ఓం నమో భగవతే శ్రీ రమణాయ
శివానందలహరి లోని ఒక శ్లోక భావాన్ని మహర్షి ఇలా వివరించారు..!!
గుహలో, ఇంటిలో, ఆరుబయట, అడవిలో, పర్వతాల మీద, నీళ్ళల్లో నిలబడి, అగ్ని మధ్యలో - కఠిన నిష్ఠలు, నియమాలు పాటించి ఏమి ప్రయోజనం?
ఓ శంభూ! సదా నీ పాద సన్నిధిలో స్థిరంగా ఉండటమే మనసుకి నిజమైన యోగం. దీన్ని సాక్షాత్కరించుకున్నవాడే నిజమైన యోగి. అతడే బ్రహ్మానందాన్ని అనుభవించగలడు.
మమతను విసర్జిస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. అహమును విడిస్తే జ్ఞానము కలుగుతుంది. ఇచ్చుగుణము బాగా పెరిగితే అది జ్ఞానానికి తెచ్చి చేరుస్తుంది.
No comments:
Post a Comment