Friday, May 15, 2026

 తమిళనాడు సనాతన ధర్మాన్ని అంగీకరించదా...? 

అయితే అదే తమిళనాడులో వేల ఏళ్లుగా నిలిచిన దేవాలయాలు ఎవివి రా...?
మదురై మీనాక్షి అమ్మవారు ఎవరు...?
రామేశ్వరం ఎవరి చరిత్ర...?
చిదంబరం నటరాజ స్వామి ఎవరి ఆత్మ...?
తంజావూరు బృహదీశ్వరాలయం ఎవరి వైభవం...?

తమిళ నేలలో పుట్టిన నయనార్లు ఎవరు రా...?
ఆళ్వార్లు ఎవరి భక్తి జ్వాలలు...?
రామానుజాచార్యుల అడుగుజాడలు ఎవరి సంస్కృతి...?
పెద్ద జీయర్ పరంపర ఎవరి ఆధ్యాత్మిక వారసత్వం...?

ఆరు పడైవీడు — 6 కుమారస్వామి ఆలయాలు ఎవరి వైభవం...?
అరుణాచలం “అన్నామలై” అగ్ని జ్యోతి ఎవరి ఆత్మ...?
చిదంబరం నటరాజుని ఆకాశ తాండవం ఎవరి తత్వం...?
రామేశ్వరం జ్యోతిర్లింగం ఎవరి మహిమ...?
మదురై మీనాక్షి అమ్మవారి క్షేత్రం ఎవరి గర్వం...?
శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ఎవరి భక్తి సామ్రాజ్యం...?

తమిళ సంస్కృతి అంటేనే
శైవం… వైష్ణవం… వేదం… ఆగమం… భక్తి ఉద్యమం రా 🚩

ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే… 🤭
మీ ప్రభుత్వ అధికారిక చిహ్నమే
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయం గోపురం! 🛕
గవర్నమెంట్ లోగో మీద దేవాలయం పెట్టుకుని…
మాటల్లో మాత్రం “సనాతనాన్ని నిర్మూలిస్తాం” అంటారా...? 🤣

అంటే ఊపిరి సనాతనం…
ఉనికి సనాతనం…
సంస్కృతి సనాతనం…
కానీ డైలాగులు మాత్రం యాంటీ సనాతనం 🤭
సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ
నీ తాతలు… వాళ్ల తాతలు… తరాలుగా అరుస్తూనే ఉన్నారు…
కానీ చివరికి కూలిపోయింది వాళ్ల అహంకారమే.

సనాతనం మాత్రం
హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు
ప్రతి ఆలయ ఘంటారావంలో ఇంకా బ్రతికే ఉంది…
ఎప్పటికీ ఉంటుంది 🚩

👉“మోదీ లేరు అంటే సనాతనం లేదు” అంటున్నావ్ కదా…

ఒక్క విషయం గుర్తుపెట్టుకో…
సనాతన ధర్మం ఏ రాజకీయ పార్టీతో మొదలుకాలేదు…
ఏ రాజకీయ నాయకుడితో ముగియదు 
రాముడిని ఎదిరించిన రావణులు పోయారు…
శివుడిని అవమానించిన దక్షులు పోయారు…
సనాతనాన్ని తాకిన ప్రతి అహంకారం చరిత్రలో కలిసిపోయింది…

కానీ సనాతనం మాత్రం నిత్యనూతనంగా దేదీప్యమానమవుతోంది 🚩

ఎందుకంటే ఇది ఒక మతం కాదు…
ఇది ఈ నేల శ్వాస 

సనాతన ధర్మాన్ని నిర్మూలించే మొగోడు ఇప్పటివరకు పుట్టలేదు రా…
ఇకపై కూడా పుట్టడు కూడా 💪🔥🚩

No comments:

Post a Comment