ajju-baipalli
2 days ago
నడక, కదలికలు అనేవి శరీరానికి సంబంధించినవి. "నేను శరీరానిని" అనే భ్రమలో ఉన్నంత వరకు మోక్షం అర్థం కాదు. శరీరం మరణించినా, నిద్రలో ఉన్నా "నేను" అనే చైతన్యం అలాగే ఉంటుంది. ఆ నిజమైన "నేను"ని తెలుసుకోవడమే ముక్తి.
బాహ్యంగా చేసే పూజలు, తీర్థయాత్రలు, లేదా నడక వంటి పనులు చిత్తశుద్ధిని కలిగిస్తాయి, కానీ అవి మాత్రమే మోక్షాన్ని ఇవ్వవు. మనస్సును దాని మూలమైన హృదయంలో (Self) లీనం చేయడమే అసలైన పని.
ఆయన ఒక ఉదాహరణ చెప్పేవారు - మనం నీడలో కూర్చుని, ఎండలోకి వెళ్లి, మళ్ళీ కష్టపడి నీడలోకి వచ్చి "ఆహా! నీడ ఎంత చల్లగా ఉందో!" అని సంతోషించినట్లుగా, మన అసలు స్థితి ఆత్మ (ముక్తి) లోనే ఉంది. మనం దాన్ని వదిలేసి బాహ్య ప్రపంచంలో వెతుకుతూ, తిరిగి ఆ స్థితిని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
http://youtube.com/post/UgkxH6ljAZK60mGooVF5Y2O2RlH9O0LWMTWs?si=2-niQq5DLu5Acmo_
No comments:
Post a Comment