Tuesday, January 13, 2026

 *@ చెడ గొట్టేది పెద్దలే @
           66వ రోజు
    తేది: 13/01/2026
""""""""""""""""""""""""""""""""""""""
రాఘవ జీతంలో సగం సిగరెట్లకే తగలేస్తాడు సిగరెట్ల
వ్యసనం మానుకోమని, ఆరోగ్యానికి మంచిది కాదని
భర్తకి చెప్పి చెప్పి రాధ విసిగిపోయింది ఒకరోజు
అయిదొందల నోటు ఇచ్చి కొడుకును సిగరెట్ ప్యాకెట్
తెమ్మన్నాడు రాధ అభ్యంతరం చెబితే 'ఏం కాదులే
అని కసురుకున్నాడు కొడుకు సిగరెట్లు తెచ్చి పాకెట్
మనీ కావాలంటూ యాభై రూపాయలు తీసుకున్నాడు...
మర్నాడు రాధ ఏదో రాసుకోవడానికి పెన్ను కోసం
కొడుకు స్కూల్ బ్యాగ్ తెరిచింది అందులో సిగరెట్లు
ఉండటంతో భర్తకు చూపించింది 'నీ బ్యాగ్ లో సిగరెట్లు
ఎందుకున్నాయిరా?' అడిగాడు రాఘవ కోపంగా, 'అవీ...
అవీ..నా ఫ్రెండ్ పెట్టాడు నాన్నా' అన్నాడు కొడుకు
భయంగా 'నీ బ్యాగ్ లో వాడెందుకు పెడతాడ్రా?'
అంటూ బెల్ట్ తీసుకుని కొడుకును కొట్టడం మొదలెట్టాడు తండ్రి 'పిల్లాణ్ని కొట్టి చంపేస్తావా?' అంటూ
పెద్దగా ఏడుస్తూ కేకలు పెట్టింది రాధ ఆ గోలకి
ఇరుగూ పొరుగూ వచ్చారు 'నువ్వు మనిషివేనా?
పిల్లాణ్ని కొడతావా? నువ్వు కాల్చితే ఒప్పూ, వాడు
కాల్చితే తప్పునా? ముందు నువ్వు మారు' అని
రాఘవని చివాట్లు పెట్టారు అతడికి తల తీసేసినట్లయింది ఇక సిగరెట్లు తాగనని శపథం చేసుకున్నాడు అతణ్ని మార్చడానికి తల్లీ కొడుకూ ఆడిన
నాటకం అదని ఆ తండ్రికి తెలియదు...

శ్రీహరి గెజిటెడ్ అధికారి మొదట్లో పార్టీల్లో తాగేవాడు క్రమంగా అది వ్యసనంగా మారింది కొడుకు
సుధీర్ ఈమధ్యే ఉద్యోగంలో చేరాడు తండ్రిని చూసి
అతనూ తాగడం మొదలెట్టాడు అమ్మానాన్నలు
కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తండ్రీ
కొడుకూ ఇద్దరూ తాగుబోతులని తెలిసి వచ్చిన సంబం
ధాలు వెనక్కిపోతున్నాయి ఒకరోజు అర్ధరాత్రి శ్రీహరికి
ఫోన్ వచ్చింది 'మీ వాడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరి
కాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు' అని. ఎస్ఐ శ్రీహరి
మేనల్లుడే విషయం తెలిసి ఉదయాన్నే శ్రీహరి స్నేహితులు పరామర్శకి వచ్చారు అతడికి చాలా అవమా
నంగా అనిపించింది తను చేసిన పనే కొడుకూ చేస్తు
న్నాడు కాబట్టి అతణ్ని ఏమనడానికీ మొహం చెల్లలేదు
దాంతో ఇక జన్మలో తాగకూడదని గట్టిగా నిర్ణయించు
కుని భార్యాబిడ్డలకు మాటిచ్చాడు అతడిలో
ఆ మార్పు
తేవడానికి భార్య, కొడుకు, మేనల్లుడు కలిసి ఆడిన
నాటకం అదని శ్రీహరికి తెలియదు
ఇలా నాటకాలతో వ్యసనాలు మాన్పించడం మాటలు
చెప్పినంత తేలికేమీ కాదు పెద్దలు ఏం చేస్తే పిల్లలూ
అదే చేస్తారని చెప్పడానికే ఈ ఉదాహరణలు. చాలా
మంది తండ్రులు చేస్తున్న తప్పులే ఇవి తాము వ్యస
నాల బారిన పడటమే కాక పిల్లలూ ఆ దారి పట్టేం
దుకు కారణమవుతున్నారు చేజేతులా తమ బిడ్డల
ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారు నిజంగా
పిల్లల మీద ప్రేమ ఉన్న తల్లిదండ్రులెవరూ వ్యసనాల
జోలికి పోరని గుర్తుంచుకోవాలి...*
 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_♻️ మారిస్ ఫ్రీడ్మన్ ఒక విదేశీయుడు. మహర్షి దర్శనం కోసం వచ్చి, మహర్షి మీద కొన్ని గేయాలు వ్రాశారు. మహర్షి ఆ గేయాలన్ని చదివి ఇలా సెలవిచ్చారు..._*
*_ఇదే విషయాన్ని కొన్ని శతాబ్దాల క్రితం అప్పయ్య దీక్షతార్ తన సంస్కృత రచనల్లో చెప్పారు. తాటాకు మీద ఉన్న ఆ గేయాలన్ని ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేవు. అందులో ఉన్నది ఏమిటంటే "రాజు ముందు నృత్యం చేసే రాజనర్తకి తన కాళ్ళు నొప్పి పెట్టినా రాజు సైగ చేసేదాకా నృత్యం ఆపలేదు" అని._*
*_అదేవిధంగా.. "ఓ భగవాన్ ! జనన మరణాల వలయంలో పడి అలసిపోయాను. నాపైన కరుణ చూపి ఈ జనన మరణ నృత్యావర్తనం (చక్రం) నుంచి నన్ను తప్పించు" అని._*
*_🦚 మహర్షి ఎందుకో ఒక్క నిమిషం చటుక్కున ఆగి మరలా ఇలా కొనసాగించారు..._*
*_ఈ విదేశీయుడు ఇక్కడి వారే. ఏ కారణం చేతనో విదేశంలో జన్మించారు. మళ్ళీ ఇక్కడికి చేరాడు. లేకపోతే అప్పయ్య దీక్షితులు వ్రాసినట్లుగా ఇలా గేయాలు వ్రాయడం ఏమిటి ?!"_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘‍♀️ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍
 


🌟 దివ్యమైన పిచ్చి! 🌟

శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అద్భుతమైన సత్యం ఇది. ఈ ప్రపంచం నిజంగానే ఒక పిచ్చి ఆసుపత్రి లాంటిది.మనం దేని కోసం ప్రాకులాడుతున్నాం,దేని కోసం పిచ్చివాళ్ళం అవుతున్నాం అనేది చాలా ముఖ్యం.
గురుదేవులు ఇలా అనేవారు:
"ఈ ప్రపంచం ఒక ఉన్మత్త శరణాలయం, కొందరు ధనవ్యామోహంతో, కొందరు ఇతర వ్యామోహాలతో, మరికొందరు కీర్తి ప్రతిష్ఠల వ్యామోహంతో పిచ్చివారైతే, అత్యల్ప సంఖ్యాకులు మాత్రమే భగవంతుని నిమిత్తం పిచ్చివారవుతున్నారు. ఇందులో, భగవంతుని యందు ఉన్మత్తత కలిగి ఉండటమే నా అభిమతం. మనలను క్షణంలో బంగారంగా మార్చే పరుసవేది వంటివాడు భగవంతుడు. దీనివలన ఆకృతి నిలిచి ఉన్నా, స్వభావం మారినట్టే. మనలో హాని చేసే గుణం తొలగిపోయి, పరిశుద్ధమై నిలిచి ఉంటాము."🕉️🙏
 

 


🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺

1) ఏం దర్శనం అయ్యింది అనేది ముఖ్యం కాదు.
దర్శించేవాడు ఎవడు అనేదే ముఖ్యం.

2) భగవంతుణ్ణి నమ్మినందుకు గుర్తు ఏమంటే భగవంతుణ్ణి ఏమీ కోరకపోవడమే.

3) కావాలి - వద్దు ఈ రెంటినీ వదిలినవాడే నిజమైన విరాగి.

4) ఒకటి' అని నిర్వచించడం కూడా ద్వైతమే.
ఊరక ఉండడమే అద్వైతము.

5) “నా”లోనిది ఈ ప్రపంచం.
“నా” ఒక్కనిదే ఈ ప్రపంచం.
“నేనే" ఈ ప్రపంచం.

6) మన సమస్యలకు కారణం మనస్సే.
 




 *భగవంతుని_అనుగ్రహం*

*వ్యాస భగవానుడు వేదవిభజన చేశాడు. ఎన్నెన్నో రచనలుచేశాడు ఆఖరికి సర్వధర్మాలను వివరించే మహాభారతాన్ని కూడా రచించినప్పటికీ, మనశ్శాంతి లేక బాధపడుతుండేవాడు. అలాంటి సమయంలో ఓ రోజున నారదుడు వ్యాసుని దగ్గరకు వచ్చి ఆయన వ్యాకులత తెలుసుకొన్నాడు. వ్యాసుని దుఃఖం దూరం చేద్దామనుకొని ఓ వ్యాసా! నీవు ఇన్ని రచనలు చేశావు కాని శ్రీహరి లీలావిశేషాలను తెలిపే కథలను పట్టించుకోలేదు. ఇక నీవు ఇపుడు శ్రీహరి గుణగానాన్ని కథా రూపంలో వ్యక్తం చేస్తూ రచన సాగించు నీకు మనస్తాపం నశిస్తుంది అని చెప్పాడు.*

*పూర్వంలో తాను ఎలా మనఃశాంతిని పొందిందో వివరించాడు. పూర్వజన్మలో వేదాధ్యయన సంపన్నుడైన ఓ గొప్పవారి ఇంట పనులు చేసే దాసికి పుత్రుడుగా జన్మించాను. ఓసారి ఆ ఇంటి యజమాని చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఋషులకు సేవ చేయటం కోసం నన్నుపంపాడు. ఋషుల దగ్గర నేను చేసి వారి ఆదరాన్ని చూరగొన్నాను. నా సేవకు ఆ ఋషులు ఎంతగానో సంతోషించారు. ఋషులతో పాటుగా నేను నిరంతరం ఆ హరినామ సంకీర్తన చేస్తుండేవాడిని. చాతుర్మాస్య దీక్ష తర్వాత ఋషులంతా తీర్థయాత్రలకు బయలుదేరుతూ నాకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు. నిరంతరం ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మంచి జరుగుతుందని చెప్పారు. త్వరలోనే భగవంతుని అనుగ్రహం పొందవచ్చుని కూడా వారు చెప్పారు. కొన్నాళ్ల తరువాత పాము కాటు వల్ల నా తల్లి చనిపోయంది. ఆ దుఃఖాన్ని నేను భరించలేకపోయాను. ఇక అక్కడ నాకు పనేమీలేదని అక్కడ్నుంచి వెళ్లిపోయాను. పోతూ కూడా హరినామ కీర్తన మాత్రం నేను ఆపలేదు. అలా నేను నడిచి నడిచి చాలా దూరం నడచి అలసిపోయ ఓ చెట్టు కింద కూర్చుని కళ్లు మూసుకొన్నాను. అంతలో నా దృష్టికి ఆ మాధవుడు కనిపించి అంతలోనే కల చెదిరింది. జనార్దనుడు కనిపించకుండా పోయాడు. నేను ఊహించనదని జరిగి వెనువెంటనే శ్రీహరి కనిపించనందున నేను బాగా డస్సిపోయాను. కాని మరలా పనికట్టుకుని ముందుకు వెళ్లి దారిలో తటాకం కనిపిస్తే స్నానపానాదులు చేసి మళ్లీ హరినామ సంకీర్తన చేస్తూ నాకు దైవదర్శనం కలుగాలని వేడున్నాను.*

*కాని ఆ దైవం నన్ను కరుణించలేదు. మళ్లీ ఆ హరి రూపం నాకు కనిపించలేదు. నేను పదేపదే కోరుకుని అలసిపోయాను. భగవంతుని దర్శనం కలుగలేదని నా శరీరాన్ని శుష్కింపచేసుకొన్నాను. కాని భగవంతుని అనుగ్రహాన్ని పొందలేక పోయాను. అపుడు ఆ శరీరవాణి నాతో ఓయ భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి దగ్గర దారి ఉంది. అదేంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించి, కర్మలన్నింటినీ నిర్మూలన చేసి, పరిశుద్ధుడైన యోగిగా మారితే భగవంతుడు తనకుతానై వచ్చి నిన్ను అనుగ్రహిస్తాడు. అట్లా నీకు చేసే శక్తి లేకపోతే కేవలం భగవంతుడినే నిశ్చలంగా నమ్మి భగవంతుడిపై భారం వేసి నేను చేసే ప్రతి పనీ భగవంతుని ప్రేరణతోనే చేస్తున్నాను. కర్త కర్మ క్రియ కూడా భగవంతుడు తప్ప నేను అనేది కేవలం పరికరమే. దాన్ని భగవంతుడే ఉపయోగించుకుంటున్నాడు. ఫలితమూ భగవంతునిదే కార్యమూ భగవంతుడే అని నమ్మి జీవనయానం సాగించు భగవంతుడి నామాన్ని, చరిత్రను నిత్యం పఠించు... భగవంతుని నిస్సంగత్వాన్ని భక్తుని కోసం ఆయన చేసే సంగత్వాన్ని గుణాతీతుడెట్లానో అట్లానే భక్తునికోసం ఎట్లా గుణవంతుడౌతాడో, ఎట్లా రూపవంతుడు అవుతాడో ఇవన్నీ అంటే భగవంతుని లీలావిశేషాలను నిరంతరం స్మరించు అని చెప్పింది. నేను ఆవిధంగా చేశాను. నాకు భగవంతుని అనుగ్రహం దొరికింది. కనుక నీవు కూడా భవగంతుని లీలావిశేషాలకర అక్షరరూపం ఇవ్వు తప్పక భగవంతుని అనుగ్రహం దొరుకుతుంది అనిచెప్పాడు. వెంటనే నారదోపదేశంతో వ్యాసుని భాగవత రచన చేశాడు. మనఃశాంతినిపొందాడు. మనమూ భగవంతుని గుణగానాన్ని ఆలపిద్దాం. భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుదాం*

*┈━❀꧁ గురుభ్యోనమః ꧂❀━┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁📚🍁 🙏🕉️🙏 🍁📚🍁
 *భోగిపండుగ* గురించి..
               
మనకు వచ్చే అనేక పండుగలలో ‘భోగిపండుగ’ను చాలా విశేషంగా చేసుకుంటాం. 
భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండుగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజు గనుక దానికి భోగిపండుగ అని పేరు. 
ఈ ‘భోగి పండుగ’ వచ్చే సమయానికి వ్యవసాయ దారులు పంటలు కోతలు కోస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన పంట జాగ్రత్తగా ధ్యాన్యాగారంలో నిలవ చేసి మళ్ళీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించిన కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాలను అనుభవిస్తారు. భోగిపండుగ అని పిలవడానికి కారణం ఏమిటంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యం అంతా వచ్చేటటువంటి కాలం.

ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా ఉండే  భోగి పండుగ బాహ్యంలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటటువంటి ఆ కాలం ప్రారంభం అవడానికి సంకేతం. 
ఇది బాహ్యమునందు భోగి. ఆంతరముగా విచారణ చేస్తే భోగి పండుగకు ఉన్న విశేషం చాలా చాలా గొప్పది. 
దక్షిణాయన పుణ్యకాలం యొక్క చిట్టచివరి రోజు ఏదైతే ఉందో, మకర సంక్రాంతికి ముందు ఉండే రోజు భోగి పండుగ. ఈ తిథినాడు భోగిపండుగ రావాలి అనే నిర్ణయం ఉండదు.

మనిషి ఆంతరముగా భోగం అనుభవించడానికి కావలసినటువంటి స్థితిని పొందుతాడు. విడుదలయే మోక్షము. అటువంటి మోక్షాన్ని పొందడమే జీవితంలో నిజమైన భోగి. అటు ఆధ్యాత్మికంగా భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి కావలసిన కాలం అయి ఉండడం ఒక ఎత్తు. లౌకికమైన కోరికలకు దూరంగా ఉండి ఆంతరమునందు భగవంతుడి దగ్గరగా ఈశ్వరకాలం పెంచుకుంటాం అని చెప్పడానికి సూచనగా భోగిమంట అని వేస్తారు. అందులో కట్టెలు, ఆవుపేడతో చేసిన పిడకలు వేస్తారు. అంటే దాని అర్థం లౌకిక కామాన్ని కాల్చేసి ఈశ్వర కామాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తాం అని. బాహ్యంలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాం. ఆ భోగి లౌకిక కామన కాలిపోయి ఈశ్వర కామన ఒక్కటే మిగిలిపోతే ఆ ఈశ్వర కామమే నిరతిశయ భక్తిగా మారితే 
ఆ భక్తివలన చేసిన కర్మాచరణం చేత చిత్తశుద్ధి చేత పాత్రత కలిగితే పాత్రత వలన జ్ఞానము కలిగితే జ్ఞానము వలన భోగి. 
భోగి అంటే ఈశ్వరునితో భోగించుట. అనగా మోక్ష సిద్ధి కలుగుతుంది. దక్షిణాయనంలో చేసిన ఉపాసనకి సిద్ధిని ప్రకటనం చేసేటటువంటి రోజుగా చెప్పబడే విశేషమైన తిథి గనుక దానికి ప్రత్యేకంగా ఒక తిథి నిర్ణయం చేయరు. దక్షిణాయనానికి చిట్టచివరి రోజు ఏది ఉంటుందో అదే మనకి భోగి పండుగగా నిర్ణయింపబడి ఉంటుంది.

ఈ భోగిపండుగ నాటికి   అమ్మవారి అనుగ్రహం రేగు పండులోకి ప్రవేశిస్తుంది. 
అందుకే చిన్నపిల్లలకి జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించడానికి వాళ్ళు కూర్చుని పెద్ద పెద్ద యజ్ఞయాగాదులు నిర్వహించలేరు గనుక చిల్లర పైసలు, బంతిపూలు, రేగుపండ్లు, చెరకు ముక్కలు, కొబ్బరి ముక్కలు కలిపి పెద్దవాళ్ళు పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళ మీదనుంచి ఈ పదార్థాలను విడిచిపెడతారు. 

ఈ పదార్థాలు వాళ్ళ తలమీంచి క్రిందకు పడిపోతే భోగిపీడ తొలగిపోయి వాళ్ళు సంతోషంగా జీవితం గడపడానికి ఏ అనారోగ్యము ప్రతిబంధకంగా వచ్చే అవకాశం ఉంటుందో అటువంటి అవకాశం తొలగిపోయి వాళ్ళు ఉత్తరోత్తర జీవితంలో సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అందుకే భోగిపీడ తొలగించుకునేటటువంటి అద్భుతమైనటువంటి రోజు భోగిపండుగ.✍️```
-- పూజ్య గురుదేవులు, ‘ప్రవచన చక్రవర్తి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు గారు.
     *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                   🌷🙏🌷

సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


MOLAKA--మొలక

ALL
Book Review
health tips
Memories
new
News
Poem
Quotations
se
Seria
Serial
Story
Talent
Videos
సమయం !!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
జనవరి 12, 2026 • T. VEDANTA SURY
శతాబ్దాల క్రితం 
సహనం-.
అర్థ శతాబ్దం క్రితం 
అవకాశం-.
దశాబ్దాల క్రితం 
ధనం-.
ఇప్పుడు 
సమయం-ఇచ్చేవాడే 

నిజమైన స్నేహితుడు 
నిజమైన నాయకుడు 
నిజమైన ప్రేమికుడు 
నిజమైన గురువు 
నిజమైన దేవుడు..!!

ఇప్పుడు 
సహనం-అవకాశం 
ధనం-కన్నా సమయం విలువైనది!!!.

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


https://www.molakanews.page/2026/01/blog-post_442.html?m=1
 చైతన్య సింధువు 
***************
వివేకానందను 
సంఘపరివార్ తో 
కలిపిఎలాచూస్తారు?
వాళ్ళది మతోన్మాదం!

సర్వమతసహనం 
వివేకానందబోధలసారం!
ఆకలిఅంటరానితనం 
తొలగాలన్నదే ఆదర్శం!

ఆకలినుండి ఆర్తుల్ని 
కాపాడాలన్నదే 
ఆయన వేదన అంతా!
అదే పిలుపు ఇచ్చాడు!

ఉక్కునరాలు 
ఇనుపకండరాలు
ధైర్యసాహసాలు
కావాలన్నాడు!

ఆయనముఖాకృతి 
కళా కాంతులు
హావభావాలు ఆహార్యం 
యువతకు స్ఫూర్తి!

మూఢ హిందువుకాడు
హేతువాదహిందువు!
మహాచైతన్య సింధువు!
సకల జన బంధువు!
       *********
తమ్మినేని అక్కిరాజు
      హైదరాబాద్
.     12-1-2026

(వివేకానంద 163వ
జయంతి సందర్భంగా)
 [1/8, 08:13] +91 98497 72509: ది. 08.01.2026.
నా కవితా శీర్షిక......!
-----------------------
ఎవరు నయం ......?
-----------------------
పక్కలో బల్లెం 
చెప్పులో గులక నయం 
పల్లేరు గాయల్లాంటి
బంధువులు కన్న 

అంగీలో గొంగళి 
పురుగు నయం 
నేనున్నాను అని గొప్పగా 
నటించే స్నేహం కన్న 

నరహంతకుని నడుమ 
బందీగా ఉండడం నయం
క్షణం క్షణం మరిగించే
భాగస్వామి చెరలో కన్న 

ఆయుధము తో
ఎదురుగా వచ్చే కసాయి నయం
భుజం పై చెయ్యి వేసి 
నడిచే కపట మనిషి కన్న

నిలువు దోపిడి చేసే 
కరుడుగట్టిన దొంగ నయం 
సొంత ఇంటికి కన్నం
వేసే ఇంటి వాడి కన్న 

చలనం లేని రాతి 
దేవుడు నయం
మనిషిని మనిషిగా చూడని 
మనువాది ఉన్మాదం కన్న
-----------------------
    -----రత్నమహర్షి'అమ్మఒడి'.
మొబైల్ నెం:8978741733
-----------------------
[1/10, 15:53] +91 98497 72509: ద. 10.01.2026
నా కవితా శీర్షిక..........!
-----------------------
ఏది నీది ఏది నాది....!
-----------------------
ఏది నీది ఏది నాది
ఏది సొంతం ఏది శాంతం 
నీది నాది ఏదికాదని 
ఎదను నింపుకో ఎర్రి వాడా 

ఏది సత్యo ఏదసత్యo
ఏది నిత్యమో ఏదనిత్యమో
మనసు చెప్పును మానవీయుడా 
తోసిపుచ్చకు నేటి జీవుడా 

ఏదిగమ్యo ఏది రమ్యo 
ఏది వెలుగు ఏది చీకటి
ఏదిగమనమో ఏదగమనమో
ఎంత వరకో జీవి పయనం 
నిజము తెలియునా నరుడ నీకు

ఏది పుణ్యం ఏది పాపం 
ఏది నరకo ఏది స్వర్గo
ఏదిజీవమో ఏది మృత్యువో
ఇలనే తెలుసును ఖచ్చితముగా
కనులు తెరువుము మానవుండా

ఏది ఏకం ఏదనేకం 
ఏది మైకం ఏది లోకం 
ఏదికారణమేది,కార్యమో
పొంది జ్ఞానం పరవశిస్తూ
జీవితమున శాంతి నొందుము !
----------------------------
      ----రత్నమహర్షి 'అమ్మఒడి '.
మొబైల్ నెం : 8978741733
-----------------------------
 *🌹🌾  సంక్రాంతి – 3 రోజులు కాదు, 12 రోజుల రైతుల పండుగ : అద్వితీయ భారతీయ వ్యవసాయ-సంస్కృతి మహోత్సవం.  🌾🌹*

*భారతీయ పండుగలలో వ్యవసాయం, ప్రకృతి, సంప్రదాయం ఈ మూడింటి సమ్మేళనంగా నిలిచే మహాపండుగ సంక్రాంతి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగ ఒక జీవనోత్సవంలా జరుపుకుంటారు. చాలామందికి సంక్రాంతి మూడు రోజుల పండుగగా మాత్రమే తెలిసినప్పటికీ, సంప్రదాయంగా ఇది పన్నెండు రోజులపాటు కొనసాగుతూ గ్రామీణ సంస్కృతిని సంపూర్ణంగా ప్రతిబింబించే మహోత్సవంగా భావించబడుతుంది.*

*ప్రతి సంవత్సరం జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజున మకర సంక్రాంతి వస్తుంది. ఈ సందర్భంగా దక్షిణాయనం ముగిసి ఉత్తరాయనం ప్రారంభమవుతుంది. ఈ కాలాన్ని హిందూ ధర్మంలో శుభకాలంగా, ఆధ్యాత్మికంగా పవిత్రమైన సమయంగా భావిస్తారు. ముఖ్యంగా రైతులకు ఇది ఆనందోత్సవం. తమ శ్రమ ఫలితంగా వచ్చిన పంట చేతికొచ్చిన వేళ, ప్రకృతికి మరియు సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు.*

*సంక్రాంతిని సంప్రదాయంగా పన్నెండు రోజులపాటు వివిధ ఆచారాలతో జరుపుకుంటారు. పండుగకు ముందు రోజుల్లో పంట కోత పూర్తవడం, ఇళ్లను శుభ్రపరచడం జరుగుతుంది. భోగి రోజున పాత వస్తువులను అగ్నికి ఆహుతి చేసి, కొత్త జీవనానికి స్వాగతం పలుకుతారు. ఇది కేవలం భౌతిక శుభ్రతకే కాకుండా, మనసులోని చెడు అలవాట్లు, నెగటివ్ ఆలోచనలను వదిలి ముందుకు సాగాలనే ఆధ్యాత్మిక సంకేతంగా కూడా భావిస్తారు.*

*భోగి అనంతరం గృహపూజలు, ధాన్య సంరక్షణ, దేవతారాధన జరుగుతాయి. మకర సంక్రాంతి ప్రధాన పండుగ రోజు. ఈ రోజున సూర్యభగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తాయి. కొత్త బియ్యం, నువ్వులు, బెల్లంతో తయారయ్యే పొంగలి, అరిసెలు, సకినాలు వంటి సంప్రదాయ వంటకాలు ఈ రోజున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.*

*సంక్రాంతి అనంతరం బంధుమిత్రుల కలయిక, ఆత్మీయ సందర్శనలు జరుగుతాయి. కనుమ ముందు రోజు పశువులను సిద్ధం చేయడం, గ్రామాల్లో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుమ రోజున వ్యవసాయానికి తోడ్పడే పశువులకు పూజలు నిర్వహించడం ప్రధాన ఆచారం. ఎద్దులను అలంకరించడం, ఎద్దుల పోటీలు, గ్రామీణ క్రీడలు రైతు జీవనానికి గౌరవాన్ని తెలియజేస్తాయి. ఇది రైతు-పశు అనుబంధాన్ని గుర్తు చేసే రోజు.*

*కనుమ తర్వాత రోజుల్లో గ్రామీణ క్రీడలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముక్కనుమ రోజున విందులు, జాతరలు, కుటుంబ సమ్మేళనాలు జరుగుతాయి. ఈ దశ సంక్రాంతి పండుగకు ముగింపు దశగా భావించబడుతుంది. అనంతరం దేవాలయ దర్శనాలు, దానధర్మాలు, పరస్పర శుభాకాంక్షలతో పండుగ సంపూర్ణమవుతుంది. ఈ విధంగా సంక్రాంతి పన్నెండు రోజులపాటు గ్రామీణ జీవన విధానాన్ని, భారతీయ సంస్కృతి మూలాలను ప్రతిబింబిస్తుంది.*

*ఆధునిక కాలంలో నగర జీవనం పెరిగినా సంక్రాంతి ప్రాముఖ్యత తగ్గలేదు. నగరాల్లో నివసించే వారు కూడా ఈ సమయంలో స్వగ్రామాలకు చేరుకుని కుటుంబంతో కలిసి పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది కేవలం పండుగ మాత్రమే కాకుండా, కుటుంబ ఐక్యతను, వ్యవసాయ విలువలను, ప్రకృతితో మన బంధాన్ని గుర్తు చేసే జీవన సందేశం. అందుకే సంక్రాంతి – 12 రోజుల పండుగగా భారతీయ సంస్కృతిలో ఒక అద్వితీయ మహోత్సవంగా నిలిచింది.* 
🌾🌾🌾🌾🌾🌾. ✍️ప్రసాద్ భరద్వాజ     
 *అరటిపండును తొక్క తీసే తింటాం.
సపోటాను తొక్క తీసిన గింజ ఊసేసి తింటాం.

*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తింటాం,పై తొక్కు,
లోపలి గింజలు వదిలేస్తాం.

*ఆపిల్, జామ పళ్ళని మొత్తం తినేస్తాం.

**ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.

**ఒక్కోటి ఒక్కో రుచి.తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.

*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు.

మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తమంతే.

**అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.

**కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు ,ఒక్కోరిది ఒక్కో స్వభావం.

అయితే అందరు పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే కానీ మనిషి విషయంలో వాళ్ళు చేసిన మంచి కంటే , వాళ్ళు చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది. 

పండులో అక్కర్లేని గింజ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా !!*

**పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం.
   *ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.*

      ****కుటుంబమనేది - ఏ మిక్సిడ్ భ్యాగ్ అఫ్ ఫ్రూట్స్!🍁.            
 ** శ్లో|| కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః ఉత్తమ భర్త లక్షణాలు ఇవి

భర్త పనులు చెయ్యడం లో ఒక యోగి వలే ప్రతి ఫలం ఆశించ కుండ చెయ్యాలి !!కుటుంబాన్ని నడపడంలో కార్యాలనునిర్వహించడంలోసంయమనంతోవ్యవరించాలి ! ! రూపంలో కృష్ణుని వలే ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి ఓర్పులో రామునిలాగా ఉండాలి !! భార్య వండిన దానిని తృప్తిగా వంకలు పెట్టకుండా తినాలి !! సుఖ దుఃఖాలలో భార్యకు మిత్రుని వలే ఉంటూ ... మంచి చెడ్డలను పంచు కోవాలి !! 
 *ఓ పార్థా, ఆసురీ స్వభావాన్ని కలిగి ఉన్నవారి లక్షణాలు కపటత్వం, అహంకారం, అహంకారం, కోపం, కఠినత్వం మరియు అజ్ఞానం.*

~ గీత 16.4

జ్ఞానులు దైవీ-సంపత్ అని వర్ణించబడిన మంచి లక్షణాలను విలువైనదిగా భావిస్తారు మరియు వాటిని తమ జీవితంలో పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనికి విరుద్ధంగా, ఆసురీ స్వభావం గల వ్యక్తులు దుష్ట లక్షణాలను స్వీకరిస్తారు.

ఎవరైనా ఇంట్లో నివసించాలనుకుంటే, అతను మొదట దాని దుమ్ము, సాలెపురుగులు మరియు ఇతర అసహ్యకరమైన వస్తువులను తొలగించి, వాతావరణాన్ని శుద్ధి చేయడానికి కొన్ని సువాసనగల కర్రలను వెలిగించాలి. అలాగే, మనిషి శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి, దానిలోని అసహ్యకరమైన వస్తువులను బయటకు పంపించి, పోషకమైన ఆహారాన్ని తీసుకోవాలి.

అదే విధంగా, చాలా కాలంగా తన అజ్ఞాన స్థితిలో హృదయాన్ని కలిగి ఉన్న చెడు లక్షణాలను విడిచిపెట్టడం ద్వారా మనస్సు యొక్క స్వచ్ఛతను పెంపొందించుకోవాలి. ప్రకృతి నుండి దుర్మార్గపు కళంకాలను తొలగించడం మరియు ఆరోగ్యకరమైన వ్యక్తిత్వం మరియు ప్రవర్తనను ఏర్పరచడం ప్రజలందరి విధి.O Partha, the qualities of those who possess a demoniac nature are hypocrisy, arrogance, conceit, anger, harshness, and ignorance.

~ Gita 16.4

The wise value the good qualities described as Daivi-sampat and try to cultivate them in their life. Opposed to this, people of demonical nature embrace the wicked qualities.

If anybody wants to live in a house, he should first of all clean it of the dust, cobwebs and other foul things, and then light some scented sticks to purify the atmosphere. So also, man should keep the body pure, the foul things in it should be ejected and nourishing food should be taken in. 

In the same manner, purity of mind should be cultivated by abandoning the bad qualities which have been possessing the heart for a long time in one’s ignorant state. The removal of vicious taints from nature and the formation of healthy patterns of character and conduct, is the duty of all people.