Friday, April 3, 2026

 *భగవద్గీత 7.27–28 — తాత్త్విక విశ్లేషణ*

శ్లోకం 7.27

> ఇచ్ఛాద్వేషసముత్థేన
ద్వంద్వమోహేన భారత ।
సర్వభూతాని సమ్మోహం
సర్గే యాంతి పరంతప ॥


సరళార్థం

ఓ అర్జునా, ఇష్ట–అనిష్టాల వల్ల పుట్టే ద్వంద్వమోహం కారణంగా అన్ని జీవులు సృష్టిలో మోహితులవుతారు.


---

శంకరభాష్య సారం

ఇక్కడ మూడు ముఖ్యమైన పదాలు ఉన్నాయి:

1. ఇచ్ఛా (కోరిక)

ఇష్టమైన వస్తువుల పట్ల ఆకర్షణ.

2. ద్వేషం

ఇష్టం లేని వస్తువుల పట్ల విరక్తి లేదా అసహ్యం.

3. ద్వంద్వమోహం

ఈ రెండు కలిసి మనసులో ద్వంద్వం సృష్టిస్తాయి:

సుఖం / దుఃఖం

లాభం / నష్టం

మానం / అపమానం


శంకరాచార్యులు చెబుతారు:

ఈ ద్వంద్వాల వల్ల మనిషి స్వరూపజ్ఞానాన్ని కోల్పోతాడు.

జీవుడు తనను:

శరీరం

మనస్సు

భావాలు


ఇవన్నీగా భావిస్తాడు.

అదే మోహం.


---

“సర్గే యాంతి”

శంకరుల ప్రకారం:

జీవుడు జన్మ తీసుకున్న క్షణం నుంచే ఈ ద్వంద్వమోహం ప్రభావం మొదలవుతుంది.

అంటే:

అజ్ఞానం కొత్తగా పుట్టింది కాదు.
అది అనాది సంస్కారం.

ఇదే సంసార చక్రానికి మూలం.


---

శ్లోకం 7.28

> యేషాం త్వంతగతం పాపం
జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వంద్వమోహనిర్ముక్తాః
భజంతే మాం దృఢవ్రతాః ॥


అర్థం

పుణ్యకర్మల వల్ల పాపం క్షీణించినవారు ద్వంద్వమోహం నుండి విముక్తులై దృఢ సంకల్పంతో నన్ను భజిస్తారు.


---

శంకరాచార్యుల వ్యాఖ్యానం

ఇక్కడ ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక నియమం ఉంది.

1. పాపక్షయం

పాపం అంటే కేవలం నైతిక తప్పులు కాదు.

శంకరుల ప్రకారం:

పాపం = మనస్సు అశుద్ధి.

అది తగ్గాలి.


---

2. పుణ్యకర్మ

పుణ్యకర్మలు:

ధర్మాచరణ

యజ్ఞం

దానం

తపస్సు

శాస్త్రాధ్యయనం


ఇవి మనస్సును శుద్ధి చేస్తాయి.

ఇది చిత్తశుద్ధి.


---

3. ద్వంద్వమోహ విముక్తి

మనస్సు శుద్ధి అయినప్పుడు:

ఇష్ట–అనిష్టాలు తగ్గుతాయి

ద్వంద్వాల ప్రభావం తగ్గుతుంది


అప్పుడు మాత్రమే:

భగవద్భక్తి స్థిరంగా ఉంటుంది.


---

ఉపనిషత్ ప్రతిధ్వని 📖

కఠోపనిషత్ (1.2.24)

> “నావిరతో దుశ్చరితాత్…”



అంటే:

మనస్సు శుద్ధి లేకుండా
ఆత్మజ్ఞానం సాధ్యం కాదు.

గీతా ఇక్కడ అదే విషయాన్ని చెబుతోంది.


---

తత్త్వసారం

ఈ రెండు శ్లోకాలలో ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం ఉంది:

1️⃣ ఇచ్ఛా + ద్వేషం → ద్వంద్వమోహం
2️⃣ ద్వంద్వమోహం → అజ్ఞానం
3️⃣ పుణ్యకర్మ → చిత్తశుద్ధి
4️⃣ చిత్తశుద్ధి → స్థిర భక్తి
5️⃣ స్థిర భక్తి → జ్ఞాన మార్గం


---

ఆధునిక అన్వయం 🌿

మనుషుల జీవితంలో ఎక్కువ సమస్యలు బాహ్య ప్రపంచం వల్ల కాదు. “నాకు ఇది కావాలి” లేదా “ఇది నాకు వద్దు” అనే మనస్సు ప్రతిస్పందనల వల్లే ఎక్కువ కలతలు వస్తాయి. మనస్సు ఈ ద్వంద్వాల ప్రభావం నుండి కొంచెం బయటపడినప్పుడు మాత్రమే లోపల ప్రశాంతత మొదలవుతుంది. అదే ఆధ్యాత్మికతకు ద్వారం. 🧘‍♂️


---

చివరగా ఒక చిన్న నిజం, 

మనుషులు సాధారణంగా ఇలా అనుకుంటారు:

“ప్రపంచం నన్ను బాధిస్తోంది.”

గీతా మాత్రం నిశ్శబ్దంగా చెబుతోంది:

“ప్రపంచం కాదు.
నీ ఇష్ట–అనిష్టాలే నిన్ను తిప్పేస్తున్నాయి.”

అవి కాస్త తగ్గితే…
సత్యం కనిపించడానికి పెద్ద అడ్డంకి ఉండదు.         *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 
 [4/2, 07:46] +91 94924 83092: Health is Wealth
Bottle gourd is more than a summer vegetable. It is rich in water and potassium, helping the kidneys flush waste gently without extra strain. Unlike packaged drinks, it supports hydration without added sugar or sodium. Its mild nature supports steady urine flow and reduces toxin build-up. Lightly cooked bottle gourd or fresh juice can quietly support kidney health, especially during hot weather.
[4/2, 16:40] +91 86390 01803: 

*ఆరోగ్యమే సంపద*
*సీసా పొట్లకాయ వేసవి కూరగాయ కంటే ఎక్కువ. ఇందులో నీరు మరియు పొటాషియం పుష్కలంగా ఉన్నాయి, మూత్రపిండాలు అదనపు ఒత్తిడి లేకుండా వ్యర్థాలను సున్నితంగా ఫ్లష్ చేయడంలో సహాయపడతాయి. ప్యాక్ చేసిన పానీయాల మాదిరిగా కాకుండా, ఇది చక్కెర లేదా సోడియం జోడించకుండా ఆర్ద్రీకరణకు మద్దతు ఇస్తుంది. దీని తేలికపాటి స్వభావం స్థిరమైన మూత్ర ప్రవాహానికి మద్దతు ఇస్తుంది మరియు టాక్సిన్ నిర్మాణాన్ని తగ్గిస్తుంది. తేలికగా వండిన పొట్లకాయ లేదా తాజా రసం మూత్రపిండాల ఆరోగ్యానికి, ముఖ్యంగా వేడి వాతావరణంలో నిశ్శబ్దంగా సహాయపడుతుంది.*
 గుండెలన్నీ బండలై 
ఉండిపోయే క్షణాలే 
మండిపోతున్న భూమిలో 
ఎండిపోయెను మమతలు

యుద్ధమంటే  అక్షరాలా?
ఆధిపత్యాలు  నక్షరాలా?
అందరూ ఉట్టి వీక్షకులా?
అమాయకులకు శిక్షలా?

కూలదోసినవి తిరిగి 
కట్టగలరా క్షణంలో?
కట్టుబట్టలతో మిగిలిన 
కన్నీటి బ్రతుకుల రక్షణేది?

కొన్ని కుటిల తంత్రాలకు 
ఎన్ని జటిల సమస్యలు?
మిన్ను విరిగి మీద పడితే 
మన్నుకేది మనుగడ?

అడుగడునా విధ్వంసం 
అణ్వాయుధాల ప్రభావం 
అడలి పోవును జీవజాలం 
అల్లాడిపోవును భూతలం

విచక్షణ లేని వర్తన చూసి 
విచలితమై పోతివా?
వినలేవా ఆర్తనాదాల వినతులు 
కనలేవా కృపను జగతిని..🙏

కర్మసాక్షికి నివేదనగా 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏
 కాఫీ కబుర్లు సంఖ్య 1148 (ఏప్రిల్ 01 - 2026) -- హేపీ ఏప్రిల్ -- కొత్త ఆంగ్ల సంవత్సరం 2026లో అపుడే నాలుగవ నెల ఐన ఏప్రిల్ లో ప్రవేశించిన సందర్భంగా ఏప్రిల్ కబుర్లు సరదాగా చెప్పుకుందాం.  కొన్ని విశేషతలు ప్రత్యేకతలు కలగలిపిన మాసం ఏప్రిల్.  భారతదేశ రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ లోనే జన్మించారు.  తోబుట్టువులు దినోత్సవంతో పాటు మరికొన్ని ఇతర important days ఈ నెలలో ఉన్నాయి.  ఇది వసంత ఋతువులో ఓ భాగం.  ఏప్రిల్ పూలు వెదజల్లింది, మే (నెల) పూలు తెచ్చింది.. అని ఓ పాత సామెత ఉంది.  ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది ఈరోజునే అంటే ఎప్రిల్ 1 వ తారీఖు నాడే.  పాఠశాల కళాశాల విద్యార్థులకు పెద్ద పరీక్షలు అయ్యాక సుమారు రెండు నెలలు వేసవి సెలవులు మొదలయ్యేది ఏప్రిల్ లోనే.  ఏప్రిల్ & మే  మండుటెండల మాసాలు..  పూర్తి వేసవిలో వస్తాయి గనుక.  ఇక ఈరోజు ఏప్రిల్ 1న ఆల్ ఫూల్స్ డే అంటారు.  చిలిపి సరదా ఆటపట్టించే పనులు ఈరోజున చేయడం పరిపాటి.  ఇది ఎక్కువగా పిల్లల్లో యువతరంలో కనిపించేది ఆరోజుల్లో.  1964లో బిశ్వజీత్ సైరాబాను హీరో హీరోయిన్లుగా వచ్చిన హిందీ హిట్ చిత్రం ఏప్రిల్ ఫూల్.  శంకర్ జైకిషన్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ తో సహా అన్ని పాటలు సూపర్ హిట్సే.  యీ ఏప్రిల్ ఫూల్స్ డే సంస్కృతి రెండు శతాబ్దాల క్రితం రోమన్ లో మొదలై అన్ని దేశాలకు పాకింది.  లవ్వర్స్ కూడా ఒకరికొకరు ఫూల్స్ చేసుకుంటూ ఈరోజు గడుపుతారు.  నా రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టింది యీ ఏప్రిల్ ఒకటినే (1971).  ఈవిధంగా ఈరోజు నాకు ఓ memorable day.  ఆంగ్లంలో ఓ చిన్న సరదా కథ.. Am I a fool.. అని రాశాను.  గానీ ఎవ్వరికీ చూపించలేదు ధైర్యం చాలక.  కొన్నాళ్ళ తరువాత మా ఆంగ్ల లెక్చరర్ అవసరాల రామకృష్ణారావు గారికి చూపిస్తే రెండు మూడు చిన్న సవరణలు చేసి బాగుంది అని చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది.  క్రమంగా సినీ అడ్వాన్స్, స్క్రీన్, కారవాన్, విజయచిత్ర, హాసం, తెలుగు వెలుగు పత్రికలలో నా ఉత్తరాలు, అభిప్రాయాలు నేను పంపినవి వచ్చాయి.  1991-92 ప్రాంతాల్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆంగ్ల దినపత్రికలో ఓ 15 వరకు నా లెటర్స్ వేసేరు.  1978-79 లలో రెండు విఫల ప్రేమకథలు కూడా రాసి ఉంచుకున్నాను.  గానీ ఏ పత్రికకి పంపలేదు.  ఇవి ఏప్రిల్ & ఏప్రిల్ ఒకటి ప్రత్యేకతలు.  అన్నట్లు .. రాజేంద్ర ప్రసాద్, శోభన నటించిన.. ఏప్రిల్ 1 విడుదల.. సినిమా 90వ దశకంలో వచ్చింది.  ఏప్రిల్ ఫూల్ సరదాలు ఇప్పుడు అంతగా లేవు.  ఈతరం వాళ్ళకి అంతగా తెలియక పోవచ్చు కూడా.  ఎవర్ హేపీ మంత్ గా యీ ఏప్రిల్ మనందరికీ ఉండాలని కోరుకుందాం..  ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
 కొన్ని విషయాలు ఎంత వద్దనుకున్న వినిపిస్తాయి. 
కొన్ని దృశ్యాలు ఎంత కాదనుకున్న కనిపిస్తాయి. 
వాటిని మనసు వరకు చేరవేయాలా లేదా అన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. 
              😊🙏🏻
చిన్నబోయిన మదికి 
చిన్ని మెప్పుల మాటలా 
వన్నె తరిగిన మోమున 
వెన్నెల వాన కురిసేలా....

వెతల చీకటికి 
వెలుగుల ధారలా...
వీడని నీడలు 
వెరచి పారిపోయేలా...

రేయిని ఆగిన 
తలపుల వాగుకు 
తలుపులు తీసి కమ్మని 
హాయిని దారిగా చూపేలా...

తీరము చెప్పిన 
తీరని కోరికలేవో 
తీరికగా విని 
తీర్చే మాటను ఇచ్చేలా..

మూగిన మబ్బుల 
దాటుకు వచ్చి 
ఆగిన కిరణపు కాంతికి 
దాగిన చీకటి తోక ముడిచేలా

తోసుకు వచ్చిన వెలుతురులో 
మనకై వచ్చిన వేడుకగా 
మోసుకు వచ్చిన కానుకలన్నీ 
తీసుకుపొమ్మని  చెప్పే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏
 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


               *తన కోపమే ..*
                ➖➖➖✍️
```

*”కోపం అనేది ఎదుటివారిని చంపాలని.. మనం తాగే 'విషం' వంటిది..”

*“కృష్ణుడు చెప్పిన అద్భుతమైన జీవిత సత్యం:

“కోపం: ఆత్మను దహించే అగ్ని!

*శ్రీకృష్ణుడి జీవన పాఠం.. 
మనలోని అంతర్గత శత్రువులను ఎలా జయించాలో బోధించారు..

“మానవ భావోద్వేగాలలో అత్యంత శక్తివంతమైనది, ప్రమాదకరమైనది 'కోపం'

“కోపం అనేది ఒక ఆయుధం కాదు, అది ఒక ఆత్మహత్య సదృశ్యమైన చర్య.."

*“విషంతో పోలిక (The Poison Analogy)

“మనం ఎవరి మీదైనా కోప్పడితే అది వారికి నష్టం కలిగిస్తుందని భ్రమిస్తాం. 
కానీ నిజానికి, ఎదుటివాడు చావాలని కోరుకుంటూ మనం విషం తాగడం ఎంతటి మూర్ఖత్వమో, కోపం కూడా అంతే. 
ఆ విషం మొదట మన రక్తాన్ని, మన శాంతిని, మన ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తుంది.."

*“ముందుగా నిన్నే కాల్చేస్తుంది..

'అగ్ని దేనినైనా కాల్చాలంటే, అది మొదట ఎక్కడ పుట్టిందో ఆ కర్రనో లేదా వస్తువునో దహిస్తుంది. అలాగే కోపం కూడా:

*మానసికంగా: ఆలోచనా శక్తిని హరిస్తుంది. విచక్షణను కోల్పోయేలా చేస్తుంది.

*శారీరకంగా: రక్తపోటును పెంచి, మనసును అశాంతికి గురి చేస్తుంది.

*సామాజికంగా: బంధాలను చిన్నాభిన్నం చేస్తుంది.."

*"ప్రశాంతత కోసమే క్షమించాలి.."

"మనం అవతలి వారిని క్షమించాల్సింది వారి మీద ప్రేమతోనో, వారు గొప్పవారనో కాదు.. మన ప్రశాంతత కోసం. మన మనసు అనే తోటలో కోపం అనే కలుపు మొక్క ఉంటే, అక్కడ ఆనందం అనే పువ్వు వికసించదు. ఆ భారమైన కోపాన్ని వదిలేస్తేనే మనసు తేలికపడుతుంది.”

*కృష్ణుడి సందేశం - నిగ్రహంగా 

“శ్రీకృష్ణుడు శిశుపాలుడి విషయంలో వంద తప్పుల వరకు సహించి ఓర్పును ప్రదర్శించాడు. 
అది ఆయన బలహీనత కాదు, అది ఆయన నిగ్రహం. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం లేదా ఆ పరిస్థితి నుండి తప్పుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు.."


 *సారాంశం:

కోపం అనేది ఒక క్షణం పాటు వచ్చే పిచ్చితనం. ఆ క్షణంలో మనం తీసుకునే నిర్ణయాలు జీవితకాలం బాధను మిగిల్చవచ్చు. అందుకే, ఎదుటివారి తప్పులకు మనల్ని మనం శిక్షించుకోకుండా (కోపంతో రగిలిపోకుండా), ప్రశాంతతను ఆయుధంగా మార్చుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత.✍️```

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 మనసున నింపే మమతవై 
బ్రతుకును నడిపే తోvడువై 
పుడమిని పుత్తడి పూయగా 
పిలిచిన పలికే నేస్తం నీవే!

కాలం నీవే  కర్తవి నువ్వే 
కదిలే చక్రపు ఇరుసువి నువ్వే 
కరుకుగ తోచే కర్మలకు 
కర్తవు నీవే భర్తవు నీవే!

పూచే పూవుల రంగు నీవే 
ఊగే ఆకుల మెరుపు నువ్వే 
సాగే గాలికి  నేస్తం నువ్వే 
ఆగే బ్రతుకుల గమ్యం నువ్వే!

మాయల వలలు పరిచేది 
కన్నుల కలలు విరిచేది 
తెన్నులు తెలియక మార్చేది 
మిన్నుల నడిచే దైవం నువ్వే!

తప్పులు తెలిసీ చేసేస్తూ
గొప్పగ ఉన్నామనుకుంటే 
తిప్పలు పడక తప్పదని 
చెప్పక..నవ్వే దొరవి నువ్వే!

నువ్వే దైవం 
నీ రాకే ధైర్యం 
నీ చూపే సౌఖ్యం 
నీ కృపే భాగ్యం 

బ్రహ్మాండానికి  అండవి నువ్వే!
ఆదిదైవానికి వందనాలతో 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏
 Health is Wealth
White bread with butter and jam may taste good, but it offers very little nutrition. It has almost no fibre and is mostly refined flour, sugar and fat, which gives only short-term fullness. Avoid making it the first meal of the day. Choose a breakfast with better nutrition so the body stays satisfied longer and gets steady energy.
 ఈవ్యాసం తప్పక ఓపికతో చదవండి తెలుగు రాష్ట్రాల్లో  73% హిందువులు హిందు వ్యతిరేక శక్తులకే మద్ధతు ఇస్తున్నారు.

భారత్ టుడే సర్వేలో వెల్లడి

అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేది అధిక శాతం హిందువులే.!!

ఈ హిందువుల మాటలు ఉద్దేశాలు :-

1. అందరూ దేవుళ్ళు ఒకటే అంటారూ... వీళ్లు దగ్గర ఉండి చూసినట్లు.

2. అన్ని మతాల సారం ఒక్కటే అంటారు.. ఏదో  వీళ్ళు ప్రపంచ జ్ఞానులాగా.

3. అన్ని మత గ్రంధాలు చెప్పేది ఒకటే అని  బోధనలు చేస్తారు...  వీళ్ళేదో అన్ని గ్రంధాలు చదివినట్లు.

4. వాడి మతం వాడిది మన మతం మనది అందులో తప్పులు మనం ఎత్తి చూపకూడదు అని ఉచిత సలహా ఇస్తుంటారు... ఏదో పెద్ద  వేదాంతుల్లాగా. 

5. వాడు మన మతాన్ని తిడితే వాడి పాపాన వాడిపోతాడు అంటారు... ఏదో జ్ఞానుల్లాగ.

6. క్రైస్తవులు ప్రతి ఇంటికి వచ్చి మత ప్రచారం చేస్తూ యేసు ఒక్కడే దేవుడు మీరు రాళ్లకు రప్పలకు పూజిస్తే నరకానికి పోతారు అని మత ప్రచారం చేస్తే వాళ్ళ మతం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు మీకేంటి అని అనేవాళ్ళే ఎక్కువ.

7. క్రైస్తవుల ఇంటికి ప్రార్ధనకుకి వెళ్లి కేకులు బిర్యానీ తిని వస్తారు వాళ్ళు మన పూజకు రారు ప్రసాదం పెడితే తినరు దానికి ఈ సిగ్గులేని వెధవలు వాళ్ళు దేవుడిని నమ్ముకున్నారు అంటాడు వీళ్ళు దెయ్యాన్ని నమ్ముకున్నట్లు.

8. హిందువులను హిందు గ్రంధాలను హిందూ దేవుళ్లను తిట్టేవాళ్లను ప్రశ్నించిన హిందువులను నీకు మతపిచ్చి పట్టేసింది మతోన్మాదిలా తయారయ్యావు అని విమర్శిస్తారు.

9. హిందూ ధర్మం గొప్పతనాన్ని  ప్రచారం చేస్తుంటే (వీళ్ల అతితెలివితో) ఇలా అంటారు... ప్రచారం చేస్తున్నందుకు వీళ్ళకి పైనుంచి డబ్బులు వస్తున్నాయి అందుకే చేస్తున్నారు అని గుసగుసలాడుతారు.

10. పూర్తిగా అవగాహన లేకుండా హిందూ ధర్మం కోసం వీళ్ళే అసత్యాలు ప్రచారం చేస్తారు (ఉదా: కృష్టుడికి 16 వేలమంది భార్యలు).

11. స్వార్ధంతో రోజు గుడికెళ్లి ఆ దేవునికి అభిషేకాలు పొర్లు దన్నాలు పెడతారు అదే దేవుడిని వేరే మతం వారు తిడుతుంటే చేతకాని చవట దద్దమ్మ లాగా మనల్ని కాదన్నట్లు చూస్తూ ఉరుకుంటారు.

12. వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వీళ్లకు మంచి జరగకపోతే వ్యక్తిగత స్వార్థంతో హిందూ ధర్మాన్ని దూషించి మతం మారిపోతారు.

13). ధర్మం గురించి చెబుతుంటే... వీళ్లకి పనీపాటా లేదా, ఏం వస్తుంది వీళ్లకి? ఎప్పుడూ ధర్మం ధర్మం అని కొట్టుకుంటారు, ఈ టైంని సంపాదనకి వాడుకుంటే చాలా సంపాదించుకోవచ్చు, ఈ తెలివితేటలేవో డబ్బు సంపాదించడంలో చూపించుకోవచ్చుగా అని ఎద్దేవా చేస్తారు కానీ వాళ్లకేం తెలుసు ధర్మం బతికి ఉంటేనే సకల సంపదలు అనుభవించొచ్చని, లేదంటే పరాయి మతస్థుడికి బానిసగా బ్రతకాల్సిన గతి పడుతుందని?

ఈ సెక్యులర్ హిందువులు 
(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి నిజం తెలుసుకోండి 

గొప్పదైన నీ ధర్మాన్ని నీ దేశాన్ని కాపాడుకో. మేలుకోండి హిందువులారా! లేకపోతే కొన్ని రోజులు, కొన్ని ఏళ్ళ తర్వాత మీ పిల్లలకి పూర్వం హిందూమతం ఉండేది అనిచెప్పే పరి స్థితి వస్తుంది. ఇది మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తే మీ మీ గ్రూపులకు పంపగలరని సవినయముగా ప్రార్థిస్తూ
ఈ సెక్యులర్ హిందువులు 
(హిందూ ధర్మాన్ని నాశనం చేసేవారు) ఇప్పుడైనా మారండి నిజం తెలుసుకోండి.
ధన్యవాదములు 🙏🙏
🚩🚩ఇది మీరు అంగీకరిస్తారా? 🚩🚩
 మన జీవితంలో చాలా మందినీ మనం కలుస్తాం.. లేదా మనలను కలుస్తారు...
కొంతమంది మనల్ని ప్రేమిస్తారు.. కొంతమంది మనతో పాటు నడుస్తారు... కానీ...

ఇంకొంతమంది ఉంటారు... మన ముందొక మాట... చాటుకొక మాట... మనకు తెలియకుండానే మన కోసం గుంతలు తవ్వేవారు.

అలాంటి వారి గురించి మనం ఒకసారి ఆలోచించాలి... వాళ్లు నిజంగా జీవితంలో ఎదగగలరా...? స్పష్టంగా చెప్పాలంటే.. వారు ఎప్పటికీ ఎదగరు ఉన్నచోటే... ఉంటారు.

ఎందుకంటే జీవితం ఒక అద్దంలాంటిది.. మనము ఏమి ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది.

మనం నమ్మకద్రోహం చేస్తే... మనకు కూడా ఏదో ఒకరోజు అదే ఎదురవుతుంది. మనం వంచన చేస్తే.. మన జీవితంలో కూడా వంచన ఎదురవుతుంది.

నిజాయితీకి shortcut లేదు...
నమ్మకానికి duplicate లేదు...
మానవత్వానికి alternative లేదు.

మన ముందొక మాట... వెనక ఇంకో మాట మాట్లాడేవారు... వాళ్లు తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించవచ్చు... కానీ అది గెలుపు కాదు... అది ఒక మాయ.

ఎందుకంటే...
నిజం ఎప్పుడూ ఆలస్యంగా గెలుస్తుంది... కానీ ఖచ్చితంగా గెలుస్తుంది.

ఒక్కసారి మనం ఆలోచిద్దాం!
ఎవరైనా మన మీద నమ్మకం పెట్టుకున్నారు అనుకుందాం... ఆ నమ్మకాన్ని మోసం చేయడం అంటే... వారి హృదయాన్ని గాయపరచడం.

అది డబ్బుతో సరి చేయలేం..అది మాటలతో మానిపించలేం...
మన ప్రయాణం slow గా ఉండొచ్చు...కానీ clean గా ఉండాలి.

జీవితంలో పెద్ద విజయం అంటే ఏమిటో తెలుసా...?
👉 పెద్ద ఇల్లు కాదు,
👉 పెద్ద కారు కాదు,
👉 డబ్బు కాదు.
👉 మన గురించి ఇతరులు చెప్పే మాట...
“ఆ వ్యక్తి చాలా నిజాయితీ గలవాడు”
అదే అసలు విజయం.

కొంతమంది ఇలా అనుకుంటారు...
“చిన్న చిన్న అబద్ధాలు చెప్పినా ఏమవుతుంది..?” “కొంచెం మోసం చేస్తే ఎవరికీ తెలియదు…”
కానీ గుర్తుంచుకోండి...
మనకు తెలియకపోయినా... మన మనసుకు తెలుసు.ఆ మనసు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు.

మన జీవితంలో మనం కోల్పోయేది డబ్బు కాదు... మనిషి కోల్పోయేది నమ్మకం.
ఒక్కసారి నమ్మకం పోయిందంటే... మళ్లీ అది సంపాదించడం చాలా కష్టం.

అందుకే...
మనం ఎక్కడ ఉన్నా... ఎంత స్థాయిలో ఉన్నా... నిజాయితీని వదలకండి. నమ్మకాన్ని కాపాడండి. మనసును శుభ్రంగా ఉంచండి.

మరొక్కసారి చెబుతున్నాను...
నమ్మకద్రోహం చేసే వారు... వంచన చేసే వారు... మన ముందొక మాట, వెనక ఇంకో మాట మాట్లాడేవారు.
వాళ్లు కొంతకాలం shine అవుతారు...కానీ జీవితాంతం sustain అవ్వలేరు.

కానీ...
నిజాయితీగా నడిచేవారు. మనసు నిండా మంచితనంఉన్నవారు. ఇతరులకు మంచిని కోరుకునేవారు.
వాళ్లు slow గా ఎదుగుతారు... కానీ, strong గా నిలబడతారు.

మిత్రమా... చివరిగా ఒక మాట...

“జీవితంలో గెలవడం అంటే...ష ఇతరులను ఓడించడం కాదు... మన విలువలను కాపాడుకోవడం.”
మంచి మార్గంలో నడవండి... విజయం మీ వెంట వస్తుంది.🙏

శూన్యం నుండి సామ్రాజ్యం వరకు!

 *శూన్యం నుండి సామ్రాజ్యం వరకు!* (ఆధ్యాత్మిక కుటుంబం నేటి మోటివేషనల్ స్పెషల్ స్టోరీ)

*జపాన్ లోని ఒక చిన్న కుగ్రామం. అక్కడ ఒక సైకిల్ రిపేర్ షాపు. ఆ షాపులో ఒక చిన్న పిల్లోడు... ఒళ్లంతా గ్రీజు, మొహమంతా నల్లటి నూనె మరకలు. లోకం అతన్ని చూసి మురికి పిల్లోడు అని ఈసడించుకుంది. కానీ ఆ పిల్లోడికి మాత్రం యంత్రాల శబ్దం సంగీతంలా వినిపించేది. అతని పేరు సోయిచిరో హోండా.*

*హోండాకి చదువు అబ్బలేదు. స్కూల్ కి వెళ్తే పుస్తకాలు శత్రువుల్లా కనిపించేవి. కానీ ఒక ఇంజిన్ కనిపిస్తే చాలు, అతని కళ్లు అగ్ని కణికల్లా మెరిసేవి. 15 ఏళ్ల వయసులో ఊరు వదిలేసి టోక్యో వెళ్ళాడు. అక్కడ ఒక గ్యారేజీలో పనికి చేరాడు. వాడు పనివాడు కాదు, యంత్రాలతో యుద్ధం చేసే సైనికుడు. తిండి లేదు, నిద్ర లేదు... కేవలం యంత్రాలు, వాటి విడిభాగాలు!*

---------------------

*హోండాకి ఒక పిచ్చి ఉండేది... అదే 'పిస్టన్ రింగ్స్' తయారు చేయడం. తన దగ్గర ఉన్న డబ్బుని ఆ ప్రాజెక్ట్ మీద పెట్టాడు. తన భార్య దగ్గర ఉన్న బంగారాన్ని కూడా అమ్మేశాడు. గాలిని తిన్నాడు, నీళ్లు తాగి పడుకున్నాడు. రాత్రింబవళ్లు కష్టపడి పిస్టన్ రింగ్స్ తయారు చేసి, అప్పటికే దిగ్గజమైన 'టయోటా' కంపెనీకి పంపాడు.*

కానీ విధి వెక్కిరించింది! టయోటా ఇంజనీర్లు ఆ రింగ్స్ చూసి నవ్వుతూ తిప్పి పంపేశారు. "ఇవి నాసిరకం.. నువ్వు పనికిరావు" అని మొహం మీదే తలుపులేశారు. లోకం హోండాను చూసి నవ్వింది. "సొంత ఆస్తి పోగొట్టుకున్నావు, భార్య నగలు అమ్మేశావు, ఇప్పుడు రోడ్డు మీద పడ్డావు.. నీకు ఇది అవసరమా?" అని వెక్కిరించింది.

కానీ హోండా గుండెల్లో ఉన్నది రక్తం కాదు.. అది పట్టుదల! ఆ అవమానాన్ని భరించాడు. మళ్ళీ స్కూల్ కి వెళ్ళాడు, మళ్ళీ పరిశోధనలు చేశాడు. రెండేళ్ల పాటు నరకం చూశాడు. చివరకు టయోటా మేనేజ్‌మెంట్ దిగివచ్చి కాంట్రాక్ట్ ఇచ్చింది. గెలిచాడు అనుకునేలోపు అసలైన సినిమా మొదలైంది.

టయోటాతో కాంట్రాక్ట్ కుదిరింది, ఫ్యాక్టరీ కట్టాడు. సరిగ్గా అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆకాశం నుండి అమెరికా బాంబులు నిప్పులు కురిపిస్తున్నాయి. హోండా ఫ్యాక్టరీ మీద ఒక బాంబు పడింది. కళ్లముందే కట్టిన సామ్రాజ్యం కుప్పకూలింది.

అతను ఏడ్చాడా? లేదు! "బాంబులు పడితే పడ్డాయి.. ఆ విమానాల నుండి కింద పడే ఇంధన డబ్బాలను ఏరుకుని రండి.. వాటితో కొత్తవి తయారు చేద్దాం" అన్నాడు. అది హోండా రేంజ్! కానీ విధి ఇంకా అతనితో ఆడుకుంటూనే ఉంది. ఒక భారీ భూకంపం వచ్చింది. మిగిలిన కొద్దిపాటి ఫ్యాక్టరీ కూడా నేలమట్టమైంది.

చేతిలో ఏమీ లేదు.. కేవలం శిథిలాలు తప్ప. హోండా ఆ శిథిలాల మీద నిలబడి గర్జించాడు. తన పిస్టన్ రింగ్స్ ఫార్ములాను టయోటాకి అమ్మేసి, తన మనుషులకు జీతాలు ఇచ్చి, శూన్యంలోకి నడిచాడు.

-------------------

యుద్ధం తర్వాత జపాన్ అనాథలా మారింది. తిండి లేదు, ప్రయాణించడానికి వాహనాలు లేవు. గ్యాసోలిన్ (పెట్రోల్) దొరకడం గగనమైపోయింది. అందరూ అప్పుల గురించి, చావుల గురించి ఆలోచిస్తుంటే.. హోండా మాత్రం ఒక అద్భుతం గురించి ఆలోచించాడు.

అతని దగ్గర ఒక పాత రేడియో ఇంజిన్ ఉంది. దాన్ని తీసుకుని తన సైకిల్‌కి తగిలించాడు. అది మొట్టమొదటి హోండా మోటార్ సైకిల్! ప్రజలకు అది ఒక ఆశాకిరణంలా కనిపించింది. అందరూ తమ సైకిళ్లకి ఇంజిన్లు పెట్టమని క్యూ కట్టారు. కానీ ఇంజిన్లు తయారు చేయడానికి అతని దగ్గర ఒక్క పైసా కూడా లేదు.

హోండా ఏం చేశాడో తెలుసా? జపాన్ లోని 18,000 మంది సైకిల్ షాపు యజమానులకు ఒక ఉత్తరం రాశాడు. "మన దేశాన్ని మళ్ళీ నిలబెడదాం.. నాకు పెట్టుబడి ఇవ్వండి, మీకు అద్భుతమైన మోటార్ సైకిల్ ఇస్తాను" అని! ఆ ఉత్తరంలో ఉన్న 'కసి'ని చూసి దాదాపు 5,000 మంది పెట్టుబడి పెట్టారు. హోండా సామ్రాజ్యం మళ్ళీ మొదలైంది!

--------------

హోండా తయారు చేసిన బైకులు మొదట్లో ఫెయిల్ అయ్యాయి. కానీ అతను వెనక్కి తగ్గలేదు. "99 శాతం వైఫల్యం తర్వాతే ఒక శాతం విజయం ఉంటుంది" అనేది అతని సిద్ధాంతం. చివరకు 'సూపర్ కబ్' అనే బైక్ తెచ్చాడు. అది ఒక సంచలనం!

కానీ హోండా లక్ష్యం జపాన్ కాదు.. ప్రపంచం! "ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రేసింగ్ పోటీ అయిన 'ఐల్ ఆఫ్ మ్యాన్'లో నా బైక్ గెలవాలి" అని శపథం చేశాడు. అందరూ నవ్వుకున్నారు.. "నీ డబ్బా బైకులతో అంతర్జాతీయ రేసుల్లో గెలుస్తావా?" అని.

1959లో హోండా టీమ్ రేసులో దిగింది. మొదటిసారి ఓడిపోయింది. కానీ రెండేళ్ల తర్వాత.. 1961లో... హోండా బైకులు 1, 2, 3, 4, 5 స్థానాలను కైవసం చేసుకుని ప్రపంచం నోరు మూయించాయి. ఇటలీ, బ్రిటన్, జర్మనీ దేశాల హేమాహేమీలు హోండా కాళ్ల దగ్గర వంగి సలాం కొట్టారు.

హోండా నమ్మిన సూత్రాలు తెలుసా?

నేను చూసిన విజయాలు కేవలం 1 శాతం మాత్రమే. నా మిగిలిన 99 శాతం జీవితం కేవలం వైఫల్యాల సమాహారం. కానీ ఆ వైఫల్యాలే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టాయి!

నీ కల నీకు నిద్ర పట్టకుండా చేస్తోందా? అయితే నువ్వు సరైన దారిలో ఉన్నావు. నీ కలే నీకు ఆహారం కావాలి, నీ కలే నీకు శ్వాస కావాలి!

ప్రపంచం నిన్ను అడ్డుకుంటోందా? బాంబులు వేస్తోందా? భూకంపాలు తెస్తోందా? రానివ్వు! ఆ శిథిలాల మీద నిలబడి నీ సింహాసనాన్ని నిర్మించుకో. అదే అసలైన యోధుడి లక్షణం!

ఇదంతా చదివావు కదా..

ఈ కథ చదివి మళ్ళీ ఫోన్ పక్కన పడేసి నిద్రపోతావా? లేక హోండాలాగా నీ కలల కోసం యుద్ధం మొదలుపెడతావా?

నీ దగ్గర డబ్బు లేదా? హోండా దగ్గర కూడా లేదు.
నీకు అవమానాలు ఎదురవుతున్నాయా? హోండాను టయోటా తరిమికొట్టింది.
నీ వ్యాపారం దెబ్బతిన్నదా? హోండా ఫ్యాక్టరీ మీద బాంబులు పడ్డాయి.

మరి నీకున్న సాకు ఏంటి? భయమా? ఆ భయాన్ని చంపేయ్. నీలో ఉన్న 'బర్నింగ్ ఫైర్' ని బయటికి తీయ్. ఈ క్షణమే నీ పని మొదలుపెట్టు. చరిత్ర నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు చరిత్ర సృష్టించే పనిలో ఉండాలి.

లే! గర్జించు! పని మొదలుపెట్టు!

- నల్లమోతు శ్రీధర్.          *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 
 బ్రాహ్మణుడి సంపదను దొంగిలించడం వల్ల బ్రహ్మరాక్షసుడు జన్మిస్తాడు,

రత్నాలను దొంగిలించేవాడు నీచ జాతిలో పుడతాడు,

ఆకులు మరియు సుగంధ ద్రవ్యాలను దొంగిలించేవాడు పుట్టుమచ్చగా పుడతాడు.

అదేవిధంగా, ధాన్యాలను దొంగిలించేవాడు ఎలుక అవుతాడు,

వాహనాలను దొంగిలించేవాడు ఒంటె అవుతాడు,

పండ్లను దొంగిలించేవాడు కోతి అవుతాడు.

మంత్రాలు పఠించకుండా తినేవాడు కాకి అవుతాడు.

గృహోపకరణాలను దొంగిలించేవాడు రాబందు అవుతాడు,

తేనెను దొంగిలించేవాడు తేనెటీగ అవుతాడు,

పండ్లను దొంగిలించేవాడు రాబందు అవుతాడు,

ఆవులను దొంగిలించేవాడు మానిటర్ బల్లి అవుతాడు,

అగ్నిని దొంగిలించేవాడు హెరాన్ అవుతాడు.

(గరుడ పురాణం, 453).     *ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 
 "సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికం కల్పాక్షయే"

అన్ని జీవులు నాలో భాగాలు మరియు ఎల్లప్పుడూ నాలోనే నివసిస్తాయి. అయితే, ప్రకృతి మరియు ప్రకృతి పనులు, శరీరం మొదలైన వాటితో గుర్తింపు (నేను-నా సంబంధం) ద్వారా అవి ఏ చర్యలు చేసినా, అవి ఆ చర్యలతో మరియు వాటి ఫలితాలతో అనుసంధానించబడి, వాటిని మళ్లీ మళ్లీ పుట్టి చనిపోయేలా చేస్తాయి. మహా జలప్రళయ సమయం వచ్చినప్పుడు (బ్రహ్మ వంద సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత కరిగిపోతాడు), ప్రకృతిపై ఆధారపడిన అన్ని జీవులు, నా స్వభావంలో కలిసిపోతాయి, వాటి ప్రకృతి-జన్మించిన సంబంధాలను, అంటే వాటి సంబంధిత చర్యలను తీసుకుంటాయి. మహా జలప్రళయ సమయంలో జీవులు ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాయో, అవి ఆ స్వభావంతో మహా జలప్రళయంలో కలిసిపోతాయి.
(శ్రీమద్ భగవద్గీత, 637)
బ్రహ్మ యొక్క ఒక రోజును 'కల్పం' అంటారు, ఇది వెయ్యి మానవ చతుర్యుగాలకు సమానం. బ్రహ్మ యొక్క ఒక రాత్రి అదే పొడవు ఉంటుంది. దీని ప్రకారం, బ్రహ్మ జీవితకాలం వంద సంవత్సరాలు.        *ఆధ్యాత్మిక కుటుంబం 4*
 శ్రీమద్భగవద్గీతా శ్లోకాలు 7.5–6 — విశ్లేషణ

శ్లోకం 7.5

> అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥


అర్థం:
ఇంతకుముందు చెప్పినది నా అపరా ప్రకృతి. దాని కన్నా వేరైన నా పరా ప్రకృతిని తెలుసుకో. అది జీవరూపంగా ఉంది; దాని వల్లే ఈ జగత్తు నిలుస్తోంది.

శంకరభాష్య సారం

“అపరా” — అష్టవిధ జడప్రకృతి.

“పరా” — చైతన్యరూప జీవశక్తి.


శంకరుల ప్రకారం,
ఈ పరా ప్రకృతి అంటే చైతన్యస్వరూప ఆత్మ.
అదే జీవరూపంగా వ్యక్తమవుతోంది.

అపరా ప్రకృతి జడము.
పరా ప్రకృతి చైతన్యము.

జగత్తు కేవలం భౌతిక మూలకాలతో నిలబడదు.
చైతన్యం లేకపోతే శరీరం మట్టిపొత్తే.

అంటే — జీవశక్తే ఆధారం.


---

శ్లోకం 7.6

> ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥


అర్థం:
ఈ రెండు ప్రకృతులే సమస్త భూతాల యోని (కారణం) అని గ్రహించు. నేను సమస్త జగత్తుకి ఉద్భవమూ, లయమూ.

శంకర వ్యాఖ్యానం

ఇక్కడ స్పష్టంగా బ్రహ్మతత్త్వం ప్రకటించబడింది.

అపరా + పరా — రెండూ పరమాత్మ ఆధీన శక్తులు.

బ్రహ్మమే కారణం.


శంకరుల ప్రకారం,
బ్రహ్మమే ఉపాదాన కారణం (material cause) కూడా,
నిమిత్త కారణం (efficient cause) కూడా.

ఉదాహరణ:
మట్టితో కుండ తయారవుతుంది.
మట్టి లేకపోతే కుండ లేదు.

అలాగే బ్రహ్మ లేకపోతే జగత్తు లేదు.


---

తత్త్వసారము

జగత్తు రెండు శక్తుల సమన్వయం:
జడ + చైతన్య.

కానీ రెండూ బ్రహ్మాధీనమే.
అందువల్ల పరమాత్మే ఆది, అంతం.

ఇది ద్వైతంగా కనిపించినా,
ఆధారం మాత్రం ఏకమే.


---

ఉపనిషత్ ఆధారం 📖

ఛాందోగ్య ఉపనిషత్ (6.2.1):
“సదేవ సోమ్య ఇదమగ్ర ఆసీత్”
మొదట సత్ మాత్రమే ఉంది.

తైత్తిరీయ ఉపనిషత్ (3.1):
“యతో వా ఇమాని భూతాని జాయంతే…”
అన్నీ యేన జనించాయి, యేన జీవిస్తున్నాయి, యస్మిన్ లయమవుతున్నాయి — అదే బ్రహ్మ.



---

ఆధునిక అన్వయం 🌿

మన జీవితంలో బాహ్య వనరులు (అపరా) ఉన్నా, అంతర్గత చైతన్యం (పరా) లేకపోతే అర్థం లేదు. అసలు శక్తి బయట కాదు, లోపలే ఉంది. దాన్ని గుర్తిస్తే దృష్టికోణం మారుతుంది. 🧘‍♂️✨

ఇప్పుడు గీతా మరింత స్పష్టంగా చెబుతుంది —
ఈ జగత్తంతా ఒకే పరమాధారంపై నిలబడి ఉందని.

నిజంగా చూస్తే, ఇదే మోక్షానికి బేస్ మ్యాప్.

[🚨NOTE: ఇక్కడ ఈ సందర్భంలో బ్రహ్మ/బ్రహ్మము అంటే శాశ్వత చైతన్యానికి చెందిన నిరాకార, నిర్గుణ, నిర్వికల్ప, నిరంజన, నిర్ద్వైత, నిరాధార, అక్షయ తత్త్వం అని అర్థం. ఇది మనం వ్యవహారికంగా చెప్పుకునే చతుర్ముఖ బ్రహ్మ కాదు.].           *ఆధ్యాత్మిక కుటుంబం 4*