Sunday, July 13, 2025

 *గాయత్రీ మహా మంత్రం.* 

*"ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం ।*
*భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ।।*

*గాయత్రీమంత్రంలో ఇరవైనాలుగు అక్షరాలతో పాటు ఇరవైనాలుగు దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది. ఈ ఇరవైనాలుగు గాయత్రీమూర్తులకు చతుర్వింశతిగాయత్రి అని పేరు. ఈ మంత్రంలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉన్నాడు. వారెవరెవరో తెలుసుకుందాం...*

*01) తత్ - విఘ్నేశ్వరుడు*
*02) స - నరసింహస్వామి*
*03) వి - శ్రీ శ్రీమహావిష్ణువు*
*04) తుః - శివుడు*
*05) వ - శ్రీకృష్ణుడు* 
*06) రే - రాధాదేవి*
*07) ణ్యం - శ్రీమహాలక్ష్మి*
*08) భ - అగ్నిదేవుడు*
*09) ర్గః - ఇంద్రుడు*
*10) దే - సరస్వతీ దేవి*
*11) వ - దుర్గాదేవి*
*12) స్య - ఆంజనేయస్వామి*
*13) ధీ - భూదేవి*
*14) మ - సూర్యభగవానుడు*
*15) హి - శ్రీరాముడు*
*16) ధి - సీతాదేవి*
*17) యో - చంద్రుడు*
*18) యో - యముడు*
*19) నః - బ్రహ్మ*
*20) ప్ర - వరుణుడు*
*21) చో - శ్రీమన్నారాయణుడు*
*22) ద - హయగ్రీవుడు*
*23) యా - హంసదేవత*
*24) త్ - తులసీమాత*

*ఈ ఇరవైనాలుగుదేవతలకు మూలమైన గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి, దివ్యతేజస్సు, సకలసంపదలు, సమస్తశుభాలు కలుగుతాయి.*🙏

No comments:

Post a Comment