Wednesday, March 11, 2026

******What is love? The shocking truths told by Plato | What is Love? Plato Philosophy

What is love? The shocking truths told by Plato | What is Love? Plato Philosophy

 https://m.youtube.com/watch?v=X8e4FWm9Dpo



00:04 మనిషి నాగరికత నేర్చుకున్నప్పటి నుంచి అడవుల నుంచి కాంక్రీట్ జంగిల్స్ వరకు ప్రయాణించినా కాలంతో పాటు మారుతూ వచ్చిన ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే అది ఒక అన్వేషణ
00:15 ఆ అన్వేషణే ప్రేమ. యుద్ధాలు జరిగినా, సామ్రాజ్యాలు కూలిపోయినా, కవుల కలం నుంచి రక్తం చెందిన దాని వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ ఇదే అని మనం నమ్ముతుంటాం. కానీ ఈ
00:26 మాటలు నావి కావు. ప్రపంచం గర్వించే గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో వేల ఏళ్ల క్రితమే ఒక భయంకరమైన సత్యాన్ని మన మొహాన కొట్టాడు. అదేమిటంటే లవ్ ఈస్ ఏ సీరియస్ మెంటల్
00:36 డిసీజ్ అని వినడానికి ఇది చాలా క్రూరంగా అన్ రొమాంటిక్ గా అనిపించవచ్చు. కానీ ప్లేటో లాంటి మేధావి ప్రేమను ఒక తీవ్రమైన మానసిక వ్యాధి అని ఎందుకన్నాడు? మనం
00:47 పవిత్రమైనది అని పూజించే ఈ ఎమోషన్ నిజానికి ఒక మానసిక రుగ్మత అయితే మనం ఇప్పటివరకు బ్రతుకుతున్న జీవితం ఒక పెద్ద అబద్ధమా? అసలు సమాజం మనకు నేర్పిన ప్రేమ
00:57 అంటే ఏమిటి త్యాగం, అనురాగం ఒకరి కోసం ఒకరు బ్రతకడం ఒకరి కళ్ళలో ఒకరు ప్రపంచాన్ని చూసుకోవడం ఇవన్నీ మనం సినిమాల్లో నవలల్లో చూసి నేర్చుకున్న
01:06 రొమాంటిక్ డెఫినిషన్స్ కానీ నిజానికి ప్రేమ అంటే ఒక వ్యక్తిపై మనకున్న విపరీతమైన డామినెన్స్ మనలో ఉన్న ఇన్సెక్యూరిటీ భావాన్ని మనలోని అగాధమైన
01:15 ఒంటరితనాన్ని కప్పి పుచ్చుకోవడానికి మనం ఇంకొకరితో చేసుకునే ఒక కెమికల్ డీల్ మాత్రమే ఈ ప్రేమ. మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే నిజానికి అవతలి
01:24 వ్యక్తిని ప్రేమించడం లేదు. ఆ వ్యక్తి మన జీవితంలో ఉండటం వల్ల మనకు కలిగే ఆ సెక్యూరిటీని ప్రేమిస్తున్నాం అంతే ఈ వ్యాధి మనల్ని ఎలా వణికిస్తుందో ఒక్కసారి
01:34 గమనిస్తే ఇది కొన్ని దశల్లో మనల్ని ఆక్రమిస్తుంది. మొదటి దశను మనం ఇన్ఫెక్షన్ అని పిలవచ్చు ఎక్కడో ఎవరో తెలియని వ్యక్తిని చూడగానే మన మెదడులో డోపమైన్
01:44 అడ్రినలిన్ లెవెల్స్ ఆకస్మాతుగా పెరిగిపోతాయి. దీన్ని మనం చాలా గర్వంగా స్పార్క్ అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని పిలుచుకుంటాం. కానీ మెడికల్ గా చూస్తే
01:52 ఇదొక అబ్సెసివ్ స్టేట్ రెండో దశ భ్రమ. వాడు లేకపోతే నేను లేను ఆమెతో మాట్లాడకపోతే నా రోజు గడవదు అని అనుకోవడం ఒక క్లాసిక్ డెల్యూషన్ ఇక్కడ లాజిక్
02:02 పూర్తిగా చచ్చిపోతుంది. ఒక మనిషి మరొక మనిషికి ప్రాణాధారం ఎలా అవుతాడు అది కేవలం మెదడు సృష్టించుకున్న ఒక మాయాజాలం మాత్రమే. మూడో దశ వ్యసనం ఒక డ్రగ్ అడిక్ట్
02:12 తనకి డోస్ దొరకపోతే ఎలా పిచ్చివాడైపోతాడో ప్రేమలో ఉన్న వ్యక్తి కూడా అవతలి వ్యక్తి అటెన్షన్ దొరక్కపోతే అలాగే విలవిలలాడిపోతాడు. ఇక నాలుగో దశ క్షీణత ఆ
02:21 అటెన్షన్ తగ్గినా లేదా ఆ వ్యక్తి దూరమైనా మనం పవిత్రం అని పిలుచుకున్న ఆ ప్రేమ వెంటనే విపరీతమైన ద్వేషంగా పగగా మారిపోతుంది. అంటే మన ప్రేమ అనేది కేవలం
02:32 అవతలి వ్యక్తి మనక ఇచ్చే వాల్యూ మీద ఆధారపడి ఉందన్నమాట. నిజానికి ఇదంతా ఒక పెద్ద సర్కాజం. ఒక పిచ్చివాడు రోడ్డు మీద నిలబడి చెట్టుతోనో గోడతోనో మాట్లాడుతుంటే
02:41 మనం వాడిని చూసి జాలి పడతాం లేదా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించమంటాం. కానీ అదే ఒక వ్యక్తి తన ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ అవతలి వ్యక్తి పంపే ఒక ఎమోజీకి గంటలు
02:50 గంటలు మురిసిపోతూ నవ్వుకుంటూ ఉంటే దాన్ని మనం క్యూట్ అంటాం. రాత్రి రెండు గంటలకి నిద్ర మానుకొని తిన్నావా పడుకున్నావా అని అడగడం కేరింగ్ ఎలా అవుతుంది? అది
02:59 కచ్చితంగా నిద్ర లేని వ్యాధి లక్షణం కాదా? సమాజం ఈ వ్యాధికి ఒక గ్లామర్ కోటింగ్ పూసింది. ఎందుకంటే ప్రేమ అనే మార్కెట్ మీద వేల కోట్ల బిజినెస్ నడుస్తోంది. గ్రీటింగ్
03:09 కార్డ్స్ నుంచి డైమండ్ రింగ్స్ వరకు సినిమాల నుంచి డేటింగ్ యప్స్ వరకు అంతా ఈ మెంటల్ డిసీజ్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. సమాజం చెప్పే ప్రేమ
03:17 వెనుక ఉన్న అసలు ఉద్దేశం సోషల్ కన్ఫర్మిటీ. అంటే అందరూ పెళ్లి చేసుకుంటున్నారు అందరూ రిలేషన్షిప్ లో ఉన్నారు కాబట్టి నేను కూడా ఎవరినో ఒకరిని
03:25 పట్టుకోవాలి అనే భయమే ఇది. మన హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందంటే మనం ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళు మనకి నచ్చినట్టు ఉండాలని కోరుకుంటాం.
03:34 వాళ్ళు మనల్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళితే భరించలేం. అంటే అక్కడ మనకు కావాల్సింది అవతలి వ్యక్తి సంతోషం కాదు మన అహానికి కలిగే తృప్తి. మనుషులు స్వతహాగా
03:43 అత్యంత స్వార్ధపరులు. మనం ఇంకొకరిని ప్రేమిస్తున్నామ అంటే నిజానికి వాళ్ళలో మనల్ని మనం ప్రేమిస్తున్నాం. మన అవసరాలని తీర్చే ఒక అద్దం కోసం మనం పడే తాపత్రయమే ఈ
03:53 ప్రేమ. ఫిలాసాఫికల్ గా చూస్తే మానవ ఉనికి అనేది అత్యంత శూన్యమైనది. ఆ శూన్యాన్ని నింపుకోవడానికి మనం రకరకాల వ్యసనాలని వెతుక్కుంటాం. కొందరికి అధికారం వ్యసనం
04:03 అయితే మరికొందరికి డబ్బు వ్యసనం. మెజారిటీ ప్రజలకి ఈ ప్రేమ అనేది ఒక వ్యసనమే. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు కూడా లోలోపల నవ్వుకుంటూ ఉండవచ్చు. నా ప్రేమ
04:12 అలాంటిది కాదు నా పార్ట్నర్ చాలా గ్రేట్. మా మధ్య ఉన్నది గ్రేట్ రిలేషన్షిప్ బాండ్ అని మిమ్మల్ని మీరు సర్ది చెప్పుకుంటూ ఉండవచ్చు. కానీ ఇది సరిగ్గా ఒక రోగి తనకి
04:21 జబ్బు లేదని డాక్టర్ తో వాదించినట్టే ఉంటుంది. మీ ఎమోషన్స్ మీద మీకు కంట్రోల్ లేనప్పుడు అవతలి వ్యక్తి ప్రవర్తన మీద మీ సంతోషం ఆధారపడి ఉన్నప్పుడు దాన్ని ప్రేమ
04:30 అని పిలవడం కేవలం ఒక సాకు మాత్రమే అదిఒక బానిసత్వం మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీ మెదడులో జరుగుతున్న కెమికల్ లోచాన్ని మీరు ఒక గొప్ప
04:39 ఆధ్యాత్మిక అనుభూతిగా భ్రమపడుతున్నారు. సమాజం ఈ భ్రమను ప్రోత్సహిస్తోంది ఎందుకంటే నిజం తెలిస్తే మనుషులు విచ్చలవిడిగా మారిపోతారని వ్యవస్థలు కూలిపోతాయని భయం.
04:48 మనం పుట్టినప్పటి నుంచి చవ్వే వరకు ఒంటరి వాళ్ళమే. ఈ నిజాన్ని అంగీకరించలేక తోడు కోసం పరితపిస్తూ ఆ తోడు దొరికినప్పుడు దానికి ప్రేమ అనే లేబుల్ వేసి పండగ
04:57 చేసుకుంటాం. కానీ ఆ రంగు కొద్ది రోజులకే వెలిసిపోతుంది. అప్పుడు మొదలవుతుంది అసలు నరకం. గొడవలు, అనుమానాలు, ఆధిపత్య పోరాటాలు. అయినా సరే మనం దీన్ని
05:06 వదిలిపెట్టం. ఎందుకంటే మనకి నిశ్శబ్దం అంటే భయం, ఒంటరితనం అంటే వణుకు. ఆ భయం నుంచి పుట్టిందే ఈ రిలేషన్షిప్ డ్రామా అంతా. ప్లేటో అన్నట్టు ఇది సీరియస్ మెంటల్
05:17 డిసీజ్ మాత్రమే కాదు ఇది ఒక సామూహిక పిచ్చి కూడా ఒకరు చేస్తే పిచ్చి అందరూ కలిసి చేస్తే అది సంప్రదాయం లేదా ప్రేమ చివరికి తేలేది ఏంటంటే మనిషి చేసే ప్రతి
05:28 పని వెనక ఉన్నది తన ఉనికిని కాపాడుకోవాలనే తపన. ఈ అనంతమైన విశ్వంలో మనం చాలా అల్పమైన వాళ్ళం అనే సత్యాన్ని మర్చిపోవడానికి మనకొక మత్తు కావాలి. ఆ మత్తే ప్రేమ. అది
05:41 రోగం కాకపోతే ప్రపంచంలో ఇన్ని విరిగిన హృదయాలు ఎందుకు ఉంటాయి ప్రేమ పేరుతో ఇన్ని ఆత్మహత్యలు ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతాయి పవిత్రమైన చోట హింస ఉండదు కానీ ప్రేమలో
05:52 హింస అంతర్లీనంగా ఉంటుంది. అందుకే మళ్ళీ అదే పాయింట్ దగ్గరికి వద్దాం. మనిషి దేనికోసం వెతుకుతున్నాడో అది శాంతి కాదు. అది ఆనందం కాదు. అది కేవలం తన
06:02 ఒంటరితనాన్ని చంపుకోవడానికి తన ఇన్సెక్యూరిటీ భావాన్ని కప్పి పుచ్చుకోవడానికి వెతుక్కునే ఒక భయంకరమైన మానసిక వ్యాధి. మీరు ప్రేమిస్తున్నాను అని
06:11 అనుకుంటున్న ప్రతిసారి ఒకసారి అద్దంలో చూసుకోండి. అక్కడ కనిపిస్తున్నది ఒక ప్రేమికుడు కాదు ఒక రోగి తనకి తానే మందు వేసుకోలేక ఇంకొకరిని ఆ మందుగా వాడుకోవాలని
06:22 చూస్తున్న ఒక అసక్తుడు. ప్లేటో చెప్పింది అక్షర సత్యం. మనం ప్రేమ అని పిలుచుకుంటున్న ఈ మాయాజాలం నిజానికి ఒక సీరియస్ మెంటల్ డిసీజ్. ఈ వ్యాధి నుంచి
06:32 బయట పడటం అంత సులభం కాదు. ఎందుకంటే రోగికి తను రోగి అని తెలిసినప్పుడే చికిత్స మొదలవుతుంది. కానీ ఇక్కడ ప్రపంచం అంతా ఆ రోగంలోనే మునిగి తేలుతోంది. కాబట్టి ఈ
06:42 సామూహిక పిచ్చిలో మీరు కూడా ఒక భాగమే. మీ ప్రేమ, మీ త్యాగం, మీ ఎమోషన్స్ అన్ని ఆ వ్యాధి లక్షణాలే. ప్రేమ అనేది ఒక సహజమైన అనుభూతి అని మనం అనుకుంటాం కానీ అది ఒక
06:53 సామాజిక ప్రోగ్రామింగ్. చిన్నప్పటి నుంచి మనకు వినిపించే కథలు మనం చూసే పరిసరాలు మనల్ని ఒక నిర్దిష్టమైన రీతిలో ఆలోచించేలా చేస్తాయి. ఆ ప్రోగ్రామింగ్ లో భాగమే ఈ
07:03 ప్రేమ. నిజానికి మనిషికి కావాల్సింది గుర్తింపు. ఆ గుర్తింపు ఇంకొకరి కళ్ళల్లో వెతుక్కున్నప్పుడు అది ప్రేమగా మారుతుంది. కానీ ఆ గుర్తింపు శాశ్వతం కాదు. ఎందుకంటే
07:13 అవతలి వ్యక్తి కూడా తన గుర్తింపు కోసం మీ దగ్గరకు వచ్చాడు. ఇద్దరు యాచకులు ఒకరినొకరు ధనవంతులు అని అనుకోవడం ఎంత ఫన్నీగా ఉంటుందో ఇద్దరు ఇన్సెక్యూరిటీ అనే
07:23 భావంతో ఉన్న వ్యక్తులు ఒకరినొకరు ప్రేమిస్తున్నాం అని అనుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఈ నిజాన్ని అంగీకరించడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకే మనం కవితలు
07:33 రాసుకుంటాం డ్యూయెట్లు పాడుకుంటాం. కానీ లోలోపల మనందరికీ తెలుసు ఇదంతా ఒక పెద్ద అబద్ధం అని ఆ అబద్ధాన్ని మనం ఎంత అందంగా అలంకరిస్తే అది అంత గొప్ప ప్రేమగా చలామణి
07:44 అవుతుంది. అందుకే ప్లేటో మాటల్ని తక్కువ అంచనా వేయకండి. ఆయన మనుషుల మనస్తత్వాలని లోతుగా అధ్యయనం చేసి చెప్పిన మాట అది. ప్రేమ అనేది ఒక తీవ్రమైన మానసిక వ్యాధి. ఆ
07:54 వ్యాధికి లోనైన ప్రతి ఒక్కరు ఒక మాయా లోకంలో బ్రతుకుతుంటారు. ఆ లోకం నుంచి బయటకు రావడం అంటే వాస్తవాలని ఎదుర్కోవడం. ఆ వాస్తవం చాలా భయంకరంగా ఉంటుంది. అందుకే
08:05 మనం ఆ వ్యాధినే ప్రేమిస్తాం. ఆ పిచ్చినే ఆరాధిస్తాం. చివరిగా మీరు ఎప్పటి నుంచి ప్రేమ కోసం వెతుకుతున్నారో గుర్తు తెచ్చుకోండి. అది మీరు పుట్టినప్పటి నుంచి
08:14 కాదు మీరు మీ గురించి మీరు భయపడటం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ భయానికి మనం పెట్టిన పేరే ప్రేమ. అదే ఆ సీరియస్ మెంటల్ డిసీజ్.
 *శ్రీమద్భగవద్గీత – షష్ఠాధ్యాయః* (1–2 శ్లోకాలు)

అనాశ్రితః కర్మఫలం     కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ     న నిరగ్నిర్న చాక్రియః ॥1॥

యం సన్న్యాసమితి ప్రాహుః     యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసన్న్యస్తసంకల్పః     యోగీ భవతి కశ్చన ॥2॥ 

శంకరభాష్య ఆధారిత భావార్థం & తాత్త్విక విశ్లేషణ


---

శ్లోకార్థం (సారాంశం)

కర్మఫలాన్ని ఆశ్రయించకుండా
తనకు చేయవలసిన కర్తవ్య కర్మను చేసే వాడే
నిజమైన సన్న్యాసి,
అలాగే నిజమైన యోగి కూడా.

అగ్ని త్యజించడమో,
కర్మను వదిలేయడమో
సన్న్యాసం కాదు.

ఎవరు “సన్న్యాసం” అని పిలుస్తారో
అదే నిజానికి “యోగం”.

సంకల్ప త్యాగం చేయని వాడు
ఎవరూ యోగి కాలేడు.


---

శంకరభాష్యానుసార విశ్లేషణ

🔹 “అనాశ్రితః కర్మఫలం”

శంకరాచార్యులు ఇక్కడ స్పష్టంగా చెబుతారు:

👉 కర్మను వదిలేయమని కాదు
👉 కర్మఫల ఆశను వదలమని

ఫలాపేక్షే కర్మకు బంధం.
ఫలత్యాగమే కర్మను శుద్ధం చేస్తుంది.

అందుకే —
కర్మ చేస్తూనే,
అకర్తృత్వ బుద్ధితో ఉన్నవాడే
నిజమైన సన్న్యాసి.


---

🔹 “న నిరగ్నిః న చ అక్రియః”

ఇది ఒక కీలకమైన శ్లోకభాగం.

శంకరుల వ్యాఖ్యానం ప్రకారం:

అగ్ని త్యజించడం = సన్న్యాసం కాదు

కర్మ మానేయడం = మోక్షం కాదు


అంతఃసంకల్ప త్యాగమే సన్న్యాసం.

బాహ్య రూపం కాదు,
అంతర దృష్టే ముఖ్యం.


---

2వ శ్లోకం – సన్న్యాసం = యోగం

🔹 “యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి”

ఇక్కడ కృష్ణుడు చెప్పింది తత్త్వ విప్లవం.

ప్రపంచం రెండు మార్గాలు అంటుంది:

ఒకటి సన్న్యాసం

ఒకటి యోగం


కృష్ణుడు చెబుతున్నాడు: 👉 ఇవి రెండు కాదు, ఒకటే.

శంకరుల మాటల్లో:

> కర్మఫల త్యాగంతో చేసే కర్మయోగమే
జ్ఞానానికి సిద్ధత.




---

🔹 “అసన్న్యస్తసంకల్పః” — అసలు త్యాగం ఇదే

సంకల్పం అంటే:

నేను చేస్తున్నాను

నాకు ఇది రావాలి

నాకు ఇది కావాలి


ఇవి ఉన్నంతవరకూ:

యోగం లేదు

సన్న్యాసం లేదు


అందుకే: 👉 సంకల్ప సన్న్యాసం లేకుండా యోగం అసంభవం.


---

ఉపనిషత్తుల ఆధారం

📖 ఈశావాస్యోపనిషత్ (2)

> కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః
కర్మ చేస్తూనే జీవించాలి,
కాని బంధం లేకుండా.



📖 బృహదారణ్యకోపనిషత్ (4.4.22)

> నిష్కామః కర్మ కుర్వీత
నిష్కామ కర్మే ముక్తికి మార్గం.



📖 ముండకోపనిషత్ (1.2.12)
కర్మల ద్వారా జ్ఞాన సిద్ధి,
కాని కర్మలే మోక్షం కావు.


---

తాత్త్విక సారాంశం

సన్న్యాసం అనేది వేషం కాదు

యోగం అనేది శారీరక కసరత్తు కాదు

సంకల్ప త్యాగమే రెండింటికీ ప్రాణం


👉 కర్మలో ఉండి, కర్తృత్వం విడిచినవాడే యోగి.
👉 అతడే నిజమైన సన్న్యాసి.             

మానవుడు కానుకలతో దేవుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తే అది కేవలం మూర్ఖత్వమే!

 మానవుడు కానుకలతో దేవుడి అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తే అది కేవలం మూర్ఖత్వమే!

భగవంతుడు చిత్తచోరుడే కానీ విత్తచోరుడు కాదు! ఆయనను ప్రేమ, భక్తి, విశ్వాసాల ద్వారా మాత్రమే సాధించుకోవాలి.

సత్యభామ తన అహంకారంతో తన సంపద ద్వారా కృష్ణుడిని తనవైపు తిప్పుకోవాలని ఆశించింది. ఆమె తన వద్ద ఉన్న భారీ మొత్తంలో బంగారాన్ని తూకం వేసి విఫలమైంది.

రుక్మిణి నిజమైన భక్తితో సమర్పించిన ఒకే ఒక్క తులసి ఆకు తన సంపదను మించిందని నిరూపించడం ద్వారా సత్యభామ తన మూర్ఖత్వాన్ని గ్రహించింది.

సత్యభామ కోరికకు ప్రతీక. అయితే రుక్మిణి భక్తికి ప్రతీక. 

ఆకు, పువ్వు, పండు లేదా నీటిని సమర్పించడం పట్ల తాను సంతోషంగా ఉంటానని కృష్ణుడు చెప్పాడు. 

దీన్ని కేవలం అక్షరాలా తీసుకోకూడదు. మన శరీరమే ఆకు. మన హృదయమే వికసించిన పువ్వు. మన మనస్సే ఫలం, మన కన్నీళ్ళే తోయం(నీరు). ఇవి దేవునికి ఆమోదయోగ్యమైన అసలైన సమర్పణలు. వీటి ద్వారానే దేవుడు సంతృప్తి చెందుతాడు.

మనలో ప్రేమ ఉంటే నిత్యమూ భగవంతుడు మనతోనే ఉంటాడు. ఆయన మనతో ఉంటే జీవితంలో మనకు లోటు అంటూ ఏదీ ఉండదు.
 *_🌴 నీ కర్మ వశానా నువ్వు కొన్నిసార్లు అపజయం పాలు కావడం గానీ వెనుకబడి ఉండడం గాని లేదా ఇబ్బందులకు గురి కావడం గానీ జరగవచ్చు.. కానీ భగవంతుని పై నీ నమ్మకం చెరిగిపోకుండా ఉంచుకో! నువ్వు ముందుకు తూలి పడినా, నీ నమ్మకం నిన్ను కిందికి పడిపోకుండా కాపాడుతుంది. నువ్వు దృఢంగా నిలబడేలా నీకు ఆసరాగా మారుతుంది.. మారు ప్రయత్నంలో నిన్ను విజయవంతం చేస్తుంది..🌴_*




 *#గుడి_నిర్మాణం_జీవుడికి ఆధారమైన చక్రములు....*
#సహస్రార_చక్రము: (గర్భ గుడి)
జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

#గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.

#ఆజ్ఞాచక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)

#విశుద్ధిచక్రము: (అంతరాలం)
మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.

#అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.

#అనాహతచక్రము: (అర్ధమంటపం)

ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.

#అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.

#మణిపూరకచక్రము:(మహామంటపం)
నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.

#స్వాధిష్ఠానచక్రము: (ధ్వజస్తంభం)

ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

#ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.

#మూలాధారచక్రము: అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.

#మోకాలిస్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.

#పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.

ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి.

ఓం శ్రీ మాత్రే నమః 

నేను ఏ రూపాన్ని దర్శిస్తూ, ఏ నామాన్ని జపిస్తే మంచిది ?"

 నేను ఏ రూపాన్ని దర్శిస్తూ, ఏ నామాన్ని జపిస్తే మంచిది ?"

"స్మరణ, ధ్యానాదులకు ఏదేవత రూప నామాలైనా ఒక్కటే ! మనసుచేసే స్మరణ, ధ్యానాలే ముఖ్యం కానీ అది ఎంచుకునే రూపనామాలు ప్రధానం కాదు. తనను ఏ నామస్మరణ చేయమంటారని రామశాస్త్రి అనే భక్తుడు శ్రీరమణమహర్షిని అడిగాడు. నీ పేరునే సార్ధక నామం చేసుకోమని మహర్షి సూచించారు. అంటే రాముడన్నది కేవలం పేరుకే పరిమితం చేసుకోకుండా నిజంగా రాముడిగానే ఉండేందుకు ప్రయత్నించాలని మహర్షి ఉపదేశం. మనం అనేక దేవతల పేర్లు పెట్టుకుంటాం. కానీ పిలిచేప్పుడు, పలికేప్పుడు వారి స్మరణ ఉండదు. అలాకాక పేరుపెట్టి పిలిచే ప్రతిసారీ ఆ దైవాన్ని స్మరించగలిగితే అది సాధనే అవుతుంది. పేరు మన దేహానికే అయితే శవాన్ని కూడా పేరు పెట్టి పిలవాలి. కానీ ప్రాణం పోయిన తర్వాత దాన్ని 'రామయ్యశవం' అంటారేగాని శవాన్ని రామయ్య అని ఎవరూ పిలవరు. మనసు, దేహానికి వర్తించని ఆ నామం అనాదిగా వస్తున్న మన ప్రాణస్వరూపమైన ఈశ్వరుడిదే. ఆ ధ్యాసతో ఉండగలిగితే ప్రతి పిలుపు భగవంతుని సంకీర్తనే అవుతుంది !"*

*"అసలు మనసుకు 'ఇష్టాయిష్టాలు' ఎలా ఏర్పడుతున్నాయి ? 'వాసనా బలగాల'ను పెంచి పోషించేవి ఏమిటి ??"*

****

*"మనకు ఇష్టం కలుగకముందు ఏర్పడిన ఒకానొక అనుభవమే ఆ ఇష్టాన్ని పెంచుతోంది. మనసును ఇష్టాయిష్టాలతో కలుషితం చేసేది 'తమస్సు, రజస్సు' అనే గుణాలు. తమస్సు అంటే 'చీకటి'. కోరుకునే విషయం తప్ప ఇంకేది కనిపించనంత వివేకంలేని మనోచీకటి అది. ఇది మనలోని వాసనాబలాన్ని పోషిస్తోంది. రజోగుణ ప్రభావం వల్ల కోర్కెతీర్చుకోవటం కోసం ప్రయత్నం జరుగుతుంది. సత్వగుణం ఈ రెంటికీ మధ్యస్థంగా త్రాచులో ముల్లులా ఉంటుంది. రజో, తమో గుణాల సమస్థితే 'సత్వగుణం'. ఈ గుణాలే మనలో 'వాసనాబలాన్ని' పెంచి పోషించేది !"*

"నేను" లేచిందా..సర్వము లేస్తుంది.
"నేను" అణిగిందా...సర్వము అణగుతుంది.
ఈ  " నేను" సమస్తాన్ని తెలుసుకుంటుంది.
ఈ "నేను" ను తెలుసుకోకుండా, సమస్తము
తెలుసుకోవాలని అనుకోవడం అవివేకం.
అందుకే  "నేను" ను విచారించండి.
"నేను" ను విచారించడమే వివేకం.

*పెళ్లిమంత్రాలకు అర్థం పరమార్థం..........!!* *పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?*

 *పెళ్లిమంత్రాలకు అర్థం పరమార్థం..........!!*
*పెళ్లంటే... తప్పెట్లు, తాళాలు, మూడు ముళ్లు, ఏడడుగులు... అంతేనా?*

*పెళ్లంటే..*
*రెండు మనసుల కలయిక,* 
*నూరేళ్ల సాన్నిహిత్యం...*
*ప్రమాణాలు , వాటికి కట్టుబడి ఉండటం*

*ప్రమాణాలకు కట్టుబడి ఉంటే ఆ సంసారం స్వర్గం.*
*ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకం.*

మానవజీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం వివాహం. ఆ సందర్భంలో వధూవరులతో పలికించే ప్రామాణిక మంత్రాలు...*

 వాటి అర్థాలపై ప్రత్యేకం :-
"""""""""""""""""""""""""""""""""
జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువకాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పటిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్దేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. 

ఆప్రమాణాలను త్రికరణశుద్ధిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు , ఆరుకాయలుగా వర్థిల్లుతుంది. ఆ బంధం నిండునూరేళ్లు పవిత్రంగా, పచ్చగా ఉంటుంది.

 వైవాహిక జీవితానికి మూలం :-
""""""""""""""""""""""""""""""""""""""""
వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షులు చెబుతారు.

 ఆధ్యాత్మిక, సాంఘిక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు.

సంప్రదాయ వివాహాలలో ముఖ్యంగా తొమ్మిది అంశాలు ఉంటాయి. అవి..

(1) సమావర్తనం..
(2) కన్యావరణం..
(3) కన్యాదానం..
(4) వివాహహోమం..
(5) పాణిగ్రహణం..
(6) అగ్నిపరిచర్య..
(7) లాజహోమం..
(8) సప్తపది..
(9) నక్షత్ర దర్శనం.

   సమావర్తనం :-
"""""""""""""""""""""

పెళ్లితంతులో అత్యంత ప్రధానమైన ‘సమావర్తనం’ అంటే తిరిగిరావటం అని అర్థం.

గురుకులంలో విద్య పూర్తయ్యాక, .....

     " చరితం బ్రహ్మచర్యోహం " 

అనే శ్లోకాన్ని గురువుల అనుజ్ఞ కోసం పఠించి, గురువు అనుజ్ఞతో గృహస్థాశ్రమం స్వీకరించడానికి సిద్ధపడడం. 

వివాహం చేసుకున్నాక, గురువుకు ఇచ్చిన మాటను అతిక్రమించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది.

గృహస్థ ధర్మాన్ని స్వీకరించబోయే సమయంలో...

(*) రాత్రి సమయంలో స్నానం చేయను..
(*) వస్త్రరహితంగా స్నానం చేయను..
(*) వర్షంలో తడవను..
(*) చెట్లు ఎక్కను..
(*) నూతులలోకి దిగను..
(*) నదిని చేతులతో ఈదుతూ దాటను..
(*) ప్రాణ సంశయం ఏర్పడే సన్నివేశాలోకి ఉద్దేశపూర్వకంగా ప్రవేశించను.

................................. అని పలికిస్తారు.

   అంకురారోపణం :-
""""""""""""""""""""""""""

వివాహానికి ముందే కన్యాదాత ఈ కార్యక్రమం నిర్వర్తిస్తాడు.

 పంచపాలికలలో పుట్టమన్ను పోసి నవధాన్యాలను పాలతో తడిపి మంత్రయుక్తంగా వేసి పూజిస్తారు.

 ఇందులోని పరమార్థం..... 
‘‘కొత్తగా పెళ్లి చేసుకుంటున్న దంపతులారా! భూమిలో విత్తనాలను వేస్తే పంట వస్తోంది. కాబట్టి నేలతల్లిని నమ్మండి, పంట సంతానాన్ని పొందండి’’ .

......................... అని ధర్మసింధు చెబుతోంది.

   కన్యావరణం :-
"""""""""""""""""""""""

కన్యను వరించటానికి రావటాన్ని ‘కన్యావరణం’ అంటారు. 

మంగళవాద్యాల నడుమ వధువు ఇంటికి వచ్చిన వరుడిని, వధువు తండ్రి గౌరవంగా ఆహ్వానించి మధుపర్కం ఇస్తాడు.

     మధుపర్కం :-
"""""""""""""""""""""""""
మధుపర్కమంటే ‘తీయని పానీయం’ అని అర్థం.

 వరుడికి... 
తేనె,
పెరుగు, 
బెల్లం కలిపిన మధురపదార్థం తినిపించాక, మధుపర్కవస్త్రాలను ఇస్తారు.

     ఎదుర్కోలు సన్నాహం :-
""""""""""""""""""""""""""""""""""""""
ఇరుపక్షాలవారు శుభలేఖలు చదివి, ఒకరికొకరు ఇచ్చుకుని, పానకం అందచేస్తారు.

     కన్యాదానం :-
""""""""""""""""""""""""
వధువు తండ్రి, తన కుమార్తెను మరో పురుషుడికి కట్టబెట్టడమే కన్యాదానం. 

కన్యాదానం చేసేటప్పుడు వల్లించే మంత్రాలు....

" అష్టాదశవర్ణాత్వియకం కాన్యపుత్రవత్పాలితామయా
ఇదానిల తపదాస్వామి దత్తాం స్నేహేన పాలయం "

‘కుమారుడితో సమానంగా పెంచుకొన్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ప్రేమాభిమానాలతో కాపాడుకో’

‘శ్రీలక్ష్మీనారాయణ స్వరూపుడైన వరునికి ఇదిగో నీళ్లు... అంటూ వరుడి పాదాలు కడుగుతారు.

‘పితృదేవతలు తరించడానికి ఈ కన్యను నీకు దానం చేస్తున్నాను. 

సమస్తదేవతలు, పంచభూతాలు నేను చేస్తున్న ఈ దానానికి సాక్షులుగా ఉందురుగాక’ ‘అందంగా అలంకరించిన సాధుశీలవతి అయిన ఈ కన్యను " ధర్మకామార్థ సిద్ధికోసం " ప్రయత్నం చేస్తున్న ఈ సాధుశీలుడైన బుద్ధిమంతునికి దానంగా ఇస్తున్నాను’.

‘ధర్మబద్ధంగా సంతానం పొందడానికి, ధర్మకార్యాలు నిర్వహించడానికి ఈ కన్యను ఇస్తున్నాను’ .

వధువు తండ్రి ‘పృణీద్వం’ (వరించవలసినది) అంటాడు. 

అప్పుడు .....
వరుడు ‘పృణేమహే’ (వరిస్తున్నాను) అంటాడు.

ఆ తరువాత వధువు తండ్రి వరునితో,...

‘‘నేత్రాయ పౌత్రపుత్రా లక్ష్మీం కన్యాంనామ్నీం
ధర్మేచ అర్థేచ కామేచ త్వయైషా నాతిచరితవ్య"

ధర్మంలోనూ, 
అర్థంలోనూ, 
కామంలోనూ లక్ష్మీస్వరూపిణి అయిన ఈ కన్యను అతిక్రమించనివాడవై ఉండు అని పలికిన వధువు తండ్రితో, ‘నాతిచరామి’ (అతిక్రమించను) అని వరుడు మూడుసార్లు వాగ్దానం చేస్తాడు.

ఇది వేదోక్త మంత్రార్థం. ఆ మాటకు అంత మహత్తు ఉంది. అలా అన్న తరవాతే వరుడి పాదాలను కడిగి, కన్యాదానం చేస్తారు.

     యోక్త్రధారణం :-
"""""""""""""""""""""""""""""

యోక్త్రం అంటే దర్భలతో అల్లిన తాడు.

 వివాహ సమయంలో వరుడు దీనిని వధువు నడుముచుట్టూ కట్టి ముడి వేస్తాడు. 

ఈసమయంలో వరుడు.....

" ఆశాసానా సౌమ నవ ప్రజాం సౌభాగయం తను మగ్నే,
రనూరతా భూత్వా సన్న హ్యే సుకృతాయ కమ్ ’’  ........ అంటాడు.

ఉత్తమమైన మనస్సును, 
యోగ్యమైన సంతానాన్ని, 
అధికమైన సౌభాగ్యాన్ని, 
సుందరమైన తనువును ధరించి, ........
అగ్నికార్యాలలో నాకు సహచారిణివై ఉండు.

 ఈ జీవిత యజ్ఞమనే మంగళకార్యాచరణం నిమిత్తమై వధువు నడుముకు దర్భలతో అల్లిన తాటిని కడుతున్నాను... అనేది ఈ మంత్రార్థం.

    జీలకర్ర , బెల్లం :-
""""""""""""""""""""""""""""
వధూవరులు... 
జీలకర్ర, బెల్లం కలిపిన మెత్తని ముద్దను శిరస్సు భాగం లో ( బ్రహ్మరంధ్రం పైన ) ఉంచుతారు.

 ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరూ ఏకం కావడానికి, పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడేలా మనసు సంకల్పించటం దీని అంతరార్థం. 

ఈ సమయంలో .......

‘‘ ఆభ్రాతృఘ్నీం వరుణ ఆపతిఘ్నీం బృహస్పతే లక్ష్యం తాచుస్యై సవితుస్సః ’’ 

వరుణుడు - సోదరులను వృద్ధిపరచుగాక.
 బృహస్పతి - ఈమెను భర్తవృద్ధి కలదిగా చేయుగాక.
 సూర్యుడు - ఈమెను పుత్రసంతానం కలదానిగా చేయుగాక’’ 

........అని అర్థం. ఇదే అసలైన సుముహూర్తం.

       మంగళసూత్రధారణ :-
"""""""""""""""""""""""""""""""""""""

 తాళి......
తాటి ఆకులను గుండ్రంగా చుట్టి, పసుపు రాసి, పసుపుతాడు కడతారు. దానిని తాళిబొట్టు అంటారు. ( తాళవృక్షం నుంచి వచ్చింది ) .

వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ముడి వేస్తూ ఈ కింది మంత్రాన్ని పఠించాలి.

" మాంగల్య తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదాశ్శతం "

నా జీవానికి హేతువైన ఈ సూత్రాన్ని నీకంఠాన మాంగల్యబద్ధం చేస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు జీవించు... అని దీని అర్థం.

     పాణిగ్రహణము :-
""""""""""""""""""""""""""""""

" ధృవంతే రాజా వరుణో ధృవం దేవో బృహస్పతిః
ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం "

చంద్రుడు - మనస్సు
బృహస్పతి - కాయం 
అగ్నిహోత్రుడు - వాక్కు  ... 

వీరు ముగ్గురి నుంచి బతిమాలి, వధువును తీసుకువస్తాడట వరుడు. 

అంటే త్రికరణశుద్ధిగా కాపురం బావుంటుంది అని అర్థం.

కన్య ........
పుట్టగానే కొంతకాలం చంద్రుడు, 
కొంతకాలం గంధర్వుడు, 
కొంతకాలం అగ్ని కాపాడతారట. 

ఆ తరువాత వారి ముగ్గురిని అడిగి వరుడు వధువును తీసుకువస్తాడట .

సోముడు నిన్ను గంధర్వుడికిచ్చాడు, 
గంధర్వుడు అగ్నికిచ్చాడు, 
నేను నిన్ను కాపాడవలసిన నాలుగవవాడను’ అని అభిమంత్రించి పెళ్లికూతురు చేయి పట్టుకొంటాడు. ఇదే పాణిగ్రహణం.

తలంబ్రాలు :-
"""""""""""""""""

దీనినే అక్షతారోహణంగా చెబుతారు. 

అక్షతలు అంటే నాశం లేనివి. వీరి జీవితం కూడా నాశనరహితంగా ఉంటుందని చెప్పడం కోసమే ఈ తంతు. 

ఇందులో ముందుగా..... 
ఒకరి తరవాత ఒకరు కొన్ని మంత్రాలు ఉచ్చరించాక వేడుక ప్రారంభం అవుతుంది. 

సంతానం, 
యజ్ఞాది కర్మలు, 
సంపదలు, 
పశుసంపదలు ... కలగాలని భార్యాభర్తలు వాంఛిస్తారు.

సప్తపది :-
""""""""""""""

ఏడడుగులు నడిస్తే సంబంధం దృఢపడుతుందట. ఈ ఏడడుగులు ఏడేడు జన్మల అనుబంధాన్నిస్తుంది.

 వరుడు వధువుని చేయి పట్టుకొని అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందుకి పెడుతూ, ఏడు మంత్రాలు చెబుతాడు. ఇదే సప్తపది. 

ఇందులో వరుడు వధువుని ఏడు కోరికలు కోరతాడు. (*) అన్నం..
(*) బలం..
(*) ప్రతిఫలం..
(*) వ్రతాదికం..
(*) పశుసంపద..
(*) సంతానం..
(*) ఋషుల అనుగ్రహం..

కలగాలని ఒక్కో అడుగూ వేస్తూ చదువుతారు.

ఈ మంత్రాలను త్రికరణశుద్ధిగా వల్లిస్తూ, అందులోని పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని, పెళ్లినాడు చేసే ప్రమాణాలను అతిక్రమించకూడదని, వీటికోసం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మహర్షులు చెప్పారు. 

ప్రమాణాలను నిలబెట్టుకున్న నాడు వివాహవ్యవస్థ పటిష్టంగా ఉంటుందనే పెద్దల వాక్కు ఆచరణీయం.

కొత్త బంధాలు - పరిచయాలు :-
""""""""""""""""""""""""""""""""""""""

మానవజీవితంలోని అన్ని సంస్కారాలలోకీ అతి ముఖ్యమైనది వివాహం. దీనితో రెండు జీవితాల బంధం ముడిపడి ఉంటుంది. మూడుముళ్ల బంధం తో వివాహజీవితం కొనసాగుతుంది. 

వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టాలు ....
(*) స్నాతకం..
(*) కాశీయాత్ర..
(*) కన్యాదానం..
(*) శుభముహూర్తం..
(*) మంగళసూత్రధారణ..
(*) తలంబ్రాలు..
(*) సప్తపది..
(*) అరుంధతీ దర్శనం..

ఈ కార్యక్రమాలు పురోహితుల వేదమంత్రాల మధ్య, బంధుమిత్రుల శుభాశీస్సుల మధ్య వైభవోపేతంగా జరుగుతుంది. వివాహంతో ఇరువర్గాల బంధువుల మధ్య కొత్త పరిచయాలు, కొత్త బంధాలు, అనుబంధాలు కలుగుతాయి.

ఆత్మల అనుసంధానం :-
""""""""""""""""""""""""""""""""""""

మానవుడు... 
కడుపులో ఉన్నప్పటి నుంచి, తనువు చాలించేవరకు మొత్తం 16 కర్మలు ఉంటాయి. 

వాటిల్లో వివాహం అతి ప్రధానమైనది,

స్త్రీపురుషులు కలిసి ధర్మార్థకామమోక్షాలను సాధించుకోవడమే వివాహ పరమార్థం.

జీవిత భాగస్వామ్య వ్యవస్థ నుంచి రెండు ఆత్మలుగా ఏకమవ్వడమే వైవాహిక జీవితం. పెళ్లితో స్త్రీపురుషుల అనుబంధానికి నైతికత ఏర్పడుతుంది. 

లౌకికంగా ఏర్పడే అన్ని అనుబంధాలలోకి వివాహబంధం అతి ముఖ్యమైనది, పవిత్రమైనది.

 పెళ్లి వెనుక ఉన్న సృష్టి రహస్యం, పెళ్లి పేరుతో జరిగే మంత్రోచ్చారణలు అన్నీ కలిసి దంపతులను సృష్టికారకులుగా నిలబెడుతున్నాయి.
    శ్రీ శ్యామల జ్యోతిష్యాలయము పెడన.       
             సర్వే జనా సుఖినోభవంతు.          
 వయసి గతే కః కామవికారః 
శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారః
జ్ఞాతే తత్వే కః సంసారః 10

భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు. 

*జ్ఞానం ఒక జీవ నది!* *ఎవ్వరికీ అన్ని ముందే తెలియవు.*

 *జ్ఞానం ఒక జీవ నది!*
                

*ఎవ్వరికీ అన్ని ముందే తెలియవు.*

```
పుట్టినప్పుటినుండి మనకి ఊహ వచ్చే వరకు తల్లి చాలా విషయాలు చెబుతుంది. అలా చెప్పింది తెలుసుకోవడం “జ్ఞానం.”

కొంచెం పెద్దయ్యాక తండ్రి చాలా భౌతిక విషయములు, ఎవ్వరితో ఎలా ఉండాలో చెబుతారు, ఇదొక జ్ఞానం.

స్కూల్లో చేరంగానే, ప్రాధమిక జ్ఞానం నుండి (అక్షర జ్ఞానం దగ్గరనుండి అనేక విషయాలు నేర్పుతారు) ఉపాధ్యాయులు ఎన్నో విషయాలు చెబుతారు. ఇదొక “జ్ఞానం.”

తరువాత మిత్రులు, బాల్య మిత్రులు, కళాశాల మిత్రులు, ఉద్యోగ మిత్రులు, ఇలా మిత్రులు మనకి అనేక తెలియని విషయాలు చెబుతారు. ఇదొక ‘జ్ఞానం.’

వార్తాపత్రికలు, పుస్తకాలు, గ్రంధాలు కొంత ‘జ్ఞానం’ నేర్పుతాయి.

“నేర్చుకునే నైపుణ్యం ఉంటే మన అనుభవాలు కొంత ‘జ్ఞానం నేర్పుతాయి.’

ఇలా ‘జ్ఞానం, ఏమి తెలియని మనకి, ఎందరో, తల్లి మొదలుకొని, అనుభావాల వరకు మనకి ‘జ్ఞానం’ అందిస్తున్న వారే.

ఆది గురువు దత్తాత్రేయ స్వామి కూడా తాను 24 గురువుల దగ్గర నేర్చుకొన్నారు అని చెప్పారు.

ఇలా ‘జ్ఞానం తెలిపే వారు గురువులు, తెలుసుకునే వారు శిష్యులు.’

ఐతే ఇదంతా భౌతిక ‘జ్ఞానం వరకే!’

ఆధ్యాత్మిక ‘జ్ఞానం’ కోసం మనకి సద్గురువు అవసరం. ఆయన ఆ జ్ఞానాన్ని సాధన చేసి అనుభవ పూర్వకంగా తెలుసుకొని, ఆ సాధన ఇతరులతో చేయించ గలిగిన నైపుణ్యం కలవారై ఉంటారు.

మన అంతరంగం నిష్కామ కర్మలతో, స్వార్ధం లేకుండా, మమకారం లేకుండా శుద్ధమైతే, అప్పుడు పరమాత్మ ఒక సద్గురు రూపంలో మన వద్దకు వచ్చి, సాధన మార్గం ఉపదేశించి మనతో సాధన చేయిస్తారు.

ఇది జ్ఞానం వచ్చే విధానము.

అయితే జ్ఞానం కావాలి అంటే కొన్ని అర్హతలు కావాలి!```


**అవి:*
*1). అన్నీ "నాకే తెలుసు" అన్న భావం ఉండకపోవడము.*

*2). మనకి *జ్ఞానం నేర్పే వ్యక్తి పట్ల విశ్వాసం ఉండాలి. "ఆ వీడి మొహం వీడికి ఏం తెలుసు", "పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు" అనుకుంటే జ్ఞానం రాదు.*

*3) తెలుసుకునే జ్ఞానం పట్ల శ్రద్ధ భక్తి*

*4). *జ్ఞానం ఒక నిరంతరంగా ప్రవహించే జీవ నది అని,  అది తనకు తన గురువు ద్వారా, తన నుండి తనని నమ్మే వారికి వెళుతుంది అని తెలుసుకోవాలి.*

*5) జ్ఞానానికి   "పేటెంట్ రైట్స్" ఉండవు. ఇది "నా జ్ఞానం", "నా అనుమతి లేకుండా" ఇతరులకి చెప్పకూడదు అనుకోవడం మూర్ఖత్వం.*

*6). ప్రతి ఒక్కరు వారికి తెలిసింది, విన్నది ఇంకొకరికి చెప్పి (గురువు కావాలని వారికి ఉండదు) వారిచే మెప్పుదల పొందాలి అనే ఆశ ఉంటుంది. భుజం తట్టి శెభాష్ అనిపించుకోవాలి అని ఉంటుంది.*

*జ్ఞానం ఒకరినుండి ఇంకొకరికి వెళ్ళిపోతుంది అని గ్రహించాలి. *జ్ఞానం ఒక జీవ నది లాంటిది అని తెలుసుకోవాలి.*.      
 *అంతర్దృష్టి*

పల్లెటూరి వెనక ఒక చిన్న పల్లె, ఆ పల్లెలో వనమాలి అనే శిల్పి ఉండేవాడు. అతని చేతులు శిలకు ప్రాణం పోశాయని పేరు. అతని తండ్రి, తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ కళను, దైవంగా భావించి పూజించేవాడు. గ్రామ దేవాలయానికి శివలింగం చెక్కాలన్నది అతని చిరకాల స్వప్నం.

ఒక శుభముహూర్తాన వనమాలి తన పని ప్రారంభించాడు. ఎంతో నిష్టతో, భక్తితో, తన ఆత్మను కూడా ఆ శిలలో నిక్షిప్తం చేస్తున్నట్లు శిల్పాన్ని తీర్చిదిద్దుతున్నాడు. అతని చేతిలో అది కేవలం రాయి కాదు, శివుని రూపం. రోజులు గడిచాయి, శివలింగం సగం పూర్తయింది. ఆ గ్రామస్తులందరూ ఆ శిల్పాన్ని చూసి మురిసిపోయారు, ఎప్పుడెప్పుడు ప్రతిష్ఠిస్తారా అని ఎదురు చూశారు.

అయితే విధి వక్రీకరించింది. ఒకనాటి రాత్రి, విచిత్రమైన జ్వరంతో వనమాలి కళ్ళు కనిపించకుండా పోయాయి. కళ్ళ ముందు చీకటి తప్ప ఏమీ లేదు. అతని కల చెదిరింది. శివలింగం అసంపూర్తిగా మిగిలిపోయింది. "నా శివుని నేను ఎలా పూర్తి చేయగలను? నా చేతులు పని చేయగలవు కానీ, నా కళ్ళు చూడలేవు కదా!" అని తీవ్ర నిరాశలోకి జారిపోయాడు. గ్రామ పెద్దలు, పూజారి తీవ్ర ఆవేదన చెందారు. ప్రతిష్ఠ ముహూర్తం దగ్గర పడుతోంది.

కానీ, వనమాలి మనసులో ఏదో అదృశ్య శక్తి అతనిని నిరంతరం వెనక్కి లాగుతున్నట్లు అనిపించింది. అతని గురువు, అంటే అతని తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి: "శిల్పం కళ్ళతో చూసి చెక్కేది కాదు వనమాలి, మనసుతో చూసి, ఆత్మతో స్పృశించి చెక్కేది. నిజమైన రూపం నీ హృదయంలోనే ఉంది." పూజారి కూడా వచ్చి, "వనమాలి, దైవకార్యంలో అడ్డంకులు సహజం. నీ భక్తిని పరీక్షించడానికి వచ్చినవి. కళ్ళు మూసుకున్నా, నీ మనసు చూడగలదు. నీ చేతులకు శివుడే మార్గం చూపుతాడు," అని ధైర్యం చెప్పాడు.

వనమాలికి కొత్త ధైర్యం వచ్చింది. తన కళ్ళు పోయినా, హృదయం నిండా భక్తిని నింపుకుని, మళ్ళీ ఆ శివలింగం దగ్గర కూర్చున్నాడు. అతని చేతులు స్పర్శతో శిలను అన్వేషించాయి. ఆ కళ్ళు లేని వనమాలి, తన ఊహతో, తన అంతర్దృష్టితో, తన భక్తితో పని చేయడం ప్రారంభించాడు. గ్రామస్తులు కొందరు అతని పిచ్చిని చూసి నవ్వారు. "కళ్ళు లేనివాడు శిల్పాన్ని ఎలా చెక్కగలడు?" అని గేలి చేశారు. కానీ వనమాలి వాటిని పట్టించుకోలేదు. అతని చేతుల్లో అద్భుతం జరుగుతోంది. ప్రతి స్పర్శ, ప్రతి సుత్తె చప్పుడు, ఒక ప్రార్థనగా మారింది.

ప్రతిష్ఠాపన దినం వచ్చింది. జనం గుమిగూడారు. అసంపూర్ణమైనా, అంధుడు చెక్కిన విగ్రహాన్ని చూడడానికి అందరూ ఆతృతగా ఉన్నారు. తెర తీయబడింది. అందరూ నిశ్చేష్టులయ్యారు! అదొక అద్భుతం! శిల్పి వనమాలి కళ్ళు లేనివాడైనా, ఆ శివలింగం అద్భుతంగా, సజీవంగా, దివ్యమైన కాంతితో మెరిసిపోతోంది. అది పగటిపూట కూడా నక్షత్రంలా ప్రకాశిస్తోంది. ఆ రూపం అతని గత శిల్పాలను మించిపోయింది. వనమాలి కళ్ళలో ఆనంద బాష్పాలు. "నేను చూడలేదు. ఆయనే నా చేతులకు మార్గం చూపించాడు. నా కళ్ళు పోయినా, ఆయన రూపం నా హృదయంలో స్పష్టంగా కనిపించింది. నాకు అంతర్దృష్టి కలిగింది!" అన్నాడు భక్తితో.

గ్రామమంతా శివనామ స్మరణతో మార్మోగింది. ఆ రోజు వనమాలి కేవలం ఒక శిల్పి కాదు, భక్తితో దైవాన్ని దర్శించిన మహానుభావుడు. అతని శిల్పం భక్తికి, అంతర్దృష్టికి ప్రతీకగా నిలిచింది.

 *శ్రీమద్భగవద్గీత – పంచమాధ్యాయః* (28–29 శ్లోకాలు)

యతేంద్రియమనోబుద్ధిః     మునిర్మోక్షపరాయణః ।
విగతేచ్ఛాభయక్రోధః     యః సదా ముక్త ఏవ సః ॥28॥

భోక్తారం యజ్ఞతపసాం     సర్వలోకమహేశ్వరమ్ ।
సుహృదం సర్వభూతానాం     జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ॥29॥


శంకరభాష్య ఆధారంగా భావార్థం & ఉపనిషత్తుల సమర్థన


---

శ్లోకార్థం (సారాంశ భావం)

ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి —
మూడు నియంత్రణలో ఉన్న ముని,
మోక్షాన్నే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నవాడు,
ఇచ్చ, భయం, క్రోధం లేనివాడైతే —
అతడు ఎప్పుడూ ముక్తుడే.

యజ్ఞాలు, తపస్సుల ఫలభోక్త నేనే,
సర్వలోకాలకూ మహేశ్వరుణ్ణి,
సర్వభూతాలకు హితుడైన నన్ను
ఈ విధంగా తెలిసినవాడు
యథార్థ శాంతిని పొందుతాడు.


---

శంకరభాష్యానుసార విశ్లేషణ

🔹 “యతేంద్రియమనోబుద్ధిః”

శంకరాచార్యుల ప్రకారం,
ఇక్కడ మూడు స్థాయిల నియంత్రణ చెప్పబడింది:

ఇంద్రియ నియమం (బాహ్య విరతి)

మనో నియమం (విక్షేప నివృత్తి)

బుద్ధి నియమం (అవిద్యా ఖండన)


ఇవి ఉన్నవాడే ముని —
మాట్లాడకపోవడంవల్ల కాదు,
అజ్ఞానం మౌనమైపోయినవాడే ముని.


---

🔹 “సదా ముక్త ఏవ సః” — అత్యంత కీలక వాక్యం

ఇది భవిష్యత్తు వాగ్దానం కాదు.
శంకరులు స్పష్టంగా చెబుతారు:

👉 మోక్షం కొత్తగా ఉత్పత్తి అవదు.
👉 అది సాధించబడేది కాదు.
👉 జ్ఞానంతో తెలుసుకోబడేది మాత్రమే.

అందుకే — సదా ముక్తః
అంటే ఎప్పటికీ బంధంలో లేనివాడు.


---

29వ శ్లోకం – శాంతి రహస్యం

ఇక్కడ కృష్ణుడు మూడు తత్త్వాలు చెబుతాడు:

1️⃣ భోక్తారం యజ్ఞతపసాం

కర్మఫల భోక్త మనం కాదు.
అహంకారమే బంధం.

2️⃣ సర్వలోకమహేశ్వరమ్

ప్రపంచంపై నిజమైన అధిపత్యం
ఏ జీవికీ లేదు.

3️⃣ సుహృదం సర్వభూతానాం

ఈశ్వరుడు శిక్షకుడు కాదు.
అంతర్యామిగా హితుడే.

శంకరుల మాటల్లో:

> ఈ మూడు తత్త్వాల జ్ఞానమే శాంతికి మూలం.




---

ఉపనిషత్తుల ఆధారం

📖 ఈశావాస్యోపనిషత్ (1)

> ఈశావాస్యమిదం సర్వం
అహంకార భోగం విడిచిన చోటే శాంతి.



📖 కఠోపనిషత్ (2.2.13)

> నిత్యో నిత్యానాం
ఈశ్వరుడు భోక్త, పాలక, హితుడు.



📖 ముండకోపనిషత్ (3.2.9)

> సర్వభూతస్థమాత్మానం
అంతర్యామి జ్ఞానం ద్వారానే మోక్షం.




---

తాత్త్విక సారాంశం

మోక్షం అనేది రాకపోకల విషయం కాదు.

శాంతి అనేది బాహ్య పరిస్థితుల ఫలితం కాదు.

అహంకార త్యాగం + ఈశ్వర తత్త్వ జ్ఞానం
= సహజ ముక్తి.



---

సంక్షేప వాక్యం

> ఇంద్రియ–మనో–బుద్ధి నియమంతో,
కర్తృత్వ భోగ భావం విడిచిన జ్ఞానివాడు —
మోక్షాన్ని పొందడు,
మోక్షంగానే ఉంటాడు. 🕉️✨.             

Tuesday, March 10, 2026

 🔥ఎంత అద్భుతమైన తెలివితేటలండి మన పాలకులవి! మనం వాళ్లని చూసి చాలా నేర్చుకోవాలి. ఇంట్లో పిల్లలు ఆకలేస్తోంది అన్నం పెట్టరా అని అడిగినప్పుడు, వాళ్లకి అన్నం పెట్టడం చేతకానివాడు ఏం చేస్తాడు? సైలెంట్ గా పక్కోడి ఇంటికి నిప్పు పెట్టి, ఒరేయ్, వాడెవడో మనల్ని కొట్టడానికి వస్తున్నాడు, ముందు వాడి పని పడదాం రండి అంటాడు. అబ్బా! ఎంత గొప్ప వ్యూహం!

దేశంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నప్పుడు, లోపల జనం ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు... వాళ్ళకి సమాధానం చెప్పే బదులు, ఏకంగా ఒక దేశం మీద బాంబులు వేసేస్తే పోలా? అసలు సమస్యలన్నీ పక్కకు పోతాయి, అద్భుతమైన దేశభక్తి అనే మత్తుమందు అందరికీ ఎక్కేస్తుంది. ఒక్క దెబ్బకు ఎన్ని పిట్టలో చూడండి! దీన్ని ప్రశంసించకుండా ఎలా ఉండగలం? ఇక ఇంకో గొప్ప లాజిక్ ఆలోచించండి. ఆయుధాలు తయారు చేసేవాడు పస్తులుండకూడదు కదా? పాపం వాళ్లూ బతకాలి కదా! అందుకే, లక్షల కోట్లు ఖర్చు పెట్టి మనుషుల మీద బాంబులు వేస్తూ... దానికి ఉగ్రవాదాన్ని నిర్మూలించి, ప్రపంచ శాంతిని స్థాపించడానికి చేస్తున్న ఆపరేషన్అని ఎంత ముద్దుగా పేరు పెట్టారో చూశారా? శాంతిని స్థాపించడానికి మనుషుల్ని ముక్కలు ముక్కలుగా పేల్చేయడం... వావ్! లాజిక్ ఎలా ఉందంటే, కడుపు నొప్పి తగ్గాలంటే, కడుపు కోసి పేగులు బయటపడేయాలి అన్నంత అద్భుతంగా ఉంది. ఇంత గొప్ప ఆలోచనలు మనకెందుకు రావో కదా! నిజానికి, మన నాయకులని తప్పుబట్టడానికి వీల్లేదు. వాళ్లకు తెలుసు... మనకంటే గొప్ప ప్రేక్షకులు ఈ భూమ్మీద దొరకరని. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో వాళ్లు రక్తం చిందిస్తుంటే, మనం ఇక్కడ సోఫాలో కూర్చుని, స్నాక్స్ తింటూ, ఇరాన్ గెలుస్తుందా? అమెరికా గెలుస్తుందా? అని ఒక వెబ్ సిరీస్ లాగా, ఐపీఎల్ మ్యాచ్ లాగా ఎంజాయ్ చేస్తున్నాం. నిజం చెప్పాలంటే... మనలో ఉన్న ఈ అద్భుతమైన Emptiness, ఈ అజ్ఞానమే... వాళ్ల అసలైన పెట్టుబడి. మనిషి అహంకారం బతకాలంటే దానికి నిరంతరం ఒక గొడవ కావాలి. వాళ్ళు అక్కడ గొడవ పడుతూ వాళ్ళ అహంకారాన్ని పెంచుకుంటున్నారు, మనం ఇక్కడ దాన్ని చూస్తూ మన ఖాళీ బుర్రలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటున్నాం. ఇద్దరిదీ లాభమే! సో, ఈ గొప్ప నాటకాన్ని ఇలాగే ఎంజాయ్ చేయండి. దయచేసి ప్రశ్నించకండి, ఎందుకంటే, పొరపాటున లాజిక్ తో ఆలోచిస్తే అసలు నిజం తెలిసిపోతుంది. నిజం తెలిసిపోతే ఈ మేధావుల'వ్యాపారం ఆగిపోతుంది. అది మనకి ఇష్టం లేదు కదా! ⭕#anukulavedam 


http://youtube.com/post/Ugkx0FWJpKhSA_g9m3cGIAeKUt15Ki_DRiWQ?si=fgQJiN2yS2h0T3AE

యోగులు తమ వీర్యాన్ని ఎందుకు వృథా చేయరు? నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు | Semen Retention Secret

యోగులు తమ వీర్యాన్ని ఎందుకు వృథా చేయరు? నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు | Semen Retention Secret

Author Name:Golden Info

Youtube Channel Url:https://www.youtube.com/@Goldeninfo2

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ibU1eYusAOA



Transcript:
(00:01) ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మనిషి ఏ శక్తిని వృధా చేయడాన్ని తన స్వేచ్ఛగా భావిస్తున్నాడో అదే శక్తిని కాపాడుకోవడానికి హిమాలయ యోగులు తమ జీవితమంతా తపస్సులో ఎందుకు గడుపుతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆధునిక వైద్యశాస్త్రం కేవలం ఒక బయోలాజికల్ ఫ్లూయిడ్ గా భావించే దానిని భారతీయ యోగశాస్త్రం జీవన ఆధారం మరియు ఈశ్వరుడి ప్రసాదం అని ఎందుకు పిలుస్తోందో? దాని వెనక ఉన్న కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? సో ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం.
(00:34) దీని గురించి మాట్లాడటానికి కూడా ప్రజలు భయపడతారు లేదా సిగ్గుపడతారు. కానీ నిజం ఏమిటంటే ఇది కేవలం కామవాంచకు సంబంధించిన విషయం కాదు. ఇది మీ అస్తిత్వానికి మీ శక్తికి మరియు మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈరోజు మనం వీర్య విజ్ఞానం గురించి మాట్లాడుకుందాం. మనం తినే ఆహారం ఒక సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రక్రియ తర్వాత బంగారు బిందువుగా ఎలా మారుతుందో తెలుసుకుందాం.
(00:59) ఒక చుక్క వీర్యాన్ని తయారు చేయడానికి శరీరం ఎంత కష్టపడుతుందో తెలిస్తే మీ ఆత్మ వణికిపోతుంది. క్షణకాలపు సుఖం కోసం మీరు దానిని వృధా చేసినప్పుడు నిజానికి మీరు మీ మరణాన్ని ఆహ్వానిస్తున్నారని అర్థం. కాబట్టి మీ చేతనను ఏకాగ్రం చేయండి మరియు నాతో పాటు ఈ శరీరం అనే ఈ బ్రహ్మాండపు యాత్రకు బయలుదేరండి. అక్కడ రక్తం, మాంసం మరియు మధ్యల ద్వారా ప్రయాణించి మనిషి దైవత్వాన్ని పొందుతాడు.
(01:27) శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు ప్రముఖ జ్యోతిష్యులు ప్రధాన తాంత్రికులు శ్రీ ఎం కే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారెంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, అత్త కోడల సమస్యలు, భార్యా భర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు.
(02:00) మొదటగా మన శరీర అమెరికను ఒక యంత్రం లాగా కాకుండా ఒక రసాయన ప్రయోగశాల లాగా చూడాలి. ఈ శరీరం 24 గంటలు పని చేస్తూనే ఉంటుంది. మీరు తినే రొట్టె తాగే నీరు తినే పండ్లను శరీరం నేరుగా అలాగే ఉపయోగించుకోదు. ఆ ఆహారాన్ని విచ్చిన్నం చేయాలి వండాలి మరియు దాని సారాన్ని బయటకు తీయాలి. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో ఒక అగ్ని వెలుగుతోంది.
(02:24) దానినే జఠలాగ్ని అంటారు. ఈ అగ్ని జీవం. మీరు ఒక ముద్ద ఆహారాన్ని నోట్లో వేసుకున్నప్పుడు అక్కడి నుండి ఒక సుదీర్ఘ యాత్ర మొదలవుతుంది. ఈ యాత్ర ఏడు దశల ద్వారా సాగుతుంది. ఈ ఏడు దశలనే ఆయుర్వేదంలో సప్త ధాతువులు అంటారు. ఇది ఒక నిచ్చెన లాంటిది. ప్రతి మెట్టు ముందరి మెట్టు కంటే ఎక్కువ శుద్ధమైనది సూక్ష్మమైనది మరియు శక్తివంతమైనది.
(02:49) ఈ నిచ్చెను యొక్క చివరి మెట్టు అత్యున్నత శిఖరమే వీర్యం. అయితే ఈ ప్రక్రియను ఇప్పుడు మైక్రోస్కోపిక్ స్థాయిలో అర్థం చేసుకుందాం. మీరు ఆహారం తిన్నప్పుడు అది కడుపులోకి వెళ్లి జీర్ణం అవుతుంది. జఠరాగ్ని దానిని వండుతుంది. ఈ ఉడికిన ఆహారం నుండి తయారయ్యే మొదటి సారాన్ని రసం అంటారు. రసం అంటే ఆహారపు జ్యూస్ దీనిని ఆధునిక విజ్ఞానం ప్లాస్మా అంటుంది.
(03:13) ఆహారం రసంగా మారడానికి సుమారు ఐదు రోజుల సమయం పడుతుంది. ఈ రసం శరీరం మొత్తం తిరుగుతూ శరీరానికి పోషణ ఇస్తుంది. కానీ శరీరం ఇక్కడితో ఆగదు. ఈ రసంలో కూడా ఒక అగ్ని ఉంటుంది. దానినే రసాగ్ని అంటారు. ఈ రసాగ్ని ఆ రసాన్ని మళ్ళీ వండుతుంది. మరియు రసంలోని అత్యుత్తమ భాగం దాని మీగడ లాంటిది రక్తంగా మారుతుంది. రసం నుండి రక్తం తయారవ్వడానికి మళ్ళీ ఐదు రోజుల సమయం పడుతుంది.
(03:41) అంటే మీరు ఈ రోజు తింటున్న ఆహారం 40 రోజుల తర్వాత మీ శరీరంలో రక్తంగా ప్రవహిస్తుంది. మీరు రెండు సెకండ్ల ఆనందం కోసం ఫ్లష్ చేసే ఆ ఒక్క చుక్క వీర్యానికి మీ శరీరం ఒక నెల రోజుల పాటు తపస్సు చేసింది. మీ శరీరంలోని అవయవాలు మీ కిడ్నీలు మీ లివర్ మీ గుండె పగలు రాత్రి పని చేయడం వల్లే ఈ పూర్తి ఆహారం ఒక బంగారు బిందువుగా మారుతుంది. అయితే శాస్త్రాల్లో మిమ్మల్ని కదిలించి వేసే ఒక భయంకరమైన సమీకరణం ఇవ్వబడింది.
(04:11) ఒక మనిషి 40 కిలోల ఆహారం తిన్నప్పుడు దాని నుండి సుమారు 1 కిలో రక్తం తయారవుతుందని మరియు 100 చుక్కల రక్తం ఖర్చయినప్పుడు ఒక చుక్క వీర్యం తయారవుతుందని చెప్పబడింది. ఇది కేవలం సామెత కాదు ఇది శక్తి యొక్క రూపాంతరం కొన్ని టన్నుల పూలను నలిచిన తర్వాత ఒక చిన్న అత్తరు సీసా తయారైనట్లే వీర్యం మీ శరీరపు అత్తరు ఇది మీ జీవన సారం. ప్రకృతి ఈ ద్రవాన్ని ఇంత విలువైనదిగా ఇంత చిక్కదిగా మరియు ఇంత శక్తివంతంగా ఎందుకు చేసింది ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే దీని ఉద్దేశం సామాన్యమైనది కాదు.
(04:45) దీని ఉద్దేశం సృజన. ఒక కొత్త జీవానికి జన్మనివ్వగల శక్తి ఇది. ఒక చిన్న కణం దానికి సొంత మెదడు లేదు కానీ దాని లోపల ఎంత ఇంటెలిజెన్స్ దాగి ఉందంటే అది ఒక పూర్తి మనిషి నమూనాను తనలో కలిగి ఉంది. కళ్ళు ఎలా ఉండాలి? జుట్టు ఎలా ఉండాలి? బుద్ధి ఎలా ఉండాలి ఇవన్నీ ఆ ఒక్క సూక్ష్మ కణంలో కోడ్ చేయబడ్డాయి. దీనినే DNAన్ఏ అంటారు. మరియు వీర్యం ఆ DNAన్ఏ కు వాహకం.
(05:12) సో ఒకవేళ మీరు ఈ శక్తిని శరీరం నుండి బయటకు పంపించినప్పుడు మీరు కేవలం ఒక ద్రవాన్ని పంపడం లేదు. మీరు మీ శరీరపు సారాన్ని, మీ ఎముకల రసాన్ని మరియు మీ మెదడు శక్తిని బయటకు విసురుతున్నారు. అందుకే హస్త ప్రయోగం లేదా అతి సంభోగం తర్వాత మనిషికి వెంటనే బలహీనత కలుగుతుంది. నిద్ర వస్తుంది. కాళ్ళు వణుకుతాయి. విచారం కలుగుతుంది.
(05:36) దీనిని సైన్స్ పోస్ట్ కాయిటల్ ట్రిస్టెస్ అని పిలుస్తుంది. ఎందుకు? ఎందుకంటే శరీరం సోకిస్తోంది. నేను ఇంత కష్టపడి కూడబెట్టిన నిధి దోచుకోబడింది అని శరీరం ఏడుస్తోంది. కానీ ఆగండి ఇది కేవలం వీర్యం తయారయ్యే కథ మాత్రమే అసలు మాయ అసలు రహస్యం దీని తర్వాత మొదలవుతుంది. యోగ విజ్ఞానం ప్రకారం వీర్యం తయారవ్వడం చివరి మెట్టు కాదు ఇది ఒక పెద్ద దూకుడుకు కావలసిన ముడి సరుకు సామాన్య మనిషి వీర్యం అదోగామి అధోగామి అంటే దాని స్వభావం క్రిందికి ప్రవహించడం నీటి స్వభావం క్రిందికి ప్రవహించడం లాగే కామవాసన అనే చిన్న వేడి తగలగానే ఈ వీర్యం కరిగి శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. జాతిని ముందుకు
(06:16) తీసుకెళ్ళడానికి ప్రకృతి సిద్ధం చేసిన నియమం ఇది. కానీ యోగి ప్రకృతి నియమాన్ని నమ్మడు అతను ప్రకృతి నియమాన్ని తిప్పికొట్టడం తెలుసుకుంటాడు. ఈ వీర్యాన్ని బయటకు ప్రవహించకుండా ఆపినట్లయితే దానిని శరీరంలోనే ఉంచుకోగలిగితే ఒక అద్భుత ప్రక్రియ మొదలవుతుంది. దీనినే ఊర్ధ్వరేతస్ అంటారు. ఊర్ధ్వరేతస్ అంటే ఆ వీర్యం పైవైపుకు ప్రవహిస్తుందని అర్థం.
(06:40) మీరు బ్రహ్మచర్య పాలన చేసినప్పుడు మీ వీర్యాన్ని కాపాడుకున్నప్పుడు మరియు కామ ఆలోచనలకు దూరంగా ఉన్నప్పుడు శరీరంలో పోగైన వీర్యం మళ్ళీ జీర్ణం కావడం మొదలవుతుంది. ఎందుకంటే శరీరం చాలా తెలివైనది. ఈ విలువైన నిధి పునరుత్పత్తి కోసం ఉపయోగపడటం లేదని గ్రహించినప్పుడు అది వృధా కానివ్వదు. దానిని రీసైకిల్ చేస్తుంది. దానిని మళ్ళీ పీల్చుకుంటుంది.
(07:04) ఈ వీర్యం మళ్ళీ రక్తంలో కలిసినప్పుడు అది ఎనిమిదవ ధాతువు రూపం తీసుకుంటుంది. ఈ ఎనిమిదవ మరియు గుప్త ధాతువునే ఆయుర్వేదంలో ఓజస్సు అని అంటారు. ఓజస్సు అనే పదం చాలా లోతైనది. ఓజస్సు అనేది టెస్ట్ ట్యూబ్ లో చూడగలిగే భౌతిక పదార్థం కాదు. ఓజస్సు అంటే ఒక తేజస్సు, ఒక మెరుపు, ఒక వైబ్రేషన్ వీర్యం ఓజస్సుగా మారినప్పుడు అది పదార్థం నుండి శక్తిగా మేటర్ నుండి ఎనర్జీగా మారుతుంది.
(07:32) అయితే ఈ ఓజస్సు మన శరీరంలో ఏమి చేస్తుంది? మొదటగా ఇది మీ నర్వస్ సిస్టం ను ఇనుముల బలంగా మారుస్తుంది. ఓజస్సు తక్కువగా ఉన్న మనిషి చిన్న విషయాలకే భయపడతాడు. యంజైటీ కలుగుతుంది. చేతులు కాళ్ళు వణకుతాయి. భయం వేస్తుంది. కానీ ఓజస్సు నిండుగా ఉన్నవాడు సింహంలా నిర్భయంగా ఉంటాడు. అతని ముందు సాక్షాత్తు మరణం వచ్చినా అతని కనురెప్పవాలదు.
(07:56) స్వామి వివేకానంద దీనికి అతి పెద్ద ఉదాహరణ. ఈ ఓజస్సు మీ మెదడుకు ఆహారం ఆధునిక న్యూరాలజీ కూడా ఇప్పుడు అంగీకరిస్తోంది. మన మెదడు నిర్మాణానికి అవసరమైన లిసితిన్, కొలెస్ట్రాల్, ఫాస్ఫరస్ మరియు ప్రత్యేక రకమైన ప్రోటీన్లు వీర్యంలో ఉంటాయి. మన మెదడు మరియు మన వెన్నెముక ఒక ప్రత్యేక ద్రవంలో తేలుతుంటాయి. దానినే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఓ లేదా సిఎస్ఎఫ్ అని అంటారు.
(08:20) యోగశాస్త్రం ప్రకారం వీర్యానికి మరియు సిఎస్ఎఫ్ కు నేరుగా సంబంధం ఉంది. వీర్యం ఓజస్సుగా మారి పైకెక్కినప్పుడు అది నేరుగా మెదడుకు పోషణ ఇస్తుంది. దీనినే మేధాశక్తి అంటారు. మేధా అంటే కేవలం బట్టీ పట్టే బుద్ధి కాదు సత్యాన్ని నేరుగా చూడగలిగే మరియు ఛేదించగలిగే బుద్ధి. ఏ విద్యార్థి ఓజస్సు క్షీణించిందో అతను 10 సార్లు చదివినా గుర్తుంచుకోలేడు.
(08:43) కానీ బ్రహ్మచారి ఒక్కసారి వింటే జీవితాంతం మరిచిపోలేడు. దీనినే ఫోటోగ్రాఫిక్ మెమరీ అని అంటారు. ఇది మాయ కాదు ఇది మెదడుకు లభించే హై క్వాలిటీ ఫ్యూయల్ యొక్క ఫలితం. మీరు చరిత్ర తీసి చూడండి. ప్రపంచాన్ని మార్చిన గొప్ప ఆవిష్కర్తలు తత్వవేత్తలు మరియు యోధులందరూ తమ జీవితంలోని ముఖ్యమైన సమయంలో తమ కామశక్తిని కాపాడుకున్నారు. ఐజాక్ న్యూటన్, నికోలా టెస్లా, లియనార్డో డావిన్సీ, దయానంద సరస్వతి టెస్లా స్పష్టంగా చెప్పారు.
(09:12) నా ఆవిష్కరణలు, నా పరిశోధనలు ఇవన్నీ కూడా నా బ్రహ్మచర్య ఫలితమే. నేను నా శక్తిని సంభోగంలో వృధా చేయలేదు. అందుకే ఆ శక్తి నా మెదడులో మెరుపులా మెరిసింది మరియు నాకు బ్రహ్మాండపు రహస్యాలు కనిపించాయి. న్యూటన్ చనిపోయినప్పుడు అతని శరీరంలో ఒక్క చుక్క వీర్యం కూడా తక్కువ కాలేదు. ఆయన జీవితాంతం తన శక్తిని పైకి లేపారు. స్టీవ్ జాబ్స్ కూడా తన యవ్వనంలో భారత్ వచ్చారు మరియు వీర్య రూపాంతర ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు.
(09:39) ఆయన తన పెద్ద ప్రాజెక్టుల సమయంలో వారాల తరబడి బ్రహ్మచర్యం పాటించేవారు. తద్వారా తన ఫోకస్ లేజర్ లాగా తీక్షణంగా ఉండేలా చూసుకునేవారు. అయితే ఈ ఓజస్సు మీ ముఖంపై ఒక ప్రత్యేక మెరుపును కలిగిస్తుంది. దీనినే ఆరా లేదా ప్రభా మండలం అని అంటారు. కొందరి సమక్షంలోనే మీకు శాంతి మరియు శక్తి లభించడం మీరు గమనించి ఉంటారు.మీ మీరు వారి వైపు అయస్కాంతంలా ఆకర్షించబడతారు.
(10:02) వారి కళ్ళలో ఒక వింత ఆకర్షణ ఉంటుంది. వారేమీ మాట్లాడకపోయినా ప్రజలు వారిని వింటారు. ఇది మాగ్నెటిజం ఇది ఓజస్సు యొక్క ఆకర్షణ. జంతువులు కూడా ఈ శక్తిని గ్రహిస్తాయి. పూర్వకాలంలో ఋషులు అడవుల్లో సింహాలు, పులుల మధ్య ఉండేవారు. మరియు జంతువులు వారికి హాని చేసేవి కావు. ఎందుకు? ఎందుకంటే వారి ఓజస్సు శక్తి ఎంత ప్రబలంగా ఉండేదంటే హింసాత్మక జంతువులు కూడా వారి ముందు శాంతించేవి.
(10:27) ఏ మనిషి వీర్యం నిరంతరం స్కలనం అవుతుందో అతని ఓరా బలహీనంగా ఉంటుంది. అందులో రంధ్రాలు ఉంటాయి. ప్రతికూల శక్తులు మరియు ఆలోచనలు అతనిపై సులువుగా ఆధిపత్యం చెలాయిస్తాయి. కానీ ఈరోజు తరానికి ఏమవుతుందో చూడడం చాలా బాధాకరం. ఈరోజు 12, 13 ఏళ్ల పిల్లలు ఎవరి శరీరంలో అయితే వీర్యం ఇంకా సరిగ్గా తయారవ్వడం కూడా మొదలవ్వలేదో వారు ఇంటర్నెట్లో అశ్లీలత చూస్తూ దానిని నాళిలో పారబోస్తున్నారు.
(10:52) వారు ఎంతటి పాపం చేస్తున్నారో వారికి చెప్పేవారు ఎవ్వరూ లేరు. వారు వాయుదాల పద్ధతిలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒక పిల్లవాడు లేదా యువకుడు నిరంతరం వీర్యనాశనం చేసినప్పుడు అతని ఎదుగుదల ఆగిపోతుంది. అతని ఎముకలు బలహీనంగా ఉండిపోతాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. బుగ్గలు లోపలికి వెళ్ళిపోతాయి. అతను ప్రజల కళ్ళల్లోకి చూసి మాట్లాడలేడు.
(11:14) అతనిలో ఆత్మవిశ్వాసం పూర్తిగా నశిస్తుంది. అతను ఎప్పుడూ అలసిపోయి చిరాకుగా మరియు విచారంగా ఉంటాడు. ఈరోజు మనం దేనికి డిప్రెషన్ అంటున్నామో అందులో 80% కారణం ఈ వీర్యనాశనమే. మీ లోపల జీవమే మిగలనప్పుడు మీకు జీవించడంలో ఆనందం ఎలా వస్తుంది? ఒకసారి మీరే ఆలోచించండి. కాబట్టి ఈరోజే ఇప్పుడే మీతో మీరు ఒక సంకల్పం తీసుకోండి. ఈ సంకల్పం ఎవరికో చూపించడానికి కాదు మీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ద్రవ బంగారాన్ని ఈ ఈశ్వరుడి ప్రసాదాన్ని ఇలాగే వృధా చేయనని సంకల్పం తీసుకోండి.
(11:48) మీ శక్తిని ఓజస్సుగా మారుస్తానని మరియు ఒక గొప్ప జీవితాన్ని నిర్మిస్తానని సంకల్పం తీసుకోండి. గుర్తుంచుకోండి మీరు కేవలం ఒక సాధారణ మాంసపు ముద్ద కాదు మీరు అనంతమైన శక్తికి మూలం మీ ఒక్క చుక్క వీర్యంలో ఒక కొత్త జీవితాన్ని సృష్టించగలిగే శక్తి ఉంది. ఆలోచించండి ఒకవేళ ఆ శక్తి మీలోనే ఉండిపోతే అది మిమ్మల్ని ఎలా నిర్మించగలదు అది మిమ్మల్ని మహామానవుడిగా మార్చగలదు.
(12:10) వచ్చేసారి మనసు ఎప్పుడైనా జారినప్పుడు ఆ రెండు నిమిషాల సుఖం మిమ్మల్ని ఊరించినప్పుడు దాని ధర ఏమిటో గుర్తుంచుకోండి. మీ శరీరం చేసిన ఆ 30 రోజుల తపస్సును గుర్తుంచుకోండి. మీరు మీ రక్తాన్ని మీ ఎముకలను మరియు మీ మెదడును నాళిలో పారబోస్తున్నారని గుర్తుంచుకోండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు అడగండి. ఈ బేరం మనకి సమ్మతమేనా అని సమాధానం మీ లోపలి నుండే వస్తుంది.
(12:35) మరియు ఆ సమాధానమే మీ జీవితాన్ని మారుస్తుంది. వీర్య రక్షణే ధర్మం వీర్య నాశనమే మృత్యువు లెండి మేల్కొనండి మరియు మీలో నిద్రిస్తున్న ఈ శక్తిని గుర్తించండి. ధన్యవాదాలు.

సంతృప్తి నీ జన్మ హక్కు ✍️POSTCARD (18) from KANTHRISA

సంతృప్తి నీ జన్మ హక్కు ✍️POSTCARD (18) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=GzkJ__51o-M



Transcript:
(00:01) మనిషి జీవితం నిరంతరం తృప్తికి అసంతృప్తికి మధ్యన కొట్టుమిట్టాడుతుంటుంది. సోక్రటిస్ అంటాడుహిహూ ఇస్ నాట్కంటెంట్ విత్ వాట్ హి హస్వడ్ నాట్ బికంటెంట్ విత్ వాట్ హివడ్ లైక్ టు హవ దాని తాత్పర్యం ఏమిటంటే ఇప్పుడున్న దానితో సంతోషంగా లేనివాడు తాను కోరేది దొరికిన తర్వాత కూడా దానితో సంతోషంగా ఉండే అవకాశం లేదు కొందరికి ఎప్పుడూ అంతేనా అసంతృప్తి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి ఇంకేదో కావాలి. కానీ అదేంటో తెలియదు.
(00:40) ఒక చిన్న కథ విన్నా ఇదిఒక ఇండోనేషియన్ స్టోరీ ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటుంది. ఎవరో వచ్చి బిస్కెట్ ఇస్తారు ఏడుపాపుతుంది. మళ్ళీ ఏడుస్తుంది ఎవరో వచ్చి టీవీ ఆన్ చేస్తారు కాసేపిన తర్వాత మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ ఎవరో వచ్చి ఉయ్యాల్లో పడుకోబెడతారు. మళ్ళీ ఏడుస్తుంది. ఎవరో వచ్చి ప రూపాయలు ఇస్తారు మళ్ళీ ఏడుస్తుంది ఎవరో వచ్చి టెడ్డీ బేర్ ఇస్తారు మళ్ళీ ఏడుస్తుంది.
(01:10) కథలో చివరి లైన్ ఎలా ఉంటుందంటే ఇవన్నీ కాదు తనకు అమ్మని ఇవ్వండి అని తను ఏడిచేది అమ్మ కోసం కానీ ఈ ప్రపంచం ఏవేవో ఇస్తుంది ఏడుపాపడానికి ఇవ్వాల్సింది ఒక్కటి ఇస్తే సరిపోతుంది. సో తృప్తి గాని సంతృప్తి గాని వస్తువుల్లో దొరకదు. అది వస్తువుల్లో బయట మనుషుల ప్రవర్తనలో వెతికినంతసేపు మనిషిని అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. బుద్ధుడు అంటాడు సంతృప్తి ఉన్నవాడు నిజమైన ధనవంతుడు చాలామంది చెప్పారు దీని గురించి కానీ మనం అంతగా ఆలోచించం.
(01:57) రకరకాల పందుల్లో పడిపోతాం డబ్బు వెంటపడతాం దేనికోసం ఎదురు చూస్తాం దేనికోసం పోరాడతాం నేను ఇది అని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ పెనుగులాటలో ఈ పోరాటంలో అలసి ఒకరోజు మూలక పడతాం. ఫైనల్ గా జీవితం అంటే ఏంది అంటే అంతున అసంతృప్తి అనుకున్నది చేయలేకపోయాను సాధించలేకపోయాను ఫస్ట్ అఫ్ ఆల్ తృప్తికి సంతృప్తికి ఉన్న తేడా ఏమిటి? తృప్తి అన్నది జస్ట్ ఇంద్రియ సుఖం అంతే ఆకలింది తిన్నావు తృప్తి కలిగింది.
(02:34) ఏదో కోరుకున్న వచ్చింది తృప్తి కలిగింది ఇంటికి బంధువులు వచ్చారు ఓ తృప్తి కలిగింది తాత్కాలికం కానీ సంతృప్తి అన్నది కాస్త బయట పరిస్థితులతో సంబంధం లేకుండా నువ్వు అనుభవించే ఒక కాన్స్టెంట్ స్టేట్ ఒక శాశ్వతమైన తృప్తి అది అంటే నీ దగ్గర డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు కానీ డబ్బు పట్ల ఒక అవగాహన ఉంది అది లేకపోయినా పర్వాలేదుని నీ చుట్టూ మనుషులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎవరున్నా లేకున్నా నీకు శరీరానికి తగిలే చాలంది గాలి చాలు ఇంకేమ అక్కర్లేదు నాకు ఏదో కావాలంటే తృప్తి ఏమ అక్కర్లేదు అనుకుంటే సంతృప్తి
(03:18) అసంతృప్తి అంటే కావాలనుకున్నది దొరకనప్పుడు సో సంతృప్తిగా జీవించడం అంటే ఆల్మోస్ట్ కోరిక ఎండైపోవడమే సరే కొన్నిసార్లు కోరవల్సింది వచ్చినా అది తీరకపోయినా పర్వాలేదులే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ ఆటిట్యూడ్ దానికోసం ప్రయత్నం చేయొచ్చు. ఒక చిన్న కథ విన్నా ఒక రాజు ఉన్నాడు అతని దగ్గర అన్ని ఉన్నాయి. రాజ్యము, సంపద, శక్తి మంది, మార్బలం అన్ని ఉన్నాయి బట్ ఏదో అసంతృప్తి ఒకరోజు గుర్ర మీద పోతూ ఉంటే అడవిలో ఒక ఫకీర్ కనిపించాడు. సాధువు కనిపించాడు.
(03:58) ఆయన దగ్గర ఏమీ లేదు కానీ చక్కగా ఒక పాట హం చేస్తూ ఉన్నాడు దరనరో అని పాడుతున్నాడు అక్కడ వినేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు చిటికేస్తూ పాడుతున్నాడు మంచిగా కాలు అట్లా ఊపుతున్నాడు లయబద్ధంగా రాజు ఆశ్చర్యపోయి తన గుర్రాన్ని ఆపి దిగి అడిగాడు అయ్యా నా దగ్గర అన్ని ఉన్నాయి నేను అసంతృప్తిగా ఉన్నాను నీకుేమీ లేదు నువ్వు ఎంత సంతృప్తిగా ఆనందంగా ఎలా ఉన్నావ్ అంటే ఆ సాధువు అంటాడు నీ దగ్గర ఏదైతే ఉందో అది నీ మనసు నింపలేదు.
(04:40) నాకేమో నాకు అవసరం లేని లేని దాన్ని కోరే మనసు లేదు. ఈ అడవి ఈ చెట్లు ఈ చీమలు ఇది చాలు నాకు అందుకే సంతృప్తిగా ఉన్నాను. మనం సంతృప్తిగా ఉండగలిగే అన్ని మన దగ్గర ఉన్నాయి. కానీ మనం అసంతృప్తిగా ఎందుకు ఉన్నామ అంటే ఇంకా ఏదో కోరుతున్నాం. సో మనలో మనం గుర్తించని ఒక ఈగో ఉంటుంది. అది ఎప్పుడు గుడ్లగూబలాగా కళ్ళు పెట్టుకొని బయటకి చూస్తా ఉంటది.
(05:15) ఎవరిదో ఒక వస్తువు చూసినప్పుడు ఎవరో బాగా సక్సెస్ అయినప్పుడు అది నాకు కావాలి. అవును అని నువ్వు అనుకోగానే అసంతృప్తి బయలుదేరుతుంది. అలా కాకుండా అది మనకు అక్కర్లేదు అని అనుకోగానే ఈగో డిసపర్ అయిపోతుంది. సో ఏమీ లేకపోయినా జీవితం ఉంది అని గుర్తిస్తే అసంతృప్తి వెళ్ళిపోతుంది. వేరేవాళ్ళు ఇచ్చే గుర్తింపు మనకు అక్కర్లేదు.
(05:46) ఎవరనా గుర్తిస్తే అది వాళ్ళ గొప్పదను అనుకుంటే అసంతృప్తి వెళ్ళిపోతుంది. ఏదైనా కోరిక ఉండటం తప్పు కాదు దానికోసం ప్రయత్నం చేయడము తప్పు కాదు కానీ ఆ కోరిక నెరవేరకపోతే దాన్ని అంగీకరించగలిగితే జీవితంలో అసంతృప్తి వెళ్ళిపోతుంది. కృష్ణమూర్తి అంటాడు మన బాధల్లో చాలా భాగం ఇతరులతో పోల్చుకోవడం వల్లే సో పోల్చుకునే మానసిక స్థితి ఉన్నవాడు సంతృప్తిగా ఉండే అవకాశం లేనే లేదు అని తృప్తి అంటావా అవి నీడ్స్ ప్రతిరోజు నీళ్లు కావాలి తృప్తిగా ఉంటుంది భోజనం కావాలి తృప్తిగా ఉంటుంది చలివేస్తే ఒక కోటు కావాలి తృప్తిగా ఉంటుంది.
(06:22) సంతృప్తి అన్నది ఆధ్యాత్మిక పరమైనది. ఒకసారి ఇప్పటికీ నీ దగ్గర ఉన్న చాలా వాటిని చూడు అందులో 99 శాతం విషయాలను నువ్వు ఇగ్నోర్ చేస్తూ ఉన్నావేమో వాటిని తిరిగి ఉపయోగించుకో నీ చుట్టూ ఉన్న కొందరితో మంచిగా ఉండటం ప్రారంభించు ఎవరికైనా మనసు నొప్పి కలిగితే ఓ క్షమాపణ కోరు పెద్దవాళ్ళు కనిపిస్తే [సంగీతం] వాళ్ళ కాళ్ళకు మసాజ్ చెయ్ ఏదైనా ఒక వైట్ పేపర్ కనిపిస్తే దాంట్లో బొమ్మకి నువ్వు ఏదనా చెప్పాలనుకున్నది ఒక పుస్తకంగా రాయి నీ పందిలో పడిపో దాని గుర్తింపు రావాలి లేకపోతే ఎవరో గుర్తించాలి కీర్తి ప్రతిష్టలు కావాలి నా పేరు చిరస్థాయిగా నిలబడాలి ఇట్లాంటి
(07:07) ఆలోచనలు వెంటనే తీసి బొందబెట్టి అది సమాజానికి అవసరమైతే నన్ను గుర్తుపెట్టుకుంటారు అది వాళ్ళ హెడేక్ ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు నో హెడేక్ సో అందుకని నిన్న ఒక వ్యక్తి వచ్చాడు మేము మీ టాక్స్ విన్నాను ఈరోజు మధ్యాహ్నం పెడతాందని ఆటో నడుపుకుంటాడు. కానీ ఎంత స్పష్టంగా చెప్పాడు. మీ మాటల వల్ల నా లైఫ్ లో అసంతృప్తి వెళ్ళిపోయిందండి అంతకంటే ఎక్కువగా ఏమి చెప్పలేదు అతను నాకు చాలా ఆనందంగా అనిపించింది.
(07:45) అతను తన జ్ఞాన ప్రకర్షని తనక ఎన్ని సంస్కృత శ్లోకాలు వచ్చు ఇవేవి చెప్పలేదు జస్ట్ సింపుల్ గా ఒక లైన్ లో చెప్పాడు అసంతృప్తి లేదండి నాకు పోయింది. అయినా అడిగాను మరి ఇంతకుముందు ఎందుకుఉంది ఇప్పుడు పోయిందని ఎట్లా తెలిసింది అంటే ఇంతకుముందు ఇంకేదో కావాలి. నేను మా అత్తగారి ఇంటికి వెళ్తున్నాను ఇట్లా చూడాలి అట్లా చూడాలి నేను పోగానే కుర్చి వేయాలి ఇట్లా ఏదో కోరుకునేవాడిని అతను అన్నాడు ఎక్స్పెక్టేషన్ వల్ల నాకు అసంతృప్తి ఉందేమో ఎక్స్పెక్టేషన్ పోవడంతో నాకు అసంతృప్తి పోయింది [సంగీతం] నేను ఇంకా బాగా పని చేయగలుగుతున్నాను. ఇంకా నా
(08:17) చుట్టూ ఉన్న వాళ్ళతో హాయిగా ఉండగలుగుతున్నాను. ఇప్పుడు మా అత్తగారి ఇంటికి వెళ్తే నా కుర్చి వేయకపోతే కింద కూర్చుంటున్నాను లేదా నా కుర్చి నేనే వేసుకొని కూర్చుంటున్నాను. అసలు వేరే వాళ్ళని లెక్కలోకి తీసుకోవడం లేదు. వాళ్ళకి వచ్చింది ఏదో వాళ్ళు చేస్తున్నారు. నిజంగా ఎవరికీ ఉండదు నన్ను ఇబ్బంది పెట్టాలని ఒకవేళ నిజంగా ఇబ్బంది పెట్టాలని ఒకడు అనుకుంటే నువ్వు ఏం చేసినా వాడు ఇబ్బంది పెడతాడు.
(08:38) సో ఓవరాల్ గా పూర్తి సంతృప్తితో జీవితాన్ని జీవించడానికి కావలసిన అన్ని మన దగ్గర ఉన్నాయి. తృప్తి [సంగీతం] మనకి ఇంద్రియ సుఖం వల్ల వస్తే సంతృప్తి సరైన అవగాహన వల్ల వస్తుంది. అసంతృప్తి ఎక్స్పెక్టేషన్ వల్ల కంపారిజన్ వల్ల వస్తుంది. ఇవన్నీ చాలా చిన్న విషయాలే కానీ ఇవే చాలా పెద్ద విషయాలే కూర్చుంటాయి. వాటి యొక్క ఇంపాక్ట్ చాలా ప్రొఫౌండ్ గా ఉంటుంది మన మీద.
(09:11) అందుకని ఫస్ట్ ఉన్నవాటిని పూర్తిగా అంగీకరిద్దాం. అక్కడి నుంచి జీవితాన్ని తిరిగి నిర్మించుకుందాం. [సంగీతం] మళ్ళీ మాట్లాడుకుందాం ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న సహజమైన సంపదలు ఏవైతే ఉన్నాయో వాటందరికీ శిరస్సు వచ్చి నమస్కారం సరసువేస
 *🌹 జపంలో 108 సంఖ్య ఎందుకు ముఖ్యము? భక్తి దృష్టిలో మహిమ*  

*ప్రతి హిందువు ఇంట్లోనో దేవాలయంలోనో మీరు తప్పకుండా జపమాల (మాల)ను చూసే ఉంటారు. ఆశ్చర్యకరంగా, ఆ మాలల్లో ఎప్పుడూ 108 పూసలు మాత్రమే ఉంటాయి. సంఖ్యాపరంగా ఈ 108కి అంత ప్రాముఖ్యత ఎందుకు?*

*ఏదైనా మంత్రం జపించేటప్పుడు కూడా ఈ సంఖ్యనే ఎందుకు లెక్కించాలి? ఇది కేవలం సాంప్రదాయమా లేక దీని వెనుక ఏదైనా లోతైన ఆధ్యాత్మిక, గణిత రహస్యం దాగి ఉందా? ఈ సంఖ్య మన భక్తిలోనూ, విశ్వం తో మన అనుసంధానంలోనూ ఎలాంటి పాత్ర పోషిస్తుందో తెలుసుకుంటే, మీరు కూడా ఆశ్చర్యపోతారు! ఆ మహిమ ఏమిటో వివరంగా చూద్దాం.*

*108 సంఖ్యకు హిందూ ధర్మంలో అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ సంఖ్య కేవలం పూసల సంఖ్య మాత్రమే కాదు ఇది విశ్వం మరియు దైవత్వానికి సంబంధించిన అనేక అంశాలను సూచిస్తుంది.*

*జ్యోతిష్యం మరియు ఖగోళ శాస్త్రం: 108 అనేది జ్యోతిషశాస్త్రంలో అత్యంత ముఖ్యమైన సంఖ్య. మనకు 12 రాశులు మరియు 9 గ్రహాలు ఉన్నాయి. ఈ రెంటినీ గుణించగా వచ్చే సంఖ్య (12 * 9 = 108) ఈ 108 ద్వారా విశ్వంలోని మొత్తం గ్రహాల ప్రభావం శక్తి మరియు సమయం ప్రతిబింబిస్తాయని నమ్ముతారు. అలాగే, 27 నక్షత్రాలు మరియు ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు ఉన్నాయి, దీనిని గుణించినా 108 వస్తుంది (27 * 4 = 108).*

*ఉపనిషత్తులు మరియు పీఠాలు: మన పురాణాల ప్రకారం, 108 ఉపనిషత్తులు, 108 దివ్య దేశాలు (విష్ణు ఆలయాలు) మరియు శక్తికి సంబంధించిన 108 శక్తి పీఠాలు ఉన్నాయి.*

*యోగా మరియు చక్రాలు: మానవ శరీరంలో 108 శక్తి రేఖలు (మర్మ స్థానాలు) ఉన్నాయని యోగా శాస్త్రం చెబుతుంది. ఈ అన్ని కారణాల వల్ల, 108 సార్లు జపం చేయడం అనేది విశ్వంలోని సంపూర్ణ శక్తిని దైవత్వపు అన్ని రూపాలను ఏకకాలంలో ఆరాధించడానికి సమానంగా భావిస్తారు.*

*జపమాలలో 108 పూసలు మాత్రమే ఉండి, చివర్లో ఒక గురువు పూస ఉంటుంది. ఈ గురువు పూస లెక్కలోకి రాదు. జపమాలను 108 సార్లు పూర్తి చేయడం అనేది ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసినట్లు లెక్క. ఈ 108 సార్లు మంత్రం జపించడం ద్వారా మనస్సు, వాక్కు మరియు శరీరం ఒకే లక్ష్యంపై ఏకాగ్రత చెందుతాయి.*

*ఒక రకంగా చెప్పాలంటే, 108 సార్లు జపం చేస్తే, అది మనస్సును స్థిరంగా ఉంచడానికి, ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి మరియు దైవిక శక్తిని ఆకర్షించడానికి సహాయపడుతుంది. ఏదైనా జపం చేసినప్పుడు, తెలియకుండా తప్పు జరిగినా లేదా అశుభం జరిగినా, 108 సంఖ్య యొక్క పవిత్రత ఆ దోషాన్ని తొలగించి, సంపూర్ణ ఫలాన్ని ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.*

*గమనిక: జపం యొక్క అసలు లక్ష్యం సంఖ్యను పూర్తి చేయడం కాదు, మంత్రంపై సంపూర్ణ ఏకాగ్రత మరియు భక్తిని కలిగి ఉండటం. 108 అనేది ఏకాగ్రతకు మరియు పూర్తి ఫలాన్ని పొందడానికి ఒక మార్గదర్శి మాత్రమే.*