారి కాళిదాసు దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళుతున్నారు. సూర్యుని ప్రతాపం చాలా ఎక్కువ వుండి ఆయనకి దాహం వేస్తోంది.

దాహం భరించలేని స్థితిలో ఉన్న ఆయనకు నీళ్ళ కుండతో నడుస్తున్న ఒక స్త్రీ కనపడింది. ఆ మహిళ దగ్గరకు పరుగు పరుగున వెళ్లి, గట్టిగా ఇలా పిలిచాడు,  “ఓ మాతా! సూర్యుడు నా మీద ఎంతో కఠినంగా వున్నాడు, ఈ ఓర్చుకోలేని దాహం నా గొంతుకను ముల్లుతో  పొడుస్తున్నట్లుగా వుంది. దయతో నీ వద్ద ఉన్న నీళ్ళను నాతో పంచుకోమని అర్ధిస్తున్నాను.” 

ఆ స్త్రీ, “పుత్రా, నీ పరిస్థితి  నాకు అర్ధమవుతున్నది. ఈ నీళ్ళు తప్పకుండా నీ దహాన్ని తీరుస్తాయి. కాని నీవు ఎవరో తెలియకుండా నేను ఈ నీళ్ళను నీకు ఇవ్వలేను. దయచేసి నిన్ను నీవు పరిచయం చేసుకో”, అని అన్నది.

కాళిదాసుకు ఒక్క క్షణం కూడా వృధా చేయడం ఇష్టం లేదు. నోట్లోనుంచి వచ్చే ప్రతీ మాట ఆయన ఎండిపోయిన గొంతుకను హింసిస్తోంది, ఐనా ఆ వృద్ధ మహిళను నొప్పించకూడదని వెంటనే, “అయితే నేను ఒక సంచారిని అనుకో” అని అన్నాడు.

ఆ స్త్రీ సమాధానంగా ,“నువు సంచారి ఎలా అవుతావు పుత్రా? ఈ సృష్టిలో ఇద్దరే ఇద్దరు సంచారులు. ఎల్లప్పుడూ ఆగకుండా సంచరించేవి - ఒకరు సూర్యుడు, రెండోది చంద్రుడు. నీ నిజమైన గుర్తింపు చెప్పు” అని అన్నది.

ఆ సమాధానానికి కాళిదాసు ఆశ్చర్యపోయాడు. గొంతు సరిచేసుకొని, “నేనొప్పుకుంటున్నాను, సరే నువ్వు నన్ను ఒక అతిధిగా ఎందుకు అనుకోకూడదు?” అని అడిగాడు. 

దానికి ఆ స్త్రీ “నీవు అతిథివి కాదు నాయనా. మన జీవితంలో ఇద్దరే అతిథులు ఒకటి సంపద, రెండు యవ్వనం. ఇవి ఖచ్చితంగా వస్తాయి, వచ్చి వెళ్లిపోతాయి, నువ్వు ఎంత బతిమాలినా ఉండవు! ఇప్పుడు చెప్పు, నువ్వు ఎవరో” అని అన్నది.

అంతటి సూక్ష్మ జ్ఞానాన్ని చూసి కాళిదాసుకి మాటలు రాలేదు. ఐనా ఆ స్త్రీ తర్కం ఆయనను ఉత్తేజపరిచింది. సమాధానంగా “ఓ  మాతా నేను ఒక సహనాన్ని” అని అన్నాడు.

ఆ స్త్రీ వెంటనే ఆయన చెప్పిన దానికి ఒప్పుకోకుండా, “నేను అలా అనుకోవట్లేదు. సహనం కలిగినవి  రెండే జీవులు మొదటిది  భూమాత, మన అందరి పాపాలభారాన్ని మౌనంగా సహిస్తోంది. రెండోది మన చుట్టూ వున్న వృక్షాలు, అవి ఎటువంటి విచక్షణ లేకుండా ప్రతిఒక్కరికీ, వాటికి నష్టం కలిగించే వాళ్ళకి కూడా ఉదారంగా ఉంటాయి. నీకు అంత సహనం లేదు.” అని అంది. 

కాళిదాసుకి ఈ మాటల యుద్ధంలో తాను ఓడిపోతున్నానేమో అన్న చిరాకు ఎక్కువ అవుతోంది. దాహం మరింత పెరిగి, ఆయన నిగ్రహన్ని హరించివేస్తోంది, దానితో ఆయన,  “అయితే నేను ఒక మొండివాడ్ని అయి వుండాలి” అని అన్నాడు. 

దానికి  సమాధానంగా ఆ స్త్రీ, “ఓ  పుత్రా! నువ్వు మొండి వాడివి కానే కాదు. గోళ్ళు, జుట్టు ఇవి రెండే మొండివి, మనం ఎన్నిసార్లు కత్తిరించినా మళ్ళీ పెరుగుతాయి", అని అన్నది.

కాళిదాసు సహనాన్ని కోల్పోయాడు. గుక్కెడు నీళ్ల కోసం ఇంత చర్చా! అప్పుడాయన పెద్దగా, “అయితే నేనొక మూర్ఖుణ్ణి” అని అరిచాడు. 

ఆ స్త్రీ, “అది నిజమైతే ఎంత బాగుండేది! ఈ భూమి మీద తిరిగే మూర్ఖులు ఇద్దరే. నువ్వు వారిలో ఒకడివి కావు. మొదటి వాడు తగినంత జ్ఞానం లేకుండా పరిపాలించే రాజు. రెండవవారు ఆ రాజుగారిని సంతోషపెట్టి, ఆయన దృష్టిలో మంచిని పెంపొందించుకోవడానికి అతని నిర్ణయాలను కూడా తప్పుద్రోవ పట్టించే ప్రజలు” అని అన్నది. 

ఆ స్త్రీ యొక్క జ్ఞానాన్ని చూసి కాళిదాసు సంభ్రమంతో అవాక్కయిపోయాడు. భవిష్య ప్రపంచంలో కూడా ఎవరూ చూడని గొప్ప ప్రఖ్యాతి పొందిన ఒక సంస్కృత కవి, బహుశా చదవడం కూడా రాని ఒక మహిళ ముందు తల ఎత్తుకొని నిలబడలేకపోయాడు.

ఆయన ఓటమిని అంగీకరిస్తూ ఆ స్త్రీ కాళ్ళమీద పడి, “ఓ మాతా! నా గురించి నాకు తెలుసనుకున్న నేను ఎంత మూర్ఖుడినో తెలుసుకున్నాను. మన ఈ కలయిక నా ఆలోచనా విధానాన్నే మార్చివేసింది, నేను సిగ్గుతో కుంచించుకుపోతున్నాను. నా అమాయకత్వాన్ని క్షమించి, నామీద దయ చూపించి గుక్కెడు నీళ్ళను ప్రసాదించమని యాచిస్తున్నాను.”  

ఆయన కళ్ళ నిండా నీళ్లతో ఆ స్త్రీ ని చూడడానికి తల ఎత్తగానే కనిపించిన  దృశ్యం, దాహంతో సొమ్మసిల్లిపోయానా, లేక కల కంటున్నానా అన్న అనుమానాన్ని కలుగజేసింది. 
ఆ స్త్రీమూర్తి ప్రదేశంలో చంద్రుని లాగా కాంతిని ప్రసరిస్తున్న అద్భుతమైన ఆకారం నిలబడి వుంది. ఆవిడ కాళిదాసును కటాక్షించిన సరస్వతి మాతే తప్ప వేరెవ్వరో కాదు. 
ఈ మండుటెండలో చల్లని నీటి కన్నా అతిసున్నితమైన స్వరంలో ఆవిడ మాట్లాడింది.. 

ఆమె చిరునవ్వుతో, “కాళిదాసా! లేచి నిలబడు నాయనా. నువ్వు నిజంగా గొప్ప పండితుడివి. నీ మాటలకు జీవితాలను బాగు చేసి, వాటిని మార్చగలిగిన శక్తిని కలిగి ఉన్న విషయం వాస్తవమే కానీ, నీ సామర్ధ్యాలను చూసుకొని నీ అహం, నువ్వు సాధించిన వాటిని కించపరుస్తున్నది. నీవు విద్యావంతుడవే కాని దానికి తోడుగా నీ హృదయంలో అహంకారానికి కూడా చోటు ఇచ్చావు. నీకు సరైన మార్గదర్శనం చేయడానికే నేను వచ్చాను.”

“నిజమైన పండితుడికి గుర్తు అతని జ్ఞానం కాదు అతని వినయం. నీలోని అహంకారాన్ని పోషించే విద్య నిరుపయోగమైనది. దానితో జీవితమంతా వృధా అవుతుంది. తాను సాధించిన వాటిని ఏ విధంగా పరిగణిస్తున్నాడు అనే విషయాన్ని నీవంటి జ్ఞానవంతుడైన వ్యక్తి అర్ధం చేసుకొని ఇతరులకు బోధించాలి అంతే గాని వాటిని చూసుకుని గర్వపడకూడదు. అతడు చేయవలసినదల్లా ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండడమే ఎందుకంటే జ్ఞానం అనంతమైనది. కాబట్టి నువ్వు ఎల్లప్పుడూ విద్యార్థిగానే ఉండాలి నాయనా," అని అన్నది.

కాళిదాసు వెంటనే లేచి నిలబడి ఆవిడకు నమస్కరించాడు. తనలోని అజ్ఞానాన్ని ధ్వంసం చేసినందుకు సరస్వతిదేవికి కృతజ్ఞతలు తెలిపాడు. తన తప్పును తానే తెలుసుకున్నందుకు ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తూ తనకు అందించిన ఈ శాశ్వతమైన విజ్ఞాన ముత్యాలను ఎల్లప్పటికీ పోగొట్టుకోకూడదని అనుకున్నాడు. 

సరస్వతి దేవి చిరునవ్వుతో చివరికి నీటిపాత్రను కాళిదాసుకు అందించింది. 
ఆయన కృతజ్ఞతతో ఆ పాత్రను మెరుస్తున్న కళ్ళతో  స్వీకరించి  తేనె కన్నామధురంగా ఉన్న ఆ నీటిని త్రాగాడు. ఆయన  నీటి దప్పికనే కాక ఆయన విజ్ఞాన దాహం కూడా ఆ నీటితో తీరిపోయింది.
ఈ కథ ఇక్కడితో ముగిసింది కాని ఒక అనంతమైన సందేశాన్ని అందిస్తోంది. అది ఏమిటంటే, భగవంతుడు మనకు ప్రసాదించిన లక్షణాలు ఇతరులకు ఉపయోగపడనంత వరకు అవి అర్ధరహితమే.

“వినమ్రత, నిరాడంబరత అనే లక్షణాలు ఉంటే నీకు కావలసినవన్నీ నీ వద్ద ఉన్నట్లే అనుకోవచ్చు.”✍️```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...  9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
 ఏకాదశ రుద్రులు ( Ekadasa rudrulu ) 
ఏకాదశ రుద్రులు అంటే శివుని పదకొండు రూపాలు లేదా అవతారాలు, వీరు హిందూ పురాణాల ప్రకారం వివిధ పేర్లతో ప్రస్తావించబడతారు, మత్స్య పురాణం ప్రకారం కపాల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్బుధన్య, శాస్త, శంభూ, చండ, భవ అనేవి వారి పేర్లు, వీరికి శివాలయాల్లో, ముఖ్యంగా కోనసీమ వంటి ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఇవి శివునిలోని శక్తిని, ఉగ్ర రూపాన్ని సూచిస్తాయి. 
మత్స్య పురాణం ప్రకారం: కపాల, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజపాద, అహిర్బుధన్య, శాస్త, శంభూ, చండ, భవ.
విష్ణు పురాణం ప్రకారం (మగ రూపాలు): మన్యు, మను, మహమస, మహాన్, శివ, ఋతుధ్వజ, ఉగ్రరేత, భవ, కామ, వామదేవ, ధృతవ్రత
మహాభారతం ప్రకారం: మృగవ్యాధ, సర్ప, నిరృతి, అజైకపాద్, అభివర్ధన, పినాకి, దహన, ఈశ్వర, కపాలి, స్థాను, భర్గ.
వాల్మీకి రామాయణం ప్రకారం: అజ, ఏకపాద, అభీర్బుధ్యా, హర, శంభూ, త్రయంబక, అపరాజిత, ఈశాన, త్రిభువన, త్వష్ట, రుద్ర. 
ప్రభల తీర్థానికి 476 ఏళ్ల చరిత్ర - ప్రభల ఉత్సవానికి రాష్ట్ర పండగ హోదా కల్పించిన ప్రభుత్వం - కనుమ రోజు సంప్రదాయంగా ప్రభల తీర్థం వేడుక. కోనసీమ అందాలు ఇంద్రదనసుల్లా కొలువు తీరే ప్రభల తీర్ధం కన్నుల పండుగలా కనుమనాడు జరుగుతుంది.
మారుతున్న కాలంలో నాటికీ నేటికి సాంస్కృతిక సంప్రదాయాలకు ఆదరణ తగ్గలేదనటానికి ఈ ప్రభల ఉత్సవాలే ఉదాహరణ. 17వ శతాబ్దంలో జగ్గన్న మహారాజుగా పిలిచే రాజా వత్సవాయ జగన్నాథ మహారాజు 11 మంది ఏకాదశి రుద్రులంతా ఒకచోట కొలువు తీరాలనే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి కనుమ పండగ రోజు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తోట మొసలపల్లి గ్రామములో వుంది కనుక దీనికి ఆతిధ్యము మొసలపల్లి కి చెందిన మధుమానంత భొగేశ్వరుడు మిగతా గ్రామ రుద్రులకు ఆతిధ్యము ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నా ముందే తోటకు చేరుకుని అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ.ఈ ఏకాదశ రుద్రులకు అద్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు
"శ్రీ వ్యాఘ్రేశ్వరుడు".ఈ వ్యాఘ్రేశ్వరుడు కి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదా పుర:స్సరంగా ఒక్కసారి లేపి మళ్ళి కిందకు దించుతారు. ఈ 11 శివుళ్ళకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానము.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటీ అంటే గంగలకుర్రు మరియూ గంగలకుర్రు(అగ్రహారం) రుద్ర ప్రభలు ఈ తోట కి రావాలంటే మధ్యలో కాలువ(కౌశిక) దాటాలి.ఆ ప్రభలు ఆ కాలువలోంచి ఏ మాత్రం తొట్రూ లేకుండా "హరా హరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడువలేము. అలాంటిది ఒక 50 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లు గగుర్పొడుస్తుంది.ఇక ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేను ని తొక్కుతూ పంటను తొక్కుతూ వచ్చినా రైతులు భాదపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతం గా భావిస్తారు. అలా ఏక కాలం లో ఏకాదశ రుద్రుల(11ప్రభలు) దర్శనం చేస్తుంటే కళ్ళు ఆనందాశ్రువులు రాలుస్తాయి.
దర్శనీయ ప్రణాళిక 
అమలాపురం నుంచి రావులపాలెం పోవు బస్సులో ముక్కామల చేరుకోవాలి. ముక్కామల ఆటో స్టాండ్ నుంచి ఒక ఆటో ఏర్పాట్టు చేసుకోవాలి.
1) ముందుగా ముక్కామల శివాలయ దర్శనం
(కాలాగ్నిరుద్రాయ).
2) ముక్కామల నుంచి నేదునూరుకు ప్రయాణం. నేదునూరు శివాలయ దర్శనం (త్రికాగ్నికాలయ) తర్వాత వక్కలంక ప్రయాణం.
3) వక్కలంక శివాలయ దర్శనం (త్రిపురాంతకాయ) పిమ్మట ఇరుసుమండకు ప్రయాణం (వయా) ముక్కామల.
4) ఇరుసుమండ శివాలయ దర్శనం (త్ర్యంబకాయ) పిమ్మట పులేటికుర్రుకు ప్రయాణం.
5) పులేటికుర్రు శివాలయ దర్శనం (శ్రీ మన్మహాదేవాయ) పిమ్మట వ్యాఘ్రేశ్వరంకు ప్రయాణం.
6) వ్యాఘ్రేశ్వరం శివాలయ దర్శనం (విశ్వేశ్వరాయ) పిమ్మట కె. పెదపూడికు ప్రయాణం.
7) కె. పెదపూడి శివాలయ దర్శనం (మహాదేవాయ) పిమ్మట గంగలకుర్రుకు ప్రయాణం.
8) గంగలకుర్రు శివాలయ దర్శనం (సదాశివాయ) పిమ్మట గంగలకుర్రు అగ్రహారంకు ప్రయాణం.
9) గంగలకుర్రుక అగ్రహారం శివాలయ దర్శనం (సర్వేశ్వరాయ) పిమ్మట పాలగుమ్మి కు ప్రయాణం.
10. పాలగుమ్మి శివాలయ దర్శనం (మృత్యుంజయాయ) పిమ్మట మొసలపల్లి కు ప్రయాణం.
11. మొసలపల్లి శివాలయ దర్శనం (నీలకంఠాయ) పిమ్మట ముక్కామలకు తిరుగు ప్రయాణం. ముక్కామల నుంచి ఇంటికి ప్రయాణం.
ఏకాదశ రుద్రులును ఏక కాలములో సందర్శించుట పుణ్య దాయకం. వాటిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. తద్వారా సకల పాపాల నుండి విముక్తులవుతారు. వ్యాధులు నుంచి విముక్తి పొందగలరు అని భక్తుల ఘాడ విశ్వాసం.
స్వంత వాహనములు కలిగిన వారు అమలాపురం నుంచి మొసలపల్లి చేరుకుంటారు. చివరి క్షేత్రంగా నేదునూరు చేరుకుంటారు. నేదునూరు నుంచి అయినవిల్లికి బయులుదేరుతారు.
 *ఈ ఒక్కటి ఆలోచించండి..

తోటి మనిషికి మర్చిపోకుండా థాంక్స్ చెబుతాం.. కానీ మన జీవితానికి మనం ఎప్పుడూ కృతజ్ఞత ప్రదర్శించం! ఒక తరం క్రితం వరకూ చాలామంది పొద్దున్నే లేవగానే, రాత్రి నిద్రపోయే ముందు కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకుని, జీవితానికీ, భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకునే వారు. ఇక్కడ భగవంతుడు అనే మాట చదవగానే ఉన్నాడా లేదా అనే టాపిక్‌కి వెళ్లే మేధావితనమే మనం చూస్తున్నాం గానీ.. అది భగవంతుడు అయినా, లైఫ్ అయినా ఓ అజ్ఞాత శక్తికి వినమ్రంగా నమస్కరించడంలో తప్పేం లేదు కదా!

సమాజంలో రోజురోజుకీ పెరుగుతున్న నెగిటివ్ ఎమోషన్స్‌‌ని మనం absorb చేసుకోవడం చాలా కష్టం. మన మానసిక, శారీరక ఆరోగ్యాలు దెబ్బతింటాయి వాటిని లోపలికి తీసుకుంటే! అలాంటి నెగిటివ్ ఎమోషన్స్‌కి అద్భుతమైన పరిష్కారం.. వాటిని పాజిటివ్ ఎమోషన్స్‌తో మార్పిడి చెయ్యడం!

అలాంటి పాజిటివ్ ఎమోషన్స్‌లో ముఖ్యమైనది కృతజ్ఞత తెలపడం! ఈరోజు మనం శ్వాస తీసుకుంటున్నామంటే, కాళ్లూ, చేతులూ, శరీర అవయువాలూ బాగున్నాయంటే, తినడానికి తిండి ఉందంటే... ఓ ఉద్యోగమో, వ్యాపకమో, కుటుంబమో, మన వాళ్లంటూ కొంతమంది మనుషులో ఉన్నారంటే మనం చాలా పెట్టి పుట్టినట్లు! అందుకే ఈ జీవితాన్ని ప్రేమించండి.. ప్రతీరోజూ దానికి కళ్లు మూసుకుని థాంక్స్ చెప్పండి.

నిన్ను ప్రేమించే, ఆప్యాయంగా చూసే ప్రతీ మనిషికీ తరచూ ఫోన్ చేసి కాస్త ఆప్యాయంగా మాట్లాడండి. నీ ఎదుగుదలకి ఉపయోగపడిన గురువులకి నమస్కరించండి.. వారి ఆశీస్సులు లభిస్తాయి. ఇతరులు బాగుండాలని కోరుకోండి. ఇలాంటి దృక్పధం ఉన్నంత కాలం సమాజం అల్లకల్లోలం అయినా నువ్వు బాగుంటావు.. కారణం నీ మనఃస్థితి గొప్ప భావనలతో నిండి ఉంది కాబట్టి! ఇక నుండి మొదలుపెట్టండి.. అందరికీ, జీవితంలో అన్నింటికీ ప్రణామాలు తెలపడం!