[1/13, 23:39] +91 98852 16452: *🚩 భోగి పండుగ , భోగి అంటే ఏమిటి ? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? భోగి మంట , భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?🚩*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం.
దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు , ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు , దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను , బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది. మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు *"శాస్త్రీయ కారణాలు"* తెలుసుకుందాం..
*"భుగ్"* అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.
పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందినది దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని , ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు ఇదే అనేవి కూడా పురాణాల గాధ.
సాదారణంగా అందరు చెప్పేది , ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు , ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి , మామిడి , మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (ఆక్షిజన్) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి , ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు , అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది. ఐక్యమత్యాన్ని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా , మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.
కాని మనం ఫ్యాషన్ , సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి , దాని విష వాయువులను పిలుస్తూ , కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము. ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం. ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం. పనికి రాణి వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు , వైర్లు లాంటివి కావు.
ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిషు దుండుగులు , భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో కచాల్సింది పాత వస్తువులని కాదు , మనలోని పనికి రాని అలవాట్లు , చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం , విజయాలు వస్తాయి.
*భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుసుకుందాము*
భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు. రేగి చెట్లు , రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం , రంగు , పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తల పై పోయడం వలన శ్రీ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మన పిల్లల ఫై ఉంటుంది అని , పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.
మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లు పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే , పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి , నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి , శరీరం ఫై , ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు.
మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు , అంతర్దాలు , రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార , సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.
[1/13, 23:39] +91 98852 16452: *🚩పిల్లలకి #భోగిపళ్ళు పొయ్యడం వలన కింద వర్ణించిన అనేక ప్రయోజనాలు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు .🚩*
చిన్నారులకి నర దృష్టి , గ్రహపీడనివారణ కలుగుతుంది.
తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాని ప్రేరేపితం చేస్తే, పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది.
రేగి పళ్లను పిల్లల తల మీద పోడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియా పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుందని భావిస్తారు.
సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగిపండ్లను పోస్తారు.
రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. చర్మసంబంధమైన ఎలాంటి వ్యాధినుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది.
[1/13, 23:51] +91 98852 16452: భోగినాడు తలమీద రేగిపండు నిలబడితే యోగి ! చిల్లర నిలబడితే ?
పుష్యమాసం వచ్చేసిందంటే, సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినట్టే. ఉత్తరాయణ పుణ్యకాలం . ఈ సమయంలో రైతులు గాదెల నిండా ధాన్యాన్ని నింపుకొని ఆనందంగా ఉంటారు . అటువంటి సమయంలో వచ్చేదే సంక్రాంతికి పండుగ. ఈ పండుగనాటి భోగి రోజు ఏంటో విశిష్టమైన అలవాట్లని మన పెద్దలు మనకి సంప్రదాయంగా ఇచ్చారు . అదేమిటంటే, రేగిపళ్ళు పిల్లలకి తలమీద పోయడం . ఎందుకలా ?
యోగిత్వం.. బదరీఫలం అంటుంది శాస్త్రం .‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక.
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం సిటీ జీవనాన్ని తనలోకి లాగేసుకొని రకరకాల కొత్తపుంతలు తొక్కుతోంది . పేపరు బాల్స్ , చమ్కీ ముక్కలు ఈ భోగినాటి పాళ్లల్లో కలువుతున్నారు . కానీ అది మంచిది కాదు . సహస్రార చక్రానికి, ఈ రేగిపండు తగలడం వలన తామస గుణాలు తగ్గి పిల్లల్లో , చక్కని సత్వగుణ వృద్ధి జరుగుతుంది . అదే విధంగా , వారి కున్న ద్రుష్టి దోషాలు తొలగిపోతాయని పెద్దల మాట .
భారత దేశంలో అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు.
హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోసే సంప్రదాయాన్ని పెట్టారని మనం గ్రహించాలి . ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.
[1/13, 23:51] +91 98852 16452: భోగభాగ్యాలనిచ్చే భోగి !
- లక్ష్మీరమణ
ధనుర్మాసం భోగి పండుగతో ముగుస్తుంది . అప్పటికి పంటలు (పౌష్యములు) అన్ని చక్కగా ఇంటికి చేరుకుంటాయి . రైతులందరూ సంతోషంగా ఉంటారు . వారికి పంటలు పండించడంలో సహకరించిన పశువులని కూడా ఈ కాలంలో పూజించి కృతఙ్ఞతలు తెలియజేస్తారు . ఈ ధనుర్మాస పర్యంతమూ భూదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. విశేషించి ఇది ప్రక్రుతి ఆరాధనకు సంబంధించిన పండుగ సమయం . సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే మొదలవుతుంది . ఆ విశేషాలని ఇక్కడ తెలుసుకుందాం.
ఈ మాసంలో భూదేవిని రంగవల్లికలతో అలంకరిస్తాం . ముగ్గులలో పసుపు కుంకుమలు, పూలు, రేగిపండులు పెట్టి ఆ దేవతని ఆరాధిస్తాం. ఇందులో ముగ్గులపై ఉపయోగించే బియ్యపు పిండిని సూక్ష్మ జీవులకి ఆహారంగా అందించడం అనే గొప్ప కారుణ్యం కూడా దాగుంది . ధనుర్మాసంలోనే పంటలన్నీ మనకి చేతికొస్తాయి. మనకి పౌష్యములు అనుగ్రహించినందుకు అమ్మని పౌష్య లక్ష్మీగా కొలుచుకుంటాం . భూమి పంచభూతాలలో ఒకటి. పంచభూతాలలో ఏ ఒక్కటి లేకపోయినా పౌష్యములు ఉండవు. అవి లేనినాడీ పోషణ జరుగదు కాబట్టి భూమి మీద మనుగడే ఉండదు. మనం పూజించే పోష్య లక్ష్మే గోదామాత .
ఆ భూమాతే గోదామాతగా ప్రభవించింది. ప్రకృతి స్వరూపంగా విరిసి పరమాత్మని చేరుకుంది. ఆవిడ శ్రీ రంగనాథునికి తాను ధరించిన తర్వాత, అవే పూలమాలలు సమర్పించేవారు . భూదేవిగా ఆమె పరమాత్మ కోసం పుష్పించి, ఆ విధంగా పరమ సౌందర్యం భక్తితో తదాత్మాతని పొంది, ఆ విధంగా భక్తిలో రమించడం ద్వారా తనని తాను అలంకరించుకొని, ఆ సౌందర్యప్రభలతో పరమాత్మను పొందారని కదా అర్థం. గోదామాతగా అమ్మ ఆచరించి మరీ, ఆ పరమ పురుషున్ని పొందడానికి కావలసింది భక్తి మాత్రమే అని మరో సారి చాటి చెప్పారు .
మరో విధంగా చూసినా పోషించేవాడు విష్ణువు . ఆ పోషణకి అవసరమైన సరుకు సమకూర్చేది పౌష్యలక్ష్మి. అందువల్ల వారిద్దరికీ ఉన్నది ప్రకృతీ పరమాత్మల సంబంధం .
ఇక్కడ అమ్మవారు తాను రచించిన పాశురాల్లోనూ అదే సందేశాన్నిస్తారు . చలి కాలం బాధిస్తోందని, బద్ధకించ వద్దు . ఇది పరమాత్మని చేరుకొనే సమయం . రండి మనందరమూ ఆ పరమాత్మ సన్నిధికి పోదామంటుంది . ఇక్కడ వణికించే చలికాలం , మనకున్న మోహబంధాలే తప్ప మరొకటి కాదు . పరమ ప్రకాశం ప్రభవించే చోట చీకటి, జ్ఞానజ్యోతి వెలిగేచోట అజ్ఞాన తిమిరాలు ఎలా ఉంటాయి ? అదే విధంగా ధనుర్మాసములో మనస్సనే ధనుస్సుకి భక్తి అనే బాణాన్ని సంధించి , భగవంతుని పొందడమే లక్ష్యంగా సాధన చేస్తే, తప్పకుండా దుర్లభమయిన ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగల్గుతాము .
అమ్మ గోదాదేవిగా మార్గాళీ వ్రతాన్ని ఆచరించి, రోజుకొక పాశురంతో పరమాత్మని అర్చించారు . ఆ వ్రత సమాప్తి జరిగి ఆమె స్వామిని చేపట్టి భోగములందిన రోజు భోగి . గోదాపాశురాలతో నిత్యమూ ఈ ధనుర్మాసంలో పూజించినవారికి, కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించినవారికీ చక్కని, సద్గుణ సంపన్నుడైన వరుడు భర్తగా లభిస్తాడు .
భోగి రోజున తలంటి స్నానం చేసి భగవదార్చనలు చేయడం శ్రేయప్రదం. చలిమంటలు వేయడం ఈరోజున పాటించవలసిన ఆచారం.
శుభం