Sunday, July 13, 2025

 *       ** భక్తి మార్గం **
పరమేశ్వరుడికి తుమ్మి పువ్వులు అంటే ఎందుకంత ఇష్టం.. దాని వెనుక ఉన్న రహస్యం ఇదే!  

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. కోరిన కోరికలను తీర్చే దేవుడు ఆ భోళా శంకరుడు. ఎవరైనా సరే శివలింగంపై కొన్ని నీళ్లు పోసి భక్తితో కన్నీళ్ళతో పరమేశ్వర ఆదుకోవయ్యా అని వేడుకోగానే వెంటనే ఆదుకునే దేవుడు ఆ పరమేశ్వరుడు.

ఈ సృష్టికి ఆది దంపతులు పార్వీ పరమేశ్వరుడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులను మనం నిత్యం ఆరాధిస్తూ వుంటాము. పరమేశ్వరుడికి రెండు రకాలైన పుష్పాలను ఎట్టిపరిస్థితుల్లో పొరపాటున కూడా సమర్పించవద్దు. ఒక వేల సమర్పిస్తే జీవితంలో ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవించాల్సి వస్తుందట.

వెయ్యి తెల్లజిల్లేడు పుష్పాలను తెచ్చి శివసహస్రనామం చదివి శివలింగంపైన వేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక గన్నేరు పుష్పాన్ని శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది అని శాస్త్రం మనకు చెబుతోంది. వెయ్యి గన్నేరు పుష్పాన్ని శివసహస్రనామం చదివి శివలింగంపైన పెడితే ఎంత పుణ్యమైతే వస్తుందో అంతే పుణ్యం ఒక్క మారేడు దళం శివలింగంపైన పెడితే అంత ఫలితం వస్తుంది. అలాగే ఒక బిల్వపత్రాన్ని శివలింగంపైన పెడితే మూడు జన్మల పాపాలను శివుడు హరించివేస్తాడట. వెయ్యి బిల్వదలాలను శివలింగం పైన వేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తామరపువ్వును శివలింగపైన పెడితే అంత ఫలితం వస్తుంది. అదేవిదంగా వెయ్యి తామర పుష్పాలను శివలింగం పైన పెడితే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం ఒక్క ఉమ్మెత్తు పువ్వును శివలింగం పైన పెడితే వస్తుందని శాస్త్రం మనకు చెబుతోంది.

వెయ్యి జమ్మి పువ్వులు శివలింగం పై పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్క తుమ్మి పువ్వు పెడితే అంత ఫలితం వస్తుందని చెబుతున్నారు. పరమేశ్వరుడికి తుమ్మి పువ్వు అంటే చాలా ప్రతీకరము. మారేడు పువ్వుకంటే కూడా తుమ్మి పువ్వు అంటే శివుడికి చాలా ఇష్టమని శివపురాణం మనకు చెబుతోంది. శివుడికి తుమ్మి పువ్వు ఎందుకిష్టమనేదానిపై శివపురాణంలో ఒక కథ వుంది. పూర్వం ఒక ఆటవికుడు అడవిలో వెళ్తుంటాడు. అతనికి శివుడంటే భక్తి. మార్గ మధ్యలో చలిఎక్కువగా వుండడం వల్ల ఆగిపోతాడు. అక్కడ శివలింగం వుంటుంది. శివలింగానికి నమస్కారం చేసుకొని ఒక చోట తలదాచుకొని తన దగ్గర వున్న సంచిని కప్పుకొని నిద్రపోతాడు. మధ్యలో మేలుకవ వచ్చి చలివల్ల శివుడు కూడా వణుకుతాడనుకొని ఆ సంచిని శివలింగం పైన కప్పుతాడు. దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏమి కావాలో అడుగుతాడు. తన పాదాలు ఎప్పుడూ శివుడి పైన వుండాలని కోరుతాడు, అంటే శివుడి పాదాలు తనపైన వుండాలని సరిగ్గా అడకకుండా తప్పుగా అడుగుతాడు.

అయినా కూడా శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు. వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి, పాదాల రూపంలో వుండి ఎప్పుడూ తనపై వుండేలా కోరికను ప్రసాదిస్తాడు.అందుకే తుమ్మి పువ్వు పాదాల ఆకారంలో వుంటుంది. ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది. శివుడికి ఎన్ని పువ్వులతో పూజచేసినా తుమ్మి పువ్వులతో పూజ చేయడం మరిచిపోవద్దు. కార్తికమాసంలో శివుడిని తుమ్మి పువ్వులతో పూజచేయడం చాలా శుభప్రదం. శివపూజలో పొపాటున కూడా బంతి పూలను వాడకూడదు. మొగలిపువ్వులను కూడా శివుడికి అర్పించవద్దు. ఎవరైతే మొగలి పువ్వులతో అర్పిస్తారో వారు జీవితంలో అష్టకష్టాలను అనుభవిస్తారట.
sekrana from quora

No comments:

Post a Comment