Tuesday, April 16, 2024

ఈరోజు ఆధ్యాత్మిక విషయం

 *_🌹'ఈరోజు ఆధ్యాత్మిక విషయం'🌹_*

*_మనిషి జీవితం కేవలం తాత్కాలికం. అటువంటి జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవిస్తూ, జీవిత ప్రయాణాన్ని సాగిస్తుంటారు._*
*_ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పరిచయం చేసిన ఈ మహాభారతం మనిషి జీవితానికి ఎంతో అర్థాన్ని కూడా వివరించింది. అయితే ప్రతి వ్యక్తి అనుసరించాల్సిన ఆ నాలుగు మంత్రాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం!_*

*_“సర్వే క్షయాంత నిచాయంః_*
*_పతనంతఃసమ్రుశ్ఛాయః”_* 
*_“సంయోగ_*
*_మారాతంత చ జీవితమ్”_*

*_☝ఈ నాలుగు మంత్రాలు చదివి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.☝_*

*_వీటి అర్థం పరమార్థం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం!_*

*_🌹1. సర్వే క్షయాంత నిచాయంః_*

*_ఈ ప్రపంచంలో ఉద్భవించిన ప్రతి ఒక్క వస్తువు చివరికి నాశనం కావాల్సిందే. అటువంటి వాటి కోసం కొందరు జీవితాంతం కష్టపడి సంపాదిస్తూ ఉంటారు.వారు ఎలాంటి పనిచేసినా చివరకు మిగిలేది వారు చేసిన మంచి, చెడు మాత్రమేనని మనకు మహాభారతం తెలియజేస్తుంది.కాబట్టి దురాశతో ఎక్కువ సంపాదనలో మునిగిపోవడం కాకుండా అవసరమైనంత మేరకు డబ్బును సంపాదించుకోవాలని తెలియజేస్తుంది._*

*_🌹2. పతనంతః సమ్రుశ్ఛాయః_*

*_ఈ మంత్రం అర్థం మనం జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, గొప్పలకు పోకుండా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక వ్యక్తి గొప్పగా ఎదిగితే తన కింద ఉన్న వ్యక్తులను ఆదరించేందుకు కృషి చేయాలి._*

*_🌹3. సంయోగ విప్రయోగంత:-_*

*_ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంయోగం ఉంటే అందుకు తగ్గ వియోగం కూడా ఉంటుంది. అనుకోకుండా కొంత అదృష్టం మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఎంతో సంబరపడతాము.అలాగే దూరం అయినప్పుడు బాధపడతాము. మన జీవితంలో సంయోగం, వినియోగం ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి._*

*_🌹4. మారాతంత జీవితమ్.._*

*_దీని అర్థం   పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. వ్యక్తుల పట్ల ప్రేమ పూర్వకంగా ఉండాలి కానీ,_* 
*_చనిపోయినప్పుడు పశ్చాత్తాపడకూడదు.ఈ విశ్వంలో జననం,మరణం మాత్రమే వాస్తవమైనవి._*
*_మిగిలినవన్నీ మన జీవితంలో ఏర్పడే తాత్కాలికమైన సంఘటనలు మాత్రమే._* *_మనిషి ఈ నాలుగు స్తోత్రాలను పఠించి,_* *_పాటించడం ద్వారా ఏ వ్యక్తి జీవితంలోనూ ఎటువంటి కష్ట,నష్టాలు ఉండవని మనకు మహాభారతం తెలియ చేస్తుంది.సర్వదా మనతో ఆనందమనే దివిటీని తీసుకువెళ్ళాలి. నిజమైన ఆధ్యాత్మికత మనలో ఆనందాన్ని జాగృతం చేయగలగాలి. ఆధ్యాత్మికత మనతో అన్ని చోట్లకూ ప్రకాశాన్ని తీసుకువెళ్ళేలా చేస్తుంది. ప్రపంచంలోని అందరూ ఇలా తమ వంతుగా ఆనందపు దివిటీలను తీసుకు రాగలిగితే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ తమవంతు కర్తవ్యంగా ఆనందపు కిరణాల కాంతిని లోకానికి అందించగలిగితే జీవితం ఎంతటి సుందరభరితం అవుతుంది.ఈ విషయాన్ని విస్మరించి, మనం ఆనందం ఎక్కడో బయట ఉందని వెతుకుతాం, కానీ అది మనలోపలే ఇమిడి ఉన్నది. ఎవరిలో ఈ ఆనందపు కిరణాలు ఉదయిస్తాయో వారు లోకమంతటా తమ కృపాశీస్సులను అందజేస్తూనే ఉంటారు. వారు అన్ని విషయాలనూ సత్యమనే కాంతిలో చూస్తూనే ఉంటారు, అందుచేతనే వారి మహనీయత్వాన్ని గుర్తిస్తూ ప్రజలు సహాయాన్ని అర్థిస్తూ వారి చెంతకు చేరుకుంటూ ఉంటారు._*

*_అందుకై మనం భగవంతుని ఈ విధంగా ప్రార్థించాలి.._*

*_ఓ... యోగేశ్వరా!🙏_*

*_ప్రభు నేను చేసే మీ  కార్యములలో మీరు నాకు అండగా ఉందురుగాక,_*
*_ప్రతీ కార్యములోనూ నా ఆనందాన్నీ, భక్తినీ వెల్లడి చేయగల శక్తిని ప్రసాదించుదురుగాక,_*
*_సత్యకిరణాలతో నా ఆలోచన, ఆచరణ నిండి ఉండి నా తోటివారి జీవితాలలో ప్రకాశాన్ని కలిగించుదురుగాక._*

 *_🚩సర్వేజనాః సుఖినోభవంతు.🙏🏾_*

 *_-సదా మీ శ్రేయోభిలాషి.. 💐_*

 *_-. 🙏🏾_*

No comments:

Post a Comment