Tuesday, January 13, 2026

 *సుఖ_రోగాలు_సమస్య_కు_అవగాహనా_కోసం_ _సలహాలు*
 
       ఈ రోగాలు చెడు వ్యసనాల వలననే కాక ఆ రోగులు మూత్ర విసర్జన చేసిన చోట ఆరోగ్యవంతులు మూత్ర విసర్జన  చేయడం వలన, వారి దుస్తులను ధరించడం వలన కూడా వస్తాయి.
 
       వీటిలో తెల్ల సెగ, పచ్చ సెగ, అడ్డగర్రలు (గజ్జల్లో గడ్డలు ) మొదలైన రకాలుంటాయి.
మూలబంధనం:-- పద్మాసనం   వేసుకొని ఆసనాన్ని గట్టిగా బంధించాలి.
 
ఉడ్యానబంధనం, ఉదరచాలనం , కపాలభాతి ప్రాణాయామం  చెయ్యాలి.
 
        ఈ వ్యాధి వున్న వాళ్లకు జననాంగము నుండి పసుపు పచ్చని ద్రవం లేక, తెల్లని ద్రవం,లేక  ఎర్రని ద్రవం కారుతూ వుంటుంది.
 
  *1.- #అడ్డగర్రలు_నివారణ*
 
        గజ్జల్లో పెద్ద పెద్ద గడ్డలు వాచి ఉండడాన్ని అడ్డగర్రలు అంటారు.
 
తులసి ఆకుల చూర్ణము
నల్ల ఉమ్మెత్త ఆకుల చూర్ణము
గాడిదగడపాకు చూర్ణము
 
        అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని నిల్వ చేసుకోవాలి.
 
        అవసరమైనంత పొడిని నీటితో కలిపి మెత్తగా నూరి గడ్డలపై పట్టు వేస్తే కరిగి పోతాయి.
 
  2.- *సెగరోగము(#గనేరియా)నివారణ*
 
#లక్షణాలు:--  మూత్రవిసర్జనలో మంట, శరీరమంతా విపరీతమైన మంటలుగా వుండడం, జననాంగము నుండి   పసుపు పచ్చని ద్రవం కారడం, మగవాళ్ళకు జననాంగము చివర ద్రవము అతుక్కొని మూత్ర విసర్జన సమయంలో చాలా బాధగా వుంటుంది.
 
లక్ష్మితులసి సమూలం ఎండబెట్టి దంచిన పొడి      ---  మూడు వేళ్ళకు వచ్చినంత
          కలకండ            ----తగినంత
     రెండింటిని కలిపి నాలుకతో అద్దుకొని చప్పరించాలి.

  3.-  *ముదిరిన_పచ్చ_సెగరోగము_నివారణ*

తులసి గింజల పొడి
సబ్జా గింజల పొడి
మంచి గంధం
మిరియాల పొడి
రేవల చిన్ని పొడి
ఉసిరిక పొడి

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి .

     అర టీ స్పూను పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. దీనితో ఎంతో కాలంగా వున్న రోగామైనా నివారింప  బడుతుంది. 
 *ఎర్రని_తెల్లని_సెగరోగం_నివారణ*

తులసి ఆకులు   -----  50 gr
పమిడి (పైడి) పత్తి ఆకులు             -----  50 gr
బియ్యం కడిగిన నీళ్ళు                  -----  50 gr
మేడి చెట్టు ఆకులు                      -----  50 gr
పిప్పళ్ళు       -----  50 gr
మిరియాలు       ----- 50 gr
లవంగాల   ----- 50 gr
జాజికాయ        ----- 50 gr
జాపత్రి          ----- 50 gr

         అన్నింటిని రోట్లో వేసి దంచి ముద్దగా అయ్యేంత వరకు నూరాలి.  రేగిపండు గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి , బాగా ఎండిన తరువాత సీసాలో భద్రపరచాలి.

         ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకోవాలి.

#పద్యం_చాలా_ముఖ్యం:--   కందిపప్పు, నెయ్యి, అన్నం కలుపుకొని తినాలి. పప్పులో ఉప్పు వేసుకోకూడదు.

15 రోజుల తరువాత వేయించిన ఉప్పు వేసుకోవచ్చు.

 *5.-#గనేరియా_తీవ్రత_నివారణకు_నవీన్_సలహాలు*                                                         .
       ఇది ఎక్కువగా పురుషులలో వస్తుంది. పురుష మర్మాంగానికి వస్తుంది. ఇది  అంటువ్యాధి   ఇది బ్యాక్టీరియా  ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక,  మరియు  ఇతర లోపాల వలన వ్యాపిస్తుంది.
 మంటలు,  దురదలతో ప్రారంభమై   ఐదారు  వారాల తరువాత బయట పడుతుంది.  చివరి భాగం పెద్దదయి,  వాఛి  బుడ్డ లాగా  తయారై మంట  గా  వుంటుందికూడా ,  నడవలేక పోతారు.  ఈ సమస్య తీవ్రమైతే  కీళ్ళ నొప్పులు వస్తాయి,  మోకాళ్ళలో చీము పట్టి పుండ్లు  రావడం జరుగుతుంది.

ఉసిరిక పొడి     --- 100 gr
కరక్కాయ పొడి   --- 100 gr
తాని కాయ పొడి          --- 100 gr
 
       కలిపి నిల్వ చేసుకోవాలి.
 
       రెండు టీ స్పూన్ల పొడిని రెండు కప్పుల నీటిలో వేసి కాచి ఆ కషాయం తో  మర్మాంగాన్ని రోజుకు రెండు సార్లు  కడగాలి.

త్రిఫల చూర్ణం   --- 100 gr
తుంగ ముస్తల చూర్ణం   ---    50 gr
నీళ్ళు   ---  రెండు గ్లాసులు
 
        రెండు చూర్నాలను కలిపి నిల్వ చేసుకోవాలి.
 
        రెండు టీ స్పూన్ల పొడిని  రెండు గ్లాసుల నీటిలో వేసి కషాయం కాచాలి.  బొటన వేలంత సైజులో వున్నా తిప్ప  తీగ ముక్కను నీటిలో వేసి కాచాలి. దించి బాగా పిసకాలి. ఆ విధంగా చేయడం వలన నీళ్ళ అడుగున తిప్పసత్తు  మిగులుతుంది.  నీటిని వంచేసి మిగిలిన తిప్ప సత్తును   అంతకు ముందు కాచిన త్రిఫల,  తుంగ గడ్డ ల కషాయానికి   కలిపి  తీసుకోవాలి.
 
*తీసుకోవలసిన_జాగ్రత్తలు :--* అంగ శుద్ధి,  వస్త్ర శుద్ధి,  స్నానం,  ఆహారం  విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. గిట్టని పదార్ధాలు వాడకూడదు. పచ్చి మిరిచి,  వంకాయ, గోంగూర, శనగ పిండి, మైదా వాడకూడదు.
*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
 *ప్రాణాన్ని_నిలబెట్టే_ఆస్పిరిన్_ట్యాబ్లెట్లు_ప్రతి_ఇంట్లో_ఉండాల్సిందే_వీటితో_మరిన్ని ఉపయోగాలు*
*అవగాహనా కోసం  సలహాలు* 
   
         ఆస్పిరిన్ అన్న పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది గుండె పోటే. గుండె పోటు రాగానే ఆస్పిరిన్ వేసుకోవాలని అనుకుంటారు. కానీ అంతకుమించి ఆస్పిరిన్ తో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఔషధాలలో ఇవీ ఒకటి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే ఎవరికైనా గుండె పోటు వచ్చిన వెంటనే వైద్యులు సైతం రోగికి ఆస్పిరిన్ అందిస్తారు. అయితే మీరు ఆస్పిరిన్ తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.  ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. దీినలో సాలిసైలేట్ ఉంటుంది.అందుకు నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇది స్టెరాయిడ్ కాదు కానీ కొన్ని స్టెరాయిడ్ మందుల వల్ల కలిగే ప్రయోజనాలను కలిగి ఉంటుంది. 

*#ఆస్పిరిన్_ప్రయోజనాలు*
1. తలనొప్పి, జలుబు, కాళ్ల బెణుకులు, కీళ్ల నొప్పులు, మైగ్రేన్, రుతుసమయంలో వచ్చే తిమ్మిరి నొప్పి వంటి వాటికి ఆస్పిరిన్ బాగా పనిచేస్తుంది. 
2. అందరికీ తెలిసినట్టే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే వైద్యుని సలహాతోనే దీన్ని వాడాలి. 
3. ఇది రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటుంది. రక్తాన్ని పలుచగా మార్చి గుండె వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది. 
4. వైద్యులు సాధారణంగా రక్తనాళాల వ్యాధి, హైబీపీ, డయాబెటిస్, స్మోకింగ్, అధిక కొలెస్ట్రాల్ వంటి వాటికి కూడా ఆస్పిరిన్ చక్కగా పనిచేస్తుంది. 
5. గుండెపోటుకు సంబంధింది కరోనరీ సమస్యలను నివారించడంలో ఆస్పిరిన్ మేలు చేస్తుంది. 
6. ఆస్పిరిన్ ఆర్ధరైటిస్, కీళ్ల వాపు, లూపర్, గుండె చుట్టూ వాపు రావడం వంటి ఆరోగ్య పరిస్థితులలో కూడా ఆస్పిరిన్ ను ఉపయోగిస్తారు. 
7. ఎంత డోసు వేయాలన్నది వైద్యులను అడిగి తెలుసుకోవాి. 75 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీ గ్రాముల వరకు తక్కువ మోతాదులో వాడమని సూచిస్తారు. ఈ డోసు గుండె పోటు నివారించడానికి సరిపోతుందAAsదానికీ...
ఆస్పిరిన్ మాత్రల్లో సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. రెండు ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు పొడి చేసి అందులో కాస్త నీళ్లు కలిపి మొటిమలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల వల్ల కలిగే బాధ తగ్గుతుంది. ఎరుపుదనం, చీము పట్టడం వంటివి కలగవు. మొటిమలకు అప్లయ్ చేశాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
 *దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య_కి_ఆయుర్వేద_పరిహారం  సలహాలు*

              ఆయుర్వేదం ప్రకారం, మలబద్ధకం అనేది శరీరంలో వాత దోషం పెరగడం వల్ల కలిగే సమస్య ..నివారించడానికి, వాత దోషాన్ని తగ్గించే ఆహారం మరియు జీవనశైలిని అనుసరించడం ముఖ్యం.

🌱🌱. #ఆహారం_జీవన_శైలి_మార్పులు 🌱🌱

🦚 ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలయిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, నట్స్ మరియు గింజలు ఉన్నాయి.

🦚 ప్రతిరోజూ 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.

🦚 కెఫిన్ మరియు ఆల్కహాల్ తక్కువగా తీసుకోవాలి. అవి జీర్ణక్రియను మందగించడానికి సహాయపడతాయి.

🦚 ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అది జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలం సులభంగా వెళ్లడానికి సహాయపడుతుంది.

🦚 నిద్రలేమిని నివారించాలి. సరిపోయే నిద్ర జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

🦚 మలవిసర్జన చేయాలని అనిపించినప్పుడు వెంటనే మలవిసర్జన చేయాలి. మలవిసర్జనను ఆపుకోవడం మలబద్ధకానికి దారితీస్తుంది.

*మొదటి_దశలో_ఉన్న_పైల్స్_ను_తొలగంచడానికి_నవీన్_రోయ్_సలహాలు*

మలబద్దకం లేకుండా తగు జాగర్తలు పాటించాలి. మాంసాహార భక్షణ -
ఆల్కహాల్ దూరం చేయాలి.
తేలికగా జీర్ణమగు ఆహారం -
పండ్లు -పీచు (ఫైబర్ ) ఎక్కువ ఉండు ఆహారం,
 పలుచని మజ్జిగ ,
సమృద్ధిగా మంచి నీరు తాగుట.
మంచి నిద్ర పాటిస్తూ అదుపులో ఉంచుకోవచ్చును. మలవిసర్జన బలవంతపు వెడలగొట్టుట ఎన్నడూ చేయరాదు.
ఇవి పాటిస్తే మలద్వార వాపు ,
తీపు , మల విసర్జన సమయమున నొప్పితో రక్తం స్రవించుట క్రమముగా తగ్గి ఉపశమనం మందులు -
సర్జరీ అవసరం లేకుండా చేయ వచ్చును.
 మీకు అభ్యంతరం లేకుంటే
Ficus Rel - Aesculas Hip అను హోమియో మదర్ టింక్చర్స్ ఐదు డ్రాప్స్ కొద్దీ నీళ్లలో వేసుకుని రోజుకురెండు మార్లు పుచ్చుకోండి. తగ్గి పోవును.

🌿 *ఆయుర్వేద_మందులు* 🌿

మలబద్ధకం తీవ్రంగా ఉంటే, ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు ఆయుర్వేద మందులు వాడవచ్చు.

*ఆవాల నూనె:* ఆవాల నూనె వాత దోషాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

*యాలకుల చూర్ణం:* యాలకులు వాత దోషాన్ని తగ్గించడానికి మరియు మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి.

*సాల్మలీ చూర్ణం:* సాల్మలీ వాత దోషాన్ని తగ్గించడానికి మరియు మలవిసర్జనను సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

⚡⚡ సారాంశం ⚡⚡

⚡ మలబద్ధకంతో బాధపడుతుంటే, మీ ఆహారం మరియు జీవనశైలిని మార్చడం ద్వారా మొదట ప్రయత్నించండి.

⚡ మలబద్ధకం తీవ్రంగా ఉంటే, ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు ఆయుర్వేద మందులు వాడండి...
 *శీతాకాలంలో ఆర్థరైటిస్ రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి సలహాలు*

👉శీతాకాలం ఆర్థరైటిస్ రోగులకు కష్టతరమైన సమయం కావచ్చు. చల్లని వాతావరణం, తక్కువ తేమ, మరియు తక్కువ సూర్యరశ్మి వంటి కారకాలు ఆర్థరైటిస్ లక్షణాలను మరింత తీవ్రతరం చేయవచ్చు.

కీళ్లవాతం అంటే ఆర్థరైటిస్ (arthritis)

ఇందులో చాలా రకాలు ఉంటాయి

ఆస్టియో ఆర్థరైటిస్ (Osteo arthritis) ఇది పెద్ద వయసు వాళ్ళ లో ఎముక అరుగుదల వల్ల వస్తుంది

ఇంకా రుమాటిక్ ఆర్థరైటిస్ (Rheumatic arthritis)

గౌటీ ఆర్థరైటిస్ (Gouty arthritis)

సోరియాటిక్ ఆర్థరైటిస్ (Psoriatic arthritis) ఇలా చాలా రకాలు ఉంటాయి

సెప్టిక్ ఆర్థరైటిస్ (Septic arthritis)

ఇడియోపతిక్ జువెనైల్ ఆర్థరైటిస్ (Idiopathic juvenile arthritis) వంటివి పిల్లల్లో వస్తాయి కాకపోతే ఇవి చాలా అరుదు గా మాత్రమె కనిపిస్తాయి

🌷.రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యరశ్మిని పొందడానికి ప్రయత్నించండి.

🌷 ఆహారంలో పండ్లు, కూరగాయలు మరియు పూర్తి గింజలను చేర్చండి.

🌷బయటికి వెళ్లే ముందు వెచ్చని దుస్తులు ధరించండి - గ్లోవ్స్, టోపీ, స్కార్ఫ్ మరియు సాక్స్ ధరించండి,

🌷శీతాకాలపు చలి చర్మాన్ని పొడిగా చేస్తుంది; పగిలిన చర్మాన్ని నివారించడానికి తరచుగా లోషన్‌ను క్రీమ్లను రాయండి వైద్య సలహాలు కోసం


🌷Indoors నందు low ఇంపాక్ట్ వర్కౌట్‌లు చేయండి అవి కీళ్లను మొబైల్‌గా ఉంచుతాయి.

🌷భావోద్వేగ ఒత్తిడి వాపును పెంచుతుంది, కాబట్టి విశ్రాంతి కార్యకలాపాలలో సామాజిక సంబంధాలలో ఉండండి.

🌷 సూచించిన విధంగా మందులను తీసుకోండి - మీ వైద్యునితో మందుల నియమావళిని చర్చించి పాటించంది.

🌷హాట్ అండ్ కోల్డ్ థెరపీని వర్తింపజేయండి - ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి వేడి ప్యాడ్‌లు లేదా వెచ్చని స్నానాలను చేయండి

🌷ఫోటోథెరపీ చికిత్సను పరిగణించండి - ఎరుపు మరియు పరారుణ కాంతి చికిత్సలు కొంతమంది రోగులకు ఆర్థరైటిస్ లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

🌷పోషకాహారం తినండి - కొవ్వు చేపలు, అల్లం, బెర్రీలు, ఆకుకూరలు, ఆలివ్ ఆయిల్ మరియు టార్ట్ చెర్రీ జ్యూస్ లు రోగ నిరోధక శక్తిని పెంపొందించును…

🌷కీళ్లపై అదనపు ఒత్తిడిని నివారించడానికి మీరు ఉపయోగించే వస్తువులు అందుబాటులో ఉంచుకొండి

🌷 విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోండి - సూర్యరశ్మి లేకపోవడం వల్ల విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి,

🌷సరైన సీటింగ్ బ్యాక్ సపోర్టును ఇచ్చి ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించును

🌷 Slow రేంజ్-ఆఫ్-joint మోషన్ వ్యాయామాలలో పాల్గొనండి -ఇవి joint ఫ్లెక్సిబిలిటీని పెంచును.

🌷మసాజ్ రక్త ప్రసరణను పెంచి ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న కండరాల బిగుతు మరియు నొప్పులను తగ్గిస్తుంది.

🌷సమస్యలను నివారించడానికి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతల మార్గదర్శకత్వాన్ని అనుసరించండి

👉శీతాకాలంలో ఆర్థరైటిస్ లక్షణాలను నిర్వహించడానికి మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే, మీరు మరింత సౌకర్యవంతంగా మరియు చురుకుగా ఉంటారు.
 *శంఖం మోగితే ఐశ్వర్యం వస్తుందా*

*శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీమహావిష్ణువు ధరించాడు, దానికే పాంచజన్యం అని పేరు. దాని తరువాత వచ్చిన లక్ష్మి దేవిని కూడా స్వామి స్వీకరించాడు. ముందుగా శంఖం దాని వెంటే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు. దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం. ఈ శంఖంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి దక్షిణావృత శంఖం, రెండవది వామావృత శంఖం.*

*దక్షిణావృత శంఖాలని ఎక్కువగా పూజావిదానంలో వాడరు. ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీరంగు గీత ఉంటుంది. ఇది కుడి వైపు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి ధారపోస్తే కంటికి సంబందించిన రోగాలు తగ్గుతాయి. ఎడమవైపు తెరుచుకుని ఉండే శంఖాన్ని వామావృత శంఖం అంటారు.*

*ఇది పేరుకి తగ్గట్టు ఎడమవైపుకి తెరుచుకుని ఉంటుంది. అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే. ఇది ఇంట్లో ఉంటే దుష్ట శక్తులు ఆ దరిదాపులకి  కూడా రావట. వైదికశాస్త్ర ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయట. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది.*

*1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు. ఈ శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట. అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట. ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాదులు దూరమవుతాయట. ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ  తొలగిపోతాయి. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం. శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. దీనిని  షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార, ధనాభివృద్ది కలుగుతుంది. శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు.*

*ఏ ఇంట్లో శంఖాన్ని దేముడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట. ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.*
 *ట్రాన్సిల్స్ కు నివారణ*
*!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!*
 👉నోట్లో చిటికెడు పసుపు వేసుకొని బాగా పుక్కిలించి ఉమ్మివేయాలి. 

👉50 గ్రాముల ఉత్తరేణి ఆకులు, దోరగా వేయించిన 50గ్రాముల మిరియాలు, 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు. ఈ మూడింటిని మెత్తగా నూరి నీడలో ఆరబెట్టి బఠాని గింజ అంత గోలీలు చేసి ఉదయం, సాయంత్రం వాడాలి.

👉నేరేడు చెట్టు ఆకులను దంచి నీటిలో మరిగించి గొంతులో పోసుకొనిపుక్కిలించాలి. 

👉పసుపు, మిరియాలు, తేనె ఈ మూడు సమానంగా కలిపి నూరి టాన్సిల్స్ పైన పూస్తూ ఉంటే అవి కరిగి పోతాయి.

 👉మామిడి ఆకులను దంచి రసం తీసి ఆ రసాన్ని దూదితో టాన్సిల్స్ మీద రాస్తే వాపు, నొప్పి తగ్గిపోతుంది.

 👉రోజూ చింతగింజను సానరాయి మీద నీళ్లతో సాది ఆ గంధాన్ని గొంతులో టాన్సిల్స్కు అంటిస్తూ ఉంటే అవి కరిగిపోతాయి. (ఒక పుల్లకు దూది చుట్టి దానికి గంధాన్ని అంటించి పెట్టాలి)...
 *అందం- కొంటే వస్తుందా?*
*##################*
మార్కెట్లో దొరికే అనేక వందలరకాల సౌందర్యసాధనాలు అమ్మే కంపెనీలు తమ సాధనాలను నిత్యం క్రమబద్ధంగా వాడుతూవుంటే ఖచ్చితంగా అపురూపమైన అందం ప్రాప్తిస్తుందని తమ వ్యాపార ప్రకటనలద్వారా టీ.వీలలో పత్రికలలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారా లను నిజమనినమ్మి అధికశాతంమంది స్త్రీ పురుషులు వాటిని కొని ఉపయోగిస్తున్నారు. అయితే, ఇలా ఉపయోగిస్తూ వున్నవారిలో ఏ ఒక్కరి కైనా ఆ సాధనాలవల్ల సౌందర్యం ప్రాప్తించిందా? అని మాత్రం ఏ ఒక్కరు ప్రశ్నించుకోవడంలేదు.

ఒక క్రీము పనిచేయకపోతే మరో క్రీము కొనివాడడం, ఒక షాంపు పడకపోతే మరో షాంపు వాడటం ఇలా ఎప్పటికప్పుడు నిమిష నిమిషానికి రంగులు మార్చే ఊసరవెల్లిలా విరివిగా విడుదలవుతున్న విదేశీ విష సౌందర్యసాధనాలను వాడుతూ కొత్త సౌందర్యాన్ని సాధించలేక పోవ ఉన్న సౌందర్యంకూడా నాశనం చేసుకుంటున్నారు.

కేవలం సౌందర్యం హరించిపోవడమేకాక ఆయా సాధనాలలోని విష రసాయనపదార్థాలు చర్మంలోకి ప్రవేశించి అనేకరకాల వికృత చర్మ వ్యాధులను కలిగిస్తూ కాలగమనంలో దీర్ఘకాలవ్యాధులుగా పరిమణి స్తున్నయ్.

 👉యువతీయువకులారా! పారాహుషార్

ఓ ప్రియాతిప్రియమైన బిడ్డలారా! సౌందర్యంపట్ల మీకున్న మమ కారంతో నలుగురిలో నాజూకుగా కనిపించాలనే తాపత్రయంతో మంచి చెడులను తెలుసుకోలేక నిత్యం మీరు వాడుతూవున్న అనేక సౌందర్య సాధనాలు మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్నయ్. ఇప్పటికైనా కళ్ళు తెరిచి విదేశీ వ్యాపారస్తుల విషప్రచారాలను విస్మరించి సొంత ఇంటి మార్గా లతో స్వప్రయత్నంతో సుమనోహరమైన సౌందర్యాన్ని ఎలా సాధించ వచ్చో తెలుసుకోండి.

 👉కొమ్ముపసుపుతో కోరుకున్న అందం

ప్రాచీన భారతదేశంలో, ఈనాటికీ నవనాగరికతకు దూరంగా వున్న పల్లెల్లో అక్కడక్కడా కొమ్ముపసుపుతో కోరుకున్న సౌందర్యాన్ని పొందిన వారు కనిపిస్తుంటారు. పూర్వం మనఇండ్లలోని స్త్రీలు ప్రతిరోజూ తమ పొలాలలో ప్రత్యేకంగా పండించుకున్న కొమ్ముపసుపు సానరాయి పైన మంచినీటితో గంధం తీసి ఆగంధాన్ని ముఖానికి పట్టించేవారు. ఒకగంటసేపు ఆగిన తరువాత ముఖంకడిగేవారు.

మరికొంతమంది కొమ్ము పసుపుతో పాటు నల్లనువ్వుల పొడిని కూడా కలిసి మంచినీటితో మెత్తగా నూరి ఆమిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒకగంట ఆగి కడిగేవారు. ఈ విధంగా ఒక్క పైసా ఖర్చులేని ఖచ్చితమైన మార్గంతో ముఖంపై ఎలాంటి మొటిమలు, మచ్చలు, మంగు, నల్లని వలయాలు, గుంటలు, సోలి, మొదలైన చర్మవికారాలు రాకుండా, ఒకవేళ వస్తే తగ్గిపోవడానికి కూడా దీనిని ఉపయోగించేవారు.

ఈనాటి ఆధునికులు కూడా పూర్వీకుల అనుభవాన్ని గుర్తుచేసుకొని. ఆచరించి అందాన్ని అందుకొందురుగాక!

👉ఆహార మార్పు అందానికి చేర్పు

ఆహారంవల్లనేఅన్నీసమకూరుతయ్ కాబట్టి, పూర్వం మన పెద్దలు సమతౌల్యమైన శక్తివంతమైన సేంద్రియ ధాన్యాలను కూరగాయలను ఉపయోగించి ఏనాటికీ తరగని సౌందర్య నిధులుగా ప్రకాశించారు.

ఈనాడు మనం రోజూతినే పదార్థాలద్వారా విషం రోజురోజుకు శరీరాలలో పేరుకుపోతూ రక్తంలో కలిసిపోయి శారీరక సౌందర్యాన్ని సర్వనాశనం చేస్తుంది. ఆహారం శుద్ధికాకుండా ఎన్నిఔషధాలు వాడినా ఎన్నిక్రీములు పూసినా అప్పటికప్పుడు తాత్కాలిక సౌందర్యాన్ని పొంద గలరేమోగానీ శాశ్వత అందాన్ని పొందలేరు.

అందువల్ల సాధ్యమైనంతవరకు విషరసాయనాలు వేయకుండా పండించిన పాలిష్ తక్కువగా పట్టించిన బియ్యం, సేంద్రియ ఎరువులతో, పండించిన ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, ధాన్యాలు మాత్రమే భుజించి తీరాలి. ఈమార్పు చేసుకోకపోతే ఏ నాటికి కించిత్ అయినా సౌందర్యాన్ని సంతరించుకోలేరు.
 *ఆరోగ్య మస్తు*
*##################*
మట్టి పాత్రల గొప్ప తనం
 మనం ఏ ఆహారమైన వండేటప్పుడు గాలి, వెలుతురూ వుండేలా చేసుకోవలెను. మనం వండుకునే ఏ ఆహారానికైనా సూర్యుని కాంతి, గాలి తగలని ఆహారము తినకూడదు. ఎందుకంటే? అది ఆహారము కాదు, విషముతో సమానము. గాలి, సూర్యరశ్మి తగులకుండ వండబడిన భోజనమునకు ఉ దాహరణ ప్రెజర్ కుక్కర్ ఇందులో ఆహారం వండేటప్పుడు ఏమాత్రము గాలి. సూర్యరశ్మి తగిలే అవకాశమే లేదు. ఇది పూర్తిగా విషతుల్యమని ఎన్నో.. సంవత్సరాల పూర్వమే చెప్పారు. సెంట్రల్ డ్రగ్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ వారు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ ప్రెషర్ కుక్కర్ను తయారు చేసేదిఅల్యూమినియంతో ఆహారం వండటానికి గాని, నిల్వ ఉంచటానికిగాని ' ఏమాత్రము పనికిరానిది. ఈ పాత్రలోని ఆహారం మళ్లీ మళ్లీ తింటూంటే వారికి మధుమేహం,జీర్ణసంబంధిత, టి.బి. ఆస్తమా మరియు కీళ్లసంబంధ వ్యాధులు తప్పక కలుగుతాయి.

అల్యూమినియం పాత్రలో ఆహారాన్ని తినడంవలన మన శక్తి నిర్వీర్య o మౌతుంది. ప్రేజర్క్క్కుర్లో వండిన ఆహార పదార్థంలో 13% శాతం మాత్రమే న్యూట్రిన్స్ ఉంటాయి. ప్రెజర్ కుక్కర్ అనగా ఒత్తిడి అంటే మనం ప్రెజర్ కుక్కర్లో వండిన ఆహారం ఒత్తిడికి గురైన తర్వాత మెత్తబడుతుంది కాని ఉ డకదు. పదార్థం ఉడకడం వేరు, మెత్తబడడం వేరు. దీని వ్యత్యాసం ఏమిటంటే  ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం, భూమిలో ఏగింజ వండటానికి ఎక్కువకాలం పడుతుందో అదే విధంగా ఆగింజ వండటానికి కనీసం 7నుండి 8నెలలు పడుతుంది. ఎందుకంటే అందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్, న్యూట్రీన్స్, అన్నీ సక్రమంగా మట్టినుండి అన్నిరకాల మైక్రోన్యూట్రీన్స్ ఉన్నాయి. అవన్నీ  మొక్క వేరులోకి చేరి క్రమంగా ఫలానికి చేరుతాయి. కనుకనే శరీరంలోకి చేరాలంటే పదార్థం వండబడాలి. మెత్తబడకూడదు.

మట్టి పాత్రలలో వండిన పదార్థానికి రుచి కూడా అద్భుతంగా
 ఉంటుంది. ఇద మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం కనుక మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించనంత వరకు వారికి కళ్లజోడు రాలేదు. జీవితాంతం వరకు వారికి పళ్లు ఊడిపోలేదు. మోకాళ్లనొప్పులు డయాబెటీస్
వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన న్యూటిన్స్ సక్రమంగా అందు తుంటే జీవితాంతం మన అన్ని పనులు మనమే ఎవరిమీద అధారపడకుండాచేసుకోగలుగుతాము. అది ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం భుజించటం వలన మాత్రమే సాధ్య పడుతుంది.
గనుక, మన దేశ మట్టిలో అల్యూమినియం తయారీకి కావల్సిన ముడి పదార్థాలు ఎంత ఉన్నప్పటికీ, మనవారు పూర్వం మట్టి వస్తువులకే అధిక ప్రాధాన్యత నిచ్చారు. మనం ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటేగాలి, సూర్యరశ్మి తగిలేలా ఆహారం వండుకోవాలి. మట్టి పాత్రలో వండిన ఆహారంలో 100% శాతం న్యూట్రీన్స్ మన శరీరానికి అందుతాయి కావున అత్యున్నతమైన పాత్ర మట్టిపాత్రలు.

మనకు ఉపయోగపడే మరొక పాత్ర కంచుపాత్ర. మరొక పాత్ర ఇత్తడి, వీటిలో వండిన ఆహారం తినడం వలన 97% శాతం న్యూట్రిన్స్ మన శరీరానికి అందుతాయి. డయాబెటీస్ ఏ స్థాయిలో ఉన్నవారైన మట్టి పాత్రలో వండిన భోజనం చేయడం వలన సుమారు కొన్ని నెలలలోపే ఖచ్చితంగా
వారు డయాబెటీస్ రోగం నుండి విముక్తులై ఆరోగ్యం జీవిస్తారు.
 *మూత్రద్వారంలో మంట పడుతుంటే*
*====================*
🔹అతిబల ఆకులతో  : అతిబల అనగా దువ్వెనకాయల చెట్టు. దీనినే ముద్రబెండ, తుత్తురుబెండ అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులను 20 గ్రా॥ మోతాదుగా తీసుకొని కొంచెంనీటితో కలిపి దంచి రసంతీసి ఆరసంలో ఒక చెంచా కండచక్కెర కలిపి రెండు లేదా మూడుపూటలా సేవిస్తుంటే మూత్రపిండాలలోమంట, వాపు, పోటు తగ్గటమేకాక మూత్రం సాఫీగా విడుదలౌతూ శరీరానికి బలం కూడా కలుగుతుంది.

🔸 నల్లతుమ్మతో :-- నల్లతుమ్మచెట్టుకు వచ్చే జిగురు చింతగింజంత రెండు లేదా మూడుపూటలా ఒకకప్పు నీటిలో కలిపి కరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోతుంది.

🔸రుద్రజడాకులతో - : సబ్జాచెట్టునే రుద్రజడ అంటారు. దీని ఆకులు 20గ్రా॥ తీసుకొని కొంచెం నీరుపోసి దంచిరసంతీసిపూటకురెండుచెంచాలరసం మూడుపూటలా సేవిస్తుంటే మూత్రంలోమంట, మూత్రనాళంలో వాపు తగ్గిపోతయ్.

🔹 బొప్పాయిపండుతో -: బాగాపండిన బొప్పాయిపండును తెచ్చి పైతోలుతీసి లోపలిగుజ్జును ముక్కలుగా చేసి రెండు లేదా మూడుపూటలా తింటూవుంటే మూత్ర ద్వారంలోమంట ఆశ్చర్యకరంగా అదృశ్యమైపోతుంది.
 *పురుషాంగం వంకరగా ఉంటే.. ఆ ముప్పు ఎక్కువ  సలహాలు!*
         
   
పురుషాంగం వంగినట్లు ఉండే మగాళ్లకు కేన్సర్ల ముప్పు ఎక్కువని ఓ అధ్యయనం వెల్లడించింది. ఓ వైపు వంగిన పురుషాంగం ఉండినట్లు కారణమయ్యే జన్యువులకు కేన్సర్‌తో సంబంధం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి 40 ఏళ్లు దాటిన వారిలో తలెత్తుతుంది. దీన్ని పీరొనీస్ డిసీజ్ అంటారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న 40 వేల మందిని, అంగ స్తంభన సమస్యలతో సతమతం అవుతున్న పది లక్షల మందిపై టెక్సాస్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు


అంగం వంగిపోయినట్లు ఉన్నవారిలో కేన్సర్ కణితులు వచ్చే ముప్పు పది శాతం ఎక్కువని పరిశోధకులు తేల్చారు. 42 శాతం మందికి ఉదర సంబంధ కేన్సర్ సోకుతున్నట్లు, 20 శాతం మందికి చర్మ కేన్సర్ ముప్పు ఉందని గుర్తించారు. 39 శాతం మందికి వృషణాలకు సంబంధించిన కేన్సర్ సోకే అవకాశం ఉందని చెప్పారు.

ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంలో మాత్రం వారు స్పష్టతకు రాలేకపోయారు. పీరోనీస్ డిసీజ్ గురించి లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
 *Tadalafil_medicine_ఉపయోగం_ఏమిటీ ?అవగాహనా కోసం  సలహాలు*

తడలాఫిల్ అనేది అంగస్తంభన (ED), పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ (PAH) మరియు నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా (BPH) వంటి వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.

ఇది ఫాస్ఫోడీస్టేరేస్ (PDE) ఇన్హిబిటర్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది మరియు లైంగిక కార్యకలాపాల సమయంలో పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా పని చేస్తుంది, ఇది అంగస్తంభనను సాధించడంలో మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది.

ఇది లైంగిక ప్రేరణతో కలిపి, తడలాఫిల్ ప్రోస్టేట్ మరియు మూత్రాశయంలోని మృదువైన కండరాలను సడలించడం ద్వారా పనిచేస్తుంది, రక్తం మరింత సులభంగా ప్రవహిస్తుంది.

తడలఫిల్ (అకా తడాలిస్) మగవారిలో అంగస్తంభన చికిత్సకు ఉపయోగిస్తారు.

లైంగిక ప్రేరణ సంభవించినప్పుడు పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఇది అంగస్తంభనను పెంచుతుంది.

*ఇక్కడ 5 తడాలిస్ చేయకూడనివి ఉన్నాయి. (వయాగ్రా, వేగా, హోనిహిల్, కూడా దీని కిందకే వస్తాయి).*

1.-మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే తీసుకోకండి. తడలాఫిల్ పెద్దలకు మాత్రమే.

2.-రోజుకు ఒకసారి కంటే ఎక్కువ తీసుకోకండి.

 3.-తడాలిస్ యొక్క అధిక మోతాదు నిరంతర మరియు బాధాకరమైన అంగస్తంభనకు దారితీస్తుంది.

3.-ఆల్కహాల్ తీసుకోవద్దు. తడలాఫిల్ టాబ్లెట్‌తో ఆల్కహాల్ తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, ఇది మైకము లేదా మూర్ఛకు దారితీస్తుంది.

4.-ద్రాక్షపండు తీసుకోవద్దు. ద్రాక్షపండు మరియు ద్రాక్షపండు రసం తడలాఫిల్‌తో సంకర్షణ చెంది అవాంఛిత దుష్ప్రభావాలకు దారితీయవచ్చు.

మీ స్వంతంగా తడాలిస్ తీసుకోకండి. స్వీయ మందులను నివారించండి...
 *🩺 రక్తపోటు (BP) నియంత్రణ – సంపూర్ణ మార్గదర్శకం*

*ఇప్పటి జీవనశైలిలో రక్తపోటు ఒక నిశ్శబ్ద ప్రమాదంగా మారింది.*  
*తలనొప్పి, తలతిరగడం లాంటి లక్షణాలు లేకుండానే BP పెరుగుతుంది.*  
*నియంత్రణలో లేకపోతే గుండె, మెదడు, మూత్రపిండాలకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది.*  
*కాబట్టి BPని తొందరగా గుర్తించి, క్రమంగా నియంత్రించడం చాలా అవసరం.*

---

*🎯 BP నియంత్రణ లక్ష్యాలు (Goals):*

*• రక్తపోటు: 140/90 mmHg కంటే తక్కువగా ఉండాలి*  
*• గుండె స్పందన (HR): నిమిషానికి 80 కంటే తక్కువగా ఉండాలి*  
*• షుగర్, కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉండాలి*

---

*💊 సాధారణంగా ఉపయోగించే మందులు (డాక్టర్ సూచనతో మాత్రమే):*

*• ట్యాబ్. అమ్లోడిపిన్ 5–10 mg – రోజుకు ఒకసారి*  
*• ట్యాబ్. టెల్మిసార్టన్ 20–40 mg – రోజుకు ఒకసారి*  
*• అవసరమైతే హైడ్రోక్లోరోథయజైడ్ 12.5–25 mg – రోజుకు ఒకసారి*  

*👉 ఈ మందులు రక్తపోటును తగ్గించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తాయి.*  
*👉 డోస్ మార్చడం లేదా మందులు ఆపడం స్వయంగా చేయరాదు.*

---

*🥗 ఆహార నియమాలు (Diet Advice):*

*• ఉప్పు తక్కువగా వాడాలి*  
*• నూనె, కొవ్వు పదార్థాలు తగ్గించాలి*  
*• వేయించిన ఆహారం పూర్తిగా మానాలి*  
*• తీపి పదార్థాలు తగ్గించాలి*  
*• కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలి*  
*• రోజుకు ఉప్పు 2.3 గ్రాములు (ఒక టీ స్పూన్) కంటే తక్కువగా ఉండాలి*

---

*🚫 తప్పించుకోవాల్సినవి (Avoid):*

*• జంక్ ఫుడ్*  
*• ప్రాసెస్ చేసిన ఆహారం*  
*• శీతల పానీయాలు (కోల్డ్ డ్రింక్స్)*  
*• ఎక్కువ ఉప్పు*  
*• రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం*  
*• పొగతాగడం, మద్యపానం*

---

*🚶 వ్యాయామ సూచనలు (Exercise):*

*• రోజూ కనీసం 30–45 నిమిషాలు వేగంగా నడక*  
*• మెట్లెక్కడం*  
*• తేలికపాటి యోగా, శ్వాసాభ్యాసం*  
*• కూర్చునే జీవనశైలిని తగ్గించాలి*

---

*⚖️ బరువు & ఆరోగ్య తనిఖీలు:*

*• బరువు క్రమంగా తగ్గించుకోవాలి*  
*• BPను తరచుగా చెక్ చేయాలి*  
*• రక్తంలో చక్కెర పరీక్షలు చేయాలి*  
*• కొలెస్ట్రాల్ స్థాయిలు పరిశీలించాలి*

---

*🧠 ఒత్తిడి నియంత్రణ (Stress Management):*

*• కోపం, ఆందోళన తగ్గించుకోవాలి*  
*• రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర అవసరం*  
*• ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్ద సమయం అలవాటు చేసుకోవాలి*  
*• మనసుకు నచ్చిన పనులు చేయాలి*

---

*⚠️ BP నియంత్రణలో లేకపోతే వచ్చే ప్రమాదాలు:*

*• హార్ట్ అటాక్*  
*• స్ట్రోక్ (పక్షవాతం)*  
*• కిడ్నీ ఫెయిల్యూర్*  
*• కంటి చూపు తగ్గడం*  
*• అకస్మాత్తుగా మరణం*

---

*💡 ముఖ్యమైన సందేశం:*

*BP మందులు జీవితాంతం తీసుకోవాల్సి రావచ్చు.*  
*కానీ నియమాలు పాటిస్తే మోతాదు తగ్గే అవకాశం ఉంటుంది.*  
*మందుల కంటే జీవనశైలే అసలైన మందు.*

---

*📌 గుర్తుంచుకోండి:*  
*ఈరోజు BP నియంత్రణలో పెట్టుకుంటే, రేపటి జీవితాన్ని రక్షించుకున్నట్టే....
 *_Thyroid : థైరాయిడ్ సమస్యకు దీంతో శాశ్వత పరిష్కారం.. నిపుణులు చెబుతున్న మాట..!_*
        ➖➖➖

       
*_థైరాయిడ్ గ్రంథి.. దీనినే అవటు గ్రంథి అని కూడా అంటారు. ఇది మెడ మధ్య భాగంలో గొంతు ముందుండే అవయవం. ఇది వినాళ గ్రంథులన్నింటిలో కంటే పెద్దది._*

*_శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ గ్రంథి ఒకటి. ఇది శారీరక ఎదుగుదలలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది గ్రంథి పనితీరు అదుపు తప్పడం వల్ల హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలతోపాటు ఆర్థరైటిస్ సమస్యలు కూడా ఏర్పడతాయి._* 

*_ఈ థైరాయిడ్ గ్రంథి అయోడిన్ కలిగిన థైరాక్సిన్ అనే హార్మోన్ ను స్రవిస్తుంది. ఇది సాధారణ జీవక్రియ వేగాన్ని నియంత్రిస్తుంది._*

 *_థైరాయిడ్ గ్రంథి నుండి విడుదల అయ్యే హార్మోన్ లు ప్రతి కణం పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది ఎముకలకు అవసరమయ్యే క్యాల్షియంను క్యాల్సిటోనిన్ హార్మోన్ ద్వారా సమర్థవంతంగా కాపాడుతుంది._*

*_థైరాయిడ్ గ్రంథి టి3, టి4 , క్యాల్సిటోనిన్ హార్మోన్ లను ఉత్పత్తి చేస్తుంది. శరీర అవసరాల నిమిత్తం రక్తంలో హార్మోన్ ల శాతం తగ్గడం లేదా పెరగడం చాలా సాధారణం. మారిన హార్మోన్ల నిల్వల వల్ల కలిగే అనారోగ్య లక్షణాలకు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల అది హైపోథైరాయిడ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది._*

*_థైరాయిడ్ అసమతుల్యత వల్ల కీళ్లల్లో వచ్చే అతి పెద్ద సమస్య ఆర్థరైటిస్. అంటే కీళ్లలోపల అంతా వాచిపోయి కదిపితే తీవ్రమైన నొప్పి వస్తుంది. కేవలం ఆర్థరైటిస్ వంటి సమస్యలే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది._*

*_కానీ ఈ థైరాయిడ్ సమస్యను శాశ్వతంగా రూపుమాపవచ్చట._* 

*_థైరాయిడ్ ను రూపుమాపడంలో శుద్ది చేసిన అశ్వగంధ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని హైపో, హైపర్ థైరాయిడ్ లకు మందుగా వాడవచ్చు._* 

*_ఆయుర్వేదంలో అశ్వగంధ మొక్కను అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిని కింగ్ ఆఫ్ ఆయుర్వేద అని కూడా అంటారు._* 

*_థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేయకుండా నివారించడంలో అశ్వగంధ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు._*

*_అశ్వగంధ అడాప్టోజెన్ గా పని చేస్తుంది. ఇది థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంపొదిస్తుంది. అడాప్టోజెన్ లు అన్ని రకాల వయసుల వారికి పని చేస్తాయి. దీనిని పలు రకాల వ్యాధులు ఉన్న వారు కూడా చికిత్సగా వాడుకోవచ్చు._* 

*_శాస్త్రవేత్తలు వీటిపై పరిశోధనలు జరిపి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు టానిక్ గా వాడుతున్నారు. కనుక దీనిని దీర్ఘకాలికంగా వాడినా కూడా ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు._*

*_అశ్వగంధ  పొడి రూపంలో తీసుకోలేని వారు  దీనితో  టీ  ని తయారు  చేసుకుని తాగవచ్చు.  ఈ అశ్వగంధ చూర్ణానికి తులసి ఆకులను కలపడం వల్ల దీని శక్తి మరింతగా పెరుగుతుంది._*

*_శుద్ది చేసిన అశ్వగంధ  2 నుండి 3 నెలల పాటు క్రమం తప్పకుండా వాడడం వల్ల మాత్రమే మనకు ఫలితం కనబడుతుంది._*

*_అశ్వగంధను ఔషధంగా వాడి థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనాన్ని పొందిన వారు కూడా ఉన్నారని, దీనిని వాడడం వల్ల థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు._*.
 *మంగు మచ్చలు తగ్గేందుకు 5అద్భుతమైన చిట్కాలు...*

*1.బంగాళ దుంపలతో:-*
బంగాళ దుంపలపై ఉండే తొక్కను తొలగించి సన్నగా తురమండి. దాన్ని పలచని గుడ్డలో వేసి రసం వచ్చేలా పిండండి. ఆ దూదిని ఆ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి.

*2.టమోటా, కలబందతో:-*
ముఖంపై ఉండే మచ్చలను తగ్గించడంలో టమోటా ఉత్తమంగా పనిచేస్తుంది. టమోటా గుజ్జును మచ్చలకు రాసుకుని 20 నిమిషాలు వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో కలబంద అందుబాటులో ఉంటే మచ్చలపై రాస్తూ ఉండండి. కలబందను కేవలం ముఖానికే కాకుండా ముఖం మొత్తం రాసుకున్నా మంచిదే.

*3.నిమ్మరసంతో:-*
 ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయండి. అలాగే, రోజ్ వాటర్ లేకపోతే నిమ్మరసం, తేనె కలిపి రాసినా చాలు. ఇలా రోజూ చేస్తే మంగు మచ్చలు త్వరగానే మాయమవుతాయి.

*4.టమోటా, ముల్తాని మట్టితో:-*
టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండు లేదా మూడు రోజులు ఈ చిట్కాను పాటిస్తే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది.

*5.పాల ఉత్పత్తులతో:-*
గేదె పాల వెన్నను రోజూ మచ్చలపై రాసినా మంగు మచ్చలు మాయమవుతాయి. అలాగే, గేదె పాలల్లో కాస్త పసుపు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. మేకపాలలో జాజికాయను అరగదీసి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మంగు మచ్చలు కనిపించవు. ఎర్ర కందిపప్పు ఫౌడర్‌లో పాలు వేసి, నెయ్యి వేసి మంగు మచ్చలపై రాస్తే త్వరగానే ఉపశమనం లభిస్తుంది...
 *నిద్ర లేమితో ఆయుష్షు తగ్గుతుందా?*

మనిషి ఆరోగ్యానికి ఆహారం, నీరు ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. కానీ ఆధునిక జీవనశైలిలో నిద్రను నిర్లక్ష్యం చేయడం సాధారణంగా మారింది. “నిద్ర లేమితో నిజంగానే ఆయుష్షు తగ్గుతుందా?” అనే ప్రశ్నకు శాస్త్రం స్పష్టమైన సమాధానం ఇస్తోంది — అవును, నిద్ర లేమి ఆయుష్షును తగ్గిస్తుంది.

 *నిద్ర ఎందుకు అంత ముఖ్యము?* 

నిద్ర శరీరానికి విశ్రాంతి మాత్రమే కాదు,

కణాల పునర్నిర్మాణం

మెదడు శుభ్రపరిచే ప్రక్రియ

హార్మోన్ల సమతుల్యత

రోగ నిరోధక శక్తి పెంపు

వంటి కీలక ప్రక్రియలు నిద్రలోనే జరుగుతాయి.

 *నిద్ర లేమి వల్ల శరీరంపై ప్రభావాలు* 

నిరంతరం సరిపడ నిద్ర లేకపోతే క్రమంగా ఈ సమస్యలు వస్తాయి:

1. గుండె జబ్బులు & రక్తపోటు
నిద్ర లేమి వల్ల రక్తపోటు పెరిగి, హార్ట్ అటాక్ ప్రమాదం పెరుగుతుంది.

2. డయాబెటిస్ ప్రమాదం
నిద్ర తక్కువైతే ఇన్సులిన్ సరిగా పనిచేయదు.

3. రోగ నిరోధక శక్తి తగ్గుదల
చిన్న ఇన్ఫెక్షన్లే తీవ్రమవుతాయి.

4. మానసిక సమస్యలు
ఆందోళన, డిప్రెషన్, చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గడం.

5. అకాల మరణాల ప్రమాదం
పరిశోధనల ప్రకారం రోజుకు 5 గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారిలో మరణ ముప్పు ఎక్కువ.

 *నిద్ర లేమి – ఆయుష్షు మధ్య సంబంధం* 

శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్న విషయమేమిటంటే:

దీర్ఘకాలంగా నిద్ర లేమి ఉంటే టెలోమీర్లు (క్రోమోజోమ్ చివరి భాగాలు) త్వరగా చిన్నవుతాయి

దీని వల్ల కణాలు త్వరగా వృద్ధాప్యంలోకి వెళ్తాయి

ఫలితంగా జీవితకాలం తగ్గుతుంది

 *ఎంత నిద్ర అవసరం?* 

వయస్సును బట్టి సగటు అవసరం:

పెద్దలు: రోజుకు 7–8 గంటలు

వృద్ధులు: కనీసం 6–7 గంటలు

నిద్ర గంటల కన్నా నిద్ర నాణ్యత కూడా ముఖ్యమే.

 *మంచి నిద్రకు సూచనలు* 

ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం

పడుకునే ముందు మొబైల్, టీవీ దూరంగా పెట్టడం

కాఫీ, టీ రాత్రి వేళల్లో తగ్గించడం

తేలికపాటి ధ్యానం లేదా శ్వాసాభ్యాసం

పడకగది ప్రశాంతంగా, చీకటిగా ఉండేలా చూడడం

నిద్ర లేమి చిన్న సమస్యలా అనిపించినా, అది మెల్లగా మన ఆరోగ్యాన్ని, చివరికి మన ఆయుష్షునే తగ్గిస్తుంది.

“నిద్రను వృథా చేసినవాడు జీవితాన్నే తగ్గించుకుంటాడు” అన్నది అతిశయోక్తి కాదు — ఇది శాస్త్రీయ సత్యం.

సరిపడ నిద్ర — దీర్ఘాయుష్షుకు మూల మంత్రం...