Sunday, May 22, 2022

రావణుడు మరణించాక మండోదరి ఏమైనది....!!

 🎻🌹🙏 రావణుడు మరణించాక మండోదరి ఏమైనది....!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌿లంకాధిపతి రావణుడి పట్టపురాణి మండోదరి పరమ పతివ్రత. ఆమె జీవితమంతా తన భర్త కోసమే జీవించింది. 


🌸రామాయణ యుద్ధం ముగిసిపోయింది. రణ భూమిలో రావణుని పార్దివదేహం అలాగే పడివుంది.


🌿విషయం తెలుసుకున్న రావణుని భార్య మండోదరి ఒక్కక్షణం నివ్వెర పోయింది. మహా శక్తి సంపన్నుడు, బలశాలి, అసుర విద్యలు అవలీలగా ప్రదర్శించేవాడు,


🌸 తపస్సంపన్నుడు, గొప్ప శివ భక్తుడు అయిన తన భర్త...  ఒక మానవుని చేతిలో మరణించాడని తెలిసి ఆశ్చర్య పోయింది. 


🌿ఈ విషయం రాముణ్ణి అడగాలని ఆవేశంతో.... రణభూమికి బయలుదేరింది.


🌸రణభూమిలో ఒక రాయిపై కూర్చొని వున్న రాముణ్ణి చూసి అర్థం లేని ఆవేశంతో.... పరుగు పరుగున వస్తున్న మండోదరిని రాముడు గమనించాడు


🌿సూర్యుడు పడమర అస్తమించే సమయం, ఎండ ఏటవాలుగా పడడంతో.... రాముని నీడ కొంత దూరం విస్తరించి వుంది. 


🌸అటుగా వస్తున్న మండోదరి  నీడకూడా విస్తరించి ఉండడంతో... తన నీడకు మండోదరి నీడ తగులుతుందేమోనని గ్రహించిన రాముడు అక్కడనుండి తప్పుకున్నాడు. 


🌿విషయాన్ని గ్రహించిన మండోదరి.... తన భర్త ఒక ఆడదాని విషయంలో చూపిన తీరు, రాముడు చూపిన తీరు గ్రహించి నోటమాట రాక మౌనంగా వెళ్ళిపోయింది.


🌸పవిత్రత అనేది పుట్టుకలో కాదు, సంస్కారం బట్టి ఉంటుంది అనుకున్నది.


🌿మరి రాముడి చేతిలో రావణాసురుడు హతమారిన తరువాత మండోదరి ఏమైంది అనే విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. 


🌸అయితే ఒక పురాణం ప్రకారం మండోదరి రావణుడి మరణం తరువాత విభీషణుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.


🌿రాజు మరణించాక, వారసులు కూడా లేనట్టయితే రాణిదే రాజ్యాధికారం. రామరావణుల యుద్ధంలో రావణుడితోపాటు కొడుకులు కూడా హతమారిపోయారు కాబట్టి


🌸  అప్పటి లంక నియమాల ప్రకారం మహారాణి మండోదరి కి రాజ్యాధికారం అప్పగించాల్సిందే. 


🌿కానీ, విభీషణుడు లంకను పాలించగలడు. మొదటగా విభీషణుడు రాజు అంటే అక్కడి ప్రజలు వ్యతిరేకించారు.


 🌸కానీ మండోదరిని పెళ్లి చేసుకున్నాక ఒప్పుకున్నారంట.ఈ క్రమం లో మండోదరికి పెళ్లి చేసుకుని రాజ్యాధికారం తీసుకోవాలని 

విభీషణుడికి రాముడు సూచిస్తాడు.


🌿ఆమెను చేపట్టడం ద్వారా అధికారాన్ని పొందాలనేది రాముడు సూచించిన తరుణోపాయం.


 🌸అయితే రావణుడిని ప్రాణంకన్నా ఎక్కువ ప్రేమించే మండోదరి దీనికి తిరస్కరిస్తుంది. 


🌿కానీ ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియ కోసం జరిగే లాంఛనప్రాయమైన పెళ్లే కాబట్టి అంగీకరించాలని రాముడు చెప్పడంతో అంగీకరిస్తుంది. 


🌸తరువాత కొంతకాలానికి పర్వతాల్లోకి వెళ్లి తపస్సు చేస్తూ తనువు చాలిస్తుంది...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment