Thursday, January 15, 2026

 ఆభరణం..

కిటికీ పక్కన కూర్చుని అద్దంలో తనని తాను చూసుకుంటోంది సుజాత. ఎదురుగా ఉన్న అద్దం ఆమె ముఖాన్ని కాదు, ఆమె ఒంటి మీద ఉన్న 'బరువును' చూపిస్తోంది.
పక్కింటి పార్వతమ్మ అంటుంటుంది— "ఏమమ్మా సుజాతా, నీ అదృష్టం పండాలి గానీ, మీ ఆయన నిన్ను అస్సలు కష్టపెట్టరు కదా! నిన్ను ఎప్పుడూ బంగారంలా చూసుకుంటారు" అని.
సుజాత పెదవుల మీద ఒక చేదు నవ్వు మెరిసింది. అవును, ఆయన తనని నిజంగానే బంగారంలా చూసుకుంటారు. దానికి కారణం... తన ఒంటి నిండా తన పుట్టింటోళ్లు పెట్టిన బంగారం ఉండబట్టే.
అది ప్రేమా? అలంకారమా?
ఆయనకి ఆమె ఒక మనిషిలా కంటే, ఒక 'నడిచే లాకర్' లాగే కనిపిస్తుంది. పండక్కి పబ్బానికి ఆమెను ముస్తాబు చేసి పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు, ఆయన కళ్ళల్లో కనిపించేది భార్య మీద ప్రేమ కాదు; ఆ పసిడి మెరుపులు తన హోదాను ఎలా పెంచుతున్నాయనే గర్వం.
"ఆ గొలుసు తీయకు సుజాతా, అది నీ మెడలో ఉంటేనే మనకి గౌరవం" అంటారు ఆయన. ఆ గౌరవం బరువుకి ఆమె మెడ నరాలు జివ్వుమంటున్నా ఆయనకు పట్టదు. ఆమె పుట్టినరోజున ఆయన ఇచ్చే కానుకలు కూడా 'ప్రేమలేఖలు' కావు, తులాల లెక్కలు మాత్రమే.
కంచు మోగినట్లు...
"ఏవండీ, నా మనసుకి కొంచెం ప్రశాంతత కావాలి, కాసేపు మాట్లాడుతారా?" అని అడిగితే— "నీకేం తక్కువని? అడిగిన నగ చేయిస్తున్నాను, అడిగిన పట్టుచీర కొనిస్తున్నాను. నిన్ను బంగారంలా చూసుకోవడం అంటే ఇంకేమిటి?" అనే సమాధానం వస్తుంది.
అప్పుడర్థమైంది సుజాతకి... ఆయన దృష్టిలో తను ఒక ప్రాణం ఉన్న మనిషి కాదు, ఒక పెట్టుబడి. పుట్టింటి వారు తనని 'పసిడి'తో పంపారు కాబట్టే, ఈ ఇంట్లో తనకి ఈ 'పసిడి' గౌరవం దక్కుతోంది. ఆ బంగారం గనుక కరిగిపోతే, ఆయన కళ్ళల్లో ఉండే ఆ మెరుపు కూడా ఆవిరైపోతుందని ఆమెకు తెలుసు.
నిజమే... ఆయన తనని బంగారంలానే చూసుకుంటున్నారు. ఎందుకంటే, ఆమె ఒంటి నిండా ఆమె పుట్టింటోళ్ళు పెట్టిన బంగారం ఉంది కాబట్టి!

Bureddy blooms.
 *సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు :* 
*1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.* 
*2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.*
*3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం.*
*4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.*
*5. మొగిలీశ్వర్.*
*6. కోదండరామ దేవాలయం,  కడప జిల్లా.*
*7. సూర్యనారాయణ దేవాలయం జోగుళాంబ అలంపూరు గద్వాల జిల్లా*

*నిరంతరం జలము ప్రవహించే  దేవాలయాలు :* 
*1. మహానంది*
*2. జంబుకేశ్వర్*
*3. బుగ్గరామలింగేశ్వర్*
*4. కర్ణాటక కమండల గణపతి.*
*5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం.*
*6. బెంగళూర్ మల్లేశ్వర్*
*7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం*
*8. సిద్ధగంగా*
*9. అలంపురం*

*నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు.* 
*1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.*
*2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్,* 
*3. మంజునాథ్.*

*శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్*

*సముద్రమే వెనక్కివెళ్లే* 
*1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్,*
*2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.*

*స్త్రీవలె నెలసరి అయ్యే*
*1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,* 
*2. కేరళ దుర్గామాత.*

*బహ్మ పేరు తో ఏకైక శివాలయాలు*
*అలంపూరులో నవఁబహ్మేశ్వర ఆలయాలు 9 రూపాలలో శివలింగాలు ఉంటాయి*  

*రంగులు మారే ఆలయం.* 
*1. ఉత్తరాయణం,  దక్షిణాయనం లో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.*
*2. పౌర్ణమికి తెల్లగా,  అమావాస్యకు నల్లగా రంగుమారే  శివాలయం పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం సోమేశ్వర స్వామి వారి ఆలయం. పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.*

*నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు* 
*1. కాణిపాకం,*
*2. యాగంటి బసవన్న,*
*3. కాశీ తిలభండేశ్వర్,* 
*4. బెంగుళూరు బసవేశ్వర్,*
*5. బిక్కవోలు లక్ష్మీగణపతి,*

*స్వయంభువుగా* 
*సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.*
*ఆరునెలలకు ఒకసారి తెరిచే* 
*1. బదరీనాథ్,* 
*2. కేదారనాథ్ (ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది)*
*3. గుహ్యకాళీమందిరం.*

*సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు* 
*హాసంబా దేవాలయం,  హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.*

*12 ఏళ్లకు ఒకసారి*
*పిడుగుపడే తిరిగి అతుక్కునే బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.*

*స్వయంగా ప్రసాదం తినే* 
*1.  కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.*
*2. బృందావనం రాధాకృష్ణ శయనమందిరం*

*ఒంటి స్తంభంతో*
*యుగాంతానికి గుర్తుగా  ఉండే పూణే కేధారేశ్వర్,  ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.*

*రూపాలు మారే*
*ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.*

*నీటితో దీపం వెలిగించే ఘడియ ఘాట్ మాతాజీ మందిర్,* *మధ్యప్రదేశ్. అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.*

*మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు* 
*1. హేమాచల నరసింహ స్వామి.*
*2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి*

*మనిషి వలె గుటకలు*  
*వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.*

*అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.* 

*ఛాయా విశేషం* 
*1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.*
*2. హంపి విరూపాక్షేశ్వర్,  గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.*
*3. బృహదీశ్వరాలయం.*

*నీటిలో తేలే విష్ణువు (వేల టన్నుల బరువుంటుంది ),  నేపాల్*

*పూరీ* 
*పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడ పడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమ ఘుమలాడే పూరి ప్రసాదం.*

*ఇవి తెలిసిన కొన్ని మహిమాన్విత దేవాలయాలు మాత్రమే. ఇటువంటివి దేశంలో కొన్ని వేల దేవాలయాలు నిర్మాణం చేశారు(సృష్టి చేశారు)విశ్వకర్మ పరమాత్మ వంశీయులైన విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు వారికి పాదాభివందనములు.👣👏*
*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*
          *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁 🙏🕉️🙏 🍁
 [1/14, 23:21] +91 98852 16452: *సంక్రాంతి పండుగ:*
         ➖➖➖
ప్రాణికోటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ, వెలుగును అనుగ్రహించే దైవం సూర్యుడు. ఈ సృష్టి మనుగడకు ఆయనే మూల కారకుడు. దివాకరుడికి స్వాగతం పలుకుతూ చేసుకునేదే సంక్రాంతి పండుగ. 

సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ పుణ్య ఘడియల విలువలు పెరుగుతుంటాయని మన శాస్త్ర వచనం. రెండు ఆయనాలుగా సాగే సూర్యుడి ప్రయాణంలో ధనుర్మాసంతో దక్షిణాయనం పూర్తవుతుంది.

మకర సంక్రాంతితో ఉత్తరాయనం మొదలవుతుంది. 
ఈ పుణ్యకాలానికి ఆరంభ సూచకంగా, ప్రత్యక్ష నారాయణుడికి ఆహ్వానం పలుకుతూ ముంగిళ్లను ముగ్గులతో అలంకరించే సంప్రదాయం ఏర్పడింది.

సంక్రాంతి పండుగ ప్రారంభం అయిందంటే చాలు తెలుగు వారి ప్రతీ ఇంటి ముందు రంగవల్లులు  కనిపిస్తాయి.  
ఈ రంగురంగుల  ముగ్గుల వెనుక  బలమైన శాస్త్రీయ సాంప్రదాయ కోణాలు ఉన్నాయి. ఇంటి ముందు వేసే ముగ్గు ఆ ఇంటిలోని సంతోషాలకు అద్దం పడుతుంది. అందమైన ముగ్గలు వేస్తే ఆ ఇంటిలో లక్ష్మి ఆవాసం ఉంటుందంటారు. అదృష్టం ఆ ఇంటిని వరిస్తుందంటారు. ఇంటి ముందు వేసిన అందమైన ముగ్గు ఇంటిలోకి దేవతలను ఆహ్వానించటానికి   గుర్తు అని కుడా పెద్దలు చెపుతూ ఉంటారు.

తొలి సంధ్య వేళలో లేలేత సూర్యకిరణాలు వాకిట్లో విస్తృతంగా ప్రసరిస్తాయి. ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే సూర్యశక్తి లభిస్తుంది. అంతేకాదు, నడుం వంచుతూ, కూర్చుంటూ, లేస్తూ, చేతులు ఆడిస్తూ ముగ్గు పెట్టేక్రమంలో శారీరక వ్యాయామం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చలి అధికంగా ఉండే ధనుర్మాసంలో సూర్యకాంతి చాలా అవసరం. ఈ మేరకు సంక్రాంతి వేళ ముగ్గులు పెట్టే సంప్రదాయం తప్పనిసరి చేశారు మన పెద్దలు.

ముంగిలిని నిర్మల ఆకాశానికి ప్రతీకగా భావిస్తారు. ముగ్గుకోసం వేసే చుక్కలను నక్షత్రాలుగా, వాటిని కలుపుతూ వేసే గీతలు ఖగోళంలో మార్పులుగా భావిస్తారు. ముగ్గు కేంద్రకాన్ని సూర్యుడికి సంకేతంగా చెబుతారు.

సంక్రాంతి నాడు సూర్యభగవానుణ్ని ఆహ్వానిస్తూ రథం ముగ్గును విధిగా వేస్తారు. ఇలా ముగ్గుల వెనుక ప్రాధాన్యాన్ని తెలియజేశారు మన పెద్దలు. అంతేకాదు, వాకిట్లో పేడనీళ్లతో చల్లే కళ్లాపి క్రిమికీటకాలకు విరుగుడుగా పని చేస్తుంది. ముగ్గుపిండి కూడా అందుకు తోడ్పడుతుంది.

పురాణకథల ప్రకారం ఒకానొకప్పుడు ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. కాబట్టి ఆరాజు బ్రహ్మదేవుడిని తన కుమారుడిని బ్రతికించమని ప్రార్ధించాడు. దీర్ఘ తపస్సు తరువాత బ్రహ్మదేవుడు బాలుడిని బ్రతికించటానికి అంగీకరించాడు. బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో రాకుమారుడు యొక్క బొమ్మను గీయమని రాజుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి రాకుమారుడికి జీవం పోస్తానని చెప్పాడు. ఆ సమయం నుండి రంగోలీ అన్నది జీవితం, అదృష్టం మరియు శ్రేయస్సు యొక్క చిహ్నంగా మారి మన జీవితాలలో ఒక ఆచారంగా మారింది అని కూడ అంటారు.

సంక్రాంతి మాసంలో వేసే ముగ్గుల వెనుక  ఆధ్యాత్మిక సాంస్కృతిక శాస్త్రీయ ధృక్పధాలు ఉన్నాయి అని అంటారు. ఒక పద్ధతి ప్రకారం పెట్టబడే చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్య స్థానానికి సంకేతం అని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. 

ఇక ఈ పండుగ మాసంలో వివిధ ఆకారాలతో వేసే ముగ్గుల వివరాల్లోకి వెళితే విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ, పాము ఆకారము ఆశ్లేష నక్షత్రానికి, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష, వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకూ సంకేతాలుగా కూడా జ్యోతిష్య శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

ఇక పండుగల చివరిరోజు వేసే రధం ముగ్గు సామాజిక ఐక్యతను చాటి చెబుతుంది. మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు.
https://aratt.ai/@teluguastrology

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj

https://www.facebook.com/teluguastrology

 TeluguAstrology channel  https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12
అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోయే సాంప్రదాయం  అందరు ఒకటే అనే సంకీతాలు ఇస్తుంది.

పండుగ రోజుల్లో పెట్టే ముగ్గులు, గొబ్బిళ్ళు లక్ష్మీదేవికి ప్రీతికరం. ఇలా ఎన్నో విషయాలు జీవితానికి ముడిపడినవి ఈముగ్గులలో నిక్షిప్తమై ఉన్నాయి.
[1/14, 23:21] +91 98852 16452: *🙏🕉️సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఎందుకు ఆనవాయితీ అయ్యింది..!!*
                                                                    
*సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము. అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు. ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్య స్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయాని విశ్వసిస్తారు.*

*సంక్రాంతి పండుగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది. దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్ళలో కళ్లాపి చల్లుతారు. ఆ తర్వాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులు నింపి.. వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఇక శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షరూపం సూర్యభగవానుడు. సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి.. సూర్యభగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్యహృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ వ్రతం, సూర్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతుంటారు.*

*సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈరోజున సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దేవతలు, పితృదేవతలకు దానాలు చేయాలి. సంక్రాంతి పర్వదినంనాడు భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరోజున పితృదేవతలకు ఆరాధించడం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది.*

*సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికి పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలిస్తే సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టేనని మన పూర్వీకులు చెబుతుంటారు. అలాగే ఈ పండుగ రోజున గడపకు పసుపు పెట్టి.. కుంకుమ పెట్టడం, వాకిట్లో ముగ్గులు వేసి.. వాటిలో ఆవు పేడ గొబ్బెమ్మలు పెట్టడం.. ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేసి శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.*

*సంక్రాంతి చరిత్ర*
*పురాణాల ప్రకారం, సూర్య భగవానుడు అదే రోజున తన కొడుకు శని ఇంటికి వస్తాడని చెబుతారు. దీన్ని 'తండ్రీ కొడుకుల' కలయికగా ఈ పండుగను పేర్కొంటారు. అదే రోజున అసురులపై మహావిష్ణువు విజయం సాధించిన గుర్తుగా ఈ పండుగ చేసుకోంటారని మరికొంతమంది చెబుతున్నారు. ప్రతి మాసంలో ఒక సంక్రాంతి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం చేసుకునేది మకర సంక్రాంతి.*
https://aratt.ai/@teluguastrology

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj

https://www.facebook.com/teluguastrology

 TeluguAstrology channel  https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12
*సంక్రాంతి సంబురాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. ముచ్చటగా మూడు రోజుల పాటు చేసుకుంటారు ఈ పండుగను. భోగితో మొదలయ్యే పండుగ కనుమతో ముగుస్తుంది. కొందరు ముక్కనుమ కూడా చేసుకుంటారు. పండుగరోజుల్లో ప్రతి పల్లెలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతుంది.*

*నెల రోజుల ముందు నుండే ఈ పండగ హడావుడి మెుదలవుతోంది. సంక్రాంతి రోజున తెలుగు లోగిళ్లు...కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. హరిదాసు సంకీర్తనలు ఆకట్టుకుంటాయి. ఈ పండుగకు ఎన్నో పిండి వంటలు చేస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, గంగిరెద్దులు ఎన్నో ఈ రోజున చూడవచ్చు. ఈ పండుగ సమయంలోనే పంట మెుత్తం రైతులకు చేతికొస్తుంది. అందుకే ఎంత ఖర్చు చేయడానికైనా వారు వెనుకాడరు. తెలుగు వారు ఎక్కడున్నా సంక్రాంతికి తమ ఇంట్లో వాలిపోతారు. ఈ పండుగ నాలుగు రోజులు తెలుగు లోగిళ్లు సరికొత్త శోభను సంతరించుకుంటాయి.*
 [1/13, 23:39] +91 98852 16452: *🚩 భోగి పండుగ , భోగి అంటే ఏమిటి ? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?🚩* 

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం. 

దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు , ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు , దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను , బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు *"శాస్త్రీయ కారణాలు"* తెలుసుకుందాం..

 *"భుగ్"* అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.

పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందినది దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని , ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణాల గాధ.

సాదారణంగా అందరు చెప్పేది , ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు , ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి , మామిడి , మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (ఆక్షిజన్) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి , ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు , అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది. ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా , మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

కాని మనం ఫ్యాషన్ , సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి , దాని విష వాయువులను పిలుస్తూ , కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు , వైర్లు లాంటివి కావు. 

ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దుండుగులు , భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు , చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం , విజయాలు వస్తాయి.

*భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుసుకుందాము*

భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు , రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం , రంగు , పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని , పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.

మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లు పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే , పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి , నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి , శరీరం ఫై , ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు.

మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు , అంతర్దాలు , రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార , సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.
[1/13, 23:39] +91 98852 16452: *🚩పిల్లలకి #భోగిపళ్ళు పొయ్యడం వలన కింద వర్ణించిన అనేక ప్రయోజనాలు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు .🚩*

చిన్నారులకి నర దృష్టి , గ్రహపీడనివారణ కలుగుతుంది.

తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.

రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియా పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుందని భావిస్తారు.

సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.

రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. చర్మసంబంధమైన ఎలాంటి వ్యాధినుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది.
[1/13, 23:51] +91 98852 16452: భోగినాడు తలమీద రేగిపండు నిలబడితే యోగి ! చిల్లర నిలబడితే ?
 
పుష్యమాసం వచ్చేసిందంటే, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినట్టే. ఉత్తరాయణ పుణ్యకాలం . ఈ సమయంలో రైతులు గాదెల నిండా ధాన్యాన్ని నింపుకొని ఆనందంగా ఉంటారు . అటువంటి సమయంలో వచ్చేదే సంక్రాంతికి పండుగ. ఈ పండుగనాటి భోగి రోజు ఏంటో విశిష్టమైన అలవాట్లని మన పెద్దలు మనకి సంప్రదాయంగా ఇచ్చారు .  అదేమిటంటే, రేగిపళ్ళు పిల్లలకి తలమీద పోయడం . ఎందుకలా ? 
యోగిత్వం.. బదరీఫలం అంటుంది శాస్త్రం .‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.  బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక.
 సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం సిటీ జీవనాన్ని తనలోకి లాగేసుకొని రకరకాల కొత్తపుంతలు తొక్కుతోంది .  పేపరు బాల్స్ , చమ్కీ ముక్కలు ఈ భోగినాటి పాళ్లల్లో కలువుతున్నారు . కానీ అది మంచిది కాదు .  సహస్రార చక్రానికి, ఈ రేగిపండు తగలడం వలన తామస గుణాలు తగ్గి పిల్లల్లో , చక్కని సత్వగుణ వృద్ధి జరుగుతుంది . అదే విధంగా , వారి కున్న ద్రుష్టి దోషాలు తొలగిపోతాయని పెద్దల మాట . 
భారత దేశంలో అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు.
 హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోసే సంప్రదాయాన్ని పెట్టారని మనం గ్రహించాలి . ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.
[1/13, 23:51] +91 98852 16452: భోగభాగ్యాలనిచ్చే భోగి !

- లక్ష్మీరమణ 

ధనుర్మాసం భోగి పండుగతో ముగుస్తుంది . అప్పటికి పంటలు (పౌష్యములు) అన్ని చక్కగా ఇంటికి చేరుకుంటాయి .  రైతులందరూ సంతోషంగా ఉంటారు . వారికి పంటలు పండించడంలో సహకరించిన పశువులని కూడా ఈ కాలంలో పూజించి కృతఙ్ఞతలు తెలియజేస్తారు .  ఈ  ధనుర్మాస పర్యంతమూ  భూదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. విశేషించి ఇది ప్రక్రుతి ఆరాధనకు సంబంధించిన పండుగ సమయం . సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే మొదలవుతుంది .  ఆ విశేషాలని ఇక్కడ తెలుసుకుందాం. 
ఈ మాసంలో భూదేవిని రంగవల్లికలతో అలంకరిస్తాం . ముగ్గులలో  పసుపు కుంకుమలు, పూలు, రేగిపండులు పెట్టి ఆ దేవతని ఆరాధిస్తాం. ఇందులో ముగ్గులపై ఉపయోగించే బియ్యపు పిండిని సూక్ష్మ జీవులకి ఆహారంగా అందించడం అనే గొప్ప కారుణ్యం కూడా దాగుంది . ధనుర్మాసంలోనే పంటలన్నీ మనకి చేతికొస్తాయి.  మనకి పౌష్యములు అనుగ్రహించినందుకు  అమ్మని పౌష్య లక్ష్మీగా కొలుచుకుంటాం . భూమి పంచభూతాలలో ఒకటి. పంచభూతాలలో ఏ ఒక్కటి లేకపోయినా పౌష్యములు ఉండవు. అవి లేనినాడీ పోషణ జరుగదు కాబట్టి భూమి మీద మనుగడే ఉండదు. మనం పూజించే పోష్య లక్ష్మే గోదామాత . 
ఆ భూమాతే గోదామాతగా ప్రభవించింది. ప్రకృతి స్వరూపంగా విరిసి పరమాత్మని చేరుకుంది. ఆవిడ శ్రీ రంగనాథునికి తాను ధరించిన తర్వాత, అవే పూలమాలలు సమర్పించేవారు . భూదేవిగా ఆమె పరమాత్మ కోసం పుష్పించి, ఆ విధంగా పరమ సౌందర్యం భక్తితో తదాత్మాతని పొంది, ఆ విధంగా భక్తిలో రమించడం ద్వారా తనని తాను అలంకరించుకొని, ఆ సౌందర్యప్రభలతో పరమాత్మను పొందారని కదా అర్థం. గోదామాతగా అమ్మ ఆచరించి మరీ, ఆ పరమ పురుషున్ని పొందడానికి కావలసింది భక్తి మాత్రమే అని మరో సారి చాటి చెప్పారు . 
మరో విధంగా చూసినా పోషించేవాడు విష్ణువు . ఆ పోషణకి అవసరమైన సరుకు సమకూర్చేది పౌష్యలక్ష్మి. అందువల్ల వారిద్దరికీ ఉన్నది ప్రకృతీ పరమాత్మల సంబంధం . 
ఇక్కడ అమ్మవారు తాను రచించిన పాశురాల్లోనూ అదే సందేశాన్నిస్తారు . చలి కాలం బాధిస్తోందని, బద్ధకించ వద్దు . ఇది పరమాత్మని చేరుకొనే సమయం . రండి మనందరమూ ఆ పరమాత్మ సన్నిధికి పోదామంటుంది . ఇక్కడ వణికించే చలికాలం , మనకున్న మోహబంధాలే తప్ప మరొకటి కాదు . పరమ ప్రకాశం ప్రభవించే చోట చీకటి, జ్ఞానజ్యోతి వెలిగేచోట అజ్ఞాన తిమిరాలు ఎలా ఉంటాయి ? అదే విధంగా ధనుర్మాసములో మనస్సనే ధనుస్సుకి భక్తి అనే బాణాన్ని సంధించి , భగవంతుని పొందడమే లక్ష్యంగా సాధన చేస్తే, తప్పకుండా దుర్లభమయిన ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగల్గుతాము .   
అమ్మ గోదాదేవిగా మార్గాళీ వ్రతాన్ని ఆచరించి, రోజుకొక పాశురంతో పరమాత్మని అర్చించారు . ఆ వ్రత సమాప్తి జరిగి ఆమె స్వామిని చేపట్టి భోగములందిన రోజు భోగి . గోదాపాశురాలతో నిత్యమూ ఈ ధనుర్మాసంలో పూజించినవారికి, కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించినవారికీ చక్కని, సద్గుణ సంపన్నుడైన వరుడు భర్తగా లభిస్తాడు .
భోగి  రోజున తలంటి  స్నానం చేసి భగవదార్చనలు చేయడం శ్రేయప్రదం.  చలిమంటలు వేయడం ఈరోజున పాటించవలసిన ఆచారం.  
 శుభం 

TOXIC Teaser Proved What Sadhguru Warned Us Before!

TOXIC Teaser Proved What Sadhguru Warned Us Before!

https://youtu.be/SxA62D6Bl4A?si=Fni6OTAjoKz4u1Uc


https://www.youtube.com/watch?v=SxA62D6Bl4A

Transcript:
(00:08) See there is violence in the society. You don't have to hide it. You can show it. There is sexuality in the society. You don't have to hide it. You can show it. But are you glorifying it or are you showing it in a way that people said this is not the way? If they think wow this is the way then what kind of society are you creating? [applause] See in certain other countries people watch the movie go home forget about it.
(00:40) Here it's not like that. We even elect them. [applause] Cinema is more than reality in this country. So when it is like that I think it should be conducted more responsibly. Usually sexuality means generally a woman is being treated in a not necessarily a nice way. I remember in the 70s there were movies Hindi movies that there were some actors who were called rape specialists.
(01:16) So in every movie there has to be one rape. It became almost like a standard for some time. So all those people who saw those movies as children because there was no adult certification for that anybody could go and watch it. They thought this is the way to treat a woman. Now when rape happens in the street why are you surprised I'm asking people are hiding behind the term art.
(01:46) If it is art it should not be so commercial. Today everybody at least a lot of big percentage of population is drinking. You cannot ad advertise alcohol. They will show an alco alcohol bottle and say CDs and music. >> Yes or no? >> Sparkle water. >> Sparkle. >> Sparkling water. >> That is okay.
(02:10) But CD and music how does it come? I don't know. >> This must be handled responsibly by people who are creating those things. If you bring laws for everything, then society becomes ugly. Government cannot manage these things. People should manage these things. All those people who influence the society in a big way. They must look into themselves and see what is the consequence of our actions.
(02:41) This much responsibility must come. If people use just about anything and everything to make money at the cost of the society, that is definitely ugly. It's not a question of right and wrong. It's just that for every other creature, nature controlled their sexuality because their sexuality is seasonal. Rest of the time, they don't even know who is male, who is female. Hello.
(03:10) So, nature control them. Why do you think nature took away that control from you? Because it believed that you got little more brains. But you are trying to prove you don't have that. [music] >> [music]

Wednesday, January 14, 2026

 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
03/12/2025

1) ఆలోచనలను వదులుకోండి. మీరు మరేదీ వదులుకోవలసిన అవసరం లేదు.

2)నీ గురువాక్కే నీకు ప్రమాణం..!

3)శూన్యంగా ఉండడం అంటే
'అకర్త'గా ఉండడం...

4)గురుపరంపరగా వచ్చేదే గుప్తవిద్య. అది చాప క్రింద పారే నీరు వంటిది. పారేది తెలియకుండానే చేరే చోటికి చేరుతుంది.

5)“భగవదిచ్చ" అని మాటవరుసకు అనడం కాకుండా నిజంగా అందులో స్థిరంగా నిలబడగలిగితే అదే మోక్షం.
 *ఓం నమో భగవతే శ్రీ రమణాయ*

               ఒక యువకుడు :
  భగవాన్! నాకు మరోవిధంగా ఉపదేశం ఇస్తున్నారు. తమరు మాత్రం మధుర నుండి తిరువణ్ణామలై(అరుణాచలం) దాకా ఎందుకు రావాల్సి వచ్చింది?  

                   మహర్షి :
  "ఓహో! అదా నీ సందేహం! ఏమిరా! ఈ స్వామి తాను చేసేదొకటి, ఇతరులకి చెప్పేదొకటి అనేగా నీ సందేహం! అయితే చూడు! నీలాగ నేను ఎవరి దగ్గరకు వెళ్ళి ఇలా చెయ్యాలా! అలా చెయ్యాలా! ఏం చేయమంటారు? అని అడగలేదు. నాకు ఎలా తోచిందో అలాగే చేసాను. నువ్వు కూడా నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు; ఎవరు వద్దన్నారు. ఎందుకు ఇతరులను పోయి అడుగుతావు."
    
   ఆ యువకుడు బదులు చెప్పలేక నోరు మూతపడి కాస్సేపు తలవాల్చి కూర్చుని, లేచి వెళ్ళిపోయాడు.

    ఆ తర్వాత మహర్షి ఇలా సెలవిచ్చారు ....
    
    తనమీద తనకే నమ్మకం లేదు. ఇల్లు వదలి బయటకు వెలితే ఉండగలిగే స్థైర్యము(మనోబలము), ధైర్యం తనకు ఉన్నవో లేవో తెలీదు. కారణం మనోబలం లేకపోవడమే. 
    
   మనస్సు ధృఢంగా వుంటే సందేహాలే రావు. ఎవరినీ సలహా అడగవలసిన అవసరం లేదు. వైరాగ్యం ధృఢంగా వుంటే తన నిర్ణయంతో ఎటువంటి ఫలం ఎదురైనా చలించక ధైర్యంగా స్వీకరిస్తాడు. వైరాగ్య లక్షణానికి ఇది గీటురాయి. అయితే దృఢ వైరాగ్యం పరమేశ్వరుని అనుగ్రహ ప్రసాదంగా లభిస్తుంది.
 💐31శ్రీ లింగ మహాపురాణం💐 

       🌼శివస్తుతి🌼

#ముప్పై ఒకటవ భాగం#

దివ్య దృష్టి పొందిన మహర్షులు పరమేశ్వరుని నిజరూప దర్శనం పొంది తన్మయులై ఈవిధంగా శివస్తుతి చేశారు.

నమో దిగ్వాససే నిత్య కృతాంతాయ త్రిశూలినే |
వికటాయ కరాలాయ కరాళ వదనాయ చ ||

దిక్కులే వస్త్రములుగా గల దిగంబర శివునికి నమస్కారం! త్రిశూలధారికి నమస్కారం! విశ్వవినాశునకు నమస్కారం! కరాల కరాళ వదనునికి నమస్కారం! 

అరూపాయ సురూపాయ విశ్వరూపాయ తే నమః |
కటంకటాయ రుద్రాయ స్వాహాకారాయ వై నమః ||

రూపము లేనివానికి నమస్కారం! సుందరరూపునికి నమస్కారం! విశ్వరూపునికి నమస్కారం! రుద్రునికి నమస్కారం! స్వరాధిపతికి నమస్కారం! 

సర్వప్రణతదేహాయ స్వయం చ ప్రణతాత్మనే |
నిత్యం నీలశిఖండాయ శ్రీకంఠాయ నమో నమః ||

సర్వాత్మల చేత నమస్కరించబడు వానికి నమస్కారం! నిత్యం నీలవర్ణములో ఉండే శివునకు నమస్కారం! శ్రీకంఠునకు నమస్కారం! 

నీలకంఠాయ దేవాయ చితభస్మాంగధారిణే |
త్వం బ్రహ్మా సర్వదేవానాం రుద్రాణాం నీలలోహిత ||

నీలకంఠ దేవునికి నమస్కారం! చితాభస్మం దేహమంతా ధరించినవాడికి నమస్కారం! సర్వదేవతలలో పరబ్రహ్మకు నమస్కారం! రుద్రులలో నీలలోహితునకు నమస్కారం! 

ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యెః పురుష ఉచ్యతే |
పర్వతానాం మహామేరుర్నక్షత్రాణం చ చంద్రమాః ||

సమస్త ప్రాణులకు ఆత్మవు నీవే! నీవే సాంఖ్యుల చేత పరమపురుషుడని పిలవబడుతున్నావు! పర్వతాలలో మహామేరు పర్వతం నీవే! నక్షత్రాలలో చంద్రుడివి నీవే! 

ఋషీణాం చ వసిష్ఠస్త్వం దేవానాం వాసవ స్తథా |
ఓంకారః సర్వవేదానాం శ్రేష్టం సామ చ సామసు ||

ఋషులలో వసిష్ఠుడివి నీవే! దేవతలలో రుద్రుడివి నీవే! వేదాలలో ఓంకారం నీవే! సామములలో సామవేదం నీవే! 

ఆరణ్యానాం పశూనాం చ సింహస్త్వం పరమేశ్వరః |
గ్రామ్యాణామృషభశ్చాసి భగవాంల్లోక పూజిస్తూ ||

అరణ్యమృగాలలో సింహము నీవే! గ్రామజంతువులలో వృషభం నీవే! లోకాలలో భగవంతుడిగా పూజించబడే పరమేశ్వరుడు నీవే! 

సర్వథా వర్తమానోపి యోయో భావో భవిష్యతి |
త్వామేవ తత్ర పశ్యామో బ్రహ్మణా కథితమ్ తథా ||

వర్తమానంలో ఉన్న మేము బ్రహ్మ చెప్పిన విధి విధానం ద్వారా  భూత భవిష్యత్తు వర్తమానాలలో కనపడని ఉన్న  నిన్ను సందర్శించుకోగలుగుతున్నాము! 

కామః క్రోధశ్చ లోభశ్చ విషాదో మద ఏవ చ |
యేతదీచ్ఛామహే బోద్ధుం ప్రసీద పరమేశ్వర ||

మాలోని కామ క్రోధ లోభ విషాద  మద అహంకారాలన్ని తెలుసుకుని వదిలేద్దాం అనుకుంటున్నాము. పరమేశ్వరా! మమ్మల్ని అనుగ్రహించి ప్రసన్నుడవు అవ్వుము. 

మహాసంహరణే పాప్తే త్వయా దేవ కృతాత్మనా |
కరం లలాటే సంవిధ్య వహ్నిరుత్పాదిత స్త్వయా ||

ప్రళయ సమయంలో నీవే స్వయంగా మమ్మల్ని సంహరించి మూడో కన్ను నుంచి అగ్నిజ్వాలలు లోకాలను దహించటానికి పుట్టించావు 

తేనాగ్నినా తథాలోక అర్చర్బిః సర్వతో వృతాః |
తస్మాదగ్నిసమా హ్వోతే భవావో వకృతాగ్నయః ||

అలా పుట్టిన అగ్ని అన్నిలోకాలను చుట్టుముట్టి దహించివేసాయి.  ప్రళయాగ్ని సమాన రుద్రుడవు నీవే! 

కామం క్రోధశ్చ లోభశ్చ మోహో దంభ ఉపద్రవం |
యాని చ్చాన్యాని భూతాని స్థావరాణి చరాణి చ ||

కామ క్రోధ లోభ మోహ దంభాది ఉపద్రవాలు, సర్వ చరాచర ప్రాణులు నీ చేత సృష్టించబడిన అగ్నిలో దహించబడుతున్నాయి. 

దహ్యంతే ప్రాణినస్తే తు త్వత్సముతేన వహ్నినా |
ఆస్తమాకు దహ్యమానానాం త్రతా భవ సురేశ్వర ||
త్వంచ లోకహితార్థాయ భూతాని పరిషించసి |
మహేశ్వరా మహాభాగ ప్రభో శుభనిరీక్షక ||
ఆజ్ఞాపయ వయం నాథ కర్తారో వచనం తవ |
భూతకోటి సహస్రేషు రూపకోటి శతేషు చ |
అంతం గంతుం న శక్తాః‌ స్మ దేవదేవ నమోస్తుతే ||

దేవదేవా! మహేశ్వరా! నీ చేత సృష్టించిబడిన కామక్రోధాది అగ్నులలో దహించబడుతున్న మమ్మల్ని రక్షింపుము! లోకహితము కోసం నీవే సకల ప్రాణులను పరిరక్షిస్తున్నావు! మహాభాగా! మేమందరం నీ ఆజ్ఞలను పాటించేవారం! కోట్లాది ప్రాణులలో కోట్లాది రూపములలో ఉన్న మేము నీ ఆది అంతము చూడలేని అసమర్థులం! కావున నీవే మమ్మల్ని క్షమించి కాపాడాలి. నీ పై భక్తి సదా కలిగి ఉండేటట్టు చేయాలి!" అని మునులు చేసిన శివస్తుతికి మహేశ్వరుడు ప్రసన్నుడై

"మునులారా! ప్రసన్నుడనై మీకు హితోపదేశం చేస్తున్నాను.  నేను నన్ను ప్రకృతి పురుషునిగా విభజించుకుని సృష్టిని ఆరంభించాను. కనుక స్త్రీ లింగ రూపములో ఉత్పన్నమైన ప్రతి జీవి ప్రకృతి నుంచి వచ్చినదే. అలాగే పురుష రూపంలో ఉండే జీవులన్ని నా నుంచి ఏర్పడిన పురుషుడి నుంచి వచ్చినదే. కాబట్టి సృష్టి అంతా ప్రకృతి పురుషుల నుంచి ఏర్పడింది.

కనుక నా భక్తులైనవారు దిగంబర రూపంలోని యతులను, వారి చేష్టలు బాలుని వలె లేదా పిచ్చివాని వలె ఉన్నా నిందించరాదు, గేళి చేయరాదు. శివభక్తులు భస్మధారణ చేయడానికి ఇష్టపడతారు. భస్మధారణ ద్వారా పాపాలు తొలగిపోతాయి. వీరు రుద్రలోకము చేరుకుంటారు. ఇటువంటి వారిని నిందించడం నన్ను (శివుని) నిందించటమే అవుతుంది. వీరిని పూజించితే నన్ను పూజించినట్టు అవుతుంది.

లోక కల్యాణం కోసం  రుద్రుడు ప్రతియుగంలో భస్మము పూసుకుని మహాయోగి వలె లీలలు చూపిస్తుంటాడు. మీరు గుర్తించి వారిని గౌరవించి పూజించండి" అని అనుగ్రహ భాషణం చేశాడు.

మునులు పరమేశ్వరునికి నమస్కరించి శివలింగ ప్రతిష్టించి సుగంధ కుశములు, పుష్పాలు, ఫలాలతో కూడిన జలమును మహాకుంభాలతో తెచ్చి అభిషేకం చేసారు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
 1️⃣1️⃣7️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

*32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖేl*
 *కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసేll*

ఓ అర్జునా! ఈ ప్రకారంగా వివిధములైన యజ్జములు అన్ని వేదములలో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో... అని పరమాత్మ బోధించాడు.

కర్మలలో పుట్టి పెరిగి, కర్మలు చేసే ప్రతి వాడూ ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి. ఆచరించాలి. శాశ్వతానందమును పొందాలి. అందరూ వేదములను చదవలేరు, చదివినా అర్థం కావు కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞముల గురించి చెప్పాడు. కర్మణాన్ అంటే ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన పుట్టినవి. ఏ యజ్ఞము కానీ శ్రద్ధతో నిష్టతో, భక్తితో చేయాలి గానీ ఏ ప్రయత్నమూ చేయకుండా సోమరిగా కూర్చోకూడదు. కాబట్టి ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి, జ్ఞానము సంపాదించి, మోక్షమార్గంలో ప్రయాణం చేయాలి కానీ ఏ ప్రయత్నమూ లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ నిర్ద్వంద్వంగా చెప్పాడు.

ఒక్కసారి ఇప్పటి వరకు ఎన్ని యజ్ఞములు చెప్పబడ్డాయో తెలుసుకుందాము. శ్లోకము 25 లో దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము. 26 లో ఇంద్రియ సంయమనము, శబ్దము మొదలగు విషయములను నిరోధించేయజ్ఞము. 27 లో మనో నిగ్రహ యజ్ఞము. 28 లో ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. జ్ఞాన యజ్ఞము. 29 లో ప్రాణాయామము. 30 లో ఆహార నియమములు అనే యజ్ఞము. మొత్తము 12 రకములైన యజ్ఞములు చెప్పబడ్డాయి. ఇవే కాదు వేదములలో ఇంకా చాలా విధములైన యజ్ఞముల గురించి చాలా విస్తారంగా, విపులంగా చెప్పబడింది. ఈ యజ్ఞములనన్నింటినీ స్థూలంగా రెండుగా విభజించవచ్చు. అవే జ్ఞాన యజ్ఞము, కర్మయజ్ఞము. కర్మయజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనకు తోడుపడతాయి. అందుకని ముందు కర్మయజ్ఞములు ఆచరించి వాటి వలన చిత్త శుద్ధి, మానసిక నిర్మలత్వము పొంది తరువాత జ్ఞాన యజ్ఞములు చేసి మోక్షమునకు మార్గం సుగమం చేసుకోవాలి.

*33. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞానయజ్ఞః పరన్తపl* 
*సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతేll*

ద్రవ్యములతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానము గురించి చేసే యజ్ఞము గొప్పది అని పరమాత్మ చెప్పాడు.

ద్రవ్యములు అన్నీ శాశ్వతములు కావు. జ్ఞానము నాశనం అయ్యేది కాదు. పైగా ద్రవ్య యజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే. జ్ఞానమునకు తొలి మెట్టు ద్రవ్యయజ్ఞము. కాబట్టి ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది. జ్ఞాన యజ్ఞము అంటే ఆత్మ తత్వమును గురించి విచారించడం, తెలుసుకోవడం. పరిశోధించడం, ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అని విచారించడం. మనం జ్ఞానేంద్రియములతో గ్రహించే విషయములను వివేకంతో పరిశీలించడం, భగవంతుని గురించి వినడం, మననం చేయడం, ఆచరించడం, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడం, పూర్వజన్మవాసనలను పూర్తిగా నిర్మూలించడం, మొదలగునవి జ్ఞానయజ్ఞము కిందికి వస్తాయి.

ఇంక ద్రవ్యయజ్ఞము అంటే ధనముతో సంపాదించిన వస్తువులతోనూ, బంగారముతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు, ద్రవ్యము, వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు. ద్రవ్యయజ్ఞమునకు ధనం కావాలి, వస్తువులు కావాలి. కాని జ్ఞానయజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏదీ అక్కరలేదు. మనం విహిత కర్మలు చేసినా, కర్మలో అకర్మను చూచినా, అకర్మలో కర్మను చూచినా తుదకు అది జ్ఞానమునకే దారి తీస్తుంది. కాబట్టి ఏదీ వృధా కాదు. ఏ కర్మయజ్ఞము చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలో కలుస్తాయి. అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం వాడాడు. మనం ఏ యజ్ఞము చేసినా తుదకు జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది అని అర్థం. మనం చేసే సమస్తమైన కర్మలు, యజ్ఞములు వాటిఫలములు అన్నీ జ్ఞానంలో కలిసిపోతాయి. శాశ్వతత్వాన్ని పొందుతాయి.

కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో, భక్తితో, దైవపరంగా, నిష్కామంగా చేస్తే అది యజ్ఙంతో సమానము. దానికి మంచి ఫలం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. అది జ్ఞానమునకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానమును పొందాలి అనే లక్ష్యంతోనే కర్మలు చేయాలి కానీ ఏవో తాత్కాలిక సుఖముల కోసం కాదు. కర్మ యజ్ఞము యొక్క లక్ష్యం జ్ఞానం పొందడం. దానికి సాయపడేదే కర్మ. అంతే కానీ ద్రవ్యయజ్ఞములే శాశ్వతం కాదు. మానవులు ఏ దేవుని పూజించినా, ఏ మార్గంలో ప్రయాణించినా, ఏ సాధన చేసినా, ఏ సంప్రదాయాన్ని పాటించినా, తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యము. మోక్షం పొందడానికి ఈ జ్ఞానమే తుది మెట్టు. కాబట్టి జ్ఞానాన్ని సాధించడానికి కర్మ చేయాలి. ఆ జ్ఞానంతో మోక్ష మార్గం చేరుకోవాలి.

కర్మ ఏం చేస్తుంది? మానవుని జ్ఞానము అనే భవనం వద్దకు తీసుకొని వెళుతుంది. అక్కడి నుండి జ్ఞానము మానవుని మోక్షమార్గంలో తీసుకెళుతుంది. కాబట్టి జ్ఞానము అనేది ఒకే సారి రాదు. సత్కర్మలు చేసి చేసి, చిత్తశుద్ధిని అలవరచుకొని, తరువాత జ్ఞానమును సంపాదించాలి. కాబట్టి మొట్ట మొదటి మెట్టుగా మానవుడు కర్మయోగం అవలంబించాలి. సత్కర్మలు చేయాలి. సత్సంగములో ఉండాలి, నిష్కామ కర్మలు చేయాలి. నిరంతరము భగవంతుని ఆరాదించడం, దైవ చింతన చేయడం, శ్రవణం, మననం, కీర్తనం మొదలగునవి ఆచరించాలి. అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు. కాబట్టి ప్రతి మానవుడు జ్ఞానసముపార్జనే లక్ష్యంగా కర్మలు చేయాలి. జ్ఞానము, కర్మ రెండింటిలో జ్ఞానమే శ్రేష్ఠమనీ, కాని జ్ఞానము సంపాదించడానికి కర్మముఖ్యమనీ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు.

ఈ శ్లోకంలో జ్ఞానము యొక్క శ్రేష్టత, కర్మయొక్క ఆవశ్యకత నిరూపించబడ్డాయి. మరి ఆ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో చెప్పాడు పరమాత్మ.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P272
 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️ ఒక యువకుడు చదువుకున్నవాడు. కొంత స్థితి, స్తోమత కలిగి ఉన్నవాడు. ఆరోగ్యవంతుడు. మంచీ చెడ్డా ఎఱిగినవాడు._* 
*_ఒకనాడు ఇంట్లో భగవాన్ పటం ఎదురుగా కూర్చుని భగవానును ధ్యానిస్తున్నాడు. ఉన్నట్లుండి చిత్రం సజీవమైనట్లు తోచింది. భయంతో మూర్ఛపోయేంత పని అయింది. అమ్మను కేక వేశాడు. ఆమె వచ్చి ఏమయింది ? అని అడిగింది._* 
*_చుట్టూ మూగినవారు అతని స్థితి చూచి కలవరపడ్డారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారని ఆ యువకునికి తెలుస్తూనే ఉందికాని ఏదో తెలియని శక్తి అతడిని ఇంకా అణచి వేస్తున్నది. కానీ అతడు దానిని ఎదుర్కొంటూనే ఉన్నాడు. కొంతసేపు స్మృతిని కోల్పోయాడు. తెలివి వచ్చాక అతడిని భయము ఆవేశించింది. కలవరపడినవారు అతనికి మందుమ్రాకులు ఇచ్చి, అతను తేరుకోవటానికి ప్రయత్నించారు._*
*_తరువాత కొంతకాలానికి అతడు తిరువణ్ణామలై వచ్చాడు. ఎదో మునుపటిలాగానే ఆ స్థితి ముంచుకొస్తుందనే భయం ఉండనే ఉంది అతనికి. భగవాన్ సన్నిధి, అట్టిదేమీ జరగనీయలేదు. కాని సన్నిధి నుంచి బయటకు వెళ్ళినప్పుడెల్లా, అతనికి ఆ పూర్వపు శక్తి పూనకం వచ్చి, భయావేశంలో చిక్కేవాడు._*
*_ఈ విషయాన్ని ఆశ్రమ భక్తులు, మహర్షికి విన్నవించారు. అందుకు మహర్షి దీర్ఘముగా ఇలా సెలవిచ్చారు..._*

*_🦚 ఓ అలాగా! నాకు ఎవరూ ఈ విషయాన్ని యింతవరకూ చెప్పలేదే ? అది శక్తిపాతం. శక్తిపాతంవల్ల కలిగే అనుభవం యధార్థము, సరియైనది కూడా._*
*_ఇక్కడ మనుజుడు తన సంస్కారగతిని సాగిస్తున్నాడు. సాధనలో ఆత్మ తానేనని అనుభవంలోకి వస్తున్నప్పుడు, ఉరకలువేస్తూ వస్తూన్న మనోశక్తి ఆ ఉద్వేగంలో కట్లు తెంచుకుంటుంది. తాను ఆత్మ (దైవము)ను ఏవిధముగా ఊహించాడో దాన్నిబట్టి సాధకుని అనుభవాలు ఉంటాయి._*
*_పరిపక్వబుద్ధి కలిగినవారి మనస్సు, హృదయంలో ప్రవేశించే తరుణంలో ఈ ఆత్మబోధ గురించి ఒక్కసారి విన్నారంటే, అది విద్యుత్తువలె పనిచేస్తుంది. వానికి ఆత్మ(దైవ)సాక్షాత్కారం నిశ్చయంగా అవుతుంది. అట్లుకాకపోతే ఘర్షణ తప్పదు !!_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(289వ రోజు):--
        విద్యుత్ యోగం! ఔను, మీరు స్వయంగా స్పృశించాలి ; కాని, మీ రక్కడ కూర్చొని ఎవరో ఒక సాహస వంతుడు చేస్తుంటే చూడాలను కొంటారు. తీగ వద్దకు వెళ్లి, నెమ్మది గా ... జాగ్రత్తగా ..వ్రేలును తగిలిస్తా డతను. "ఓ! ఓ! ఆఆహ్!" అని అరు స్తాడు విద్యుచ్ఛక్తి అతన్ని బలంగా త్రోయగానే. అక్కడ కూర్చొని చూస్తు న్న మీరనుకుంటారు, "ఇదన్నమాట రహస్యం. ఇదే ఆ అనుభవం : ఓ!ఓ! ఆఆహ్!". మూర్ఖుల్లా అక్కడ కూర్చొని "ఓ!ఓ! ఆఆహ్" అనే జపం మొదలుపెడ్తారు, ఆ లాభం మీకూ వస్తుందని. రాదు, నేను చెప్పేది వినండి - అలా ఎన్నటికీ జరుగదు. మీరు తీగ వద్దకు వెళ్లాల్సిందే, వ్రేలు సాచి దానిని ముట్టాల్సిందే. అప్పుడే మీకు విద్యుత్ యోగమంటే ఏమిటో బోధ పడుతుంది. అలా చేస్తేనే మీకు ప్రయోజన ముంటుంది. 
       ప్రశ్న :- ప్రయోజనం తప్పకుండా ఉంటుందని నాకెలా తెలుస్తుంది? ఆ జ్ఞానం పొందిన తర్వాత వేధించే భర్త, పెత్తనం చేసే అత్తగారు, ఏడుపు గొట్టు పిల్లలు ఉండరా ?
        స్వామీజీ :- వాళ్లంతా అలాగే ఉంటారు ; కాని, మీరు వాళ్ళను చూచే తీరు మాత్రం వేరే విధంగా ఉంటుంది. మీలోనే అంతర్గతంగా ఉన్న సత్యాన్ని మీరు గ్రహించి నపు డు, మీరు చూచే ద్వంద్వాలూ, సృష్టి లోని వైవిధ్యం - ఇవన్నీ ఆ ఒక్కగా నొక్క సత్యం నుంచే ఉద్భవించా యని గ్రహిస్తారు. అటువంటి గ్రహింపు తర్వాత, ఏదీ నిజంగా మిమ్మల్ని కలవర పరచలేదు. 
       ప్రశ్న :- ఆ శ్రేష్ఠమైన స్థితికి నేను చేరానో లేదో నాకెలా తెలుస్తుంది? ఏదైనా సరిగా చెయ్యలేదేమో ?
       స్వామీజీ :- దేముడున్నచోట 'నేను' అనే భావం ఉండజాలదు. 'నేను' ఉన్న చోటికి భగవంతుడు చాలా దూరంగా ఉంటాడు. 
        నిజానికి 'మీరు' ఆ అత్యున్నత స్థితికి చేరరు. ఆ స్థితిని అనుభవించ డానికి 'మీరు'ఉండక పోవడమే దీనికి కారణం. భగవంతుడే భగవంతుని కలుస్తాడు. 
       ప్రశ్న :- మాక్కూడా అటువంటి నిజమైన అనుభవం కలిగిందో లేదో తెలుసుకోడానికి ఉపకరించేలా, మీకు కలిగిన అనుభవాన్ని వర్ణిస్తారా? చాలామంది మహాత్ములు వారికి కలిగిన కొన్ని అనుభవాలను వివరించినట్లు నాకు గుర్తుంది. 
     స్వామీజీ :- నా స్వంత అనుభవం గురించి చెప్పాల్సిన దేమీ లేదు. అలా చెప్పడం హాస్యాస్పదం. యోగులు మాత్రమే మార్గంలో వారికి వివిధ అనుభవా లెదురయ్యా యంటారు - నిర్వికల్ప సమాధిలో అటువంటి దేమీ ఉండదు. ఆ నిర్మలమైన స్థితిలో అనుభవం అనేది లేదు. 
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
 02/12/2025

1) భగవంతుణ్ణి పొందాలన్నది వదలి భగవంతుణ్ణి పొందాలని అనుకుంటున్నది ఎవరో చూడు.

2) తన మూలంతో తాను కనెక్ట్ అవడమే నిజమైన సత్సంగం. అంతేగాని, ఓ పదిమంది ఒకచోట చేరి తత్త్వ విచారణ చేయడంకాదు!

3) గ్రహమైనా పట్టివిడుస్తుందేగాని గురువు "అను గ్రహం", దైవము "అను గ్రహం' పడితే వదలవు!

4) జగత్తును కలగా భావించి జీవించడమే కళ.

5) ఏ మార్గంలో వెళితే తిరిగి ఈ సంసారబంధంలో చిగులుకోవో అది శ్రేయోమార్గము. ఏ మార్గంలో వెళితే తిరిగి మళ్ళీ సంసారబంధంలో ఇరుక్కుంటావో అది ప్రేయోమార్గము. ఇంద్రియాలు నెట్టేది ప్రేయోమార్గంలోకి సద్గురువు త్రోసేది శ్రేయోమార్గంలోకి

6) నేను దేహాన్ని" అనుకోవడం కంటే మూఢ విశ్వాసం మరొకటి ఉండదు.
 _*శ్రీమల్లికార్జున అష్టోత్తరశతనామావళీ -24 (93-96)*_
[శ్రీశైలఖండాంతర్గమ్ - నందీశ్వరేణ ప్రోక్తం]
✍️ శ్రీ శ్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మా
🙏🔱⚜️🔱⚜️🕉️🔱⚜️🔱⚜️🙏

93. _*ఓం గణాధీశాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి గణాధీశుడిగా - గణదేవతల అధిపతిగా, గణపతికి తండ్రిగా, సర్వ శక్తుల సమన్వయకునిగా భావించబడతాడు. ‘గణ’ అనగా దేవతా సమూహం, ‘అధీశ’ అనగా అధిపతి.
మల్లికార్జునస్వామి గణాధీశుడిగా సర్వ గణాలకు అధిపతిగా, విధి–వినాయక తత్త్వాలకు మూలంగా, ఆధ్యాత్మిక కార్యసిద్ధికి మార్గదర్శిగా వెలుగుతాడు. మల్లికార్జున స్వామి రూపం వినాయక తత్త్వానికి, శక్తి సమాహారానికి, ధర్మ స్థాపనలో సహాయక శక్తికి ప్రతీక. ఈ నామము శివుని గణనాయకత్వాన్ని, శక్తి సమన్వయాన్ని, ఆధ్యాత్మిక కార్యసిద్ధిని ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి గణ తత్త్వానికి కార్యరూపం, శక్తులను సమన్వయపరచే ప్రకృతి, కార్యసిద్ధిని అనుభూతిగా మార్చే శక్తి. మల్లికార్జునస్వామి గణాధీశుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  శక్తిని భక్తుల జీవితాల్లో కార్యసిద్ధిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల గణాధిపత్య తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల కార్యసిద్ధి మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

94. _*ఓం గిరిధన్వనే నమః*_ 

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి గిరిధన్వనుడిగా -అరణ్యవాసి తపోమయ స్వరూపంగా, పర్వత–అరణ్యాలలో ధ్యానస్థితిగా భావించబడతాడు. ‘గిరి’ అనగా పర్వతం, ‘ధన్వన’ అనగా అరణ్యం - అనగా ప్రకృతిలో తపస్సుతో వెలిగే స్వరూపం. మల్లికార్జునస్వామి గిరిధన్వనుడిగా శివుని తపోమయ స్వరూపాన్ని, ప్రకృతిలో ధ్యానాన్ని, శాంతిని, వైరాగ్యాన్ని ప్రతిబింబిస్తాడు. మల్లికార్జునస్వామి రూపం అరణ్యవాస తపస్సుకు, ధ్యాన స్థితికి, ఆత్మవికాసానికి మార్గం. 

🔱 ఈ నామము శివుని తపోశక్తిని, ప్రకృతి–ధ్యాన సమన్వయాన్ని, ఆధ్యాత్మిక శుద్ధతను ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి గిరిధన్వన తత్త్వానికి కార్యరూపం, ప్రకృతిలో ధ్యానాన్ని ప్రవహింపజేసే శక్తి, తపస్సును అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి గిరిధన్వనుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని భక్తుల జీవితాల్లో శాంతిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల తపో–ప్రకృతి తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల అరణ్య ధ్యాన మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷
   
95. _*ఓం వృషధ్వజాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి వృషధ్వజుడిగా -వృషభాన్ని (బలరూప వాహనాన్ని) తన ధ్వజంగా ధరించినవాడిగా, ధర్మానికి ప్రతీకగా భావించబడతాడు. ‘వృష’ అనగా బలము, ధర్మము, ‘ధ్వజ’ అనగా పతాకం, ప్రతీక.
మల్లికార్జునస్వామి వృషధ్వజుడిగా ధర్మాన్ని తన వాహనంగా, బలాన్ని తన మార్గంగా, శాంతిని తన లక్ష్యంగా భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తాడు. వృషభం ధైర్యానికి, స్థిరతకు, ధర్మ నిబద్ధతకు ప్రతీక. 

🔱 ఈ నామము శివుని ధర్మబలాన్ని, ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని, వాహన తత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో ధర్మ మార్గంలో స్థిరంగా, ఆత్మవికాసాన్ని పొందగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామి నామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి వృషతత్త్వానికి కార్యరూపం, ధర్మాన్ని జీవనంలో ప్రవహింపజేసే శక్తి, బలాన్ని అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి వృషధ్వజుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  ధర్మాన్ని భక్తుల జీవితాల్లో శక్తిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల ధర్మ–బల తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల స్థిరత మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

96. _*"ఓం భసితోద్ధూలితాకారాయ నమః*_
🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి భసితోద్ధూలితాకారుడిగా - భస్మంతో అలంకరించబడిన స్వరూపంగా, తపోమయ–వైరాగ్య తత్త్వానికి ప్రతీకగా భావించబడతాడు. ‘భస్మ’ అనగా విపరీతమైన తపస్సు ఫలితంగా ఏర్పడిన పవిత్ర బూడిద, ‘ఉద్ధూలిత’ అనగా అలంకరించబడిన.
మల్లికార్జునస్వామి భసితోద్ధూలితాకారుడిగా వైరాగ్యాన్ని, తపస్సును, శుద్ధతను తన శరీరంపై భస్మరూపంలో ధరించి ఆత్మజ్ఞానానికి మార్గం చూపుతాడు. భస్మం అహంకార నాశనానికి, శరీర తత్త్వానికి తాత్కాలికతకు, ఆత్మ శాశ్వతతకు సంకేతం.

🔱 ఈ నామము శివుని తపోమయ స్వరూపాన్ని, వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక శుద్ధతను ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో అహంకారాన్ని అధిగమించి, ధ్యాన మార్గంలో స్థిరమవుతాడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి భస్మతత్త్వానికి కార్యరూపం, వైరాగ్యాన్ని జీవనంలో ప్రవహింప జేసే శక్తి, తపస్సును అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి భసితోద్ధూలితా కారుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని భక్తుల జీవితాల్లో శాంతిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల తపో–వైరాగ్య తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల శుద్ధత మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*


*సేకరణ:రమణ ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ్* అని8519860693 కి WhatsApp చేయండి.
🙏⚜️🔱⚜️🔱🕉️⚜️🔱⚜️🔱🙏
 💐30శ్రీ లింగ మహాపురాణం💐 

🌼దారుకావన మునులకు బ్రహ్మోపదేశం🌼

    #ముప్పైయ్యవ భాగం#

సనత్కుమారుడు తన తండ్రి బ్రహ్మ వద్దకు వెళ్లి "పితామహా! దారుకావన మునులు తిరిగి పరమశివుని అనుగ్రహం 
ఏ విధంగాపొందగలిగారుఇందు కోసం వారికి మీరు చేసిన ఉప దేశం ఏమిటి?" అని అడిగాడు.

బ్రహ్మ సరేనని "సనత్కుమారా! నేను వారికిశివునిగొప్ఫదనాన్ని చెప్పి, అనుగ్రహం పొందడానికి పూజించేశివలింగంఎలాఉండాలో, శివ పూజ భక్తితో ఎలా చేయాలో చెప్పాను. అదే నీకు వివరిస్తాను.

మహేశ్వరుడు, మహాదేవుడు, దేవాధిదేవుడు అనిశివునితప్ప వేరేఎవ్వరినిపిలువలేము.దేవతలు,పితృదేవతలు,మునులు, మానవులు,రాక్షసులు,గంధర్వాది సకల జనానికిశివుడుఒక్కడే మహా ప్రభువు.  వేయి మహా యుగాల తరువాతవచ్చేసమస్త సృష్టిని లయం చేసుకుని తాను ఒక్కడే అవ్యక్తుడుగాఉంటాడు.

తిరిగి సృష్టిసంకల్పించినప్పుడు తానే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రుడుగామారిసకలలోకాలను,చరాచరజీవులనుసృష్టిస్తాడు, పరిపాలిస్తాడు, రక్షిస్తాడు. ఆయన కృతయుగంలో యోగి అని, త్రేతాయుగంలో క్రతువు అని, ద్వాపరంలో కాలాగ్నిఅని, కలియుగంలో ధర్మకేతువు అని పేర్లు కలిగి ఉంటాడు.

జ్ఞానులుశివునియొక్కఈనాలుగురుద్రరూపాలనేధ్యానిస్తుంటారు. మునులు, బ్రాహ్మణులు, నరులు సర్వలక్షణోపేతమైన లింగరూపంలోశివునిపూజిస్తారు. శివలింగము ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మీకు వివరిస్తాను.

లోపలయందున్న లింగము బహిర్భాగమున చతురస్ర రూపములో ఉండాలి. పిండికా ఆశ్రమ స్థానములో ఎనిమిది పార్శ్వములు ఉండాలి. ఇతర స్థానాల్లో వృత్తాకారంలో ఉండాలి.

బ్రహ్మ విష్ణువులు రుద్రునితో పాటు శివలింగము లోనే ఉంటారు. కావున లింగము సువృత్తముగా శుభకరమైన ఆకారంలో ఎనిమిది అంగుళాలు పరిమాణము కలిగి ఉండాలి.  సమకేంద్రముగా ఎనిమిది లేక పదహారు కోణాలు కలిగి ఉండాలి. ఈ విధంగా తయారు చేయబడిన లింగము అభీష్టాలన్నింటిని తీరుస్తుంది.

వేదిక  రెట్టింపుగా లేక సరిసమానంగా ఉండాలి. గోముఖ వేదిక అయితే సర్వలక్షణములతో ఆకారంలో మూడవ వంతు ఉండాలి. వేదిక యొక్క అంచు చివరలు అనగా పట్టిక నాలుగు వైపులలో ఒక యవ మాత్రమే వెడల్పు కలిగి ఉండాలి. లింగము బంగారం, వెండి లేక రాగితో చేయవచ్చును. వేదిక విస్తీర్ణం నాలుగు వైపులా మూడు రెట్లు పరిమాణం కలిగి ఉండాలి.

ఆకారంలో వేదిక వృత్తముగా లేదా త్రిభుజముగా లేదా చతుర్భుజంగా లేదా షడ్భుజంగా కోణములు కలిగి ఉండవచ్చును.  కానీ ఎక్కడా పగుళ్లు వుండరాదు. వేదిక మధ్యభాగంలో కలశం స్థాపించి, పంచాక్షరి మంత్ర సహితంగా బంగారు ముక్కలను కలశంలో ఉంచాలి. సద్యోజాత మంత్రంతో లింగమును అభిమంత్రించాలి. పంచాక్షరి మంత్రంతో శివలింగాన్ని జలంతో అభిషేకించాలి.

ఈ విధంగా పూజ సామాగ్రితో లింగపూజ  ఏకాగ్ర చిత్తంతో తన పుత్రులు, బంధుమిత్రులతో  కలసి చేయాలి.  అంజలి ఘటిస్తూ త్రినేత్రుడు, త్రిశూలధారి యైన మహేశ్వరుని మనస్సులో స్థిరపరచుకుని స్మరించాలి.  భక్తి శ్రద్థలతో తనను ఆరాధించేవారిని, పూజించేవారిని పరమశివుడు తప్పక అనుగ్రహిస్తాడు"  అన్న నా ఉపదేశం విన్న దారుకావన మునులు అలాగే చేసి శివానుగ్రహం పొందుతామని నమస్కరించి దారుకావనానికి తిరిగి వెళ్లారు" అని బ్రహ్మదేవుడు చెప్పాడు.

దారుకావనానికి తిరిగి వెళ్లిన మునులు తమ భార్యాపుత్రులతో కలసి బ్రహ్మదేవుడు చెప్పిన విధానంలో శివుని ఆరాధించ సాగారు. కొందరు ఎండలలో పర్వత శిఖరాలపై, కొందరు శీతల కొండగుహలలో, కొందరు నది తీరాలలో శివపూజ చేయసాగారు. కొందరు నిలబడి, కొందరు ఒంటి కాలిపై, కొందరు నీరు మాత్రమే ఆహారంగా, కొందరు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుని శివపూజ చేశారు.

భక్తి శ్రద్థలతో మునులు చేసిన పూజలకు ప్రసన్నుడై శివుడు సంవత్సరం తరువాత అదే దింగబర అనాకారి రూపంలో దారుకావనంలో ప్రత్యక్షమైనాడు.  శరీరమంతా భస్మం పూసుకుని ఉన్నాడు. కన్నులు ఎర్రగాను, పసుపు వర్ణంలోను ఉన్నాయి. కాగడా చేతిలో పట్టుకుని అటు ఇటూ తిప్పుతూ, భయంకరంగా నవ్వుతూ, పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ వారి ఆశ్రమాల చూట్టూ తిరగసాగాడు.

భిక్ష అర్థిస్తూ ప్రతి ఆశ్రమం ముందు నుంచి వివిధ రూపాలలో  వివిధ భావాలను ప్రదర్శిస్తూ వెళుతూ శివుడు వారికి కనిపించాడు. ఇప్పుడు దారుకావన మునులలో శివుని పై భక్తి శ్రద్థలు ఉండటంతో శివుని గుర్తించి భార్యాపుత్రులు, శిష్యులు, అనుచరులతో సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు. రుద్ర భగవానునికి పళ్ళు, పూలు, పవిత్ర జలం, ధూప గంధములతో స్వాగతం పలికారు.

చేతులు జోడించి "పరమేశ్వరా! అజ్ఞానంతో, అవివేకంతో, అహంకారంతో మేము మొదట నిన్ను గుర్తించలేక తప్పు చేసాము. మా తప్పులు మన్నించి మమ్మలి క్షమించుము. చరాచర ప్రపంచం నీ నుంచే వెలువడింది. విశ్వమంతా నీవే వ్యాపించి ఉన్నావు.  అందరిని సృష్టించేవాడవు, రక్షించేవాడవు, లయము చేసుకునేవాడవు నీవే! మా తప్పులను మన్నించి ప్రసన్నుడవు కమ్ము! " అని ప్రార్ధించారు.

పరమేశ్వరుడు ప్రసన్నుడై తన దిగంబర రుద్ర రూపం వదలి వేలాది సూర్యుల తేజస్సుతో   త్రినేత్ర, త్రిశూలధారిగా దారుకావన మునులకు దర్శనమిచ్చాడు. ఆ రూపము చూడటానికి మునులకు దివ్య దృష్టి ప్రసాదించాడు. దివ్య దృష్టి పొందిన మునులు పరమశివుని నిజరూపం చూసి పులకితులై శివస్తుతి చేశారు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
 🔥అంతర్యామి 🔥

# గెలుపు దారి..

☘️లోకంలో కొందరు తమ బుద్ధి విశేషంతో, అపార అనుభవంతో ఎలాంటి సమస్యలనైనా తేలిగ్గా ఎదుర్కొంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగ ఆ సామర్థ్యాన్ని స్వయం ప్రతిపత్తిగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో విజయం సాధించినప్పుడల్లా తమపై తమకు నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మిక పరిభాషలో 'పౌరుషం' అంటే అదే!

☘️మరికొందరు ప్రతి విషయానికీ దేవుడి సాయం ఆశిస్తారు. తమ చిత్తాన్ని దైవానికి అంకితం చేసి, కోరికలను ప్రార్ధన రూపంలో భగవంతుడికి నివేదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో గెలుపొందినప్పుడల్లా వారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతూ వస్తుంది. అలా తమను తాము దైవానికి సమర్పణ చేసుకోవడమే- 'శరణాగతి'. ఆ మార్గంలో దక్కిన విజయాన్ని 'దైవికత' అంటారు. దైవ, పౌరుషాల మధ్య సమన్వయం చేకూరితే సంపూర్ణ విజయం సిద్ధిస్తుందని పెద్దల సూచన. అర్జునుడికి లభించింది. ఆది. పూర్తి సామర్థ్యంతో, పరాక్రమంతో తానే యుద్ధం చేసినా కీలక సమయాల్లో మాత్రం కృష్ణుడి సహకారాన్ని స్వీకరించాడు. దైవ, పౌరుషాల ఆ మేలికలయిక కిరీటికి గొప్ప విజయాన్ని అందించింది. 'శిశుపాల వధ'లో మాఘకవి- ఆ కలుపుగోలు ధోరణిని వివరిస్తూ 'విద్వాంసుడు పూర్తిగా దైవంపై ఆధారపడడు. అలా అని, అంతా తన ప్రతిభేననీ పొరబడడు, సత్కవులకు శబ్దం, అర్ధం రెండూ అవసరమైనట్లే... విజేతల విషయంలో దైవ పౌరుషాలు ఒకటవ్వాలి' అన్నాడు. ఆధునిక యుగంలో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలుచేసిన వారిలో భారత పూర్వ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ అగ్రగణ్యులు.

☘️'ఆదినుంచీ దైవాన్ని నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మడం అలవాటు. విధుల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడం అన్నివేళలా సాధ్యం కాదని, అది నా శక్తికి మించినదని నాకు తెలుసు. నా సామర్థ్యాన్ని తొలుత అంచనా వేసుకుని దాన్ని యాభైశాతం పెంచి, నన్ను నేను  దేవుడి చేతులకు సమర్పించుకుంటాను. ఆ తరహా సమష్టి భాగస్వామ్యంలో నేను అదనపు శక్తిని పొందడమే కాక, అది నిజంగానే నా ద్వారా ప్రసరిస్తున్న అనుభూతిని సైతం స్వయంగా ఆస్వాదించాను. దేవుడి రాజ్యం నీలోనే ఆ శక్తి రూపంలో ఉంటుందని నిశ్చయంగా చెప్పగలను' అంటూ తన ఆత్మకథలో కలామ్ చెప్పారు.

☘️దిలీప్ కుమార్ పుట్టి పదహారో ఏట సూఫిజాన్ని స్వీకరించి, భారతీయ సినీ సంగీత జగత్తును శాసించే స్థాయికి ఎదిగిన ఎ. ఆర్. రెహమాన్ అనుభవమూ అదే. 'ఎప్పటికప్పుడు కొత్తదేదో చేయడానికి నన్నొక శక్తి ముందుకు తోస్తోందని నిత్యం అనిపిస్తూనే ఉంది' అన్నారాయన. పడమటి సంగీతానికి పట్టుచీర కట్టినట్లు తన పౌరుషానికి దైవికతను చుట్టబెట్టాన దాని అంతరార్థం.

☘️కలామ్, రెహమాన్ల విషయంలో ఆధ్యాత్మికత అనేది విశ్వాసాలకు చెందినది కాదు- అధ్యయనం చేయాల్సిన అంశంగా నిరూపణ అయిన విషయం. దాన్ని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతను మనిషి తనకు చోదకశక్తిగా మలచుకోగలుగుతాడు. అది గెలుపు దిశగా మనిషిని నడిపించగలుగుతుంది.🙏

✍️- ఎర్రాప్రగడ రామకృష్ణ

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺