Tuesday, March 1, 2022

అత్యంత ధనవంతుడు* ➖➖➖✍ *జాన్ డి రాక్ఫెల్లర్

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 అత్యంత ధనవంతుడు ➖➖➖✍ జాన్ డి రాక్ఫెల్లర్ ప్రపంచంలో బిలియనీర్ అయిన మొట్టమొదటి వ్యక్తి, అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.25 సంవత్సరాల వయస్సులో, అతను U S లో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకదానిని నిర్వహించాడు, 31 సంవత్సరాల వయస్సులో, అతను ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారఅధికారి అయ్యాడు.38 సంవత్సరాల వయస్సులో, అతను U.S.లో శుద్ధి చేసిన చమురులో 90% కి నాయకత్వం వహించాడు, 50 సంవత్సరాల నాటికి దేశంలోనే అతను అత్యంత ధనవంతుడు అయ్యాడు. మరణించే సమయానికి అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.ఒక యువకుడిగా, ప్రతీ నిర్ణయం, అతని వైఖరి, ప్రతీ సంబంధం - అతని వ్యక్తిగత శక్తి, సంపదను సృష్టించేందుకు అనుగుణంగా తీర్చిదిద్దినట్టు ఉండేది.కానీ 53 ఏళ్ల వయసులో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శరీరం మొత్తం నొప్పితో చిత్రహింస పడ్డాడు, తన వెంట్రుకలను కోల్పోయాడు.ప్రపంచంలోని ఏకైక బిలియనీర్ కు ఏదైనా కొనగలిగే శక్తి ఉంది, బాధాకరమైన విషయం ఏమిటంటే, అతను సూప్, క్రాకర్స్ తప్ప మరేదీ జీర్ణించుకోలేకపోయేవాడు.అతని సహచరుడు ఒకరు ఇలా వ్రాశాడు… "అతను నిద్రపోలేక పోతున్నాడు, నవ్వలేకపోతున్నాడు, జీవితంలోనివన్నీ అతనికి అర్థరహితమైపోయాయి."అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తిగత వైద్యులు అతను ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తారని తేల్చి చెప్పారు. ఆ సంవత్సరం చాలా భారంగా, చాలా నెమ్మదిగా గడిచిపోయింది.మరణానికి సమీపంలో, ఒక ఉదయం, తనకున్న సంపదను దేనినీ తనతో పాటు తర్వాతి ప్రపంచంలోకి తీసుకెళ్లలేడనే ఒక వివేకంతో మేల్కొన్నాడు.యావత్ వ్యాపార ప్రపంచాన్ని నియంత్రించగలిగిన వ్యక్తి, అకస్మాత్తుగా తన స్వంత జీవితాన్ని తాను నియంత్రించుకోలేకపోతున్నాడని గ్రహించాడు.అతనికి ఇప్పుడు ఒకే ఒక అవకాశం మిగిలింది.తన న్యాయవాదులను, అకౌంటెంట్లను, నిర్వాహకులను పిలిచి, తన ఆస్తులను ఆసుపత్రులకు, పరిశోధన, స్వచ్ఛంద కార్యక్రమాలకు తరలించాలనుకుంటున్నట్లు ప్రకటించాడు.ఆ విధంగా, జాన్ D. రాక్ ఫెల్లర్ తన ఫౌండేషన్ ను స్థాపించాడు.సమయానుగుణంగా ఈ కొత్త దిశ పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు, మలేరియా, క్షయ, డిఫ్తీరియా నివారణలకు దారితీసింది.కానీ బహుశా రాక్ ఫెల్లర్ కథలో అత్యంత అద్భుతమైన అంశం ఏమిటంటే, తన సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడం ప్రారంభించిన క్షణం నుండి, అతని శరీరంలో చాలా గణనీయమైన మార్పులు జరిగి, తద్వారా అతను మెరుగుపడటం ప్రారంభించాడు.అతను 53 సంవత్సరాల వయస్సులో చనిపోతాడని అనుకున్నది, 98 సంవత్సరాలు జీవించాడు!రాక్ ఫెల్లర్ కృతజ్ఞతను నేర్చుకున్నాడు, తన సంపదలో ఎక్కువ భాగాన్ని తిరిగి ఇచ్చాడు. అలా చేయడం వల్ల స్వస్థత చేకూరడమే కాకుండా, అతను పరిపూర్ణుడయ్యాడు.అతను స్వస్థతకు, సంపూర్ణతకు మార్గాన్ని కనుగొన్నాడు.స్వామి వివేకానందను కలిసిన తర్వాత రాక్ ఫెల్లర్ ప్రజా సంక్షేమం కోసం తన మొదటి పెద్ద విరాళాన్ని ఇచ్చాడని, క్రమంగా ఒక విశిష్టమైన పరోపకారి అయ్యాడని చెబుతారు.పేదవారికీ, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి, రాక్ ఫెల్లర్ కు తన దాతృత్వం ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుందని వివేకానంద సూచించారు.మరణానికి ముందు, అతను తన డైరీలో ఈ విధంగా వ్రాసాడు:"నాకు పని చేయడం, ఆడుకోవడం నేర్పించబడింది, నా జీవితం ఒక సుదీర్ఘమైన, సంతోషకరమైన సెలవు దినం; పుష్కలంగా పని , పుష్కలంగా ఆట ఆందోళనను నేను దారిలో వదిలేసాను. భగవంతుడు నాకు ప్రతిరోజూ మేలు చేసాడు!"ఇవ్వడంలో ఆనందమే, జీవించటంలోని అసలైన ఆనందం. ♾♾♾"ప్రపంచంలోని అన్ని సంపదల కంటే అంతర్గత శాంతి అత్యంత ముఖ్యం."✍. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

No comments:

Post a Comment