*_మనిషికి జీవితంలో అడుగడుగునా భయాలే ఎదురవుతుంటాయి._*
*_అడుగుతీసి అడుగువేస్తే ఏమవుతుందోనని మనిషి భయపడుతుంటాడు._*
*_ఏదైనా పనిని ప్రారంభించే ముందు భయం వెంటాడుతుంది. ప్రారంభించిన తరవాత తుది వరకు నిర్విఘ్నంగా కొనసాగుతుందో లేదోనన్న భయం పీడిస్తుంది._*
*_గమ్యాన్ని చేరుకున్న తరవాత పరిణామ ఫలం ఎలా ఉంటుందోనన్న వెరపు వెంటాడుతుంది._*
*_ఇలా అనుక్షణం భయాల మధ్య బతుకు గడిపే మనిషికి మృత్యువు అంటే పెను భయం.! ఏ ఆపదా రాకుండా ఉండాలని అనుక్షణం మనిషి కోరుకుంటాడు._*
*_మరణం తొందరగా రాకూడదని ప్రార్థిస్తాడు. చిరకాలం జీవించాలని ఆశపడతాడు. ఇలా మనిషి ఆశపడటంలో తప్పులేదు. మరణం విషయంలో మనిషికి ధైర్యాన్ని కలిగించేందుకు `‘భగవద్గీత’` ఎన్నో విషయాలను బోధించింది._*
*_వాటిలో రెండు శ్లోకాలు మాత్రం మనిషికి భయాన్ని పోగొట్టే తారక మంత్రాలుగా కనిపిస్తాయి._*
*_వాటిలో మొదటి శ్లోకంలో కృష్ణుడు..._*
*_‘అర్జునా! నీవు చేయ బోతున్న యుద్ధంలో నీవు చంపేవాడివని, శత్రుపక్షం వారు చావుకు గురయ్యేవాళ్లు అని నీవు అనుకుంటున్నావు. అది నిజం కాదు... నీవు నిమిత్తమాత్రుడివే.!_*
*_మరణం వారికి ఇంతకు ముందే నిశ్చితమై ఉన్నది. పుట్టిన ప్రతి ప్రాణికి చావు తథ్యం. చచ్చిన ప్రతి ప్రాణికి మళ్ళీ పుట్టుక అనివార్యం. కనుక నీవు ఈ విషయంలో బాధపడి ప్రయోజనం లేదు. యుద్ధం చేయడమే నీ ధర్మం’ అంటాడు._*
*_ఈ మాటల్లో లోకంలోని ప్రాణుల మరణాలకు ఎవరూ కారణం కాదని, అది సహజంగా జరిగే పరిణామమేనని తెలిసినప్పుడు మనిషికి చింత, దుఃఖం దూరమవుతాయి._*
*_ఇక రెండో శ్లోకంలో..._*
*_మనిషి దేహం జీవన కాలంలో అనేక దశలను చవిచూస్తుంది. కౌమారావస్థ, యౌవనావస్థ, వృద్ధాప్యావస్థ అనేవి ముఖ్యమైనవి._*
*_పుట్టినప్పుడు మనిషి చిన్నగా ఉంటాడు. క్రమంగా పోషణతో శరీరం పెద్దదిగా మారుతుంది. బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలలో అనుక్షణం మార్పులకు లోనవుతూ తుది దశకు చేరుకుంటుంది._*
*_ఇన్ని దశలుగా మార్పు చెందిన శరీరం ఒక వస్త్రంలా జీర్ణమైపోతూ ఉంటుంది. వస్త్రం చిరిగిపోయినట్లే, అతుకులు పడినట్లే మానవదేహం కూడా శిథిలమై అతుకుల బొంతలా తయారవుతుంది. చివరికి పూర్తిగా పాడైపోయి పారవేయవలసిన స్థితికి చేరుకుంటుంది._*
*_చిరిగిపోయిన పాతబట్టలా ఈ దేహం మరణిస్తుంది. మళ్ళీ ఆత్మ మరో జన్మరూపంలో కొత్త వస్త్రాన్ని ధరిస్తుంది. అప్పుడు ‘పునరపి జననం’ సంభవిస్తుంది. ఇలా ఆత్మను కప్పి ఉంచే వస్త్రం లాంటిదే దేహం. కనుక దేహం శాశ్వతం కాదు. ఆత్మ శాశ్వతం._*
*_ఎన్ని దేహాలు మరణించినా ఆత్మ మరో దేహమనే వస్త్రాన్ని తొడుక్కుని నూతన జన్మను పొందుతుంది’ అనే విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తేటతెల్లం చేశాడు._*
*_సృష్టిలో పరిణామం అనేది అనివార్యం. ఏది అయినా పుట్టినప్పుడు ఉన్న తీరులోనే ఉండదు కదా... మార్పునకు లోనవుతూనే ఉంటుంది. అదే జీవన సత్యం. మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటే తాను శాశ్వతం కాదని, తన ఉనికి పరిమిత కాలమేనని తృప్తిపడతాడు. మరణ భయానికి దూరమవుతాడు._*
*_తాను జీవించిన పరిమిత కాలంలో అపరిమితంగా మంచి పనులు చేసి, తన జన్మను సార్థకం చేసుకుంటాడు ఇదే భగవద్గీతా పరమార్థం.☝️_*
*_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪷🙇♂️🪷 🌹🌹🌹
No comments:
Post a Comment