Tuesday, December 2, 2025

 *పూర్వకవులు ఇంచుమించుగా సదాచార సంపన్నులు, ప్రగాఢమైన దైవభక్తి గలవారు. వారి వాక్కు అమోఘంగా ఉండేది. వారి మాటకు శక్తి కూడా ఎక్కువగా ఉండేది. వారు నొచ్చుకుంటే శాపం, మెచ్చుకుంటే వరం అయ్యేది.* *శాపానుగ్రహదక్షులైన కొందరు కవులను, వారి ఆయా పద్యాలను ఆచార్య తిరుమల గారు ఇలా వ్రాసారు.*

పద్య లక్షణాన్ని వివరించేది శాస్త్రం ఛందస్సు. ఇది గణాలతో, యతిప్రాసాదులతో ఏ పద్యమెలా ఉండాలో తెలియజేస్తుంది. అయితే, అక్షరాల్లో విషమాక్షరాలు, అమృతాక్షరాలు ఉంటాయి. పద్యపాదాల్లో విషమస్థానాలు, అమృతస్థానాలు అని ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని, కవి జాగ్రత్తగా అక్షర నిబద్ధ శబ్ద ప్రయోగం చేయాలి. లేకపోతే, అది ప్రాణాంతకమైన శాపమౌతుంది.

‘పురాస్త్ర రసగిరి రుద్రే ష్వకచటహ మాతృకా నింద్యా:’ అని పద్య ప్రథమ పాదంలో 3,5,6,7,11 స్థానాల్లో అ, క, చ, ట, హ వర్ణాలుంచి పద్యం వ్రాస్తే, అవి విషమాక్షరాలై పద్యం శాపమై తగులుతుంది.

అలాగే –

హజగడలివి మూడవచో
నిజముగ నిందించి చెప్ప నీల్గుట యరుదే
భుజగమున కన్న గీడగు
సుజనా మర భూజరేచ సుగుణ సమాజా

మూడో చోట ‘హజగడ’లు, ఆరవ కడ ‘తా’ నిల్పిన మారమ్మున, గ్రుమ్మునట్లు మడియు మనుజుడున్’ అని ఆరవచోట ‘త’ కారం, ‘మ’గణమ్ము గదియు రగణము, వగవక కృతి మొదట నిలుపువానికి మరణంబగు’ నని కావ్య ప్రారంభంలో ‘మ’గణం పై, ‘ర’ గణం ఉంచి పద్యం వ్రాస్తే, చావటం ఖాయం.

కాబట్టే, సత్కావ్యాల్లో విషమాక్షర ప్రయోగాలు చేయరాదని లాక్షణికులు శాసనం చేసారు.

ఆదికవి నన్నయ భారత కావ్యాది ప్రార్ధనా శ్లోకంలో ‘శ్రీవాణి గిరిజాశ్చిరాయ’ అని 7వ స్థానంలో’చ’కారం నిల్పటం చేత భారత రచనకు విఘ్నం కలిగిందని, అలానే, నన్నెచోడుడనే రాజ కవి తన కుమారసంభవ కావ్యాన్ని ‘శ్రీ వాణీం ద్రామరేం ద్రార్చిత’ అని ‘మ’ గణం తర్వాత ‘ర’గణం ఉండే స్రగ్ధరా వృత్తంతో ప్రారంభించటం వలనే యుద్ధంలో దారుణంగా మరణించాడని చెబుతారు.

శాపానుగ్రహదక్షులైన కవుల్లో వేములవాడ భీమకవి అగ్రగణ్యుడు. ఈయన 12వ శతాబ్దికి చెందినవాడు. త్రికాల వేది. భీమేశ్వరస్వామి అనుగ్రహపాత్రుడైన అమోఘ వచస్కుడు. ఈయన బాల్యంలో వేములవాడలోని ఒక బ్రాహ్మణ చయనుల ఇంట శుభకార్యమేదో జరిగి భోజనాలకు పంక్తి నేర్పాటు చేసుకుంటే, తను కూడా స్నేహితులతో వెళ్ళి భోజనం పెట్టమనగా ఆ యింటి పెద్ద ఈయనని తిట్టి బైటకు వెళ్ళగొట్టాడట. అపుడు భీమన వాకిటి తలుపు సందులోంచి వడ్డించిన విస్తళ్ళను చూసి –

గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకుమంచు నీ
త్రిప్పడు బాపలందరుని దిట్టిరి కావున నొక్కమారు నీ
యప్పములన్ని కప్పలయి, యన్నము సున్నముగాగ మారుచున
బప్పును శాకముల్ పులుసు పచ్చడులుం జిరురాలు గావుతన

అని శపించగానే, అన్నం సున్నమై, కూరలు రాళ్ళయి, అప్పాలు కప్పలై ఎగురుతుండటంతో ఇంటిపెద్ద తెల్లబోయి, తోటి బ్రాహ్మణులతో వచ్చి ఆయనను ప్రార్ధించగా, ఆయన దయతలచి ‘నన్ గౌరవంబున నీ విప్రులు సూచిరందువలనన్ పూర్వస్థితిం జెంది భోజన వస్తు
ప్రకరంబులన్నియు యథా స్వస్థంబు లౌ గావుతన్’ అని శాపోపశమనం చేసి విందారగించి వెళ్ళాడట.

ఒకమారు భీమకవి గుడిమెట్ట గ్రామానికి వెళ్ళగా, ఆ ఊరి ప్రభువు సాగి పోతురాజు ఈయన గుర్రాన్ని పట్టి తన శాలలో కట్టించివేశాడు. ఎంత వేడినా విడువకపోయే సరికి, ఈయన కోపించి చెప్పిన పద్యమిది –

హయమిది సీత, పోత వసుధాధిపుడారయ రావణుండు, ని
శ్చయముగ నేను రాఘవుడ, సహ్యజవారిధి, మారు డంజనా
ప్రియ తనయుండు, లచ్చన విభీషణుడా, గుడిమెట్ట లంక, నా
జయమును పోత రక్కసుని చావును నేడవనాడు చూడుదీ

అని పద్యం ప్రథమ పాదం ఆరో చోట, ‘త’ కార ముంచి విషమాక్షర ప్రయోగం చేసి శపించాడు. ఏడవనాడా పోతురాజు గుండాగి మరణించాడు.

అలాగే, మరో పోతురాజనేవాడు, ఓసారి భీమకవి వస్తూ ఉంటే, తననేమి అడుగుతాడో అని ఇంట్లో తాను లేనని చెప్పించాడట. అది గమనించి భీమకవి –

కాటికి కట్టెలు చేరెను,
నేటావల నక్కలన్ని ఏడువసాగెన
కూటికి కాకులు వచ్చెను
లేటవరపు పోతరాజు లేడా లేడా

అని ప్రశ్నిస్తూ శపించి వెళ్ళగానే, కూర్చున్న మంచం మీదే ప్రాణం పోయి వొరిగిపోయాడట పోతురాజు. అతని భార్య పరుగుపరుగున వెళ్ళి భీమకవి కాళ్ళ మీద పడి వేడుకోగా –

నాటి రఘురాము తమ్ముడు
పాటిగ సంజీవి చేత బ్రతికిన భంగిన్
కాటిక బో నీకేటికి?
లేటవరపు పోతరాజ లెమ్మా రమ్మా

అనగానే, పోతరాజు నిద్రలేచినట్లు లేచి, ఈయన కాళ్ళ మీద పడ్డాడట.            
 *సింగిల్‌గా ఉన్నంత వరకూ ఎవరి ప్రపంచంలో వాళ్లు హాయిగా విహరిస్తుంటారు. అంతవరకూ ఓకే. మరి పెళ్లయినప్పుడు? పెళ్లి తర్వాత ఇండివిడ్యువల్ లైఫ్ కాస్తా మ్యారిటల్ లైఫ్‌లా మారిపోతుంది. ఆ లైఫ్‌ని కూడా హ్యాపీగా మార్చుకోవాలంటే..*.                                 కొన్ని విషయాల్లో బ్యాలెన్స్ అవసరం. ఆ బ్యాలెన్స్ కాస్త అటు ఇటు అయినా ఆ ఎఫెక్ట్ లైఫ్‌లాంగ్ ఉండిపోతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ‘ఇలా ఉండాలి’, ‘అలా ఉండాలి’ అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే ప్రేమలో రూల్స్ ఉండవు. కానీ, పెళ్లి తర్వాత మాత్రం కొన్ని రూల్స్ ఉంటాయి. ఎందుకంటే పెళ్లి అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదు. అదొక కమిట్‌మెంట్, బాధ్యత. కాబట్టి కొన్ని మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. త్యాగాలు వద్దు పరిచయం అయిన కొత్తలో ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అలాంటప్పుడే కొన్ని విషయాల్లో త్యాగం చేయడానికి సిద్ధపడతారు. ఆ త్యాగం ఎదుటివారికి అర్థమవ్వాలని కూడా ప్రయత్నిస్తుంటారు. ఆ త్యాగానికి ‘ప్రేమ’ అనే ట్యాగ్‌ తగిలించి తమలో తామే మురిసిపోతుంటారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ త్యాగాలే ఇబ్బందులుగా మారతాయి. కాబట్టి మరీ ఎక్కువ త్యాగాలు పనికి రావు. ముందునుంచే ఉన్న మీ అభిరుచుల్ని మీ పార్ట్‌నర్‌‌తో పంచుకోవాలి. ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించుకోవాలి. అప్పుడు సమస్యలుండవు. స్ట్రెంత్స్ తెలుసుకుంటే.. మీ పార్ట్‌నర్ ఎలాంటి విషయాల్లో బెస్ట్? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. తాను క్రియేటివ్ పర్సనా ? కష్టపడే వ్యక్తా? ఏదైనా కొత్త విషయం నేర్చుకోడానికి ఆసక్తి చూపుతారా? లాంటి విషయాలు కాస్త గమనిస్తే హ్యాపీగా ఉండడానికి ‘కీ’ దొరికినట్టే. వాళ్లకున్న క్వాలిటీస్‌ని బట్టి దానికి తగ్గట్టుగా నడుచుకుంటే చాలు. తాను క్రియేటివ్ పర్సన్ అని మీకనిపిస్తే తన సృజనాత్మకతను మెచ్చుకోవడం, ప్రోత్సహించడం లాంటివి చేస్తే రిలేషన్‌షిప్ ఎప్పటికీ నిలిచిపోతుంది. చిన్న మాటలే అయినా.. మీ పార్ట్‌నర్ మీకోసం ఏదైనా చేసినా, తమ ద్వారా మీకేదైన మంచి జరిగినా ఓ చిన్న థ్యాంక్స్ చెప్పండి. అలాగే ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, మీ వల్ల మీ పార్టనర్ హర్ట్ అయినా ‘సారీ’ చెప్పండి. ‘థాంక్స్’, ‘సారీ’ వినడానికి చాలా చిన్న పదాలే అయినా.. రిలేషన్‌షిప్‌లో వీటిదే ‘కీ’ రోల్. అలాగే ఒకరికి ఒకరు ఇచ్చుకునే గిఫ్ట్‌లు, గ్రీటింగ్‌లు, సర్‌ప్రైజ్‌లు కూడా రిలేషన్‌షిప్‌ను బలపరుస్తాయి. కాబట్టి వీటిని మర్చిపోవద్దు. మూడో వ్యక్తి జోక్యం ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గొడవ వచ్చినప్పుడు మీకు మీరే దాన్ని పరిష్కరించుకోవాలి. గొడవ మూడో వ్యక్తి దాకా వెళ్లకూడదు. జరిగిన తప్పును శాంతంగా పరిష్కరించుకోవాలి. ప్రేమలో ఎదుటివారి తప్పును వేలెత్తి చూపించడం కన్నా ఆ పొరపాటు ఎందుకు జరిగిందో తెలుసుకునే సహనం ఉండాలి. ఇవి కూడా.. కపుల్స్ మధ్య కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. రోజూ కలిసే బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం. ప్రతిరోజూ నిద్రకు ముందు కాసేపు మాట్లాడుకోవడం. వారానికొకరోజు సెకండ్‌ షో సినిమాకెళ్లడం లాంటివి. ఇలా కలిసి గడిపే సందర్భాలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. ఇలాంటి అలవాట్లే ఇద్దరినీ మానసికంగా దగ్గరగా ఉంచుతాయి. ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు *ఈ అలవాట్లే తిరిగి దగ్గర చేస్తాయి.*          
 *మనసు మాయ గురించి ఆలోచించకండి...* *ఆలోచించ వలసింది సరైన సాధన గురించి, సరైన ప్రచారాలు చేసేవారి తరగతులు వినడానికి ప్రయత్నాలు చేయండి...* *మానవ సమాజం ప్రతీరోజూ ఏదోక సమస్యతో భయాందోళనలను కల్గియుంటున్నారు...* *అలాంటి వారు ముందుగా నమ్మకం, విశ్వాసంతో సరైన సాధన ద్వారా అభయాలను పొందండి...* *అది మీ చేతుల్లోనే, మీయొక్క సరైన ద్వారా మాత్రమే సాధ్యం అనే అధ్యాత్మిక సత్యాన్ని ముందుగా అర్దం చేసుకోండి...* *అటు తర్వాత మీలోనే మీతోనే ఉండే అంతరాత్మ శక్తిని "అల్లావుద్దీన్ అద్భుత దీపం " ఎలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఉపయోగ పడుతుందో అనుభవపూర్వకంగా సాధకులు తెలుసుకుంటారు...* *సరైన సాధన ద్వారా అక్షయ పాత్ర, కామధేనువు, అధ్బుతమైన దీపం మీ చేతుల్లోనే.... మాయ కమ్మి మాయా ప్రచారాలు చేసేవారిని దూరంగా ఉంచండి... వారి మాయలో పడకండి..ఎందుకంటే సరైన సాధన ద్వారా పరమాత్మ స్వరూపం అయిన ఆత్మ మీకు తోడుగా నీడగా ఉంది... నీలో ఉన్న ఆత్మ శక్తికి మించిన మరొక శక్తి లేదుగాక లేదు.... కొద్దిగా అర్థం చేసుకోండి... మరి కొద్దిగా సరైన సాధన మాత్రమే చేయండి.... సరైన సాధన ద్వారా నిప్పుపై కప్పబడిన నివురును తొలగించండి... ఆత్మ జ్ఞానం ద్వారా అంతరాత్మ సందేశాలు వినడం అలవాటు చేసుకోండి.... భౌతిక జీవితంలో కోన్ని భౌతిక పరిణామాలు కొన్నిసార్లు కొందరి ఆలోచనల వలన కొంత అసౌకర్యం కలుగుతుంది... అందుకే నెగెటివ్ అలోచనలు ఎప్పటికప్పుడు దగ్దం చేసుకొని నెగెటివ్ అలోచనలు వాస్తవరూపం కావాలి అనే చిన్న ఆలోచన ద్వారా సరి చేసుకోవచ్చు...*
      ద్యానం తెలియనప్పుడు ఎవరు చెప్పినా విన్నాం, చేశాం... తెలిశాక చేయవలసింది సరైన సాధన మాత్రమే... వినవలసింది ఆత్మ సందేశాలు మాత్రమే..

Monday, December 1, 2025

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచితము శ్రీ విష్ణు షట్పది స్తోత్రం*
 
🔥ఓంశ్రీమాత్రే నమః🔥

*ఆది శంకరులు రచించిన స్తోత్రాలలో విష్ణు షట్పది ఒకటి. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం.*
 

*భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు.*

 *భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.*

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*1)అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |*
*భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ||*

*ఓ విష్ణో!  నాలోని అహంకారాన్ని తొలగించు. మనస్సును శాంతితో నింపుము. పాశవిక కోరికలనుంచి నన్ను దూరము చేయుము. సకల ప్రాణుల పట్ల నేను దయతో ఉండునట్లు చేయుము. ఈ భవసాగరాన్ని దాటుటకు చేయూతనీయుము.*



*2)దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగసచ్చిదానందే |*
*శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ||*

*సంసార సాగరములోని భయాన్ని, దుఖాన్ని పోగొట్టే, పవిత్రమైన పుప్పొడి నది వంటి, సచ్చిదానందాన్ని ఇచ్చే దివ్య సుగంధము వంటి నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను.*



*3)సత్యపి భేదాపగమే నాథ తవా‌உహం న మామకీనస్త్వమ్ |*
*సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ||*

*ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.*



*4)ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |*
*దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ||*

*పర్వతమును ఎత్తిన వాడవు (కృష్ణుడవు, కూర్మావతారము కూడా), పర్వతరాజు శత్రువైన ఇంద్రుని సోదరుడవు, అసురుల శత్రువువు, సూర్య చంద్రులు కన్నులుగా చూసేవాడవు, నిన్ను చూసిననంత లోకపు శోకము పోవును. నిన్ను చూసిన తర్వాత ఇంకా జరుగ వలసినది ఏమైనా ఉందా?*



*5)మత్స్యాదిభిరవతారైరవతారవతా‌உవతా సదా వసుధామ్ |*
*పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతో‌உహమ్ ||*

*మత్స్య రూపము మొదలకొని వివిధ అవతారములతో ఈ భువిని కాపాడుతున్నావు. పరమేశ్వరా! ఈ భవసాగరమును చూసి భయపడుతున్న నన్ను కాపాడుము.*



*6)దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |*
*భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే ||*

*నడుమునకు త్రాడు కట్టుకున్న విష్ణో (దామోదరా)! సకల సద్గుణ సంపన్నా! కలువ వంటి అందమైన ముఖము కలవాడా! అందరి రక్షకుడా! ఈ భవ సాగరాన్ని మధించ అత్యుత్తమ సాధనమైన వాడా! ఈ జీవనసాగరంలో నా భయాలను పోగొట్టుము.*


*నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |*

*ఓ నారాయణా! కరుణామయా! నా చేతులు నీ పదములకు మ్రొక్కనీ!*



*ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు ||*

*ఈ ఆరు శ్లోకములు నా వదనములో ఎల్లప్పుడూ నిలవనీ!*

🕉🌞🌎🌙🌟🚩

*శ్రీవిష్ణు షట్పది స్తోత్రం భావం:-*

*ॐॐॐॐॐॐॐॐॐ*

*మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.*


*భ్రమర నాదాలు* 

*ॐॐॐॐॐॐॐॐॐ*

*భ్రమరం అంటే తుమ్మెద. దీనికి మధువ్రతం, మధుకరం, మధుపాళి, ద్విరేఫం, భృంగం, షట్పదం, అళి మొదలైన పేర్లు ఉన్నాయి. పూలలోని తేనెను తాగుతూ, ఝుమ్మని నాదాలు చేయడం తుమ్మెదకు అలవాటు. విష్ణువును స్తుతించిన శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’ రచించి, లోకానికి ప్రసాదించారు. షట్పది అనే మాటకు అర్థం ‘ఆరు పదాలు గలది’. తుమ్మెదకు ఆరు కాళ్లుంటాయి కాబట్టి, ఆ పదం సరిపోతుంది.*


 *భగవత్పాదుల స్తోత్రంలోనూ ఆరు పదాలు విరాజిల్లుతున్నా, అవి తుమ్మెదకు సంబంధించినవి కావు. విష్ణువును ఉద్దేశించిన నామాలు అవి. అందువల్ల ఆ స్తోత్రం ‘షట్పది’ అయింది. పద్మం చుట్టూ తుమ్మెద తిరిగినట్లే, తన ముఖం అనే పద్మం చుట్టూ ఆరు పదాలూ తిరుగుతుండాలని హరిని భగవత్పాదులు కోరుతున్నారు. ‘నారాయణా, కరుణామయా, శరణం కరవాణి తావకౌ చరణౌ’ అనే వాక్యంలో ఆరు పదాలు ఉన్నందువల్ల, అది షట్పదీ స్తోత్రమైంది.*

*తుమ్మెదలు పద్మం నుంచి మకరందాన్ని తాగుతాయి. అలాగే ముఖపద్మంలో నుంచి ఆరు విష్ణు పదాల మకరందం గ్రోలడానికి స్తోత్రం అనే తుమ్మెద తిరుగుతుండాలని సారాంశం. ఆ ఆరింటి మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాల్సిందే.*


*‘ఓ హరీ! మొదట నా అవినయాన్ని పోగొట్టు. నా మనసును నియంత్రించు. భూతదయను పెంపొందించు. సంసారం అనే సముద్రం నుంచి నన్ను ఒడ్డుకు చేర్చు. నీ పాదాలు కమలాలు. ఆ పాదాల నుంచి ఉద్భవించిన ఆకాశ గంగ మకరంద ప్రవాహం వంటిది. సచ్చిదానందాలే ఆ పద్మాల సుగంధాలు. సంసార బంధాలవల్ల కలిగే భయాల్ని పోగొట్టేవి ఆ పాదపద్మాలే!*


*హరీ! నీకు, నాకు భేదం లేకున్నా- ఎప్పుడూ నేను నీవాణ్ని అవుతాను కానీ, నువ్వు నా వాడివి కాదు. అదెలా అంటే- కెరటాల్ని చూసే జనం అవి సముద్రానివే అంటారు. అంతే తప్ప, సముద్రమే కెరటాలకు సంబంధించినదని ఎవరూ అనరు.*


*పర్వతాల రెక్కల్ని తొలగించిన ఇంద్రుడి సోదరుడివి నువ్వు. అందుకే నీకు ‘ఉపేంద్రుడు’ అని పేరు. రాక్షసులకు నువ్వు శత్రువు. సూర్యచంద్రులే నీ కళ్లు. ఇంతటి మహిమ గల నిన్ను చూస్తే చాలు, సంసార దుఃఖాలన్నీ దూరమవుతాయి.*


*ఓ హరీ! లోకాల్ని రక్షించడం కోసం నువ్వు ఎన్నో అవతారాలెత్తావు. ఎందరినో రక్షించావు. సంసార బంధాలతో భయపడుతుండే నన్ను కాపాడేదీ నువ్వే! నువ్వు వనమాల ధరించావు. గుణాలన్నీ నీలో మణుల్లా వెలుగుతున్నాయి. నీ వదనం అనే పద్మం ఎంతో అందమైనది.*


 *సంసార సాగరాన్ని మధించడానికి మందర పర్వతంలా నిలుస్తావు నువ్వు. నా భయాలన్నింటినీ పోగొడతావు...’- ఇలా షట్పదీ స్తోత్రం అంతా మానవుడిలోని ఆర్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఆర్తుల్ని ఉద్ధరించాలంటూ స్వామిని స్తుతించడమే భగవత్పాదుల పరమార్థంగా స్పష్టమవుతుంది.*


*మహర్షులు, యోగులు, మహాకవులు విశ్వక్షేమాన్నే కాంక్షిస్తారు. లోకుల భయాల్ని పోగొట్టడానికి త్రికరణశుద్ధిగా కృషిచేస్తారు. అదే పనిని శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’లో చేశారు.*


 *ఆరు శ్లోకాలు, ఆరు విష్ణునామాంకిత పదాలు మకరంద బిందువుల వంటివి. వాటిని ఆస్వాదించే ఆ స్తోత్రమే ఒక తుమ్మెద. ‘అది ఎప్పుడూ ఇలాగే నా వదన సమీపంలో తిరుగుతుండాలి’ అని కోరడం అంటే, స్తోత్రాన్ని నిరంతరం పఠించే భాగ్యాన్ని అర్థించడమే! ఇదే ఆ స్తుతిలోని అసలు రహస్యం.*


*మనిషిని సంసారం అనేక విధాలుగా బాధిస్తుంది. ఇలాంటి భయాలు, బాధల నుంచి మనసుకు శాంతి కావాలి. అది భగవన్నామ స్మరణతోనే సాధ్యమని పెద్దల మాట. షట్పదీ స్తోత్రం ద్వారా శంకర భగవత్పాదులు చేసిన మహోపదేశం ఇదే. మనిషి తనలోని ఆత్మశక్తిని విస్మరించకూడదు. మనిషిలోనే శాంతి ఉంటుందని, దాన్ని అతడే తెలుసు కోవాలని స్తోత్ర భ్రమరం ఉపదేశిస్తుంది. ఆ భ్రమర నాదం హృదయంగమం!*

 *ఉపవాసం చేసినా చేయలేక పోయినా, ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించడం మంచిది.*

*26 ఏకాదశి నామములు  :-*

1 పాపమోచని ఏకాదశి
2.కామాదా  ఏకాదశి
3.వరూధిని ఏకాదశి
4.మోహినీ ఏకాదశి
5.అపర ఏకాదశి
6.పాండవ నిర్జల ఏకాదశి
7.యోగిని ఏకాదశి
8.శయన ఏకాదశి
9.కామిక ఏకాదశి
10.పవిత్రోపన ఏకాదశి
11.అన్నదా ఏకాదశి
12.పార్శ్వ ఏకాదశి
13.ఇందిరా ఏకాదశి
 14.పాశాంకుశ ఏకాదశి  
15. రమా ఏకాదశి  
16.ఉత్థాన ఏకాదశి              
17.ఉత్పన్న ఏకాదశి
18.మోక్షదా ఏకాదశి
19.సఫల ఏకాదశి 
20.పుత్రదా ఏకాదశి               
21.షట్తిల ఏకాదశి 
22.భైమి ఏకాదశి 
23.విజయ ఏకాదశి
24.ఆమలకి ఏకాదశి                   
25. పరమ ఏకాదశి
 26. పద్మిని ఏకాదశి

వాటి వాటి సమయానుసారం ఒక్కో నెలలో వచ్చే క్రమానుసారం వాటి పేర్లు సుస్పష్టంగా చదవి,భగవదనుగ్రహం పొందగలరు.
🙏🙏🕉️



 *శివానుగ్రహం స్థిరత్వం ,శక్తి, మోక్షం కోసం శ్రీ అజైకపాద మూర్తి గురించి తెలుసుకుందాం*

            *అజైకపాద మూర్తి*
చన్ద్రార్ధ శోభిత కపాల ధారీ,
శూల మృగౌ వనమాలై ర్ధరమ్ |
త్రాసాద్భి ర్దేవై రనీకైశ్చ యుతం,
పితామహోరుద్భవమూర్తి మేకపాదం భజే ||

*రూప వర్ణన*
శివుడు ఏకపాదంపై ఒకే పాదంపై స్థిరంగా నిలబడి ఉంటాడు. మిగిలిన పాదం సాధారణంగా మడచబడి, పైకి ఎత్తి ఉంటుంది లేదా అదృశ్యంగా ఉంటుంది ,శిరస్సుపై అర్ధచంద్రుని ధరించి ఉంటాడు , ఆయన చేతిలో లేదా అలంకరణలో కపాలం (పుర్రె) ఉంటుంది ,చేతులలో త్రిశూలం  మరియు జింక  ధరించి ఉంటాడు, ఆయన వన మాలలు ధరించి, అరణ్యవాసి వలె కనిపిస్తాడు.
ఈ రూపం బ్రహ్మ దేవుని నుండి ఉద్భవించినట్లుగా కూడా కొన్ని పాఠాంతరాలలో చెప్పబడింది.

భయభ్రాంతులైన దేవతల సమూహంచే పరివేష్ఠితమై ఉంటాడు. ఈ దేవతలు తరచుగా అష్టవసువులు లేదా ఇతర రుద్రులుగా చెప్పబడతారు.

*ధ్యాన ఫలం*
ఏకపాద రూపం స్థిరత్వానికి, శక్తికి మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఈ మూర్తిని ధ్యానించడం వలన ఏకాగ్రత మరియు సంకల్పం బలంగా మారుతాయి.

దేవతలు భయభ్రాంతులై ఉన్నట్లు వర్ణించడం వలన, ఈ రూపం శత్రువులను మరియు అపశక్తులను సంహరించే శక్తిని సూచిస్తుంది.
మరియు ఈ రూపం రుద్ర స్వరూపంగా, యోగానికి మూలంగా పరిగణించబడుతుంది, ఇది మోక్ష ప్రాప్తికి సహాయపడుతుంది.
***********
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 
*రాళ్ళబండి శర్మ*





ముక్తి ఇవ్వకపోయినా పరవాలేదు కాని ఏ జన్మ ఇచ్చినా నా మనస్సు నీ పాదాలపై ఉండేలా అనుగ్రహించు స్వామీ అన్నారు ఆదిశంకరులు:


నరత్వం దేవత్వం నగవన

మృగత్వం మశకతా,

పశుత్వం కీటత్వం భవతు

విహగత్వాదిజననం,

సదా తత్పాదాబ్జస్మరణ

పరమానందలహరీ, విహారాసక్తం చేత్

హృదయమిహ కిం తేన వపుషాం " -10

" మనుష్యునిగా, దేవుడుగా, పర్వతంగా, వనంగా, మృగంగా, దోమగా, పశువుగా, పక్షిగా కాని పుట్టినా ఆ ఆ పుట్టుకలందు నీ పాదపద్మాలను భావించడం అనే ఆనందనదిలో ఈదులాడే తలపు ఉన్నచో ఏ పుట్టుక అయినా లోటేముంది " అని.

ఈ శ్లోకం శంకరాచార్య విరచిత శివానందలహరి లోనిది.

ఏ పుట్టుక అయినా శివుడి ధ్యాసలోనే ఉన్నవారు చరితార్ధులవుతారు అని భావించాలి.

" జంతూనాం నరజన్మ దుర్లభం " అన్నాయి శాస్త్రాలు. కాని శివునిధ్యాసలో లేనప్పుడు ఆ నరజన్మ వ్యర్ధం కదా.

దేవతలకయినా ఇదే వర్తిస్తుంది. కుబేరుడు ప్రతిదినమూ ఇద్దరిని దర్శించుకుని పూజిస్తారుట. ఒకరు శివుడు, ఐశ్వర్యప్రదాత, సంపదకోసం. రెండు వెంకటేశ్వరుడు - తను అప్పుగా ఇచ్చిన ధనాన్ని వసూలు చేసుకోవడానికిట.

కొన్ని కొండలు ఉంటాయి - అరుణాచలం, సింహాచలం, భద్రాచలం, వేంకటాచలం (తిరుమల), రత్నాచలం (అన్నవరం ) మొ.గునవి. కొండగా పుడితేనే స్వామిని తమ తలపై పెట్టుకుని సేవించుకుని చరితార్ధులవుతున్నాయి.

కొన్ని అడవులు ఉంటాయి - శబరిమల, నల్లమల (శ్రీశైలం) మొ.గునవి. స్వామిని తమమధ్యలో ఉంచుకుని తరిస్తున్నాయి.

దోమపుట్టుక గురించి చెబుతూ హాస్యంగా " కొన్ని దోమలు అందరి రక్తమూ త్రాగవు, దేవుడి భక్తుల రక్తమే త్రాగుతూ తరిస్తాయి " అన్నారు పండితులు.

అలాగే జంతువులలో కొన్ని ఏనుగులు, పశువులు దేవుడిసేవలో తరిస్తాయి.

కొన్ని పక్షులు దేవుడిగుడి గోపురాలమీద నివసిస్తూ సుప్రభాతాలూ స్తోత్రాలూ వింటూ, ప్రసాదాలు తింటూ తరిస్తాయి
 అహో సైకత లింగేన 
భ్రష్టా మే తామ్ర భాజనం గతాను గతికోలోకః న లోకః పారమార్థికః||



భావం 

"అయ్యో ఈ ఇసుక లింగం వల్ల నా రాగి చెంబు పోయింది కదా! లోకంలో జనులు ముందువారు ఏదిచేస్తే అదే చేస్తారు కాని, ఆ పనిలోని పరమార్థాన్ని గ్రహించరు” అని శ్లోక భావం. దీనిని చిన్ని కథతో వివరిస్తాను.

 ఓ భక్తుడు పర్వదినంరోజు సముద్ర స్నానానికి వెళ్తాడు. అతని చేతిలో ఒక రాగి చెంబు  ఉంటుంది. అప్పటికి ఇంకా సముద్రస్నానానికి ఎవరు రాలేదు. 

స్నానానికి వెళ్ళే ముందు రాగి చెంబుని ఒడ్డున జాగర్తగా దాచాలనుకొంటాడు. అందుకని ఇసుకలో చిన్నగొయ్యి చేసి ఆ చెంబుని గోతిలో పెట్టి, గుర్తుగా ఇసుకని కుప్పలాగా పోగుచేస్తాడు. ఆ ఇసుక కుప్ప దూరానికి ఒక లింగాకారంలో కనపడుతుంది. తను స్నానం చేసేటప్పుడు ఆ చెంబు ఇంక ఎవరు దొంగలించలేరని అనుకొని సముద్రం లోకి స్నానానికి వెళతాడు. 

కాని ఇంకో ఇద్దరు సముద్ర స్నానానికి వస్తూ దూరంనుంచి మొదటి వాడు ఇసుకని కుప్పలా చేయడం చూస్తారు. చెంబు దాచుకోడానికి అలా చేసాడని గ్రహించక, సముద్ర స్నానానికి వెళ్లేముందు ఇసుకని శివలింగంలా చేసి సముద్రస్నానం చేస్తే మరింత పుణ్యం వస్తుంది,అదే ఆచారం అనుకొని మొదటికుప్ప ప్రక్కనే వాళ్ళిద్దరూ మరోరెండు కుప్పలుచేసి స్నానానికి వెళతారు. 

దూరంనుంచి వచ్చే మరోనలుగురు వీరు చేసినదానిని చూసి వాటి ప్రక్కనే మరోనాలుగు శివ లింగాలు చేస్తారు. ఇలా సముద్ర స్నానానికి వచ్చే ప్రతి ఒక్కరు ముందు వారిని చూసి “ఈ పర్వదినాన ఇసుకని శివలింగంగా చేసి సముద్రస్నానం చేయాలి” అనుకొని అలాగేచేస్తారు. ఇలా వందల సంఖ్యలో ఆ సముద్రపు ఒడ్డున శివలింగాలు ఏర్పడుతాయి. 

మొదటి భక్తుడు స్నానం చేసి ఒడ్డుకి వచ్చి చూసి ఆశ్చర్యపోయి!, అన్ని శివలింగాలలో తన చెంబు కోసం గుర్తుగాచేసిన ఇసుక కుప్ప ఎక్కడ ఉందో తెలుసుకోలేక, తన రాగి చెంబు పోయినందుకు బాధపడుతూ "నేను చేసిందే చూసి చేసేరు కాని ఎందుకు చేసానో అందలి పరమార్థం ఏమిటో తెలుసుకో లేకపోయారు” అని “గతాను గతికోలోకః న లోకః పారమార్ధికః” అనుకొంటూ వెళ్ళి పోతాడు.” 

పై చాటు శ్లోకం రావడానికి ఇంతటి రసవత్తరమైన సన్నివేశం జరిగింది.

- సురవరపు నాగేంద్రశర్మ
 మనం ధ్యానం స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు  నేను నా ఆత్మ మరియు నా పూర్ణాత్మ మరియు నా భౌతిక శరీరంలో ఉన్నటువంటి సకల అణువులు పరమాణువులు కణాలు  మరియు మొత్తంగా నా భౌతిక శరీరం మరియు నా యొక్క ఏడు శరీరాలతో పాటుగా శంబాలా మాస్టర్స్ తో కలిసి శంబాలా ఎనర్జీస్ తో కనెక్ట్ అవుతూ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈజిప్ట్ లో ఉన్నటువంటి గిజా పిరమిడ్ లో ఉన్న కింగ్స్ ఛాంబర్ మీద మేమంతా ఈ విశ్వంలో ఉన్న సకల గేలక్సీలలో ఉన్న సర్వ జీవరాసులు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందటం కోసం ధ్యానం చేస్తున్నాము. 
 అదేవిధంగా ఈ ధ్యానానికి మాతో పాటుగా ఈ జన్మలో  నేను అనుభవిస్తున్న సకల భయాలకు కారణమవుతున్న దివ్యాత్మ స్వరూపులందరు వారి యొక్క దివ్యమైన చైతన్యంతో వచ్చి మాతో పాటు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందుతారు.                                  అదేవిధంగా ఈ ధ్యానానికి మాతో పాటుగా ఈ జన్మలో గాని నా గత జన్మలలో గాని నేను చేసిన అజ్ఞానపు చర్యల వలన ఇబందిపడిన దివ్యాత్మ స్వరూపులందరు దయచేసి నన్ను క్షమించి వారంతా కూడా వారి యొక్క దివ్యమైన చైతన్యంతో వచ్చి మాతో పాటు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందుతారు
అదేవిధంగా ఈ జన్మలో ఈ ధ్యానానికి మాతో పాటుగా ఈ భూమీద ఉన్నటువంటి మానవజాతి అంతా కూడా వారి యొక్క దివ్యమైన చైతన్యంతో వచ్చి మాతో పాటు ధ్యానం చేస్తూ ఆనందంగా సంతోషంగా ఉంటూ  సకల జీవుల పట్ల ప్రేమతో ఉంటూ ఆత్మజ్ఙానం పొందుతారు.  అదేవిధంగా ఈ ధ్యానానికి మాతో పాటుగా బ్రహ్మర్షి పత్రిజీ మరియు మహావతార్ బాబాజీ మరియు సదానంద యోగి మరియు ఈ విశ్వ కళ్యాణం కోసం మేము చేస్తున్న ఈ ధ్యానానికి ఎవరైతే తమవంతుగా భాగస్వామ్యం అవడానికి సిద్ధంగా ఉన్న మాస్టర్ అందరూ వారి యొక్క పరమాత్మపు చైతన్యంతో వచ్చి మాతో పాటు కలిసి ధ్యానం చేస్తారు.                    ధ్యానం అయిన తర్వాత ఇప్పటి వరకు నాతో పాటుగా ఈ విశ్వ కళ్యాణం కోసం ధ్యానం చేసిన దివ్యాత్మ మరియు పరమాత్మ స్వరూపులందరికీ నా యొక్క ధన్యవాదములు.
 పక్షపాతం (స్ట్రోక్) నుండి శాశ్వత ఉపశమనం కోసం ఆయుర్వేద చికిత్స

  ఆయుర్వేదంలో, పక్షవాతాన్ని పక్షఘాత్ అని పిలుస్తారు, అంటే "శరీరంలో సగం పక్షవాతం", ఇక్కడ "పక్షం" అనేది శరీరంలోని సగభాగాన్ని సూచిస్తుంది మరియు "అఘాత (పక్షవాతం)" శరీర కదలికల బలహీనత మరియు మానసిక అస్థిరత్వాన్ని సూచిస్తుంది.

  స్ట్రోక్ రకాలు
  ముఖ పక్షవాతం - ముఖ కండరాల బలం మరియు చలనశీలత కోల్పోవడం.
  మోనోప్లెజియా - ఒక అవయవంలో శక్తి కోల్పోవడం.
  హెమిప్లెజియా - శరీరం యొక్క ఒక వైపు ప్రభావితం చేస్తుంది.
  పక్షవాతం - రెండు కాళ్ల పక్షవాతం.
  క్వాడ్రిప్లెజియా - నాలుగు అవయవాల పక్షవాతం.

  హెమిప్లేజియా అనేది పక్షవాతం యొక్క అత్యంత సాధారణ ప్రదర్శన, పక్షవాతం ఒక వైపు ముఖం, అవయవాలు మరియు ట్రంక్‌ను ప్రభావితం చేస్తుంది.

  స్ట్రోక్ కలగడానికి కారణాలు
  మెదడు కణితులు
  అనియంత్రిత అధిక రక్తపోటు
  ప్రమాదం లేదా గాయం నుండి మెదడు గాయం
  షాక్ వల్ల
  బ్రెయిన్ ఇన్ఫెక్షన్.

  స్ట్రోక్ యొక్క లక్షణాలు
  అవయవాలలో బలం కోల్పోవడం
  ముఖ పక్షవాతంలో కనురెప్ప మరియు నోరు చలనం తగ్గడం.
  చేతులు మరియు కాళ్ళ బలహీనమైన కదలిక.
  అస్థిర మనస్తత్వం.
  అస్పష్టమైన మాటలు
  మసక దృష్టి
  అవయవాల తిమ్మిరి.

  స్ట్రోక్ నివారించడానికి, ఈ క్రింది నియమాలను పాటించాలి:

  సమతుల్య ఆహారం తీసుకోండి.
  మరియు చురుకుగా ఉండండి

  రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమలో పాల్గొనడం వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు, కొలెస్ట్రాల్ మరియు శరీర బరువుపై సానుకూల ప్రభావం ఉంటుంది.

 దూమపానం వదిలేయండి.

 అధిక బరువు ఉన్న వ్యక్తులు బరువు నిర్వహణ చికిత్సలు లేదా వ్యూహాలపై దృష్టి పెట్టాలి.

  ముందుగా స్ట్రోక్ లక్షణాలను గుర్తించడానికి వ్యక్తులు వార్షిక ఆరోగ్య పరీక్షను చేయించుకోవాలి.
  వ్యక్తులకు ఇతర వైద్య సమస్యలు ఉంటే చికిత్సకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

  కొన్ని జన్యుపరమైన స్ట్రోక్‌లను నియంత్రించడం అసాధ్యం అయినప్పటికీ, ప్రమాదాన్ని తగ్గించడానికి వ్యక్తులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించవచ్చు.

  స్ట్రోక్‌ కి ఆయుర్వేద చికిత్స

  స్ట్రోక్‌ను నయం చేయడానికి ఆయుర్వేదంలో కొన్ని అద్భుతమైన మూలికలు ఉన్నాయి, శతాబ్దాలుగా ఆయుర్వేద గ్రంథాలు స్ట్రోక్‌ను నయం చేయడానికి కొన్ని అద్భుతమైన మూలికలను సూచించాయి, ఈ మూలికలు చాలా ప్రభావవంతంగా మరియు సురక్షితంగా ఉంటాయి, అవి స్ట్రోక్‌ను నయం చేయడానికి ఎలా పనిచేస్తాయో ఒక్కొక్కటిగా చర్చిద్దాం.

  అశ్వగంధ
  ఇది ఆయుర్వేదంలోని ఉత్తమ నర్విన్ టానిక్‌లలో ఒకటి, అంటే నరాలను ఉత్తేజపరుస్తుంది, ఇది వైద్య శాస్త్రంలో అత్యంత పురాతనమైన మూలిక.  నాడీ సంబంధిత పరిస్థితులతో పాటు, పక్షవాతం మరియు నాడీకణ నష్టాన్ని కలిగించే సెరిబ్రల్ పాల్సీ వంటివి అశ్వగంధతో దీర్ఘకాలిక చికిత్సవల్ల మెరుగుపడుతుందని  వైద్య అనుభవం ధ్రువీకరించింది.

  నిర్గుండి

   నిర్గుండి దాని యాంటీ కన్వల్సెంట్ లక్షణాల వల్ల పక్షవాతాన్ని నయం చేస్తుంది.  ఇది మూర్ఛలకు కారణమయ్యే కొన్ని భాగాల నుండి కూడా రక్షిస్తుంది.  ఎలక్ట్రోషాక్  మూర్ఛలను నివారించడంలో నిర్గుండి సహాయపడుతుంది.

  పక్షవాతం సాధారణంగా నరాలను ప్రభావితం చేసే వాత దోష అసమతుల్యత కారణంగా సంభవిస్తుంది.  నిర్గుండి దాని వాత బ్యాలెన్సింగ్ మరియు మెధ్య (మెదడు టానిక్) లక్షణాల కారణంగా ఈ పరిస్థితి నిర్వహణలో సహాయపడుతుంది, ఇది పక్షవాతం నిరోధించడానికి మరియు నయం చేయడంలో సహాయపడుతుంది మరియు నరాలకు శక్తిని అందిస్తుంది.

  పిప్పాలి

  పక్షవాతం యొక్క ప్రధాన కారణం నిద్రలేమి సమస్య, నిద్ర రుగ్మతలు మరియు మానసిక రుగ్మతలను నిర్వహించడానికి పిప్పాలిని ఉపయోగించవచ్చు.  పిప్పాలి పండ్లు మరియు వేరు పదార్ధాలలోని ఉపశమన గుణాల వల్ల ఇది మంచి నిద్రను ప్రేరేపిస్తుంది.

  మానసిక రుగ్మతలకు చికిత్స చేయడానికి Pippali ఉపయోగించవచ్చు.  ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం నిద్రలేమి అనేది తీవ్రతరం చేసిన వాత వల్ల వస్తుంది మరియు పిప్పలిలో వాత బ్యాలెన్సింగ్ లక్షణాలు ఉన్నాయి.

  జటామసి
  ఇది మెదడు టానిక్‌గా పనిచేస్తుంది మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల సెల్ డ్యామేజ్‌ను నివారించడం ద్వారా జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  ఇది మెదడును ప్రశాంతపరుస్తుంది మరియు ఆందోళన మరియు నిద్రలేమిని కూడా నిర్వహిస్తుంది.

  నగరమోట
  మూర్ఛ దాడుల నిర్వహణలో నగరమోత ఉపయోగపడుతుంది.  నాగరమోటా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది.  ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయగల సామర్థ్యం కారణంగా, మూర్ఛ దాడుల (స్ట్రోక్స్) తీవ్రత మరియు వ్యవధిని తగ్గించడంలో నగరమోత ఉపయోగపడుతుంది.

  హల్దీ
  మీకు స్ట్రోక్ వచ్చినట్లయితే, "మైక్రో సర్క్యులేషన్"లో ఆగష్టు 2013లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో హల్దీలోని కర్కుమిన్ స్ట్రోక్ తర్వాత మీ మెదడు కణజాలాలకు రక్తం మరియు ఆక్సిజన్ తిరిగి వచ్చినప్పుడు సంభవించే నష్టాన్ని పరిమితం చేయడంలో సహాయపడుతుందని ధృవీకరించింది. హల్దీ లోని కుర్ అద్భుతాలను చేస్తుంది.

  గుగ్గుల్
  గుగ్గుల్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మరియు రక్త నాణ్యతను మెరుగుపరచడానికి దాని సామర్థ్యానికి ప్రశంసించబడింది.  గుగ్గుల్ రక్తాన్ని శుద్ధి చేయడానికి, ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రోత్సహించడానికి మరియు ప్రసరణ వ్యవస్థ నుండి విషాన్ని తొలగించడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.  ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ పాశ్వ వాయు ఉపశమనానికి చాలా సహాయపడుతుంది.

  చావ్య లేదా పిప్పాలి
  పిప్పాలి అజీర్ణాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది.  ఆయుర్వేదం ప్రకారం, అజీర్ణం అనేది అసంపూర్ణమైన జీర్ణక్రియ యొక్క స్థితి.  అజీర్ణానికి ప్రధాన కారణం అగ్నిమాంద్యం (బలహీనమైన జీర్ణాశయం) కలిగించే కఫం.  పిప్పలిని తీసుకోవడం వల్ల అగ్ని (జీర్ణ అగ్ని) మెరుగుపడుతుంది మరియు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.  ఇది వరుసగా దాని దీపన్ (ఆకలిని కలిగించే) మరియు పచాన్ (జీర్ణ) లక్షణాల కారణంగా ఉంటుంది.  90% జీవనశైలి వ్యాధులు అజీర్ణం వల్ల వస్తాయని మీకు తెలుసా?


  చిత్రక్

  చిత్రక్ దాని కండరాల సడలింపు లక్షణాల కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థ (CNS)పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.  ఇది కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క హైపర్యాక్టివిటీని తగ్గిస్తుంది మరియు ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది.

  నాడీ వ్యవస్థ వాత దోషం ద్వారా నియంత్రించబడుతుంది.  చిత్రక్ దాని వాతా బ్యాలెన్సింగ్ మరియు మేధ్య (బ్రెయిన్ టానిక్) లక్షణాల కారణంగా CNS నిర్వహణలో సహాయపడుతుంది.  ఇది నాడీ రుగ్మతల నిర్వహణ మరియు నివారణ రెండింటిలోనూ సహాయపడుతుంది మరియు నరాలకు పోషణను అందిస్తుంది.  మీకు తెలుసా బలహీనమైన నాడి వ్యవస్థ వల్లనే పక్షపాతం వస్తుంది.

  బాలా
  రోజువారీ జీవితంలో అలసటను నిర్వహించడానికి బాలా ఉపయోగపడుతుంది.  పక్షపాతం వల్ల కలిగే ప్రధాన సమస్య బలహీనత లేదా శక్తి లేకపోవడం.  ఆయుర్వేదం ప్రకారం, అలసటను క్లమా అని పిలుస్తారు మరియు అలసట విషయంలో అసమతుల్యత యొక్క ప్రాధమిక దోషం కఫ దోషం.  బాలా దాని శక్తిని అందించే మరియు త్రిదోష బ్యాలెన్సింగ్ స్వభావం కారణంగా అలసట లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.  బాలా కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.  పక్షవాతం వల్ల కలిగే బలహీనతను తగ్గిస్తుంది.

  ఆమ్ల
  ఆమ్లా డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి మరియు పార్కిన్సన్స్ వ్యాధి నిర్వహణలో దాని కోలినెస్టరేస్ వ్యతిరేక చర్య కారణంగా ఉపయోగించవచ్చు.  ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.  ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది మరియు మెదడు దెబ్బతినడాన్ని తగ్గించడానికి మరియు అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడానికి తాపజనక మధ్యవర్తులను నిరోధిస్తుంది.  మెదడుకు పదును పెట్టడంలో సహాయపడుతుంది.

  బెహెడ
  బహెడా దాని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ-డిప్రెసెంట్ లక్షణాల కారణంగా డిప్రెషన్ సందర్భాలలో ఉపయోగపడుతుంది.  బహెడాలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి మెదడు కణాల దెబ్బతినకుండా చేస్తాయి.  బహెడ మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్‌ల (సిగ్నల్ ట్రాన్స్‌మిషన్‌లో సహాయపడే మధ్యవర్తులు) గాఢతను పెంచుతుంది మరియు తద్వారా నిరాశ మరియు ఆందోళనను నిర్వహించడంలో సహాయపడుతుంది మరియు పక్షవాతం సమస్యను నయం చేస్తుంది.

  అల్లం

  ఆక్సీకరణ ఒత్తిడి మరియు దీర్ఘకాలిక మంట అనేది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే రెండు కారకాలు మరియు అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర వయస్సు-సంబంధిత అభిజ్ఞా బలహీనతలకు ప్రధాన డ్రైవర్లు.  అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు మరియు బయోయాక్టివ్ సమ్మేళనాలు మెదడులో తాపజనక ప్రతిస్పందనలను నివారిస్తాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.  60 మంది మధ్య వయస్కులైన మహిళలపై జరిపిన ఒక అధ్యయనంలో, అల్లం సారం ప్రతిచర్య సమయం మరియు పని జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని చూపబడింది, అల్లం మెదడు ఆరోగ్యానికి అనేక విధాలుగా మద్దతు ఇస్తుందని సూచిస్తుంది.

  రస్నా

  అజీర్ణం యొక్క లక్షణాలను తగ్గించడంలో రస్నా సహాయపడుతుంది.  ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు దాని ఉష్నా (వేడి) ఆస్తి కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  మరియు శరీరం యొక్క జీవక్రియను పెంచుతుంది.

  కాలిమిర్చ్ లేదా నల్ల మిరియాలు

  నల్ల మిరియాలు మీ మెదడు పనితీరును ఆరోగ్యంగా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.  పార్కిన్సన్స్ మరియు అల్జీమర్స్ వంటి వ్యాధులలో పైపెరిన్ సంభావ్య ప్రయోజనాలను కలిగి ఉంది.  ఇది డోపమైన్ అనే సమ్మేళనం ఉత్పత్తిని నాశనం చేసే ఎంజైమ్‌లను నిరోధిస్తుంది, ఇది పార్కిన్సన్స్ వ్యాధి మరియు డిప్రెషన్‌తో బాధపడుతున్న రోగులలో చాలా సహాయపడగలదు.  నల్ల మిరియాలు మెదడు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది మరియు స్ట్రోక్‌లను నివారిస్తుంది.

  ధరుహరిద్ర

  దారుహరిద్ర జీవక్రియను మెరుగుపరచడం ద్వారా సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.  ఇది శరీరంలోని అమా (శరీరంలో జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల విషపూరిత వ్యర్థాలు) స్థాయిని దీనికి కారణం దాని ఉష్ణ (వేడి) స్వభావం .  ఇది దాని లేఖనియా (స్క్రాపింగ్) ఆస్తి కారణంగా శరీరం నుండి అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.  ఇది రక్తం యొక్క మందాన్ని తగ్గిస్తుంది, తద్వారా రక్తం శరీరం అంతటా స్వేచ్ఛగా ప్రసరిస్తుంది.

  శలాకి

  షలాకి నొప్పిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిలోని కొన్ని సమ్మేళనాలు వాపు మరియు నొప్పిని కలిగించే మధ్యవర్తులను నిరోధిస్తాయి, తద్వారా వాపు-సంబంధిత నొప్పిని నిర్వహిస్తాయి.

  శలాకి దాని వాత బ్యాలెన్సింగ్ స్వభావం కారణంగా నొప్పి (ముఖ్యంగా కీళ్ల నొప్పి) నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  ఆయుర్వేదం ప్రకారం, అన్ని రకాల నొప్పి తీవ్రతరం చేసిన వాతా వల్ల వస్తుంది, షలాకిని ఉపయోగించడం వల్ల కండరాలను సడలించడానికి  సహాయపడుతుంది. అంటే మజిల్ రిలాక్సేంట్ గా పని చేస్తుంది.

  ఇక్కడ పేర్కొన్న ఈ మూలికలన్నీ పక్షవాతాన్ని నయం చేయడానికి వాటి స్వంత లక్షణాలను కలిగి ఉన్నాయి మరియు ఇవన్నీ ఆయుర్వేద PAKSHAGHAATH NIVARAN క్యాప్సూల్స్‌లో ఉన్నాయి, ఈ క్యాప్సూల్స్ పక్షవాతం నయం చేయడానికి మరియు వారు ఎదుర్కొనే అన్ని రకాల లక్షణాలను ఉపశమనం చందడానికి సినర్జిస్టిక్ ప్రభావాన్ని ఇస్తాయి, ఈ మూలికలన్నీ 100% సహజమైనవి మరియు శూన్యం దుష్ప్రభావాలు కలిగినవి.  మీరు మీ సాధారణ ఔషధ నియమావళితో పాటు ఆయుర్వేద పక్షఘాత్ నివారన్ క్యాప్సూల్స్‌ను ఉపయోగించవచ్చు.  ఇది చాలా సురక్షితమైనది మరియు ప్రభావవంతమైనది, ఆరోగ్యకరమైన వ్యక్తులు కూడా దీనిని ముందు జాగ్రత్త చర్యగా ఉపయోగించవచ్చు

 మీరు ప్రతిరోజూ పక్షగత్ నివారణ్ క్యాప్సూల్స్‌ను ఉపయోగించాలనుకుంటే, దయచేసి అల్పాహారం ముందు 1 క్యాప్సూల్, మధ్యానం భోజనం ముందు 1 క్యాప్సూల్ మరియు సాయంత్రం భోజనం ముందు 1 క్యాప్సూల్ తీసుకోండి. మంచి శాశ్వతమైన ఫలితాల కోసం కనీసం మూడు నెలల పాటు ఆపకుండా వాడండి.

  1 - 1 - 1

 మరిన్ని వివరాల కోసం మా whatsapp నంబర్‌ను సంప్రదించండి

 7019198939

 ధన్యవాదాలు.
 *_తల స్నానం - పెరాలసిస్ స్ట్రోక్స్..._*

చాలామంది స్నానం చేసేటప్పుడు మనం సాధారణంగా ముందు తలకు నీళ్లు పోసుకుని తర్వాత శరీరానికి పోసుకుంటాము..

కాని అది సరి కాదు అని కెనడా వైద్యుల బృందం పరిశోధన తెలుపుతుంది...

ముందు కాళ్ల మీద నీళ్లు పోసుకుని తరువాత శరీరం మీద నీళ్లు పోసుకుని ఆఖరిలో తలకు స్నానం చేయాలి అని కొత్త పరిశోధన తెలుపుతుంది..

మన శరీరంలో ఒక రకమైన టెంపరేచర్ మెయింటెన్ అవుతూ ఉంటుంది.. మనం తలపైన నీళ్లు పోసుకోవడం వలన అక్కడికి వెంటనే బ్లడ్ సప్లై పెరిగిపోయి రక్తనాళాలు చిట్లి స్ట్రోక్స్ వస్తున్నాయట..

ముఖ్యంగా పెద్ద వయసు వారు రక్తపోటు ఉన్నవారు మరియు కొలెస్ట్రాల్ లాంటి గుండె జబ్బులు ఉన్నవాళ్లు గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఇటువంటి స్ట్రోక్స్ కు గురి అయి బాత్రూంలో కింద పడి చనిపోతున్నారు..

కావున సరైన పద్ధతిలో స్నానం చేయడం అనేది కూడా చాలా ముఖ్యం అని ఈ పరిశోధన వలన తెలుస్తుంది..

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

If you think the price of a pearl is Rs.100... you're in trouble! 🤔

If you think the price of a pearl is Rs.100... you're in trouble! 🤔

https://youtube.com/shorts/1JdkH4CaUpg?si=k5NKFdW57qyHNLBh


https://www.youtube.com/watch?v=1JdkH4CaUpg

Transcript:
(00:00) మీరు మార్కెట్ లో 100కి దండ 100కి దండ అని కొనే ముత్యాలు చూసి అసలు ముత్యం రేట్ ఇంతేనేమో అని ఫిక్స్ అయిపోతే మీరు పెద్ద భ్రమలో ఉన్నట్టే ఎందుకంటే అవి నిజమైన ముత్యాలు కాదు [సంగీతం] ఫ్యాక్టరీలో పండించిన బ్రాయిలర్ కోడ్ లాంటివి వాటిని ఫ్రెష్ వాటర్ పర్ల్స్ అంటారు. ఒక్క ఆల్చిపలోనే మనుషులు 30 నుంచి 40 ముత్యాలని [సంగీతం] ఈజీగా పండిస్తారు.
(00:19)  అందుకే అవి మీకు కిలోల లెక్కన చౌకగా దొరుకుతాయి. వీటి రేటు క్యారెట్ కి కేవలం రూపాయలు 100 నుంచి 500 మాత్రమే ఉంటది. కానీ అసలైన నాచురల్ పర్ల్ లేదా బసరా [సంగీతం] ముత్యం కథ వేరు. ఇది సముద్రంలో మనిషి ప్రమేయం లేకుండా వేలల్లో ఒక్క ఆల్ చిప్పలో మాత్రమే పుడుతుంది. అది కూడా ఒక్క [సంగీతం] ముత్యం తయారవ్వడానికి ఏళ్ల టైం పడుతుంది.
(00:36)  దీని రేటు వింటే దిమ్మ తిరిగిపోతే ఒక్క చిన్న బసరా ముత్యం ధర క్వాలిటీని బట్టి లక్ష నుంచి 10 లక్షల వరకు ఉంటది. అదే సైజు కొంచెం పెద్దగా ఉండి పర్ఫెక్ట్ రౌండ్ గా ఉంటే కోట్లలో పలుకుతుంది. ఉదాహరణకి ఈ గిగా పర్ల్ ని చూడండి. ఇది ప్రపంచంలోనే కాస్ట్లీ ముత్యం. [సంగీతం] దీని విలువ సుమారు ఒక 100 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 800 కోట్లు.
(00:56)  సో ముత్యం అంటే మెరిసే రాయి మాత్రమే కాదు అదొక రాజయోగం బ్రో

A pearl is... the grave of a worm!🤔

 A pearl is... the grave of a worm!🤔

https://youtube.com/shorts/Pm3TCU6kqSM?si=bsFVLxS56sk6FssZ


https://www.youtube.com/watch?v=Pm3TCU6kqSM

Transcript:
(00:00) చాలా మంది అనుకుంటారు ఆల్చిప లోపలికి ఒక ఇసుకరేను వెళ్తే ముత్యం తయారవుతుందని కానీ అది పచ్చి అబద్ధం నిజానికి ముత్యం పుట్టేది ఆల్చిపకి కలిగే నొప్పి వల్ల ఎప్పుడైతే ఒక పారాసైట్ లేదా చిన్న పురుగు ఆల్చిప లోపలికి దూరి దాని సాఫ్ట్ టిష్యూ ని డామేజ్ చేయడం స్టార్ట్ చేస్తదో అప్పుడు ఆల్చిపకి విపరీతమైన మంట పుడతది.
(00:18)  తనని తాను కాపాడుకోవడానికి అది నేకర్ అనే ఒక మెరుస్తున్న లిక్విడ్ ని ఆ పురుగు మీదకి స్ప్రే చేస్తది. ఆ పురుగుకి ఊపిరి ఆడకుండా దాని చుట్టూ లేయర్ల మీద లేయర్లు పూస్తూనే ఉంటది. కొన్నాళ్లకు ఆ లేయర్లు గట్టిపడి ఆ పురుగుని లోపలే సమాధి చేసి ఒక అందమైన రాయిలా మారుస్తాయి. దాన్నే మనం ముత్యం అంటాం. సింపుల్ గా చెప్పాలంటే మనం లక్షలు పెట్టి కొనుక్కునే ముత్యం నిజానికి ఒక చచ్చిపోయిన పురుగు యొక్క అందమైన శవపేటిక అన్నమాట

Do you know how people were robbed in the name of medicine?

Do you know how people were robbed in the name of medicine?

https://youtube.com/shorts/lcgJMOEeNQw?si=XGD9-4F8AdJSWjaM


https://www.youtube.com/watch?v=lcgJMOEeNQw

Transcript:
(00:00) పాతకాలంలో కొంతమంది ట్రావెలింగ్ డాక్టర్లు ఊరూరా తిరిగి రంగు రంగు సీసాలు అమ్మేవారు ఇది తాగితే చాలు తల నొప్పి, కీళ్ల నొప్పులు, ముసలితనం చివరికి లవ్ ఫెయిల్యూర్ కూడా సెట్ అయిపోద్ది అని ఓ రేంజ్ లో బిల్డప్ ఇచ్చేవారు. నిజానికి ఆ సీసాల్లో మందు ఉండదు మన్ను ఉండదు. సగం నాటు సారా ఇంకొంచెం నల్ల మందు లేదా నిజంగానే పాముని కరిగించి తీసిన [సంగీతం] కొవ్వు కలిపేసేవారు.
(00:21)  అది తాగగానే ఆ మత్తులో జనాలకి నొప్పులు తగ్గినట్టు అనిపించేది. దాంతో అబ్బా డాక్టర్ గారు దేవుడు స్వామి అని దండాలు పెట్టేవాళ్ళం. జనాలు ఆ మందుని నమ్మలేదు. వాడి ఇచ్చిన ఆ బిల్డప్ ని ఆ కలరింగ్ ని నమ్మారు. జనం అమాయకత్వాన్ని వాళ్ళ అవసరాలని అడ్డం పెట్టుకొని ఈ దొంగ డాక్టర్లు కోట్లు వెనకేసుకున్నారు. [సంగీతం]

Is it poisonous if the toothpaste is black? Don't be a fool, man! 🙄

 Is it poisonous if the toothpaste is black? Don't be a fool, man! 🙄

https://youtube.com/shorts/dKtIZFrt7n8?si=1prdEZnunLVCEMLP


https://www.youtube.com/watch?v=dKtIZFrt7n8


Transcript:

(00:00) ఇప్పుడే వెళ్లి మీ టూత్ పేస్ట్ ట్యూబ్ వెనకాల చూడండి ఆ బాటం మీద గ్రీన్ రెడ్ బ్లూ లేదా బ్లాక్ కలర్ లో ఒక చిన్న బాక్స్ కనిపిస్తుందా దీని గురించివాట్ లో ఒక పెద్ద పుకారు ఉంది. గ్రీన్ ఉంటే నాచురల్ అని రెడ్ ఉంటే కొంచెం కెమికల్ అని అదే బ్లాక్ ఉంటే మాత్రం ఫుల్ డేంజర్ కెమికల్ అని జనాలు భయపడుతున్నారు. కానీ అదంతా పచ్చి అబద్ధం మావ అసలు ఆ రంగులకి లోపల ఉండే పేస్ట్ క్వాలిటీకి అస్సలు సంబంధం లేదు.

(00:24)  అది ఫ్యాక్టరీలో ట్యూబ్ ని కట్ చేసే మిషన్ కోసం వేసిన ఐ మార్క్ దీని లాజిక్ చాలా సింపుల్. మన నల్ల పలక మీద తెల్ల చాక్ పీస్ ఎందుకు వాడతాం బాగా కనిపించడానికి కదా ఇది అంతే మీ పేస్ట్ ట్యూబ్ వైట్ ఉంటే మిషన్ కి క్లియర్ గా కనిపించడానికి బ్లాక్ రంగు మార్క్ వేస్తారు. అదే కొన్ని చార్కోల్ పేస్ట్ లాగా ట్యూబ్ నల్లగా ఉంటే అప్పుడు మిషన్ కి కనిపించడానికి వైట్ మార్క్ వేస్తారు.

(00:44)  అంతే తప్ప నలుపు ఉంటే విషం ఆకు పచ్చు ఉంటే అమృతం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. పేస్ట్ లో ఏముందో తెలుసుకోవాలంటే వెనకాల ఉన్న ఇంగ్రిడియంట్స్ లిస్ట్ చదవాలి తప్ప రంగులు చూసి మోసపోకండి.