Friday, June 10, 2022

నేటి జీవిత సత్యం. మన దేశంలో జనాలకి దేవతల పూజలు,ఆరాధనలలో ఉన్న ఆసక్తి ..దేవుడి ధర్మాలు తెలుసుకోవడంలో లేదు.

నేటి జీవిత సత్యం.

మన దేశంలో జనాలకి దేవతల పూజలు,ఆరాధనలలో ఉన్న ఆసక్తి ..దేవుడి ధర్మాలు తెలుసుకోవడంలో లేదు. అందుకే మనకు గుడి, పూజ, కోరిక..ఇవి తప్ప వేరే తెలీదు. ధర్మము అంటే వేద, పురాణ,ఉపనిషత్తులు కావు. అని చెప్పడానికే.. రూప,నామ,క్రియలు లేని పరమాత్మ , శ్రీ కృష్ణునిగా పుట్టి దేవుడి ధర్మములు తెలిపాడు. ఆయన "కేవలం పరమాత్మను తప్ప వేరొక్కరిని పూజించినా నువ్వు వారిలోకే కలుస్తావు. కానీ.. పరమాత్మను వేడుకో.. అప్పుడు ఆయనలోకి ఐక్యం అవుతావు. అదే మొక్షం " అంటాడు. ఇంత స్పస్టమైన వివరం తెలిపిన పరమాత్మ మాట కాదని...ఇప్పటి స్వామీజీలు చెప్పిన...యాగాలు, యజ్ఞా లు, పూజలు, మొ క్కులు, ముడుపులు అని అధర్మాలను ఆచరిస్తున్నారు. ఇవి అధర్మాలని భగవంతుడు గీత యందు చెప్పినా.. తెలుసుకొనే సమయం లేని జనాలు అజ్ఞా నంతో గుడి, గోపురాలకు వెల్తూ అసలైన దేవుడిని మరచిపోయారు. అందుకే..సమస్యలు, రోగాలు, ప్రకౄతి విపత్తులు. ఆకరికి గుడులు కూడా పెరిగాయి. మనశ్సాంతి మాత్రం తగ్గింది. ఎప్పుడు ప్రజలు ధర్మాలను ( కర్మ, బ్రహ్మ, భక్తి యోగం) ఆచరిస్తారో.. అప్పుడే మనిషి ఈ కష్టాల నుండి ముక్తి పొందుతాడు.

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment