Tuesday, February 28, 2023

మొరార్జీదేశాయి మర్చి 1977 నుండి జులై 1979 వరకు భారత ప్రధాని.

 🌹మొరార్జీదేశాయి మర్చి 1977 నుండి జులై 1979 వరకు భారత ప్రధాని.

🌹వారు తమ ఆత్మకథ "ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ " లో ఇట్లు వ్రాశారు

🌹"ఆగష్టు 1935 లో భగవాన్ శ్రీ రమణులను చూచే భాగ్యం నాకు కలిగింది.

🌹భగవాన్ సోఫా పైన కూర్చొని ఉన్నారు

🌹కౌపినము దాల్చారు. శాంతి, ఆనందము వారి వదనంలో వెలిగిపోతుంది.

🌹ఆ ముఖం మీద ఒక జ్యోతి చక్రము కూడ గమనించాను.

🌹వారిని ఏమి అడగలేదు

🌹వారు కూడా నాతో మాట్లాడ లేదు

🌹వారి ముఖాన్నే చూస్తూ ఒక గంట పైన కూర్చున్నాను

🌹వారిని అడగాలని నాకే ప్రశ్నలు తట్టలేదు

🌹చిత్త శాంతితో ఉండిపోయాను

🌹మరునాడు 12 గంటలకు వెళ్ళాను. సెలవు కోరగా, భగవాన్ నన్ను భోజనాoతరము వెళ్ళమని వారు అన్నారు.

🌹భోజనము చేసి వెళ్ళాను ".

ఢిల్లీ లోని శ్రీ రమణ కేంద్రము నిర్వహించిన శ్రీ రమణ 99 వ జయంతి వేడుకలో అధ్యక్షత వహిస్తూ 1979 జనవరి 13 న భారత ప్రధాని, శ్రీ మొరార్జీ దేశాయి ఇలా అన్నారు :-

🌹భగవాన్ కి జంతు భాష తెలుసు. వాటి ఫిర్యాదులను వినే వారు.

🌹వారి దృష్టిలో అందరూ సమానమే

🌹ఎవ్వరిని మార్చుటకు ప్రయత్నం చేయలేదు. వారి సన్నిధి వల్లనే మనిషిలో పరివర్తన కలిగినది.

🌹ఎవరైనా తనకి నచ్చిన విధాన సాధన గమ్యాన్ని చేరవచ్చు నని శ్రీ రమణులు చెప్పారు.


..... సేకరణ : శ్రీ రమణ మహర్షితో ముఖాముఖి, ఆంగ్ల మూల సంకలనం ప్రొ. లక్ష్మీ నారాయణ్, తెలుగు అనువాదం పింగళి సూర్య సుందరం గారు



..... కోటంరాజు శ్రీనివాసరావు, హైదరాబాద్ 

No comments:

Post a Comment