Friday, April 24, 2026

 దారి చూపిన మిత్రుడు    (కథ )  నారంశెట్టి ఉమామహేశ్వరరావు
వెంకటాపురంలో ఉండే  రాజు,మధు, గోపి స్నేహితులు.  ప్రక్క ఊరులోని  బడిలో తొమ్మిదో తరగతి  చదువుతున్నారు. ముగ్గురిలో రాజుకి బద్ధకం ఎక్కువ. సరిగ్గా చదవడు. మధు కూడా అంతంతమాత్రమే చదివి బడికి వస్తాడు.   వాళ్ళిద్దరూ పరీక్షల్లో బొటాబొటి మార్కులతో పాసవుతుంటారు.  


గోపి మాత్రం  చదువులో శ్రద్ధ  చూపిస్తూ ప్రజ్ఞ కనబరుస్తాడు. లోకజ్ఞానం ఎక్కువే.    వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో బహుమతులు  పొందుతుంటాడు.


 ఒకరోజు బడికి వెళుతున్నప్పుడు రాజు “ నీలాగా చదవాలని, బహుమతులు పొందాలని  మా ఇంట్లో ఒకటే విసిగిస్తున్నారు. మార్కులు తక్కువొస్తే   అదే పనిగా తిడుతున్నారు. ఈ రోజు  నిద్ర లేవడం ఆలస్యమయిందని మా నాన్న దుడ్డుకర్రతో కొట్టాడు. నాకు చదువంటే ఇష్టం  లేదు. ఇల్లు వదిలేసి ఎక్కడికైనా పారిపోవాలని పిస్తోంది” అన్నాడు .

ప్రక్కనే ఉన్న  మధు “నా   పరిస్థితీ అంతే.  ఇంట్లో నుండి  వెళిపోతే  తిట్లు  తప్పుతాయనిపిస్తోంది” అన్నాడు.  

వాళ్ళ మాటలు విన్న గోపి  “మీ ఆలోచన  తప్పు.  మీ మీద అమ్మానాన్నలు కోప్పడేది   ప్రేమ లేక కాదు. మీ శ్రేయస్సు  కోరుతున్నారు కాబట్టే బాగుపడాలని ఆశపడుతున్నారు. చదువు మీద శ్రద్ధ పెట్టండి. అమ్మానాన్నలు  సంతోషిస్తారు. మీ భవిష్యత్తు  బాగుంటుంది” అన్నాడు .    

“నీకేం బాబూ? ఎన్నయినా చెబుతావు.
ఫస్టు మార్కులు తెచ్చుకుంటావు కాబట్టి నీకు ఇవేవీ తెలిదులే. నీలాగా  మారడం మా వల్ల కాదు” అన్నారు ఇద్దరూ.


అది జరిగిన వారం తరువాత  ముగ్గురూ  బడి  నుండి వస్తున్నప్పుడు,    పొడుగైన సర్పాన్ని   చుట్టుముట్టి కదలనివ్వకుండా చేసిన చలి చీమల్ని చూసారు  దారిలో.    అది చూడగానే గోపికి ఒక ఆలోచన   వచ్చింది.

   “ ఎంతో పెద్దదైన సర్పాన్ని కొన్ని చీమలు కలిసి ఎలా   బంధించాయో చూసారా?.  వాటి  ఐకమత్యం మీద మనం  పాఠం కూడ చదువుకున్నాం. కానీ వాటి    జీవన విధానం తెలుసుకుంటే ఆసక్తిగా ఉంటుంది. మీకు  తెలుసా? ” అనడిగాడు. 

తెలియదన్నట్టు తలూపారు మిత్రులిద్దరూ.

గోపి చెప్పడం ప్రారంభించాడు. ‘నేనొక పుస్తకంలో చదివినవే మీకు  చెబుతాను. ఆహారం ఎక్కడున్నా  వెంటనే  పసి  గడతాయి చీమలు . తీపి పదార్ధాలను ఎక్కడ , ఎలా దాచినా క్షణంలో పసిగట్టేస్తాయి. చీమలకు పరిశీలనా శక్తి ఎక్కువని తెలుస్తోంది“ అని  చెప్పాడు గోపి .

“ చీమలు ఎప్పుడూ ఒకదాని తరువాత మరొకటి వరుస పాటిస్తూ వెళతాయి.  ముందున్న చీమను అనుసరిస్తాయి కానీ రెండో వరుస మొదలు పెట్టవు.  దాన్నిబట్టి చీమలు క్రమశిక్షణ పాటిస్తాయని తెలుస్తోంది” అన్నాడు గోపి. 

 ‘అవునవును” తలూపుతూ చెప్పారు  రాజు, మధు.


“వర్షాకాలంలో ఆహారానికి   ఇబ్బంది  కలగకూడదని  ముందే  ఆహారాన్ని సేకరించి  దాచుకుంటాయి. నీటిలో వెళితే చీమలకు ప్రమాదం కదా అందుకు” అని చెప్పాడు   గోపి.  అలాగా అన్నారు మిగతా ఇద్దరు.


“అంతే కాదు. అవి వెళుతున్నప్పుడు  ఏదైనా అడ్డం వస్తే  ప్రక్కనుండి వెళతాయి తప్ప ఆగిపోవు. వెనక్కు వెళ్లవు. చీమలకు పట్టుదల ఎక్కువని తెలుస్తోంది” అని కాసేపు ఆగాడు గోపి.


 ‘ఇంకా… ‘  అని అడిగారు మిగిలిన ఇద్దరు.


“వాటి  బరువు కంటే ఎక్కువ రెట్లున్న  బరువు  పదార్ధాన్ని  సులభంగా మోసుకుపోతాయి. మరో సంగతి కూడా ఉంది… “ అని  ఆగాడు  గోపి.


“అదేంటో చెప్పు” అని ఆసక్తిగా అడిగారు వాళ్లిద్దరు.
 
“అవి సేకరించిన ఇసుక రేణువులతో  శ్రద్ధగా, ఓర్పుగా పుట్టల్ని నిర్మిస్తాయి. అనుభవజ్ఞుడైన   శిల్పి  నిర్మించినంత అందంగా కనబడతాయి పుట్టలు.   వాటి లోపల అంతస్తులున్న మేడల్లాగ  నిర్మిస్తాయి.   పుట్టలను కట్చేటప్పుడు  నిరంతరం విసుగు చెందకుండా పని చేసుకుపోతాయి. అవి విశ్రాంతి తీసుకోవడం ఎవరికీ కనబడదు”  అని ఆగాడు గోపి.  

“అన్ని మంచి లక్షణాలున్నాయా”  అని ఆశ్చర్యపోయారు   రాజు, మధు.

“అవును.  వాటి నుండి  మనం నేర్చుకోవలసిందేమిటో ఇప్పుడు మీకు  తెలిసిందా?” అనడిగాడు గోపి. 

“నువ్వే చెప్పు” అన్నారు ఇద్దరూ ఒకేసారి.  
 
అప్పుడు గోపి “ చీమలకే  అంత తెలివి , కష్టపడే తత్త్వం ఉన్నప్పుడు మనుషులమైన మనకెంత  ఉండాలి? చీమల్లో లేనిది బద్ధకం, విశ్రాంతి తీసుకునే లక్షణం. ఎవరికైనా కష్టపడి పని చేసాక కాసేపు విశ్రాంతి అవసరమే. కానీ మనకు ఎంతో నష్టం కలిగించే బద్ధకం అవసరం లేదు.  మనలాంటి విద్యార్థులకు ఉన్న ఒకే ఒక్క   పని చదువు.  ఆ పని చేయమని అమ్మానాన్నలు, గురువులు కోరుకోవడం తప్పా?.  మనకి కావాల్సినవన్నీ సమయానికి  అమరుస్తూ చదువు కోమంటున్నారు. అలాంటప్పుడు పిల్లలని  సరిదిద్దే హక్కు, బాధ్యత పెద్దలకు  ఉంటుంది. చీమల గురించి విన్న తరువాతైనా బుద్ధి తెచ్చుకోండి.  ఎవరికోసమో చదువుతున్నామని అనుకోకుండా మీ  భవిష్యత్తు కోసమని మనసుపెట్టి చదవండి. మీకు తెలియంది ఉంటే పెద్దలని  అడిగి తెలుసుకోండి. విద్యార్థిగా ఉన్నప్పుడు  కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానం చేరుకుంటారు. అమ్మానాన్నలు తిట్టారని మరెప్పుడూ చెప్పవద్దు” అని ముగించాడు  గోపి.  


“ మా తప్పు తెలిసొచ్చింది.      బద్ధకం వదిలేసి  కష్టపడి చదువుతాం“ అని మాట ఇచ్చారు ఇద్దరూ .  


వాళ్లలో మంచి మార్పు రావాలని మనసులోనే కోరుకున్నాడు గోపి.
 
_____*****______
 〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️
ప్రస్తుతం వార్తల్లో ఉన్న *హర్మోజ్ జలసంధి* నే మన పూర్వీకులు, కవులు *"హురుమంజి"* లేదా *"హొరమంజి"* అని పిలిచేవారు.

మన తెలుగు సాహిత్యం, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య కాలం నాటి కావ్యాలు, ఈ హురుమంజి నుండి జరిగిన వర్తకాన్ని చాలా గొప్పగా వర్ణించాయి.

*అక్కడి నుంచి మన సీమలకు (ఆంధ్రదేశానికి) ప్రధానంగా దిగుమతి అయ్యే వస్తువులు ఇవే:*

*1. హురుమంజి గుర్రాలు (అత్యంత ముఖ్యమైనవి):* మధ్యయుగంలో మన రాజులకు, ముఖ్యంగా కాకతీయులకు, ఆ తర్వాత విజయనగర రాయలకు యుద్ధాలలో గెలవాలంటే మంచి జాతి గుర్రాలు కావాలి. అరేబియా మరియు పర్షియా (ఇప్పటి ఇరాన్) నుండి వచ్చే మేలుజాతి అశ్వాలు ఈ *"హురుమంజి"* రేవు నుండే ఓడల ద్వారా మన కోస్తా తీరానికి (మోటుపల్లి, మచిలీపట్నం, భత్కల్) వచ్చేవి.

శ్రీకృష్ణదేవరాయలు తన *"ఆముక్తమాల్యద"* లో గుర్రాల వ్యాపారం గురించి రాస్తూ, *"రేవులను అభివృద్ధి చేసి, హురుమంజి నుండి వచ్చే గుర్రాలు, ఏనుగులు శత్రువులకు దక్కకుండా మనకే దక్కేలా చూసుకోవాలి"* అని రాజనీతిని బోధించారు.

*2. సాహిత్యంలో ప్రస్తావన (శ్రీనాథుని హరవిలాసం):* కవిసార్వభౌముడు శ్రీనాథుడు రాసిన *"హరవిలాసం"* లో అవచి తిప్పయ్య సెట్టి అనే గొప్ప వర్తకుడి గురించి వర్ణిస్తూ, అతను ఏ దేశం నుంచి ఏ వస్తువులు తెచ్చేవాడో ఒక సీస పద్యంలో అద్భుతంగా చెప్పాడు. అందులో హురుమంజి ప్రస్తావన ఉంది.

*"హురుమంజి సొగసు కైవడి బారువారముల్."*

అంటే, హురుమంజి నుంచి అందమైన, వేగంగా పరుగెత్తే గుర్రాలను (బారువారముల్) తెప్పించేవాడని అర్థం.

*3. ఇతర వస్తువులు:* గుర్రాలే కాకుండా, హురుమంజి నుండి ఈ క్రింది విలాసవంతమైన వస్తువులు కూడా వచ్చేవి:

*ముత్యాలు (Pearls):* పర్షియన్ గల్ఫ్ (Basra/Hormuz) ప్రాంతం ముత్యాలకు పెట్టింది పేరు. మన కవులు వీటిని *"ఆణిముత్యాలు"* అని వర్ణించేవారు.

*పన్నీరు (Rose Water):* పర్షియా నుండి సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా గులాబీ అత్తరు (పన్నీరు) వచ్చేది.

*ఖర్జూరం & డ్రై ఫ్రూట్స్:* ఎండిన పండ్లు, బాదం, పిస్తా వంటివి.

*పట్టు (Silk/Velvet):* అక్కడి నుంచి నాణ్యమైన ముఖమల్ (Velvet) వస్త్రాలు కూడా వచ్చేవి.

*ముగింపు:* కాబట్టి, హురుముంజి అంటే మన తెలుగు వారికి కేవలం ఒక చమురు రవాణా మార్గం మాత్రమే కాదు. ఒకప్పుడు మన రాజ్యాల సైనిక బలానికి (గుర్రాలు), రాణుల అలంకరణకు (ముత్యాలు, పన్నీరు) మూలకేంద్రం అదే. ఆనాటి మన వర్తకులు సముద్రం మీద ఆధిపత్యం చెలాయించి, అక్కడి నుండి సంపదను మన దేశానికి తెచ్చేవారు.
 *_నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు   గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం భగవంతుడు అతడికిచ్చిన మహత్తరమైన శక్తి- మాట. సృష్టిలో మరేజీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదిలా     ఆ మాట ఉండాలి. మంచి అభిప్రాయం అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి._*

*_గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెబుతాడు. రెచ్చగొట్టి, ప్రలాపాలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు తనకు వినిపించిన తక్షణమే స్పందించవద్దన్నాడు. సత్యాన్ని ప్రతిబింబించేవి, ప్రియమైనవి, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా మాటలుండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని ‘వాక్‌ తపస్వి’ అన్నాడు._*

*_మృదుభాషణం మనుషులందరిలో   కనిపించాల్సిన లక్షణంగా శాస్త్రాలన్నీ గుర్తించాయి. వేదాంతి అరిస్టాటిల్‌ విశ్వసనీయత గోచరించేలా మాట్లాడితే అవి మానవ స్వభావాన్నే మార్చగలవంటాడు._*

*_మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడు తున్నానని ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతో కానీ అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు._*

*_ఆచితూచి మాట్లాడటం అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు. రామాయణంలో హనుమంతుడు, భారతంలో విదురుడు, సంజయుడు, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసు... అటువంటి మాటకారులే._*

*_మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా శాశ్వతంగా వినపడతాయి._*

*_వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే పొరపాటే అవుతుంది. వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమబద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి._*

*_భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెబుతాడు. మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం._*

*_వాక్‌ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి._*
https://chat.whatsapp.com/CMldaRpdfnd2vfqWxGlqyy
👏🧘🇮🇳🌎🧘🧘👏🧘🇮🇳🌎🧘
इस धरती पर हर जीव के शरीर के गुण एक जैसे हैं। शरीर के बिना इस धरती पर जीवन नहीं होता। यानी शरीर ही जीवन है! अगर शरीर दीपक है, तो जीवन प्रकाश है! जैसे दीपक और प्रकाश अलग नहीं हैं, वैसे ही शरीर और जीवन भी अलग नहीं हैं।
जैसे शरीर के अपने नियम होते हैं, वैसे ही जीवन के भी अपने नियम होते हैं। अगर हर कोई इस परम सत्य को समझ ले, तो बिना किसी जाति, धर्म, वर्ण, वर्ग या लिंग के भेदभाव के, हम सभी एकता के साथ जीवन के दिव्य नियमों का पालन कर सकते हैं।
यह केवल ध्यान के माध्यम से ही संभव है। ध्यान का अर्थ है "सांस पर ध्यान"
👏🧘🇮🇳🌎🧘🧘👏🧘🇮🇳🌎🧘
Every living being on this earth has the same body characteristics. Without a body, there would be no life on this earth. That is, the body is life! If the body is a lamp, then life is light! Just as a lamp and light are not separate, similarly the body and life are not separate.
Just as the body has its own laws, so too life has its own laws. If everyone understands this ultimate truth, then without any distinction of race, religion, caste, class, or gender, we can all follow the divine laws of life in unity.

That is possible only through meditation. Dhyana literally means "meditation on the breath".
👏🧘🇮🇳🌎🧘🧘👏🧘🇮🇳🌎🧘
ಈ ಭೂಮಿಯ ಮೇಲಿನ ಪ್ರತಿಯೊಂದು ಜೀವಿಗೂ ಒಂದೇ ರೀತಿಯ ದೇಹದ ಗುಣಲಕ್ಷಣಗಳಿವೆ. ದೇಹವಿಲ್ಲದಿದ್ದರೆ, ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಜೀವವಿರುವುದಿಲ್ಲ. ಅಂದರೆ, ದೇಹವೇ ಜೀವ! ದೇಹವು ದೀಪವಾಗಿದ್ದರೆ, ಜೀವನವೇ ಬೆಳಕು! ದೀಪ ಮತ್ತು ಬೆಳಕು ಹೇಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿಲ್ಲವೋ ಹಾಗೆಯೇ, ದೇಹ ಮತ್ತು ಜೀವವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿಲ್ಲ.

ದೇಹವು ತನ್ನದೇ ಆದ ನಿಯಮಗಳನ್ನು ಹೊಂದಿರುವಂತೆ, ಜೀವನಕ್ಕೂ ತನ್ನದೇ ಆದ ನಿಯಮಗಳಿವೆ. ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಈ ಅಂತಿಮ ಸತ್ಯವನ್ನು ಅರ್ಥಮಾಡಿಕೊಂಡರೆ, ಜನಾಂಗ, ಧರ್ಮ, ಜಾತಿ, ವರ್ಗ ಅಥವಾ ಲಿಂಗದ ಯಾವುದೇ ಭೇದವಿಲ್ಲದೆ, ನಾವೆಲ್ಲರೂ ಜೀವನದ ದೈವಿಕ ನಿಯಮಗಳನ್ನು ಏಕತೆಯಿಂದ ಅನುಸರಿಸಬಹುದು.
ಅದು ಧ್ಯಾನದ ಮೂಲಕ ಮಾತ್ರ ಸಾಧ್ಯ. ಧ್ಯಾನ ಎಂದರೆ "ಉಸಿರಿನ ಮೇಲೆ ಧ್ಯಾನ" ಎಂದರ್ಥ.

👏🧘🇮🇳🌎🧘🧘👏🧘🇮🇳🌎🧘

இந்த பூமியில் உள்ள ஒவ்வொரு உயிரினமும் ஒரே மாதிரியான உடல் பண்புகளைக் கொண்டுள்ளன. உடல் இல்லாமல், இந்த பூமியில் உயிர் இருக்காது. அதாவது, உடல் ஒரு வாழ்க்கை! உடல் ஒரு விளக்காக இருந்தால், வாழ்க்கை ஒளி! ஒரு விளக்கையும் ஒளியையும் தனித்தனியாகக் கொண்டிருக்காதது போல, உடலும் உயிரும் தனித்தனியாக இல்லை.

உடலுக்கு அதன் சொந்த விதிகள் இருப்பது போல, வாழ்க்கைக்கும் அதன் சொந்த விதிகள் உள்ளன. இந்த இறுதி உண்மையை அனைவரும் புரிந்து கொண்டால், இனம், மதம், சாதி, வர்க்கம் அல்லது பாலினம் என்ற எந்த வேறுபாடும் இல்லாமல், நாம் அனைவரும் ஒற்றுமையாக வாழ்க்கையின் தெய்வீக விதிகளைப் பின்பற்றலாம்.

அது தியானத்தின் மூலம் மட்டுமே சாத்தியமாகும். தியானம் என்றால் "மூச்சின் மீது கவனம் செலுத்துதல்".
👏🧘🇮🇳🌎🧘🧘👏🧘🇮🇳🌎🧘
ఈ భూమి పైన ఉన్న ఏ ప్రాణి ఒకే విధమైన దేహధర్మాలు ఉంటాయి. దేహం లేకపోతే ఈ భూమి పైన జీవితమే ఉండదు. అంటే!దేహమే జీవితం!దేహం, దీపం అయితే, జీవితం వెలుగు!ఏ విధంగా దీపం మరియు వెలుగు వేరు వేరు కాదో, అదే విధంగా దేహం మరియు జీవితం వేరు, వేరు కాదు. ఏ విధంగా దేహానికి దేహ ధర్మాలు ఉన్నాయో అదే విధంగా జీవితానికి కూడా జీవిత ధర్మాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ పరమ సత్యాన్ని అందరూ అర్ధం చేసుకొంటే జాతి, మత, కుల, వర్గ, లింగ బేధాలు లేకుండా అందరూ ఏకత్వంతో దివ్య జీవన ధర్మాలను పాటించగలం. అది ధ్యానం తోనే సాధ్యం. 🧘🏿‍♂️ధ్యానమంటే "శ్వాస మీద ధ్యాస "👏🧘🇮🇳🌎🧘🧘👏🧘🇮🇳🌎🧘
https://youtube.com/shorts/jd3rT11Mit4?si=Mb73rJWenyVK1GFE
*🪷🧘🇮🇳🌎🧘🇮🇳🌎🧘🧘🇮🇳🌎🧘🧘.🙏_*

*_మాటకు మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే మనుషులంతా మంత్రద్రష్టలవుతారు!_*


*_సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 🙏_*
 🔔 *అనగనగా...* 🔔

ఉదయం పన్నెండు గంటలు అయింది.
“పోస్ట్…” అనే కేకతో వాలు కుర్చీలో పడుకుని కళ్ళు తెరిచిన పరంధామయ్యకి, పోస్ట్‌మాన్ ఒక శుభలేఖ అందించి వెళ్లాడు.
“ఎవరిది అబ్బా ఈ శుభలేఖ?”
కార్డు చూస్తే చాలా పెద్దదిగా ఉంది.
బాగా డబ్బున్న వాళ్లది అయి ఉంటుంది, అని అనుకుంటూ శుభలేఖ తెరిచి చూశాడు.
పూర్తిగా చదివేసరికి —
“అబ్బో! రవికి ఇంత పెద్ద కూతురు ఉందా!” అని లోలోపల సంబరపడ్డాడు.
అంతలో వంటింట్లో నుంచి శారద బయటికి వచ్చింది.
“ఎవరిదండి ఆ శుభలేఖ?” అని అడిగింది.
“మా మేనల్లుడు రవి కూతురు పెళ్లిట. శుభలేఖ పంపించాడు,” అన్నాడు పరంధామయ్య ఆనందంగా.
“వెళ్లి వస్తే బాగుంటుందేమో,” అని కూడా అన్నాడు.
శారద నిట్టూర్చింది.
“ఏదో పై వాళ్లల్లాగా శుభలేఖ పంపించి ఊరుకున్నాడు. ఏనాడైనా మన ఇంటికి వచ్చాడా? ఎప్పుడైనా ఫోన్ చేశాడా? కనీసం పెళ్లి కుదిరిందని కూడా చెప్పలేదు. వాళ్ల అమ్మానాన్న ఉన్నంతకాలం బంధుత్వాలు బానే మెయింటైన్ చేశారు. ఆ తర్వాత మీ అక్క పిల్లలందరూ మేనమామను మర్చిపోయారు,” అంది నిష్టూరంగా.
శారద మాటల్లో నిజం లేకపోలేదు అని పరంధామయ్యకి అనిపించింది.
అయినా… రక్తసంబంధం కదా!
ఇన్నాళ్లూ ఆ చేదు నిజాన్ని కడుపులోనే దాచుకున్నాడు.
అంతలో గతం కళ్ల ముందుకు వచ్చింది.
పరంధామయ్య తండ్రి రామయ్యకి ఇద్దరు సంతానం.
అక్క సీతమ్మ — పరంధామయ్య కంటే నాలుగేళ్లు పెద్దది.
చిన్నతనంలోనే సీతమ్మకి పెళ్లి జరిగింది. నలుగురు పిల్లల తల్లి అయి, పక్క ఊరిలో భర్త రాజయ్యతో కాపురం చేస్తూ ఉండేది. పిల్లలందరిలో పెద్దవాడు రవికుమార్.
పరంధామయ్యకి అక్కంటే పంచప్రాణాలు.
పండగలకి, పబ్బాలకి, పురుళ్లకి, పుణ్యాలకి — సీతమ్మ పుట్టింటికి వచ్చినప్పుడల్లా, పిల్లల బాధ్యతలో పరంధామయ్య కూడా భాగస్వామి అయ్యేవాడు.
తల్లి వయసు పైబడడంతో తరచూ చెప్పేది —
“ఒరేయ్ పరం… అక్క పిల్లలతో పని చేసుకోలేకపోతోంది రా  మనం అక్కడికి వెళ్లలేం. ఇక్కడికి వచ్చినప్పుడు అయినా కాస్త విశ్రాంతి ఇద్దాం. నువ్వు పిల్లల్ని ఆడించు.”
అప్పటి నుంచి పిల్లల బాధ్యత అంతా పరంధామయ్యదే.
సీతమ్మ పిల్లలందరిలో పెద్దవాడు రవి.
సన్నగా, పొడవుగా ఉండేవాడు.
పరంధామయ్యని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు.
“మామా…” అని ప్రేమగా పిలిచేవాడు.
“నేను బాత్రూంకి వెళ్ళాలి… నువ్వు కడుగుతావా?” అని అడిగితే పరంధామయ్యకి నవ్వు వచ్చేది.
ఎక్కడికి వెళ్లినా మావయ్యే కావాలి.
ఊర్లోకి వెళ్తే చేయి పట్టుకుని నడవాలి.
చెరువు కట్టకు తీసుకెళ్లినా, బజారుకి తీసుకెళ్లినా — ముందు రవి, వెనుక మిగతా పిల్లలు.
“మావయ్య… నన్నెత్తుకో,” అన్నప్పుడు, పరంధామయ్య ఆకలి కూడా మర్చిపోయి భుజాల మీద కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పేవాడు.

రాత్రిళ్లు —
“మావయ్య పక్కనే పడుకుంటా,” అని పట్టుబట్టేవాడు.
సీతమ్మ దగ్గరికి పంపినా, అర్థరాత్రి లేచి వచ్చి పరంధామయ్య చేతిని పట్టుకుని పడుకునేవాడు.
రవికి ఆస్తమా, జ్వరాలు వచ్చేవి. జ్వరం వస్తే రాత్రంతా పరంధామయ్య చంక దిగేవాడు కాదు.
సీతమ్మ పుట్టింట్లో ఉన్నన్నాళ్లు — సమయం ఎలా గడిచిందో పరంధామయ్యకి తెలియదు.
నిజమే…
ఏ కుటుంబంలో అయినా మేనమామ పాత్ర అలాగే ఉంటుంది.
కాలం గడిచింది.
శారదతో పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే తల్లిదండ్రులు మంచం పట్టి కాలం చేశారు.
తల్లి మంచంపై ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఎప్పటికీ పరంధామయ్య మనసులో మెదులుతూనే ఉన్నాయి —
“పరం… ఆడపిల్లకు ఎంత వయసు వచ్చినా పుట్టింటి మీద మమకారం ఉంటుంది. మేము పోయిన తర్వాత కూడా అక్క కుటుంబంతో సంబంధం కొనసాగించాలి రా.”
ఆ మాటలు తూచా తప్పకుండా పాటించాడు.
పండగలకి, పబ్బాలకి సీతమ్మ కుటుంబాన్ని పిలిచేవాడు.
“పిల్లలు పెద్దవాళ్లయ్యారు… చదువులు, పనులు…” అని సీతమ్మ చెప్పినా, వీలైనప్పుడల్లా వాళ్లను చూసి వచ్చేవాడు.
కాలక్రమేణా —
రవి అమెరికా వెళ్లాడు, చదువుకున్నాడు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు…
తర్వాత సీతమ్మ దంపతులు చనిపోయారు.
అంతే.
ఫోన్‌లు తగ్గాయి.
రాకపోకలు లేవు.
ఎవరు తప్పు అన్న ప్రశ్నకి — అందరి దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంటుంది.
వయసు మీద పడేంతవరకు పరంధామయ్య రక్తసంబంధం అనే పడవలో ప్రయాణించాడు.
ఆ తర్వాత… ఆ బంధాన్ని గుర్తుచేసే పెద్దవాళ్లు లేకపోయారు.
గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్న రవి లాంటి వాళ్లు మర్చిపోతే —
మనం ఎందుకు గుర్తు చేయాలి?
అని మౌనంగా మిగిలిపోయాడు పరంధామయ్య లాంటి మేనమామ.
ఇప్పుడేమో —
శుభలేఖ.
చేతిలో కార్డు పట్టుకుని చాలాసేపు అలాగే కూర్చున్నాడు.
బంగారు అక్షరాలు మెరుస్తున్నాయి.
పెళ్లి ముహూర్తం, వేదిక పేరు, ఫోటోలు — అన్నీ ఉన్నాయి.
కానీ అడుగున… కొత్త కొత్త పేర్లు.
కుటుంబంలో పెద్దవాడిగా, ఒక క్షణం మనసు బాధపడి మౌనంగా ఉండిపోయాడు.
పరంధామయ్య నుంచి సమాధానం రాకపోవడంతో శారద మళ్లీ వంటింట్లోకి వెళ్లిపోయింది.
ఇల్లు నిశ్శబ్దంగా మారింది.
అంతలో పరంధామయ్య నిర్ణయించుకున్నాడు.
“ఏమైతేనేం… వెళ్లాలి.
రక్తసంబంధం అలా ఊరుకోదు.”
మంచి చొక్కా తీసాడు.
పాత సంచి తెరిచాడు.
కొద్దిగా పొదుపుగా దాచుకున్న డబ్బు అందులో పెట్టాడు.
అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నాడు —
ముడతలు పడ్డాయి…
కానీ ఆ మావయ్య ప్రేమ మాత్రం అలాగే ఉంది.
“రవి గుర్తుపడతాడా?”
“అతని పిల్లలు నన్నెవరో తెలుసుకుంటారా?”
అనే ప్రశ్నలు కలవరపెట్టినా —
“పిల్లల పెళ్లికి వెళ్లకపోతే మనిషినే కాదు,”
అని తన మనసుకే చెప్పుకున్నాడు.
బస్సు స్టాప్ వైపు నడుస్తూ —
ఆనాడు చిన్న రవి తన వేలు పట్టుకుని నడిచిన రోజులు,
“మావయ్య” అని పిలిచిన స్వరం —
మళ్లీ చెవుల్లో మోగాయి.
ఈ ప్రయాణం పెళ్లికే కాదు…
ఒక బంధాన్ని మళ్లీ తట్టిలేపడానికి.
కొన్ని బంధాలు తాత్కాలికంగా దూరమవుతాయి 
కానీ పిలిస్తే  మళ్లీ వెతుక్కుంటూ వెళ్తాయి పరంధామయ్య లాంటి మనసు ఉంటే.

తల్లి తర్వాత తల్లి అంతటివాడు మేనమామ. మధ్యలో వచ్చే బంధాలు మూలాన్ని ఈ రక్తసంబంధం మరుగున పడిపోతోంది చాలా కుటుంబాల్లో.  ఇది ఒప్పుకోవాల్సిన నిజం. 

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
 🌲🌲🌲🌲🌲🌲

ఒక ఊరిలో బడి బాగుంటే, ఆ ఊరిలో ఊరికోసం పనిచేసే ఓ మాస్టారు ఉంటే ఆ ఊరు ఇలా ఉంటుంది.

ఓపికగా చదవండి. టైమ్ చూసుకుని మరీ చదవాల్సిన వ్యాసమిది.

ఇక మొదలెడదాం.

మా ఊరి పక్కనే అదో మోస్తరు గ్రామ పంచాయతి.. ఆ ఊరి ఓటింగ్ ఓ నాలుగువేల వరకు ఉంటుంది! అందులో పెద్ద ప్రత్యేకత ఏం లేదు కానీ.. సంక్రాంతి పండుగ వచ్చిందంటే Benz.. BMW.. Audi.. వంటి high end luxury కార్లు ఆ వూరి రోడ్ల మీద మాములుగా తిరుగుతుంటాయి! ఇంక ఏ వీధి చూసినా.. ఆల్మోస్ట్ ప్రతి ఇంటి ముందు ఒకటో రెండో కార్లు పార్క్ చేసి ఉండటం పండక్కి అక్కడ ఓ సాధారణ విషయం! 

ఇంక సంక్రాంతి పండగ వచ్చిందంటే ఊర్లో సందడి మాములుగా ఉండదు! స్పోర్ట్స్ ఈవెంట్స్ నుండి కల్చరల్ ఈవెంట్స్ దాక ఆ వారం రోజులు దుమ్ము రేపుతారు! ఇక పండుగ సందర్భంగా ఆ ఊర్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ చూడటం కోసం అయితే ఒంగోలు.. గుంటూరు.. వంటి  చుట్టుపక్కల టౌన్స్ నుండి కూడా క్రికెట్ ప్రేమికులు వస్తుంటారు! నిజంగా అంత ఉత్సాహంగా ఉంటుంది ఆ వూరిలో పండుగ వాతావరణం!

కాని.. ఓ 40-50 సంవత్సరాలు వెనక్కి వెళితే.. చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే ఆర్థికంగా అదో బాగ వెనుకబడిన గ్రామం! అంతా మెట్ట పొలం! వూరికి నీటి వసతి లేదు! ఆదాయం చాలా తక్కువ! ఊర్లో కనీసం పెద్ద రైతులు కూడా లేరు! వందకి వందశాతం అందరూ అరెకరా.. ఎకరా.. రెండెకరాల లోపున్న చిన్నా.. సన్నకారు రైతులే! గ్రామస్తులు ఎక్కువగా వారి వారి కులవృత్తులు.. పశువుల పెంపకం.. రాష్ట్రం అంతా తిరుగుతూ అప్పట్లో పెంకుటిళ్లకు నల్ల పెంకు కప్పడం.. వంటి వృత్తులపై ఆధారపడి బ్రతికేవారు!

అంతవరకు విశేషం ఏమిలేదు.. కాని.. మిగతా గ్రామాల్లో లేనిది ఆ ఊర్లో ఉన్నది.. ఆ ఊరి దశా దిశని.. గ్రామస్తుల ఆర్దిక సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది.. అది మరేదో కాదు ఆ ఊరి " గవర్నమెంట్ హైస్కూల్"!! ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో అదే మొదటితరం హైస్కూల్! ఆరోజుల్లో దాదాపు షుమారు పది పదిహేను గ్రామాల విద్యార్థులు ఆ స్కూల్లో చదువుకోవడానికి వచ్చేవారు! అలా భవిష్యత్ లో తమ బతుకులను సమూలంగా మార్చివేసే ఓ నిశబ్ధ విప్లవానికి ఆ వూరి హైస్కూలే వేదిక అయ్యింది!

సీన్ కట్ చేస్తే.. 

ఈరోజున ఆ చిన్న గ్రామంలో మూడు నేషనల్ బ్యాంకులు.. ఓ రాష్ట్ర స్థాయి క్రికెట్ స్టేడియంతో సహ కళ్యాణ మండపాలు.. కమ్యూనిటీ హాల్స్.. మంచి లైబ్రెరీ.. వందశాతం సీసీ రోడ్లు.. అందరికీ ఫ్రీ RO drinking water plants.. అలా ఆ గ్రామానికి లేని సౌకర్యమే లేదు! ఇక దేశ విదేశాల్లో సెటిల్ ఆయిన ఆ గ్రామానికి చెందిన రెండు వందలకు పైగా NRI కుటుంబాల్లో ఒక్క అమెరికాలోనే షుమారు వంద కుటుంబాలు వరకు స్థిరపడ్డారు! ఇక దేశవ్యాప్తంగా వివిధ ఉన్నతోద్యోగాల్లో ఉన్నవారు.. డాక్టర్లు.. చార్టెడ్ అకౌంటంట్లు.. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో కొన్ని పదుల మంది యువ Software ఇంజనీర్లు! ఇక ప్రభుత్వ టీచర్లయితే చెప్పేపని లేదు.. ఆ ఊరి టీచర్ పని చేయని పాఠశాల అసలు మా జిల్లాలోనే లేదంటే అతిశయోక్తి కాదు! 

ఇక ఆ ఊరిలో ఉన్న మూడు జాతీయ బ్యాంకులు కాకుండా ఆ ఊరి కో-ఆపరేటివ్ సొసైటి (ప్రాదమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) లో గ్రామస్తుల సేవింగ్ డిపాజిట్ల విలువ అక్షరాల 20 కోట్ల రూపాయలు!! ఇది మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక విలేజ్ సొసైటీలో రెండవ అత్యధిక సేవింగ్స్ మొత్తం అట! (మొదటి స్థానంలో కేరళలో ఒక వూరి సొసైటి ఉందట) ఈ వూరి సొసైటి ఆధ్వర్యంలో సొంతంగా కోల్డ్ స్టోరేజ్ లు.. గిడ్డంగులు.. కిరాణా షాపులు.. బట్టల షాపులు.. నిర్వహిస్తూ సహకార సంఘం చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అవార్డులను అందుకుంది!

ఇక మొదటి తరంలో ఆ వూరు హైస్కూల్లో చదువుకొని బాగుపడ్డ కుటుంబాల్లో మా కుటుంబం కూడ ఒకటని నేను గర్వంగా చెప్తాను! వాస్తవానికి మా లాంటి ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో మొదటి తరంలో విద్యావకాశాలు దొరకడం.. అందరూ చదువుకోవడం వల్ల.. ఈరోజున ఒక్క మా కుటుంబంలోనే ఆరుగురు డాక్టర్లుగా వైద్య వృత్తిలో స్థిరపడ్డారు! ఇక మా జనరేషన్ లో విద్యార్హత కనీసం Post graduation లేని వాళ్ళు మా ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరు!!

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. కేవలం చదువుకొనే అవకాశాలు ఎక్కువ మందికి లభించడం వల్ల మాత్రమే.. కేవలం చదువే పెట్టుబడిగా.. మానవ వనరులే పెట్టుబడిగా.. అన్ని రంగాల్లో అభివృద్ది పథాన ముందంజలో నిలిచిన రావినూతల అనే ఓ మామూలు గ్రానం కొన్ని దశాబ్దాలలోనే అన్ని రంగాల్లో మిగతా గ్రామాలకు అందనంత ఎత్తులో నిలిచింది! అది Educaton కు ఉన్న పవర్! అది గుర్తించిన మనుషులు.. అది గుర్తించిన పాలకులు ఉన్న సమాజంలో నిజంగా అద్భుతాలే జరుగుతాయి!

ఈ సందర్భంగా.. నువ్వు ఒక చేపనిస్తే ఈరోజు మాత్రమే తింటాడు! అదే నువ్వు చేపలు వేటాడడం నేర్పితే రోజూ తింటాడనే ఓ ఫేమస్ చైనా కోట్ ని గుర్తు చేయాలనిపించింది!!

చల్లా శ్రీధర్ రెడ్డి గారు చాలా బాగా రాశారు. ఆయన చెప్పింది నిజమే. బడి వలన బాగు పడ్డాం. సందేహం లేదు. కానీ అది ఒక్కటే కాదు అనే దానికే ఈ వివరణ. మీకు సంక్రాంతి పండుగకు క్రికెట్ పోటీలో, బయట నిలుచున్న ఫారిన్ కారులో మమ్మల్ని, మా విజయాలను నిర్వచించలేవు. రెడ్డి గారు గమనించిన దానిని ఐస్ బెర్గ్ ఎఫెక్ట్ (Ice berg effect)  అంటారు. అంటే ఐస్ బెర్గ్ (Ice Berg) నీటి పైకి ఎంత కనిపిస్తుందో, అంతకు తొమ్మిది రేట్లు  లోపల ఉంటుంది.  దానిని నేను పూర్తిచేయటానికి ప్రయత్నిస్తాను. మా ఊరులో కాపులు ఉన్నారు , పెద్ద రైతులు ఉన్నారు. మీరనుకున్నంత మంది లేకపోవచ్చు. కానీ వాళ్లంతా గొప్పవారు. వారందరు ఆదర్శవంతులు. అందుకే మా బడికి భూదానం చేశారు.  సొసైటీ ని నిలబెట్టారు. కళానిలయాలకు దాతృత్వం చూపారు. ఆలయాలు పునరుద్ధరించారు. స్టేడియం కోసం జీవిత కాలాన్ని త్యాగం చేశారు. మా ఉన్నతిని మీరు ఐశ్వర్యం తో కొలిచారు. దానికంటే గొప్పగా మాలో  మానవత్వం ఉంది. మా ఊరి వైద్యులు అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, విజయవాడ, హైదరాబాదు ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో  ఎన్నో పట్టణాల్లో కొన్ని లక్షల మంది ప్రజలకు వైద్య సేవలందించారు. మా విద్యావేత్తలు రాష్ట్రం నలుమూలల్లో కొన్ని లక్షల మందికి విద్యాదానం చేశారు. వారి చైతన్య స్ఫూర్తి ఎంతో మందిని విద్యకు దగ్గర చేసింది. ప్రయోజకులను చేసింది. మా ఇంజినీర్లు ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించారు.  మైక్రోసాఫ్ట్, ఈబే, గూగుల్, డెల్, ఆపిల్ ఇంకా ఇలాంటి ఎన్నో  బహుళజాతి కంపెనీలను ఉన్నతంగా నిలబెట్టారు. కొన్ని వందల పేటెంట్లు సృష్టించారు.  ప్రపంచ మేధకు నాయకత్వం వహిస్తున్నారు. మా ఊరి కోసం తపిస్తున్నారు. మా వారి కోసం గ్రంధాలయం పెట్టారు. అణగారిన వర్గాల కోసం పాటుపడుతున్నారు. అమ్మాయిల ఆత్మగౌరవం కోసం టాయిలెట్స్ కట్టించారు.   చదువు కోవటానికి చేయందిస్తున్నారు. పల్లె, ఊరు అనే భేదాభిప్రాయం లేని జీవనం కోసం పాటుపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోని  పత్రికలు మా ప్రింటింగ్ టెక్నాలజీ నిపుణుల చేతిమీదగా నడుస్తాయి. మాకు ఒకటి రెండు ఎకరాల మెట్ట భూమే  ఉండచ్చు కానీ మా తల్లిదండ్రులు వందల ఎకరాలు ఉన్న పిల్లలకు  కంటే మిన్నగా విలువలు బోధించారు. మాకు ఆత్మగౌరవం నేర్పించారు. మా అమ్మలు మేదరమెట్ల పుగాకు గ్రేడింగుకు వెళ్ళుండచ్చు, మేము అమెరికాలో ఉన్నాకూడా పనిలో దైవం చూసిన మాతృమూర్తులు వాళ్ళు . అదే మాకు శ్రమను నేర్పింది.  మేము ఇళ్ళు కట్టినా, పెంకు కప్పినా, కుండలు చేసినా, సాఫ్ట్ వేర్ రాసినా, సర్జరీలు చేసినా అదే నిబద్దత, అదే అంకిత భావం. తప్పును తప్పని నిలదీస్తాం. ఒప్పు కాకుంటే మావాడైనా దండిస్తాం.  బడులున్న ఊళ్లన్నీ రావినూతల కాలేవు.  మా మెట్ట మట్టిలో, మా మంచి నీళ్లలో  ఒక చైతన్యం, ఒక ఒరవడి, ఒక ఉత్సాహం, ఒక ఉత్తేజం, ఒక ఉల్లాసం,ఒక సంకల్పం  నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.  దీనికి  మా తల్లిదండ్రులు, గురువులు, నాయకులు కూడా ఒక ముఖ్య కారణం. 

 – రవీంద్ర బాబు పూనాటి.ప్లసెంటన్, కాలిఫోర్నియా, అమెరికా.
 పనికిరానిది ఏముంది గురూ ప్రపంచంలో - (పునఃకథనం- డా.ఎం.హరికిషన్) 
*************************
   ఒక అడవిలో రెండు కుందేళ్ళు పోతూ వున్నాయి. ఒకటేమో నల్లది. రెండోదేమో తెల్లది. నల్లకుందేలు చాలా తెలివైంది. తెల్లకుందేలు తెలివి తక్కువది. ఆ కుందేళ్ళకు దారిలో ఒకచోట ఒక తప్పెట కనబడింది. నల్లకుందేలు “ఆహా భలేగుందే" అంటూ పరుగెత్తుకుంటూ పోయి తప్పెట తీసుకుంది. అది చూసి తెల్లకుందేలు “ఏయ్... ఏంటది... పారేయ్ ఆ పనికిరానిదాన్ని" అంది. నల్లకుందేలు నవ్వుతూ “మామా... ఈ లోకంలో పనికిరానిదంటూ ఏదీ వుండదు. అన్నీ పనికొచ్చేవే" అంది. 
అవి రెండూ కొంచం దూరం పోయేసరికి ఒకచోట రెండు జిరాఫీ పిల్లలు అల్లరి చేసినందుకు వాళ్ళమ్మ కొట్టిందని ఏడుస్తూ కనిపించాయి. నల్లకుందేలు వాటి దగ్గరకు పోయి తప్పెట తీసుకొని మధురంగా వాయిస్తా పాట పాడసాగింది. అది చూసి అవి ఆనందంగా కిందామీదా పడి నవ్వాయి. వాటి ఏడుపంతా ఎగిరిపోయింది. 

కుందేళ్ళు రెండూ కొంచం దూరం పోయేసరికి ఒక్కసారిగా పెద్ద వాన మొదలైంది. చుట్టూ ఎక్కడా పెద్దచెట్టు ఒక్కటి గూడా కనబడలేదు. నల్ల కుందేలు వెంటనే తడవకుండా చేతిలో ఉన్న తప్పెట నెత్తి మీద పెట్టుకుంది. తెల్లకుందేలుకు ఏమి చేయాలో తెలియక అలాగే వానలో తడుచుకుంటూ వణుక్కుంటూ బైలుదేరింది. 
ఆ కుందేళ్ళు రెండూ అలా కొంతదూరం పోగానే వాటికి ఒక నది అడ్డం వచ్చింది. దానిని ఎలా దాటాలో తెలీక తెల్లకుందేలు గొంతు లోతు నీళ్ళలోకి నెమ్మదిగా దిగి భయపడుతా భయపడుతా అవతలికి చేరింది. నల్లకుందేలు కాసేపు ఆలోచించి చేతిలోని తప్పెటను నీళ్ళ మీద పడవలాగా పెట్టి దానిమీద కూర్చోని చేతులతో నీళ్ళను తోసుకుంటూ అవతలికి చేరుకొంది. 
అలా ఆ కుందేళ్ళు రెండూ పోతూ వుంటే ఒకచోట వాటికి ఎదురుగా ఒక పెద్ద పులి వచ్చింది. దానిని చూసి ఆడిరిపడి అవి రెండూ పరుగెత్తుకుంటూ పోయి ఒక పొదలో దాక్కున్నాయి. కానీ ఆ పెద్దపులి వాటి వాసన పసిగట్టి ఆ పొద దగ్గరకు రాసాగింది. తెల్లకుందేలు భయంతో ఏం చేయాలో తెలియక వణికిపోసాగింది. ఇక ఈరోజుతో చావడం ఖాయం అనుకుంటా కళ్ళు మూసుకొంది. నల్లకుందేలు దానిలా తెలివి తక్కువది కాదుగదా... ఆ పెద్దపులి నుంచి ఎలా తెప్పించుకోవాలా అని బాగా ఆలోచించసాగింది. దానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే పక్కనున్న ఒక కట్టెపుల్ల తీసుకొని పులి పొద దగ్గరకు రాగానే తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా తప్పెట మీద ధనధనధనమని చెవులు బద్దలయ్యేలా వాయించసాగింది. అంతే... ఆ భయంకరమైన చప్పుడుకు అదిరిపడిన పులి ఆ పొదలో ఏముందో ఏమో అని వణికిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. అలా నల్ల కుందేలు తెలివి తేటలతో అవి రెండూ ప్రాణాలతో బైట పడ్డాయి.
*************************
డా.ఎం.హరికిషన్
 94f8;
🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.207.
*మన ఆరోగ్యం…!


               *పెద్ద ప్రేగు*
             ➖➖➖✍️

*ప్రస్తుతం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేగు క్యాన్సర్ (BOWEL / COLON CANCER) కేసుల సంఖ్య పెరుగుతోంది.*
            ➖➖➖✍️

```
*సలహాలు: అవగాహన ఉండటం వల్ల ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

*_1.ప్రేగు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? (కారణాలు)
*ఇది అని చెప్పలేకపోయినా, ఈ క్రింది అంశాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి:

*ఆహారపు అలవాట్లు : పీచు పదార్థం (FIBER) తక్కువగా ఉండటం, ఎక్కువ మొత్తంలో రెడ్ మీట్ (మటన్) మరియు ప్రాసెస్ చేసిన మాంసం (SAUSAGES, SALAMI) తీసుకోవడం.
 
*వయస్సు :
*సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఇటీవల కాలంలో యువతలో కూడా కనిపిస్తోంది.
 
*అలవాట్లు :
*మితిమీరిన మద్యం సేవించడం మరియు ధూమపానం చేయడం.

*స్థూలకాయం :
*అధిక బరువు మరియు వ్యాయామం లేకపోవడం.

*జన్యుపరమైన కారణాలు :
*కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉండటం.
 
*ఇతర వ్యాధులు:
*దీర్ఘకాలికంగా ప్రేగు సంబంధిత వాపు వ్యాధులు (ULCERATIVE COLITIS లేదా CROHN'S DISEASE) ఉండటం

*ముఖ్యమైన లక్షణాలు (SYMTOMS) :
*ఈ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి :

*1.మల విసర్జన అలవాట్లలో మార్పు (తరచుగా విరేచనాలు లేదా మలబద్ధకం).

*2.మలంలో రక్తం పడటం (ఎరుపు లేదా నలుపు రంగులో).

*3.పొత్తికడపులో నొప్పి, గ్యాస్ లేదా అసౌకర్యం.

*4.తిన్న తర్వాత కడుపు భారంగా ఉండటం.

*5.కారణం లేకుండా బరువు తగ్గిపోవడం.

*6.ఎప్పుడూ అలసటగా, నీరసంగా అనిపించడం (రక్తహీనత వల్ల).

*సలహాలు మరియు సూచనలు..

*1. పరీక్షలు (SCREENIG)  కొలనోస్కోపీ / COLONO SCOPY :
*ప్రేగు లోపల గడ్డలు లేదా పాలిప్స్ (POLYPS) ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చేసే ముఖ్యమైన పరీక్ష.

*స్టూల్ టెస్ట్/మలం పరీక్ష (STOOL TEST) :
*మలంలో కంటికి కనిపించని రక్తం ఉందో లేదో చూస్తారు.

*2. ఆహార నియమాలు :
*పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోండి.
*మైదా వంటి రిఫైన్డ్ ఫుడ్స్ తగ్గించి, తృణధాన్యాలు (WHOLE GRAINS) తీసుకోండి.
*నీరు ఎక్కువగా త్రాగాలి.

*3. జీవనశైలి మార్పులు :
*రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.
*మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండండి.
*బరువును నియంత్రణలో ఉంచుకోండి.

*చాలా సందర్భాల్లో ప్రేగు క్యాన్సర్ నేరుగా రాదు. ముందుగా పాలిప్స్ (POLYPS) అనే చిన్న కండ గడ్డలు ప్రేగులో ఏర్పడతాయి. వీటిని కోలనోస్కోపీ ద్వారా ముందుగానే గుర్తించి తొలగిస్తే, అవి క్యాన్సర్‌గా మారకుండా నిరోధించవచ్చు.

*సలహా :
*మీకు 45–50 ఏళ్లు దాటితే, ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఒకసారి స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. పైన చెప్పిన లక్షణాలు ఉంటే మాత్రం 
ఏ వయస్సు వారైనా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలవాలి.✍️```
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
 *నేటి కథ*


*పెద్ద దయ్యాలు*


పిల్లల కథల్లో అసంబద్ధత మధురంగా ఉంటుంది. మా చిన్నప్పుడెప్పుడో మేం విన్న ఈ అర్థంలేని కథ ఇంకా పిల్లల నోళ్ళలో నానుతూనే ఉంది.. ఎందుకంటారు? ఈలాంటి కథల్లోని ఏగుణం వీటిని పిల్లల మనసులకు దగ్గరచేస్తుంది? తమ బడి పత్రిక ’సృజన’ కోసం వంశి రాసిన ఈ కథ, పిల్లలకే సొంతమైన భావనలు వేటినో తెలియజేస్తుండాలి మరి. ఈ భావనల్ని అందుకోగలిగే పెద్దలు ధన్యులు!

అనగనగా ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి అడవిగుండా ఆ పక్క ఊరికి వెళ్దామనుకున్నారు. దారిలో వారికి ఒక పెద్ద నల్లతాడు, ఒక అగ్గిపెట్టె దొరికాయి. ఇంకొంచెం దూరం పోగానే వారికి పుండుతో బాధ పడుతున్న ఒక గాడిద దొరికింది. దానిని నడిపించుకొని పోతుంటే వారికి దారిలో ఒక సున్నం డబ్బా, గడ్డపార కూడా దొరికాయి. ఇంతలో చీకటి పడింది. ’ఎట్లా’ అనుకుంటుండగానే ఒక గుహ కనిపించింది. దానిలో నిద్రపోదామనుకున్నారు. కానీ దానిలో దయ్యాలున్నాయి వారికేమో తెలియదు. ఒక తలుపు ఉంటే లోపలికి వెళ్ళి గొళ్ళెం పెట్టుకున్నారు. బయటినుండి రెండు దయ్యాలు వచ్చి తలుపు తీయమని అరవడం మొదలు పెట్టాయి. అవి ఎంత అరిచినా వీళ్లు తలుపు తెరవలేదు. అప్పుడు దయ్యాలు ’మీరు ఎవరు?’ అని అడిగాయి. వారు "మేము దయ్యాలము" అని చెప్పారు. "మిమ్మల్ని ఎలా నమ్మాలి?" అని అడిగాయి అవి. "మమ్మల్ని నమ్మాలంటే మా జుట్టు చూడండి" అని వాళ్ళు నల్లతాడును బయటికి చూపారు. "ఇంకా కావాలంటే మా ఉమ్మిని చూడండి" అని సున్నండబ్బాని కిటికీలోనుండి బయటికి వంచారు. దానితో బయటి దయ్యాలు భయపడ్డాయి. "మీ అరుపును వినిపించండి" అన్నాయి దయ్యాలు మళ్ళీ. వాళ్ళు అగ్గిపెట్టెతో నిప్పురాజేసి, గడ్డపారను ఎర్రగా కాల్చారు. దానితో గాడిద పుండును కాల్చారు. అది గట్టిగా అరిచి తలుపు విరిగేటట్లు ధనధనా తన్నింది. దాని వెనకే పరుగెత్తుకొచ్చిన మిత్రులిద్దరూ బయటికి దూకి, తమ చేతిలోని గడ్డపారతో దయ్యాల వెంటపడ్డారు. అవి రెండూ భయంతో తోకముడిచి పరుగుపెట్టాయి.
 ఒకరు ఏ సాధనాన్ని అవలంబించినప్పటికీ—ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక సాధనను 'ఎంచుకుంటారని' చెప్పలేము—ఏ కార్యమైనా మొదట కేవలం ఒక 'సాధన'గా లేదా పరికరంగా మాత్రమే ఎంపిక చేయబడుతుంది. సాధకుడు ఆ నిర్దిష్ట పరికరంతో శరణాగతి, ఏకాగ్రత మరియు లయ అనే బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే, ఆ పరికరమే ఒక నిజమైన ఆధ్యాత్మిక సాధనగా రూపాంతరం చెందుతుంది.

అందువల్ల, ఒక వ్యక్తి ఏ పరికరాన్ని అవలంబించాలని ఎంచుకున్నప్పటికీ, ఆ పరికరాన్ని మేల్కొల్పడానికి అవసరమైన ప్రాథమిక అంశం 'ఆత్మ-తత్త్వం' (ఆత్మ యొక్క సారం); ఈ సారాన్ని ఏకాగ్రత శక్తి ద్వారా ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు. ఒక నిర్దిష్ట పరికరాన్ని ఎంచుకుని, దానిపై పూర్తి ఏకాగ్రతను కేంద్రీకరించడం ద్వారా, ఈ ప్రాథమిక సారాన్ని ప్రసారం చేయవచ్చు. దానికి సంబంధించిన భావనలో లేదా అనుభూతిలో నిరంతరం లీనమవడం ద్వారా, అదే భావనను ఒక మాధ్యమంగా వ్యక్తపరచవచ్చు—ఈ ప్రక్రియే 'భక్తి'కి దారితీస్తుంది. ఒకరి ప్రాణశక్తితో ('ప్రాణం') లయబద్ధమైన సామరస్యాన్ని ఏర్పరచుకోవడం ద్వారా, దానిని కూడా ఒక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చు; ఈ శక్తిని వ్యక్తపరచడానికి ఒకే ఆలోచనను పదేపదే ధ్యానిస్తే, అది ధారణగా పరిణామం చెందుతుంది—అంటే, దానికి ఏకాగ్రత అనే రూపాన్ని ఇవ్వడం ద్వారా, అది కూడా ఒక ప్రభావవంతమైన మాధ్యమంగా మారుతుంది. ప్రత్యామ్నాయంగా, ఒకే అక్షరాన్ని లేదా ధ్వనిని పదేపదే జపిస్తే, అది స్వయంగా ఒక మంత్రంగా రూపాంతరం చెంది, అదే సమయంలో శక్తివంతమైన మాధ్యమంగా కూడా పనిచేస్తుంది.

అందువల్ల, మీ భావోద్వేగాలకు లోతును చేకూర్చండి; మీ ఆలోచనలకు లోతును చేకూర్చండి; మీ అక్షరాలకు లోతును చేకూర్చండి; లేదా, మీరు ఎంచుకున్న ఏ నిర్దిష్ట సాధనానికైనా లోతును చేకూర్చండి. గుర్తుంచుకోండి: మీరు మీ సాధనంగా సగుణ రూపాన్ని ఉపయోగించినప్పటికీ—ఆధ్యాత్మిక నియమాలను (యమ మరియు నియమ) కఠినంగా పాటిస్తూ—ఒకానొక రోజు అదే సాధనం మిమ్మల్ని అద్వైతానికి పరాకాష్ట అయిన నిర్గుణ స్థితికి తీసుకువెళుతుంది. ఏదైనా ఆధ్యాత్మిక కార్యం లేదా సాధనం యొక్క ఏకైక ఉద్దేశ్యం, వ్యక్తిగత ఆత్మను (*జీవిని*) దాని నిజమైన, సహజమైన చైతన్య అస్తిత్వంతో ఏకం చేయడమే. ఈ దశను దాటిన తర్వాత, అన్ని సాధనాలు, కార్యకలాపాలు మరియు మాధ్యమాల పనితీరు పూర్తిగా ఆగిపోతుంది. ఆ తర్వాత మిగిలింది శుద్ధమైన ప్రళయం—ఆత్మ పూర్తిగా అదే చైతన్యంలో లీనమవడం. ఈ గాఢమైన లీనస్థితి—ఈ అపారమైన తన్మయత్వం—సాధకుడు (*Sadhaka*), సాధ్యం (*Sadhya*), మరియు సాధన (*Sadhana*) అనే మూడు అంశాలు ఒక పరిపూర్ణమైన, ఏకీకృత సమగ్ర రూపంలో విలీనమయ్యే ఆ క్షణం వరకు కొనసాగుతుంది; ఆ క్షణంలో, ఆ మూడింటికి సంబంధించిన భిన్నమైన అవగాహన కరిగిపోతుంది, మరియు సాధకుడు ఆ ఏకైక, ఏకీకృత చైతన్యంలో విలీనమైపోతాడు—తద్వారా ఆ చైతన్యాన్ని అంతిమమైన *ప్రజ్ఞ* (అతీంద్రియ జ్ఞానం) గా రూపాంతరం చెందిస్తాడు.
 🚩 "శరణాగతి ఎన్నడూ పాక్షికమైనది కాదు; అది ఎల్లప్పుడూ సంపూర్ణమైనది!" — శ్రీకృష్ణుడు అర్జునుడిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకోండి. ✨
ఒక నిజమైన సమురాయ్ యోధుడిని యుద్ధానికి పంపే ముందు, అతడు మృత్యువునే ఎదుర్కొనేలా చేస్తారు. తన నాభి కింద దాగి ఉన్న జీవనాధారం నుండి తన శరీరాన్ని, ఆత్మను వేరు చేయడం నేర్చుకున్నవాడు మృత్యు భయం నుండి శాశ్వతంగా విముక్తి పొందుతాడు. మరణించే క్షణంలో కూడా అతని ముఖంలో భయం ఉండదు—కేవలం ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంటుంది.

మహాభారత కథానాయకుడైన అర్జునుడు, కచ్చితంగా అటువంటి అజేయుడైన, నిర్భయుడైన క్షత్రియుడే! 🏹

అర్జునుడు మృత్యువును అధిగమించాడు. ధర్మం కోసం సర్వస్వం త్యాగం చేయగల సత్పురుషుడు అతడు. అందుకే, కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడితో, "సర్వస్వం నాకు అర్పించు" అని చెప్పాడు. అర్జునుడు లెక్కలు వేసేవాడు లేదా వెనుకాడేవాడు కాదని కృష్ణుడికి తెలుసు; అతడు శరణాగతిని ఎంచుకుంటే, తన కోసం ఏమీ దాచుకోడు.

గుర్తుంచుకోండి: దైవానికి శరణాగతి ఎన్నడూ విడతలుగా లేదా సగం సగంగా చేయబడదు; అది నూటికి నూరు శాతం సంపూర్ణమైనది. మీ జీవితంలో సంపూర్ణ శరణాగతికి *మీరు* కూడా సిద్ధంగా ఉన్నారా?
 ప్రియమైన అందరికీ,
శనివారం రోజు మేము సుమారు 16 మంది స్నేహితులు కలిసి ఆలయంలో కలుద్దామని నిర్ణయించుకున్నాం.
ఎలా క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్తారో, అలాగే ముస్లింలు శుక్రవారం మసీదుకు వెళ్తారు. అదే విధంగా మనమూ ప్రతి శనివారం ఆలయానికి వెళ్లే అలవాటు చేసుకుందాం.
మనము ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటాము — హిందువులు హిందువుల కోసం నిలబడరని.
అయితే, మనమే ఒక నియమం చేసుకుందాం — వారానికి కనీసం ఒకసారి అయినా ఒకరికొకరం కలుద్దాం.
ఈరోజు ఖాళీగా ఉన్న మన ఆలయాలను శక్తి మరియు ఐక్యత కేంద్రాలుగా మార్చుకుందాం.
ప్రతి శనివారం సాయంత్రం 7:00 నుంచి 7:30 వరకు
మీరు ఎక్కడ ఉన్నా అక్కడి దగ్గరలోని ఆలయానికి చేరుకోండి.
ఇది హారతి సమయం.
ఇంట్లో ఉంటే → ఇంటి దగ్గరలోని ఆలయానికి
దుకాణంలో ఉంటే → దుకాణం దగ్గరలోని ఆలయానికి
ఆఫీసులో ఉంటే → ఆఫీస్ దగ్గరలోని ఏదైనా ఆలయానికి
శనివారం 7:00 నుంచి 7:30 వరకు ఆలయానికి తప్పకుండా వెళ్లండి.
ఒక్కసారి ఊహించండి — భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి.
ప్రతి ఆలయంలో 50 నుంచి 100 మంది కలిసి,
శంఖనాదం, గంటనాదం, హారతి ధ్వని ఒకేసారి వినిపిస్తే,
ప్రతి శనివారం సాయంత్రం 7 గంటలకు మొత్తం భారత్ భక్తి నాదంతో మార్మోగుతుంది.
7:30 వరకు ఈ నాదం కొనసాగితే,
దాని ప్రభావం ప్రపంచమంతా వ్యాపిస్తుంది — అది దీర్ఘకాలికంగా ఉంటుంది.
నన్ను నమ్మండి —
ఈరోజు ఉన్న సమస్యలన్నీ కర్పూరంలా కరిగిపోతాయి,
హిందువులు ఇంత పెద్ద సంఖ్యలో, ప్రతి వారం ఆలయానికి రావడం ప్రారంభిస్తే.
అప్పుడు ఎవరూ హిందువులను ఎగతాళి చేసే ధైర్యం చేయరు.
సాధ్యమైతే భార్య మరియు పిల్లలను కూడా తీసుకెళ్లండి.
ఈ విధంగా ప్రతి శనివారం ఆలయానికి వెళ్లడం వల్ల,
చుట్టుపక్కల వారు మిమ్మల్ని గుర్తిస్తారు,
సంబంధాలు పెరుగుతాయి, సమాజం ఐక్యతతో బలపడుతుంది.
ఈ సందేశం మీకు నచ్చితే,
దయచేసి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి.
ఈరోజే ఒక సంకల్పం తీసుకోండి —
ప్రతి శనివారం సాయంత్రం 7:00 నుంచి 7:30 వరకు
మనం తప్పకుండా ఆలయానికి వెళ్దాం,
మన కోసం మాత్రమే కాదు,
మన సమాజం, మన కుటుంబం మరియు మన భద్రత కోసం.
గుర్తుంచుకోండి —
ఇది ఇప్పుడు చాలా అవసరం.
మనము దీనిని నిర్లక్ష్యం చేస్తే,
ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎంత త్వరగా మనం ప్రారంభిస్తామో,
అంత త్వరగా మనం ఐక్యతలో బలపడతాం.
ఈ సందేశాన్ని కనీసం ఐదు గ్రూపులకు పంపండి.
కొంతమంది పంపకపోవచ్చు,
కానీ మీరు తప్పకుండా పంపుతారని నాకు నమ్మకం ఉంది. 🙏🕉️🚩🇮🇳🔱

నేను హిందూ అని గర్వాంగా చెప్పు.


Sekarana
 *కంగారు*

సమయం రాత్రి 11 గంటలు. నిద్ర పట్టడం లేదు. ఎందుకో తెలీదు. ఈమధ్య రోజూ ఇంతే. అయినా పడుకుని కళ్ళు మూసుకుంది ఆమె. ఒక్కసారిగా గత జీవితమంతా కళ్ళముందు మెదిలింది.
 
చిన్నతనం నించీ నాకు  కంగారు ఎక్కువట. తను ఏడో నెలలోనే పుట్టేసేనట. అందుకే ఈ పిల్లకి కంగారు ఎక్కువ అని అందరూ ఏడిపించేవారు. దానికి నాదా బాధ్యత ? ఏమో కాని అప్పుడప్పుడు అనిపించేది నాకు కంగారు ఎక్కువేనని. తొమ్మిదవ నెలకే నడక, ఏడాదిలోపే మాటలు వచ్చేసాయట. బాగా మాట్లాడడంతో నాలుగో ఏటే స్కూల్ లో పడేశారు. స్పోర్ట్స్ డే నాడు రన్నింగ్ రేస్ కి వేడుతుంటే అమ్మ చెప్పింది – “నెమ్మదిగా పరిగెత్తు. నీకసలే కంగారెక్కువ”. అన్నట్లుగానే కంగారుగా పరిగెత్తాను. పడ్డాను. మోకాలు కొట్టుకు పోయింది. పెట్టిన చివాట్లతో కడుపు నిండి పోయింది. నాతో పాటే నా కంగారు కూడా పెరిగింది. పరీక్షలోస్తే కంగారు. రిజల్ట్ వచ్చే రోజైతే మరీనూ. స్కూల్ లో వక్తృత్వం పోటీలలో స్టేజ్ ఎక్కగానే కంగారు. ఎవరైనా కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే కంగారు. మాటలు తడబడేవి.
 
ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ చదువుతానంటే అమ్మా నాన్నా కంగారు పడి చదువు మాన్పించారు. వంట నేర్చుకోమన్నారు అక్కడ కూడా కంగారు నన్ను వదలలేదు.  అన్నం వుడకదేమోనని, కూర మాడి పోతుందేమోనని, పులుసులో చింతపండు తక్కువైనదేమోనని కంగారు పడుతూ వంట తగలేసే దాన్ని. కొన్నాళ్ళకి ఎలాగో వంటొచ్చిందని అనిపించుకున్నాను.
 
అనుకున్నట్లుగానే అమ్మా నాన్న కంగారు పడిపోయి నాకు పెళ్లి చేసేశారు. ఆయన మంచాయనే. అసలే కంగారు మనిషినైన నన్ను ఇంకా కంగారు పెట్టేవారు. ఆయనతో ఊరెళ్ళాలంటే బట్టలు సర్దడానికి కంగారు, రైలెక్కడానికి కంగారు, సాయంత్రం పార్క్ కి వెళ్ళడానికి కంగారు, తీరా వెళ్ళేక ఇంటికొచ్చేదాకా కంగారు. ఆ కంగారు లోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళ గురించి ఇప్పటికీ కంగారే. వాళ్ళకి జ్వరం వస్తే, వాళ్ళు హోమ్ వర్క్ చేయకపోతే, పరీక్షలో మార్కులు తక్కువొస్తే, వాళ్ళ స్కూల్ బస్ రాకపోతే, టైముకి లంచ్ బాక్స్ తయారవక పోతే అన్నిటికీ కంగారే. ఎలాగైతేనే వాళ్ళు పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు చేసుకుని ఉద్యోగాలలో సెటిల్ అయ్యారు. ఈ లోపు కంగారెక్కువై అనవసరంగా ఆయన ముందే పైకి వెళ్ళి పోయారు.
 
కొడుకులు, కోడళ్ళు  బాగానే చూసుకుంటారు. మనవలు వాళ్ళ ఆటలు, చదువుల లోకంలో వాళ్లుంటారు. వంట మనిషి వంట చేస్తుంది. పని మనిషి మిగతా పని అంతా చేసేస్తుంది. కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్లిపోతారు. ఇంట్లో నేనొక్కదాన్నే. రోజంతా ఖాళీ. ఎవరైనా నన్ను ఏదైనా అడుగుతారేమో నని ఎదురు చూస్తాను. ఎవరూ ఏదీ ఆడగారు. కావలసినవి అనీ టైమ్ ప్రకారం అమరుస్తారు. ఎప్పుడైనా మనవలు టీవీ ఖాళీగా వుంచితే చూడడం లేదా పుస్తకాలు చదువుకోవడం. ఇప్పుడు నన్ను కంగారు పెట్టేవాళ్ళు ఎవరూ లేరు. ఆ కంగారు పడిన రోజులే నాకు బాగున్నాయనిపిస్తోంది. అసలు కంగారు లేకపోతే జీవితమే లేదు అన్న సత్యం అవగతమౌతోంది. ఆరోగ్యవంతమైన కంగారు వుండాలి. పని  పూర్తి చెయ్యాలి. ఒక సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఉండాలి. లేకపోతే జీవితంఅంతా స్తబ్దుగా వుంటుంది. డిప్రెషన్, నిరాశ, నిరంతర విచారం మనకి తెలియకుండానే మనలో ప్రవేశిస్తాయి.
 
ఒక్కసారిగా నాలో ఏదో ఉత్తేజం కలిగింది. నా కంగారు నాకు కావాలి. కంగారు పడాలి. కంగారు పెట్టాలి. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. నేను చేయాలనుకుని ఇంతవరకు చేయని పనులన్నీ చేసేస్తాను. ఎవరేమనుకుంటే అనుకోనీ.
 
హాల్లోకి వచ్చి టీవీ పెట్టాను. యూట్యూబ్ ఓపెన్ చేసి నాకిష్టమైన పాత హిందీ సినిమా పెట్టుకున్నాను. ఈ రోజు మొత్తం సినిమా చూసే పడుకోవాలి అని నిశ్చయించుకున్నాను. ఒక పది నిమిషాలలో కొడుకు, కోడలు కంగారు పడుతూ గదిలోనుంచి బయటకి వచ్చారు కంగారుగా. “ఏంటమ్మా అర్ధరాత్రి పూట సినిమా పెట్టావు ?” అని అడిగారు. “నా ఇష్టం. నేను సినిమా చూసే పడుకొంటాను. మీకిష్టమైతే మీరు కూడా చూడండి” అన్నాను సీరియస్ గా. “వంట్లో బానే వుందా ?” ప్రశ్నించారు. “నిక్షేపంగా వున్నాను. వెళ్ళి పడుకోండి” అన్నాను అంతే సీరియస్ గా.  చేసేది లేక  అయోమయంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు.
 
ఇకనించీ కంగారు పడడం అంటే ఏమిటో వాళ్ళకీ నేర్పిస్తాను అనుకుంటూ చిన్నగా నవ్వుకున్నాను.

 
(నండూరి బాల సుబ్రహ్మణ్యం)

పాపం, పుణ్యం అనేవి మూఢనమ్మకాలు కావు... అవి 'ఎనర్జీ మరియు ఫ్రీక్వెన్సీలు'!

 పాపం, పుణ్యం అనేవి మూఢనమ్మకాలు కావు... అవి 'ఎనర్జీ మరియు ఫ్రీక్వెన్సీలు'!
======================================
"పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం చేస్తే నరకానికి వెళ్తాం" అని చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు చెబుతూ వచ్చారు. చిత్రగుప్తుడు పైన కూర్చుని ఒక పెద్ద పుస్తకంలో మన లెక్కలు రాస్తుంటాడని మనం విన్నాం. ఆధునిక యుగంలో ఇవన్నీ పాతకాలపు నమ్మకాలుగా కొందరికి అనిపించవచ్చు. 

కానీ క్వాంటం ఫిజిక్స్ (Quantum Physics) ప్రకారం ఈ విశ్వంలో ప్రతిదీ ఒక శక్తే (Energy). మన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ 'వైబ్రేషన్స్' (Vibrations) రూపంలో ఉంటాయి. పురాణాల్లో చెప్పిన "పాప-పుణ్యాలను" నేటి సైన్స్ పరిభాషలో "నెగిటివ్-పాజిటివ్ ఎనర్జీలు" అంటారు. దీన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకుందాం:

పుణ్యం (Positive Energy / High Frequencies):
నిస్వార్థమైన ప్రేమ, దయ, జాలి, ఇతరులకు సాయం చేయడం, కృతజ్ఞత (Gratitude) కలిగి ఉండటం... ఇవన్నీ 'హై ఫ్రీక్వెన్సీ' (ఉన్నత స్థాయి) తరంగాలు. 

మానసిక/శారీరక ప్రభావం:
 మీరు ఒక పేదవాడికి కడుపునిండా అన్నం పెట్టినప్పుడు లేదా ఒక మూగజీవికి సాయం చేసినప్పుడు మీలో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. అప్పుడు మీ మెదడులో డోపమైన్ (Dopamine), ఆక్సిటోసిన్ (Oxytocin) అనే 'హ్యాపీ హార్మోన్స్' రిలీజ్ అవుతాయి. 

ఆరా (Aura): ఈ పాజిటివ్ పనులు చేసినప్పుడు మీ శరీరం చుట్టూ ఉండే శక్తి వలయం (Aura) ప్రకాశవంతంగా మారుతుంది. 

ఫలితం: ఈ పాజిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి మంచి వ్యక్తులను, అదృష్టాన్ని, ప్రశాంతతను అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. దీన్నే మన పెద్దలు "పుణ్యం ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు కాపాడుతుంది" అన్నారు.

పాపం (Negative Energy / Low Frequencies):
కోపం, అసూయ, స్వార్థం, ఇతరులను మోసం చేయడం, పగ పెంచుకోవడం... ఇవన్నీ 'లో ఫ్రీక్వెన్సీ' (తక్కువ స్థాయి) తరంగాలు.

మానసిక/శారీరక ప్రభావం: మీరు ఎవరి పట్ల అయినా తీవ్రమైన ద్వేషం పెంచుకున్నప్పుడు లేదా ఒకరిని మోసం చేసినప్పుడు, మీ శరీరంలో కార్టిసాల్ (Cortisol) అనే 'స్ట్రెస్ హార్మోన్' రిలీజ్ అవుతుంది. ఇది మీ బీపీని పెంచుతుంది, నిద్రను దూరం చేస్తుంది, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. 

ఆరా (Aura): నెగిటివ్ పనులు చేసినప్పుడు మీ 'ఆరా' ముడుచుకుపోయి, నల్లగా మారుతుంది.

ఫలితం: ఇతరుల పట్ల మీరు వదిలే విషపూరితమైన ఆలోచనలు, తరంగాలు ముందుగా మీ శరీరాన్ని, మీ మనస్సునే నాశనం చేస్తాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ మీ జీవితంలోకి దురదృష్టాన్ని, అనారోగ్యాన్ని, సమస్యలను ఆకర్షిస్తుంది. "పాపం పండింది" అంటే ఇదే!

ఆలోచనలే శక్తులు (Thoughts are Energies):
పుణ్యం లేదా పాపం అనేది కేవలం చేతులతో చేసే పనుల వల్ల మాత్రమే రాదు. మీరు మనసులో ఏమనుకుంటున్నారు అనేది కూడా ఒక ఎనర్జీనే! 
"వాడు నాశనమైపోవాలి" అని మీరు మనసులో గట్టిగా అనుకుంటే, మీరు ఒక నెగిటివ్ ఎనర్జీని (పాపాన్ని) క్రియేట్ చేసినట్లే. ఎదుటివారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీరు పాజిటివ్ ఎనర్జీని (పుణ్యాన్ని) మూటగట్టుకున్నట్లే.

విశ్వపు బ్యాంక్ అకౌంట్ (The Cosmic Bank Account):
ఈ విశ్వం (Universe) ఒక పెద్ద బ్యాంక్ లాంటిది. మీరు చేసే ప్రతి మంచి పని, మాట్లాడే ప్రతి మంచి మాట ఆ ఖాతాలో 'పాజిటివ్ ఎనర్జీ' (పుణ్యం) రూపంలో డిపాజిట్ అవుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం ఎదురైనప్పుడు... ఈ అకౌంట్ లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఒక కవచంలా మారి మిమ్మల్ని రక్షిస్తుంది. (దీన్నే మనం 'ఏదో పుణ్యం చేసుకున్నావు కాబట్టి బతికిపోయావు' అంటాం). నెగిటివ్ పనులు చేస్తే ఈ అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయిపోయి, సమస్యల్లో చిక్కుకుంటాం.

సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలయిక:
*భౌతిక శాస్త్రం (Physics):* "శక్తిని మనం సృష్టించలేము, నాశనమూ చేయలేము (Energy can neither be created nor destroyed). అది ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారుతుంది."
*కర్మ సిద్ధాంతం:* మీరు ఈ విశ్వంలోకి ఎలాంటి శక్తిని (పాజిటివ్ లేదా నెగిటివ్) పంపిస్తారో... అది వడ్డీతో సహా తిరిగి మీ దగ్గరకే వస్తుంది. బంతిని గోడకేసి ఎంత గట్టిగా కొడితే, అంతే వేగంగా మనవైపు తిరిగి వస్తుంది. 

ముగింపు:
"పుణ్యం" అంటే వందల కొబ్బరికాయలు కొట్టడం, లక్షల రూపాయలు దానాలు చేయడం కాదు. 
ఎదుటివాడిని చూసి చిరునవ్వు నవ్వడం కూడా ఒక పాజిటివ్ ఎనర్జీయే (పుణ్యమే). ఎవరినీ నొప్పించకుండా మాట్లాడటం, మన వల్ల అయినంత సాయం చేయడం, మనసులో చెడు ఆలోచనలకు చోటు ఇవ్వకపోవడం... ఇవన్నీ మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ని పెంచుతాయి.

దేవుడు శిక్షిస్తాడు అని భయపడకండి... మీరు సృష్టించే నెగిటివ్ ఎనర్జీ (పాపం) మిమ్మల్ని శిక్షిస్తుంది. దేవుడు కాపాడతాడు అని ఎదురుచూడకండి... మీరు సృష్టించే పాజిటివ్ ఎనర్జీ (పుణ్యం) మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. 

ఇప్పటినుంచైనా మన ఆలోచనలను, పనులను పాజిటివ్‌గా మార్చుకుందాం... అద్భుతమైన జీవితాన్ని నిర్మించుకుందాం! 🙏
 లలితా సహస్రనామ పారాయణకు ముందు చదివే అత్యంత ముఖ్యమైన ధ్యాన శ్లోకం. ఈ శ్లోకం అమ్మవారి స్వరూపాన్ని, ఆమె దయను మరియు ఆమెను ఎలా ధ్యానించాలో అద్భుతంగా వివరిస్తుంది.
ఈ శ్లోకంలోని వర్ణనకు తగ్గట్టుగా అమ్మవారు అరుణ (ఎర్రటి) వర్ణంలో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు (చాపం), మరియు పుష్ప బాణాలను ధరించి ఉన్నారు. 

అలాగే ఆమె చుట్టూ అష్టసిద్ధులు (అణిమాది సిద్ధులు) కాంతి రూపంలో కనిపిస్తున్నారు.

శ్లోకం:

అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ ।
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ॥

ఈ శ్లోకం సాధకుడికి అమ్మవారి రూపాన్ని మనోఫలకంపై నిలుపుకోవడానికి సహాయపడుతుంది.

1. అమ్మవారి రూపం మరియు దయ:

"అరుణాం" - అమ్మవారు ఉదయ సూర్యుడిలా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ రంగు సృజనాత్మకతకు మరియు శక్తికి సంకేతం.
"కరుణా తరంగితాక్షీం" - ఆమె కళ్ళు దయా సముద్రంలా ఉంటాయి. ఆ సముద్రంలోని అలల్లాగా ఆమె కరుణ ఆమె భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆమె చూపు పడితేనే కష్టాలన్నీ తొలగిపోతాయి.

2. చేతిలోని ఆయుధాల అంతరార్థం:

అమ్మవారు నాలుగు చేతులలో ధరించిన వస్తువులు కేవలం ఆయుధాలు కావు, అవి మన మనస్సును, ఇంద్రియాలను నియంత్రించే శక్తులు:

పాశం (Noose): ఇది 'రాగం' (కోరికలు/బంధాలు) కు సంకేతం. అమ్మవారు తన పాశంతో భక్తుల యొక్క ప్రాపంచిక బంధాలను నియంత్రించి, తన వైపు తిప్పుకుంటుంది.

అంకుశం (Goad): ఇది 'ద్వేషం' (కోపం/అహకారం) కు సంకేతం. చంచలమైన ఏనుగు లాంటి మనస్సును అంకుశం ఎలా అదుపు చేస్తుందో, అమ్మవారు మనలోని క్రోధాన్ని, అహకారాన్ని తన అంకుశంతో అణచివేస్తుంది.

పుష్ప బాణాలు (Flower Arrows): ఇవి ఐదు బాణాలు. ఇవి ఐదు జ్ఞానేంద్రియాలకు (శబ్దం, స్పర్శ, రూపం, రస, గంధం) సంకేతం. ఈ పంచ తన్మాత్రలను అమ్మవారు నియంత్రిస్తుంది.

చాపం/విల్లు (Sugarcane Bow): ఇది మనస్సు (మనోరూపేక్షు కోదండా) కు సంకేతం. చెరకు విల్లులాగే మనస్సు కూడా తీపి కోరికలతో ఉంటుంది. అమ్మవారు మన మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుని, సరైన మార్గంలో నడిపిస్తుంది.

3. పరివారం మరియు సిద్ధులు:

"అణిమాదిభి రావృతాం మయూఖైః" - అమ్మవారి చుట్టూ అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం అనే ఎనిమిది సిద్ధులు కాంతి కిరణాల వలె పరివేష్టించి ఉంటాయి. అంటే, అమ్మవారిని శరణు వేడితే ఈ అష్ట సిద్ధులు సహజంగానే లభిస్తాయని భావం.

4. ధ్యాన విధానం (చరమ శ్లోకం):
"అహమిత్యేవ విభావయే భవానీమ్" - ఇది ఈ శ్లోకంలో అత్యంత కీలకమైన భాగం. అమ్మవారిని ఎక్కడో బయట ఉన్న దేవతగా కాదు, "ఆ భవాని దేవిని నేనే" (నేను ఆ దేవి కంటే వేరు కాదు) అనే అద్వైత భావనతో నాలోనే ధ్యానిస్తున్నాను. సాధకుడు తనలోని చైతన్యమే ఆ పరాశక్తి అని గ్రహించడమే ఈ ధ్యానం యొక్క పరమార్థం.

సారాంశం:

ఎర్రటి కాంతితో ప్రకాశిస్తూ, కరుణతో నిండిన కన్నులు కలిగి, చేతిలో పాశ, అంకుశ, పుష్ప బాణాలను, చెరకు విల్లును ధరించి, అష్టసిద్ధుల కాంతి పరివేష్టితమై ఉన్న ఆ భవాని దేవిని "నేనే" అని మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను.
ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా లలితా సహస్రనామ పారాయణకు అవసరమైన ఏకాగ్రత మరియు మానసిక స్థితి కలుగుతుంది.

శ్రీమాత్రే నమః అమ్మా
 *జీవితంలోని ఆఖరి ఏడు రోజులు*
ఒకానొకప్పుడు, ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకు ఉపన్యాసం ఇస్తున్నాడు. అప్పుడే ఆశ్రమంలోకి ఒక అపరిచితుడు ప్రవేశించి సాధువును దుర్భాషలాడాడు. సాధువు ఆ వ్యక్తి వైపు చూసి, ఏమీ సమాధానమివ్వకుండా, మౌనంగా ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.

అక్కడ ఉన్న శిష్యులలో ఒకరికి ఆ మాటలు విని కోపం వచ్చింది. తన గురువు ఎందుకు స్పందించకుండా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసింది.

ఉపన్యాసం ముగిసిన తరువాత, అతను గురువు వద్దకు వచ్చి, "గురూజీ, ఆ వ్యక్తి మిమ్మల్ని క్రూరంగా తిట్టినప్పుడు, ఘోరంగా దూషించినప్పుడు మీరు మౌనంగా ఎలా ఉన్నారు? దయచేసి చెప్పండి, మీరు అలాంటి పరిస్థితిలో కూడా ఇంత ప్రశాంతంగా, నవ్వుతూ ఎలా ఉండగలిగారు? మీకు కొంచెం కూడా కోపం రాలేదు, కనీసం మీ ముఖ కవళికలు కూడా మారలేదు. మీ రహస్యం ఏమిటి?" అని అడిగాడు.

సాధువు చిరునవ్వుతో, “ఆ రహస్యాన్ని ఖచ్చితంగా నీకు చెప్తాను అయితే ముందుగా, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి" అని అన్నాడు.

శిష్యుడు ఆశ్చర్యపోయాడు. "ఏమిటి గురూజీ, దయచేసి చెప్పండి" అని అడిగాడు.

సాధువు ఇలా చెప్పాడు, "నీవు ఒక వారం తర్వాత చనిపోతావు, మీ జీవితపు అంతం  దగ్గర పడింది."

అది విని శిష్యుడు చలించిపోయాడు. 
కాళ్ల కింద నుంచి నేల జారిపోయినట్లనిపించింది. ఎవరో చెబితే తను ఎప్పటికీ నమ్మేవాడు కాదేమో, కానీ ఆయన తన గురువు, ఆయన పై పూర్తి విశ్వాసం, గౌరవం ఉంది. అందువల్ల, దానిని నిజం అని నమ్మాడు, అతను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

శిష్యుడు చాలా కృంగిపోయాడు. నిరాశా నిస్పృహ స్థితిలో సూటిగా ఆలోచించలేకపోయాడు. కానీ తరువాత ఒక క్షణం స్థిరంగా ఉండి, ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాడు. అతను తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులు సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన గురువు ఆశీర్వాదంతో ఆశ్రమాన్ని విడిచిపెట్టాడు.
దారిలో శిష్యుడు తన జీవితంలోని ఆ చివరి ఏడు రోజులను పూర్తిగా ఎలా సద్వినియోగం చేసుకోవాలా అనే ఆలోచనలో మునిగిపోయాడు!

చాలా ఆలోచించిన తరువాత, అతను తన గురూజీ బోధనలను అనుసరించి, వినమ్రత, ప్రేమ, భగవంతుని పట్ల భక్తితో జీవించడానికి మిగిలిన ఏడు రోజులను గడపాలని నిర్ణయించుకున్నాడు.

ఆ క్షణం నుండి అతని స్వభావం చాలా తీవ్రంగా మారిపోయింది! ఇప్పుడు అతను అందరినీ అత్యంత ప్రేమపూరిత హృదయంతో కలుస్తున్నాడు. దేనికీ ఎవరి పైనా కోపం తెచ్చుకోవట్లేదు! అతను ఎక్కువ సమయం దేవుడి స్మరణలో గడుపుతున్నాడు. అతను చేసిన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు, తెలిసి లేదా తెలియక ఎవరితోనైనా విభేదాలు ఉన్నా లేదా ఎవరినైనా బాధపెట్టి ఉంటే, వారందరినీ క్షమాపణ కోరాడు. తన దినచర్యను ముగించిన తర్వాత, అతను భగవంతుని స్మరణలో మునిగిపోయాడు. ఇలా ఆరు రోజుల పాటు సాగింది. 

ఏడవ రోజు, శిష్యుడు తన అంతః సమయానికి  ముందు తన గురువును ఒకసారి చూడాలని, కలవాలని కోరుకున్నాడు. తన గురువును కలుసుకుని, అతని పాదాలను స్పృశించి, "గురూజీ, నా ముగింపు దగ్గర పడింది, నా చివరి క్షణాలు మీ వద్ద గడపాలనుకుంటున్నాను. దయచేసి చివరిసారిగా మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి" అన్నాడు.                 
         
సాధువు ఇలా అన్నాడు, "నా ఆశీర్వాదాలు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నీవు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు".       
 
ఏడు రోజుల క్రితం గురువు వద్ద విన్న విషయం తర్వాత, తన గురువు నోటి నుండి అలాంటి ఆశీర్వాదం విని శిష్యుడు కలవరపడ్డాడు.

తన శిష్యుడిని ఆశీర్వదించిన తరువాత, గురువు అడిగాడు, "ఇప్పుడు చెప్పు, గత ఏడు రోజులు ఎలా ఉన్నాయి? నీవు మునుపటిలా అందరిపై కోపంగా ఉన్నావా?"

ముకుళిత హస్తాలతో శిష్యుడు ఇలా జవాబిచ్చాడు, "లేదు, అస్సలు కాదు, గురూజీ. నేను జీవించడానికి కేవలం ఏడు రోజులు మాత్రమే ఉంది. నేను అలాంటి పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేయగలను? బదులుగా, నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ గడిపాను. నేను ఎప్పుడైనా ఎవరినైనా బాధపెట్టి ఉండినవారికి క్షమాపణ కూడా చెప్పాను."

దానికి గురువు చిరునవ్వు నవ్వి, "చూడు, ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది, నువ్వు కూడా అనుభూతి చెందావు నేను ఏ క్షణంలో నైనా చనిపోవచ్చని నాకు తెలిసినప్పుడు, ఎవరియందైనా చెడు భావనలతో ఆ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను?  బదులుగా, అందరి ఎడలా నా హృదయాన్ని తెరిచి ఉంచి, నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను."

పశ్చాత్తాపం, పగ, తగాదాలు, వాదనలతో వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. జీవితమంతా క్షమించడం, ముందుకు సాగిపోవడమే. జీవితపు నిజమైన లక్ష్యం ఆనందం ఎవరు ఈ ప్రగాఢమైన జీవిత రహస్యాన్ని నిజంగా అర్థం చేసుకుంటారో, వారు ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉంటారు. జ్ఞానం అంటే ఇదే. నీ జీవితంలోని ప్రతి క్షణమూ, అదే నీ చివరి క్షణమని భావించి జీవించు."

ఈ మొత్తం ఉపాయమేమిటో శిష్యుడు వెంటనే అర్థం చేసుకున్నాడు ఆ రోజు ప్రశాంతమైన, ప్రేమపూర్వక జీవితానికి సంబంధించిన గంభీరమైన రహస్యాన్ని తెలుసుకున్నాడు!
         
కేవలం ద్వేషాన్ని తొలగించండి, సార్వత్రిక ప్రేమ అక్కడే ఉంటుంది.

🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏