Monday, May 26, 2025

 [5/25, 13:22] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*


తడవగరాదు దుష్టగుణుదత్త మెరుంగ యెవ్వరైన నా
చెడుగుణమిట్లు వల్లదని చెప్పిన గ్రక్కున గోపచిత్తుడై
గదుదెగ జూచుగా మఱుగగాగిన తైలము నీటిబొట్టుపై
బదునెడ నాక్షణం బెగసి భగ్గు మండకయున్నె భాస్కరా!!


*తాత్పర్యం:*
దుష్టులకు దూరముండడమే మంచిది. ఎందుకంటే, వారి గుణమే అంత. దుర్జనులని తెలిశాక ఏ మాత్రం వారికి నీతులు చెప్పే సాహసానికి పూనుకోకూడదు. ఎలాంటి హితవాక్యాలూ వారి చెవి కెక్కవు. పైగా, కోపంతో మంచిమాటలు చెప్పిన వారికే చెడు తలపెడతారు. బాగా కాగిన నూనె నీటిబిందువును ఎలాగైతే దహించి వేస్తుందో అలాగ!
[5/25, 13:22] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*


*మెరిసేదంతా బంగారం కానట్లే, మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు.*
[5/25, 13:22] +91 79819 72004: *👬 నేటి చిన్నారి గీతం 👬*


*గోరంత దీపం*


గోరంత దీపం కొండంత వెలుగు
మాయింటి పాపాయి మా కంటి వెలుగు
వెచ్చని సూరీడు పగలంతా వెలుగు
చల్లని చేంద్రుడు రాత్రంతా వెలుగు
ముత్యమంతా పసుపు ముఖమంతా వెలుగు
ముత్తైదు కుంకుమా బ్రతుకంతా వెలుగు
గురువు మాట వింటె గుణమంత వెలుగు
మంచి చదువులు నీకు భవిషత్తు వెలుగు
[5/25, 13:22] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*


*ఉండనీడనిస్తే పండ మంచం అడిగినట్లు*


కొద్దిగా సహాయం చేస్తే ఇంకా ఇంకా సహాయం చేయమని వెంబడి పడటం.కష్టాల్లో నుంచి బయటపడ్డ తర్వాత కూడా ఇంకా ఆ చేరదీసిన వారి దగ్గరే ఉంటూ వారికి ఇబ్బందులు కలుగచేయటం. అలాంటి వరినుద్దేశించి ఈ మాటను వాడుతారు.
[5/25, 13:22] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*


*వస్తే కొండ పోతే వెంట్రుక*


ఒక వెంట్రుకతో కొండను లాగడానికి ప్రయత్నించినప్పుడు వస్తే కొండ వస్తుంది, పోతే ఒక వెంట్రుక పోతుంది. చిన్న పెట్టుబడితో దాదాపుగా అసాధ్యమైనంత పెద్ద లాభం సంపాయించడానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు
[5/25, 13:22] +91 79819 72004: *✍🏼 నేటి కథ ✍🏼*


*పడవా.. పద పద!*

‘స్వర్ణ సింధు’ అనే నదికి ఇరువైపులా సిరిపురం, జింకల మిట్ట అనే గ్రామాలున్నాయి. అన్ని సౌకర్యాలున్న పెద్ద ఊరు సిరిపురం. చిన్న చిన్న పల్లెల సముదాయం జింకల మిట్ట. ఆ పల్లెల ప్రజలు అనేక అవసరాల నిమిత్తం సిరిపురానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రాకపోకల్లో స్వర్ణ సింధు నదిని దాటించడానికి ఒకే ఒక పడవ ఉంది. ఆ పడవ నడిపే వాడి పేరు వరదయ్య.
ఒకరోజు సిరిపురం నుంచి జింకల మిట్టకు ఆఖరి ప్రయాణంలో పరిమితికి సరిపడే జనం చేరుకున్న తరువాత ఓ వృద్ధుడు కొడుకు సహాయంతో వచ్చాడు. అతడు తీవ్ర జ్వరంతో స్వయంగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. అతడు సిరిపురంలోని వైద్యుడి దగ్గర పరీక్ష చేయించుకుని, మందులు తెచ్చుకున్నాడు. అతడు త్వరగా ఇంటికి వెళ్లి మందులు వేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. అదే విధంగా వైద్యుడి దగ్గర పరీక్షలు చేయించుకుని ఒక గర్భిణి తన తల్లి సహాయంతో వచ్చింది.
పడవా.. పద పద!
ఆ నలుగురిని పడవలోకి రానివ్వకుండా వరదయ్య అడ్డుకున్నాడు. కారణం రాజ శాసనం. పడవ ప్రమాదాలు నివారించడానికి పరిమితికి మించి జనంతో పడవ నడిపిన సరంగులకు వంద కొరడా దెబ్బల శిక్ష విధిస్తానని రాజుగారు శాసనం చేశారు.
రాజ శాసనం ప్రకారం వరదయ్య పడవకు నిపుణులు నిర్ణయించిన సంఖ్య ముప్ఫై. పడవలోకి ముప్ఫై మంది చేరుకున్న తరువాతే వరదయ్య ఆ నలుగుర్ని అడ్డుకున్నాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వృద్ధుడి, గర్భిణి దుస్థితి చూశాక పడవలో ఉన్న వారికి జాలి కలిగింది. కానీ ఎవరూ నోరు మెదపలేక పోయారు. జింకల మిట్టకు చెందిన ప్రవీణుడనే యువకుడు మాత్రం సహించలేక పోయాడు. విద్యాభ్యాసం ముగించుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.
అతడు పైకి లేచి వరదయ్య దగ్గరికి వచ్చి ‘ఆ నలుగురిని పడవలోకి అనుమతించవలసిందే. లేకుంటే నేను పడవ కదలనివ్వను. ఇదే ఆఖరి ప్రయాణం కాబట్టి పడవ మరోసారి వచ్చే అవకాశం లేదు. తెల్లవారే వరకూ ఇక్కడ వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మనలో మానవత్వం లేదా?’ అన్నాడు ఆవేశంగా.
‘చట్టం మాటేమిటి? దేశంలోని ఏ చట్టాన్నైనా అతిక్రమించిన వారిని పట్టుకోవడానికి గూఢచారులు సంచరిస్తుంటారు. వారు ఏ క్షణంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ రూపంలోనైనా ప్రత్యక్షం కావచ్చు. వాళ్ల చేతుల్లో చిక్కి నన్ను కొరడా దెబ్బలు తినమంటావా?’’ అంటూ అశక్తతను తెలియజేశాడు వరదయ్య.
‘శాసనాన్ని ధిక్కరించడమంటే తిరుగుబాటు చెయ్యడమే, నీలో ఉన్న ఉడుకు నెత్తురు నాలో లేదు. ఇంత వాదనెందుకు పడవలోంచి ఓ నలుగురు దిగిపోతే ఆ నలుగుర్ని చేర్చుకోగలను’ అన్నాడు వరదయ్య.
పడవ నుంచి దిగిపోయి నది ఒడ్డున రాత్రంతా గడపడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే అక్కడ రాత్రి గడపటానికి ఎటువంటి సౌకర్యం లేదు. ముళ్లపొదలు పరచుకుని ఉన్న ప్రదేశం అది. పైగా చలి, చీకటి.
ప్రవీణుడు తన మాటల నైపుణ్యంతో పడవ దిగడానికి ఓ ముగ్గురు యువకుల్ని ఒప్పించగలిగాడు. తనతోపాటు నలుగురు పడవ దిగిపోవడంతో ఆ నలుగురికి చోటు లభించింది. పడవ వెళ్లిపోయింది.  
ప్రవీణుడు ఎండు పుల్లలు తెచ్చి చలిమంట వేశాడు. మంచి కబుర్లతో ఆ ముగ్గురికి కాలక్షేపం అయ్యేలా చేశాడు. మరుసటి ఉదయం పడవ రావడంతో ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత రాజు విజయ శేఖరుడి నుంచి ప్రవీణుడికి పిలుపు వచ్చింది. ప్రవీణుడితోపాటు పడవ దిగిన ముగ్గురిలో ఒకడు రాజుగారి గూఢచారి. అతడు పడవ దగ్గర జరిగిన సంఘటన గురించి సమస్తం రాజుకు వర్తమానం పంపాడు. దీంతో రాజుగారి నుంచి ప్రవీణుడికి ఆ పిలుపు వచ్చింది. రాజశాసనాన్ని ధిక్కరించినందుకు ప్రవీణుడికి శిక్ష తప్పదని అందరూ అనుకున్నారు.
కానీ ఆశ్చర్యకరంగా రాజు ప్రవీణుడిని రవాణా శాఖ పర్యవేక్షణాధికారిగా నియమించి సత్కరించాడు. దీనుల పట్ల జాలి, దయ ఉండి వారి తరఫున పోరాడగల ధైర్యం ఉన్నందుకు అతడికి ఆ పదవి దక్కింది. లోపాలతో ఉన్న ఆ చట్టానికి ఒక సవరణ చేశాడు. వృద్ధులు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్థులకు ఎప్పుడూ ప్రథమ ప్రాధాన్యం ఉంటుందనేది ఆ సవరణ. ఆ చట్టం ప్రజలకు ఎంతో నచ్చింది.

- గుండ్రాతి సుబ్రహ్మణ్యం గౌడ

No comments:

Post a Comment