Sunday, November 21, 2021

మన అభివృద్ధికి భయమే అవరోధం అంటారు. అసలు భయం అంటే ఏమిటి? భయానికి కారణాలు ఏమిటి?

ప్రశ్న: మన అభివృద్ధికి భయమే అవరోధం అంటారు. అసలు భయం అంటే ఏమిటి? భయానికి కారణాలు ఏమిటి? భయాన్ని పోగొట్టుకునే మార్గాన్ని సూచించండి.

జవాబు: మన సామర్ధ్యం మీద మనకు నమ్మకం సన్నగిల్లి, వ్యతిరేక శక్తుల ప్రభావానికి లోనైనప్పుడు కలిగే ఒత్తిడిని 'భయం' అంటారు. మన పరాజయాలన్నింటికీ మూలకారణం భయమే! భయం కలగడానికి ముఖ్య కారణాలు :

1. ఆత్మవిశ్వాసం లేకపోవడం : ఎప్పుడైతే మనం మన మీద విశ్వాసం కోల్పోతామో అప్పుడు ప్రతికూలభావాలు మనల్ని ఆవరిస్తాయి. "భయమే మరణం, భయమే పాపం, భయమే నరకం, భయమే దుఃఖానికి మూలకారణం. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రతికూల భావాలు ఉత్పన్నమయ్యేవి భయం అనే దుష్టశక్తి నుంచే" అని అంటారు స్వామి వివేకానంద.

2. పరులపై ఆధారపడడం : మన స్వశక్తిపై ఆధారపడకుండా ప్రతిదానికీ ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మనల్ని నిస్సహాయులుగా, భయస్థులుగా మారుస్తుంది.

"Why are people so afraid? The answer is that they have made themselves helpless and dependent on others. - Swami Vivekananda

3. పని మీద నిబద్ధత, నమ్మకం కోల్పోవడం : మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ ఇతరులు చులకనగా చూస్తారనే భావన మనలో రానివ్వకూడదు. దానివల్ల మనం పని మీద నిబద్ధతనూ, నమ్మకాన్ని కోల్పోతాం. అలాంటి ఊహాజనిత భయాలను వీడితేనే ప్రగతి సాధ్యం.

ఉదాహరణకు ప్రఖ్యాత వ్యాపారవేత్త, ధార్మికుడు అయిన జి. పుల్లారెడ్డిగారు మిఠాయిల వ్యాపారం ప్రారంభించక ముందు వీధుల్లో తిరుగుతూ టీ అమ్మేవారు. ఒకరోజు రోడ్డు ప్రక్కన టీ అమ్ముతుండగా అతని బంధువు ఒకతను ఆ దారిలోనే రావడం గమనించారాయన. తాను టీ అమ్మడం నామోషీగా భావించి టీ కెటిల్ ను అక్కడే వదిలేసి చెట్టు చాటున దాక్కున్నారు. ఇంతలో మేకలు గుంపుగా వచ్చి ఆ టీ కెటిల్ ను తన్నేయడంతో టీ అంతా నేలపాలైంది. అప్పుడు ఆయన చాలా బాధపడి 'నిజాయతీగా కష్టపడి పనిచేస్తున్నప్పుడు చిన్నతనంగా ఎందుకు భావించాలి? ఇతరులను చూసి ఎందుకు భయపడాలి?' అని తనని తాను ప్రశ్నించుకొని నిర్భయంగా తన పనిని కొనసాగించారు. కాబట్టి మనం నిజాయతీగా చేపట్టే ఏ పనినైనా భయం లేకుండా చేయడం వల్ల సత్ఫలితాల్ని సాధించవచ్చు.

4. విమర్శల గురించి అతిగా ఆలోచించడం: ఇతరుల విమర్శలకూ, అభిప్రాయాలకూ భయపడితే ఏ కార్యంలోనూ విజయాన్ని సాధించలేం. కాబట్టి వాటి గురించి అతిగా ఆలోచించి భీతిల్లకూడదు.

We cannot succeed in anything, if we act in fear of other people's opinions. . C. Rajagopalachari

భయాన్ని పారద్రోలడానికి కొన్ని సూచనలు :

భయం మానసిక బలహీనత వల్ల కలుగుతుంది. 'A sound mind in a sound body అనే నానుడి మనందరికీ తెలిసిందే! దృఢమైన మనస్సు ఉండాలంటే దృఢమైన శరీరం అవసరం. అందుకు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

క్రమశిక్షణతో కూడిన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం అలవరచుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలం.

ఇతరుల విమర్శలను మనలోని బలహీనతల్ని తొలగించు కోవడానికి ఉపయోగించుకోవాలి.

• ఇతరుల శక్తి సామర్థ్యాలతో పోల్చుకొని బాధపడకుండా నిరంతర తపన, నిర్విరామ కృషితో దేనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.

మనలోని లోటుపాట్లను అధిగమించడానికి అనుభ వజ్ఞులైన పెద్దల నుంచీ, సన్నిహితుల నుంచీ సలహాలను స్వీకరించాలి.

Source - Whatsapp Message

మిత్రమా..... హిందువులకు అదేం ఆత్మవంచనో🤦‍♂️ తమ పవిత్రమైన సంప్రదాయాలు, నామాలు, ఆచారాలను తిట్లకి, అవహేళనకి పర్యాయపదాలుగా వాడుతూ తమ సంస్కృతి సాంప్రదాయాలను తామే అవమానుపరుచుకూoటూవుంటారు🤦‍♂️

.
మిత్రమా.....
హిందువులకు అదేం ఆత్మవంచనో🤦‍♂️ తమ పవిత్రమైన సంప్రదాయాలు, నామాలు, ఆచారాలను తిట్లకి, అవహేళనకి పర్యాయపదాలుగా వాడుతూ తమ సంస్కృతి సాంప్రదాయాలను తామే అవమానుపరుచుకూoటూవుంటారు🤦‍♂️

boss తిట్టాడా" అని అడగటానికి బదులుగా "అక్షింతలు పడ్డాయా" అని అడగటం🤦‍♂️
"మందు🥃కొట్టావా" అని అడగటానికి బదులు "తీర్ధం పుచ్చుకున్నావా" అని అడగటం🤦‍♂️
"మోసం చేశాడా" అని అడగటానికి బదులు "పంగనామాలు పెట్టాడా" అని అడగటం OR "శఠగోపం పెట్టాడు" అని అనడం🤦‍♂️
"బార్ నుండి మందుకొట్టి వస్తే "ఎరా గుడినుండి వస్తున్నావా" అని స్నేహితులు అడగటం 🤦‍♂️

"దివాళా తీశారు (ఓడిపోయారు)" అని ఎక్కిరించడానికి/అవహేళన చెయ్యడానికి"👉 "గొవిందా గో....విందా......" అని వాడటం 🤦‍♂️
"trap చేయడాన్ని" 👉 "ముగ్గులోకి దింపాను" అనడం🤦‍♂️

ప్రలోభపెట్టి ప్రేమలోకి or trapలోపడేయడానికి ప్రయత్నించడాన్ని "పులిహోర కలుపుతున్నాడు" అని
ప్రతి పండుగకు చేసుకుని దైవానికి నైవేద్యముగా సమర్పించే పవిత్రమైన "పులిహోర"ని అవమానించడం/అవహేళనచెయ్యడం🤦‍♂️

పవిత్రమైన "సంస్కృత" భాషను తాగుబోతులు మైకం తలకెక్కిన తరువాత మాట్లాడే అర్ధంకాని బూతుమాటలను 👉 ఇక సంస్కృతం మొదలుపెడతారు" అని అవమానించడం 😡🤦‍♂️

ఇలా చెప్పుకుంటూ పోతే మన హిందువులే తమ పవిత్ర భాషను, సాంప్రదాయాలను, ఆచారాలను, నామాలను అవమానించుకోవడం పరిపాటి(fashion) అయిపోయింది😡🤦‍♂️

పండగ నాడు పాత మడుగేనా(పాత బట్టలు) అనేది సామెత. కమ్యూనిస్టు కొడుకులు దీనిని పండగనాడు పాత మొగుడేనా(భర్త) అనేలా మార్చేశారు ఆచారాలు మంట కలపాలి అని.

ఎవరైనా ఎక్కువ గోల చేస్తే ఇందిరా నీ రామాయణం అనిమంచి చెబితే జ్ఞాన బోధ వద్దు అని, సిగరెట్టు కాల్చుకోవడానికి అగ్గిపెట్టె ఇచ్చేవాడిని గురు అగ్గిపెట్టె అని అడగడం, ఏదైనా పోతే, తగిలితే గంటేమె కాదు అనడం, ఎవరైనా కక్కుర్తి పడితే నీ కక్కుర్తిలో నా కమండలం అని, ఏదీ మిగలలేదు ఉపయోగం లేదు అంటే ఏమి మిగిలింది బూడిద అనడం, మోసపోతే తూర్పు తిరిగి దండం పెట్టు అనడం... ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడాలంటే శతకోటి లింగాలలో నువ్వో బో లింగం అనడం etc.... ఇదో పెద్ద లిస్టులు హనుమంతుని తోక* లా అని వాడుకోవడం కూడా ఇదే తరహా... 🤷‍♂️యిక ముందు యిటువంటి జోకుల కు స్వస్తి పలుకుదాము.ముందు మన నుంచి వీటిని తీవ్రంగా ఖండించే పని ప్రారంభించుదాము. వాస్తవికత తో హిందూ దేవి, దేవతలను, గ్రంథాలను గౌరవించుకుందాము

-------()()()()()()--------



ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను చూడటానికి మరియు All India Arya Vysya Sangam చేరడానికి, ఇక్కడ క్లిక్ చేయండి

https://kutumbapp.page.link/DvtuTeXFopKhgtLi6

Source - Whatsapp Message

జీవిత సత్యం.

జీవిత సత్యం.

ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే.

సముద్రంలో అలలు ఎన్నో. కానీ తీరానికి చేరేవి కొన్నే.

అలాగే జీవితంలో పరిచయమైన వారు ఎందరో...

కానీ మనసుకు హత్తుకునేవారు కొందరే. వారే ఆత్మీయులు.

మన ఆలోచన ఒక విత్తనం లాంటిది. విత్తనం నుండి వచ్చే మొలక పెరిగి పెద్దదై మహావృక్షంగా మారుతుంది.

అంటే విత్తనం మంచిదవడం వల్ల అది పెరిగి మహావృక్షం అయింది.

అలాగే మన ఆలోచనలు మంచివైతే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.

బతికితే శత్రువు కూడా పొగడాలి.
చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అలా జీవించగలిగితేనే సంఘంలో గౌరవం, మర్యాద.

జీవితం మనకు నచ్చినట్లు ఎప్పటికీ వుండదు. అన్నీ సర్దుకొని బ్రతకాలి. నచ్చిందే కావాలి అనుకుంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేము.

మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుంది. ఎందరు ఉన్నా ఎక్కడ ఉన్నా , రాళ్ళలో మంచి ముత్యం వలె కనిపిస్తుంది.

ఇదే జీవిత సత్యం!

శుభ సాయంత్రం తో మీ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి ఆణిముత్యాలు.

నేటి ఆణిముత్యాలు.

సహనం అంటే..
దండించే అధికారం ఉన్నా
దండించ పోవడం.
ప్రేమ అంటే..
వదిలిపెట్టే అవకాశం ఉన్నా
వదలక పోవడం,
వ్యక్తిత్వం అంటే..
చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా
చెడిపోకుండా ఉండడం.


కష్టాల్లో ఉన్నపుడు కూడా
మీ ప్రయత్నాన్ని వదిలి పెట్టవద్దు.
ఎందుకంటే నీ ప్రయత్నాన్ని చూసి
ఆ కష్టాలే నీ పట్టుదలకు
తలవంచక తప్పదు.


మీకు సాయం చేస్తన్న వారిని మరువకండి...
మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేశించకండి....
మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి.....

దురాశ పరుడైనవ్యక్తిని ధనం తోను..
మొండి ఘటాలను అభినందనలు తోను...అవివేకిని హాస్యం తోను..
పండితుడుని నిజం తోను జయించ వచ్చు


మనం వేరేవారి తప్పుల నుంచి కూడా
పాఠాలు నేర్చుకోవాలి.
ఎందుకంటే అన్నింటినీ మన సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే,ఈ జీవితకాలం సరిపోదు.

అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటమే కాదు.
కష్ట సుఖాలు ను పంచుకొనే స్నేహితులు ఉండటo..

నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడాలనే కోరిక ఉంటుంది.
నీలో దానగుణo పెరిగితే ఆదేవుడికే నిన్ను చూడాలనే కోరిక ఉంటుంది.


బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి..
బాథని పంచుకొంటే రిలాక్స్ గా
అనిపించాలి...


వెనుక జనం వున్నారని ఎగిరిపడకు...
వెన్నుపోటు పొడిచేవాడు వెనుకనుండే వస్తాడు.. జాగ్రత్త మిత్రమా *


చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం.
దానిని సక్రమంగా పూర్తి చేయడమే సద్గుణం.

ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగగబడతారు. మనకు పరిచయం వున్నవాడు ఎదిగితే తట్టుకోలేరు...

శుభోదయం తో మానస సరోవరం

Source - Whatsapp Message

నిజమే నిలుస్తుంది

"నిజమే నిలుస్తుంది"

ఇది చిన్న అబద్దమే అని
అనుకోవొద్దు..
అబద్దాలన్నీ ఒక్కటై
నిజాన్ని నెట్టేస్తుంది...

మనిషి మనసును
కూల్చేస్తుంది..
గుండెను పేల్చేస్తుంది..
విశ్వాన్ని..
జయించాలని చూస్తుంది..
విషయం తెలిసిందో
విచ్ఛిన్నమవుతుంది!!...
అబద్దాలకు సలాంచేసి
గులాములౌతుంటే...
దగాకోరు బడాచోరులు
నిజాన్ని చంపేస్తోంటే...
ఇక ధర్మం..
న్యాయం!!ఎక్కడ??

కత్తి పోటుకన్నా
అబద్దం పోటు ఎక్కువ...
పడగ విప్పిఆడుతుంది..
మనుషుల్లో..
భేదాలను సృష్టిస్తుంది!!..
వింతలెన్నో పుట్టిస్తుంది!!..

సత్యం..ధర్మం
కళ్ళకు గంతలుకట్టి
నిజాన్ని నిలువుగా
పాతేస్తోంటే...
విలువలన్నీ...
వీధుల వెంబడి
విచిత్ర వేషధారణతో..
చీకటి శూన్యంలో..
వేదనాభరితరోదనతో
తిరుగుతున్నాయి!!..

నిజం..
నిజమెన్ని తంటాలు
పడ్డా తన్నుకొని వస్తుంది!!...
ఎంతవారినైనా..
తలను వంచేలా చేస్తుంది!!..
గంభీరంగా గర్జిస్తుంది!!..
నిర్భయంగా లేచి నిలబడుతుంది!!..
భరించలేని భయంకర అబద్దాన్ని..
బద్దలు కొడుతుంది!!..
చివరికెపుడూ గెలుపు
నిజానిదే!!...

అబద్ధం ఎంతఎత్తుకు
ఎగిరినా..చివరకు
చిక్కిశల్యం కావలసిందే!!
వేలాదిమంది అడ్డుపడినా..
నిజం నిప్పులా..
ఎగసిపడుతుంది!!..
అబద్ధం ఉప్పులా..
చిటపటలాడాల్సిందే!!...

యుగాలనుండి
ఈ అబద్దం..
మానవమనుగడను
కూల్చేస్తోంది!!..
మనుషుల మధ్య
పగల్ని పెంచుతోంది!!...
కొందరి జీవితాల్ని
నలిపేసింది!!..
సముద్రమంత..
విశాలమైన..
మానవ సమాజాన్ని...
ఆవగింజంత అబద్ధం
అంతా కల్తీ చేస్తోంది!!
అందుకే అబద్ధం వద్దు..
నిజమే ముద్దు!!..
చివరికి నిజమే నిలుస్తుంది!!...

అంబటి నారాయణ
నిర్మల్
సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

అసూయపై గెలిచే మార్గం

🍀🌻💥🌹🦚🚩


🔥అసూయపై గెలిచే మార్గం🌹

పగ, ప్రతీకారాలకు ప్రతీక... అసూయ. మానవ సంబంధాల్ని క్షణంలో దిగజార్చి, అంతం చేయడానికి సైతం వెరవని అంటువ్యాధి అసూయ. అది క్షణాల్లో వైషమ్యాలను సృష్టిస్తుంది. ఎంతటి అనుబంధాలనైనా అణుబాంబు కంటే వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది.

‘అసూయ లేకపోవడమే అహింస’ అన్నారు వివేకానంద.

రామాయణం, మహాభారతం, అన్నింటిలోనూ అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాల ప్రస్తావన ఉంటుంది. వాటి ఆధారంగా మనిషి ఏ విధంగా జీవించకూడదో తెలియజేసే గ్రంథాలు పుట్టుకొచ్చాయి.

కాలక్రమంలో అవి ప్రామాణిక, ఆధ్యాత్మిక గ్రంథాలుగా రూపాంతరం చెందాయి.

అసూయ అనే నలక మనసులో పడితే చాలు….
పగ పొగ పెడుతుంది.
ద్వేషం ఆజ్యం పోస్తుంది.
ప్రతీకారం దారులు వెతుకుతుంది.
అంతే! అగ్నిజ్వాలలు రగులుకుని ఫలితాన్ని బూడిద రూపంలో మిగులుస్తుంది.

ఆప్యాయత అనగానే పొందే అనుభూతికి, అసూయ అనగానే పొందే భయానికి, చీకటి వెలుగులకున్నంత వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రేమ ధైర్యానికి చిహ్నం అయితే, అసూయ భయానికి మారుపేరు.

మనిషికున్న ప్రబల శత్రువుల్లో ఆరోది అసూయ. కోరిక, కోపం, మోహం, లోభం, అహం- వీటిని జయించిన ఎంతటి తపోధనులు అయినా... అసూయకు అతీతులు కాదని చాటే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

ఇద్దరు మునులు కఠోర తపస్సు చేస్తున్నారు. కొంత కాలానికి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని ఒకరిని అడుగుతాడు.

“సమీపంలో మరో ముని తపస్సు చేస్తున్నాడు, అతడు కోరిన దానికి రెట్టింపు నాకు ఇవ్వమ”ని అడుగుతాడు.

దేవుడు రెండో ముని వద్దకు వెళ్ళి, మొదటి ముని కోరిన కోరిక తెలిపి, “నీకేం కావాలి?” అంటాడు.

వెంటనే ఆ రెండో ముని “నాకు ఒక కన్ను పోవాలి!” అని కోరుకుంటాడు.

“దేవుడు “తథాస్తు!” అంటాడు. ఫలితం తెలిసిందే!

బాల్యంలో ఊహ కలిగినప్పటి నుంచే అసూయ మొదలవుతుంది. అమ్మ ఒక పిల్లవాడిని ముద్దు చేస్తే మరొకరికి అసూయ, అసహనం కలుగుతాయి.

రుక్మిణిపై అసూయ కారణంగానే శ్రీకృష్ణుణ్ని సత్యభామ వీధిలో విక్రయించి, తులాభారం వరకు తీసుకెళ్ళింది.

అసూయను పూర్తిగా త్యజించి అప్రమత్తంగా ఉండేవారు సమస్త విశ్వంలోని ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. దాన్ని నిస్వార్థంగా పంచగలుగుతారు.

‘అసూయ కలిగినవాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ అసంతృప్తితో, ప్రతీకారేచ్ఛతో, సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు. తమకు ఎంత ఉన్నా ఎదుటివారికి ఉన్న ‘కొంత’ను చూసి అసంతృప్తితో రగిలిపోతుంటారు.

నూరుగురు అన్నదమ్ములు, రాజ్యం, సకల సంపదలున్న దుర్యోధనుడు- దాయాదులైన పంచ పాండవులకు సూది మొన మోపినంత భాగం కూడా ఇవ్వననడం అసూయకు పరాకాష్ఠ.

అసూయతో సాధించేది శూన్యమని గ్రహించలేకపోవడం మూర్ఖత్వం. అసూయ కట్టెకు అంటుకున్న నిప్పు లాంటిది. అసూయకు ఆశ్రయం ఇస్తే వారిని అది చెదపురుగులా తొలుస్తూ, ఆఖరికి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది.

అసూయను పట్టుకుని శిఖరాగ్రం వరకు ఎవరైనా చేరారనుకోండి. అక్కడి నుంచి కిందకు చూస్తే, ఏ ఒక్క బంధం కనుచూపు మేరలో కనిపించదు. పైకి వెళ్ళలేక, కిందకు రాలేక, త్రిశంకు స్వర్గమనే శూన్యంలో ఒంటరిగా మిగలాలి.

అసూయను వదిలించుకోవాలంటే, ముందు దాని తాలూకు చెడు ప్రభావాలను అర్థం చేసుకోవాలి. అందుకు ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రయత్నం చెయ్యాలి.

‘అసూయను మించిన శాపం మరొకటి లేదు.

అసూయను ‘ప్రేమ, దయ, కరుణలతోనే జయించగలం’ అన్నాడు గౌతమ బుద్ధుడు.*✍️

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

అసూయ....

మనిషికున్న ప్రబల శత్రువుల్లో ఆరోది అసూయ. కోరిక, కోపం, మోహం, లోభం, అహం- వీటిని జయించిన ఎంతటి తపోధనులు అయినా... అసూయకు అతీతులు కాదని చాటే ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇద్దరు మునులు కఠోర తపస్సు చేస్తున్నారు. కొంత కాలానికి దేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని ఒకరిని అడుగుతాడు. సమీపంలో మరో ముని తపస్సు చేస్తున్నాడు, అతడు కోరిన దానికి రెట్టింపు నాకు ఇవ్వమని అడుగుతాడు. దేవుడు రెండో ముని వద్దకు వెళ్ళి, మొదటి ముని కోరిన కోరిక తెలిపి, నీకేం కావాలి అంటాడు. వెంటనే ఆ రెండో ముని ‘నాకు ఒక కన్ను పోవాలి’ అని కోరుకుంటాడు. దేవుడు తథాస్తు అంటాడు. ఫలితం తెలిసిందే!

బాల్యంలో ఊహ కలిగినప్పటి నుంచే అసూయ మొదలవుతుంది. అమ్మ ఒక పిల్లవాడిని ముద్దు చేస్తే మరొకరికి అసూయ, అసహనం కలుగుతాయి. రుక్మిణిపై అసూయ కారణంగానే శ్రీకృష్ణుణ్ని సత్యభామ వీధిలో విక్రయించి, తులాభారం వరకు తీసుకెళ్ళింది. అసూయను పూర్తిగా త్యజించి అప్రమత్తంగా ఉండేవారు సమస్త విశ్వంలోని ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు. దాన్ని నిస్వార్థంగా పంచగలుగుతారు.

‘అసూయ కలిగినవాళ్లు ప్రశాంతంగా ఉండలేరు. ఎప్పుడూ అసంతృప్తితో, ప్రతీకారేచ్ఛతో, సందర్భం కోసం ఎదురు చూస్తుంటారు. తమకు ఎంత ఉన్నా ఎదుటివారికి ఉన్న ‘కొంత’ను చూసి అసంతృప్తితో రగిలిపోతుంటారు. నూరుగురు అన్నదమ్ములు, రాజ్యం, సకల సంపదలున్న దుర్యోధనుడు- దాయాదులైన పంచ పాండవులకు సూది మొన మోపినంత భాగం కూడా ఇవ్వననడం అసూయకు పరాకాష్ఠ. అసూయతో సాధించేది శూన్యమని గ్రహించలేకపోవడం మూర్ఖత్వం. అసూయ కట్టెకు అంటుకున్న నిప్పు లాంటిది. అసూయకు ఆశ్రయం ఇస్తే వారిని అది చెదపురుగులా తొలుస్తూ, ఆఖరికి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తుంది.

అసూయను పట్టుకుని శిఖరాగ్రం వరకు ఎవరైనా చేరారనుకోండి. అక్కడి నుంచి కిందకు చూస్తే, ఏ ఒక్క బంధం కనుచూపు మేరలో కనిపించదు. పైకి వెళ్ళలేక, కిందకు రాలేక, త్రిశంకు స్వర్గమనే శూన్యంలో ఒంటరిగా మిగలాలి.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

నేటి ఆణిముత్యాలు.

నేటి ఆణిముత్యాలు.

సహనం అంటే..
దండించే అధికారం ఉన్నా
దండించ పోవడం.
ప్రేమ అంటే..
వదిలిపెట్టే అవకాశం ఉన్నా
వదలక పోవడం,
వ్యక్తిత్వం అంటే..
చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా
చెడిపోకుండా ఉండడం.


కష్టాల్లో ఉన్నపుడు కూడా
మీ ప్రయత్నాన్ని వదిలి పెట్టవద్దు.
ఎందుకంటే నీ ప్రయత్నాన్ని చూసి
ఆ కష్టాలే నీ పట్టుదలకు
తలవంచక తప్పదు.


మీకు సాయం చేస్తన్న వారిని మరువకండి...
మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేశించకండి....
మిమ్మల్ని నమ్ముతున్న వారిని మోసం చేయకండి.....

దురాశ పరుడైనవ్యక్తిని ధనం తోను..
మొండి ఘటాలను అభినందనలు తోను...అవివేకిని హాస్యం తోను..
పండితుడుని నిజం తోను జయించ వచ్చు


మనం వేరేవారి తప్పుల నుంచి కూడా
పాఠాలు నేర్చుకోవాలి.
ఎందుకంటే అన్నింటినీ మన సొంత అనుభవంతోనే నేర్చుకోవాలంటే,ఈ జీవితకాలం సరిపోదు.

అదృష్టం అంటే ధనం, ఆస్తులు ఉండటమే కాదు.
కష్ట సుఖాలు ను పంచుకొనే స్నేహితులు ఉండటo..

నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడాలనే కోరిక ఉంటుంది.
నీలో దానగుణo పెరిగితే ఆదేవుడికే నిన్ను చూడాలనే కోరిక ఉంటుంది.


బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి..
బాథని పంచుకొంటే రిలాక్స్ గా
అనిపించాలి...


వెనుక జనం వున్నారని ఎగిరిపడకు...
వెన్నుపోటు పొడిచేవాడు వెనుకనుండే వస్తాడు.. జాగ్రత్త మిత్రమా *


చేయబోయే పనిని తెలుసుకోవటమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం.
దానిని సక్రమంగా పూర్తి చేయడమే సద్గుణం.

ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగగబడతారు. మనకు పరిచయం వున్నవాడు ఎదిగితే తట్టుకోలేరు...

శుభోదయం తో మానస సరోవరం

Source - Whatsapp Message

అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు నవంబర్19.2021.

ఈ రోజు మా మగాళ్ల దినోత్సవం.
అని సంతోషించే లోపే...
మరుగుదొడ్ల దినోత్సవం కూడా
ఉందని గుర్తు చేశాడు.😢 😢😢
అయినా సరే ఏదైనా ఎంజాయ్ చేద్దామంటే ఈరోజు కార్తీక పౌర్ణమి.

మా బాధలు ఎవరు పట్టించుకుంటారు, ఏడవలేక పైకి నవ్వుతూ తిరిగే మేము మాకు మేమే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాము.

ఈ క్రింది విధంగా
మా బాధ లు ఎవరు అర్దం చేసుకుంటారు..

🙏అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు నవంబర్19.2021.🙏

⚡ నువ్వు అలిగితే... ఆడపిల్లవా... అని హేళన.

⚡నువ్వు ఏడిస్తే... ఏడ్చేవాడిని
నమ్మొద్దని హేళన.

⚡సరదాగా బయటతిరిగితే... తిరుగుబోతు అని బిరుదు .

⚡బాధ మరిచిపోవడానికి తాగితే... తాగుబోతు అని బిరుదు.

⚡అమ్మ చెప్పినట్లు వింటే అమ్మ చాటు కొడుకు అని.

⚡భార్య చెప్పినట్లు వింటే పెళ్ళాం చాటు మొగుడని.

⚡చెల్లె, అక్క, బావ, బాబాయ్, మాట వింటే చేతకాని చవట అని.

⚡దోస్తులతో బయట తిరిగితే
జులాయి అని.

⚡ఎక్కువ మాట్లాడితే పోకిరి అని.

⚡తక్కువ మాట్లాడితే నల్లికుట్లోడు అని.

నీవు ఏమి చేసినా, ఎలా ఉన్నా తప్పు పట్టే లోకంలో.
ఇంటా-బయట అన్ని రకాల
బాధలు భరిస్తూనే, అవమానాలు సహిస్తూనే... బాధ్యతలు మోస్తూనే... కొడుకుగా, తండ్రిగా, భర్తగా, సోదరుడిగా, మేనమామగా, అల్లుడిగా, ప్రేమికుడిగా, స్నేహితుడిగా నిరంతరం ప్రేమ ను పంచుతూ...

అనునిత్యం త్యాగాలు చేస్తూ...నే ఉన్న...ఓ..."మగ"ధీరుల్లారా...

⚡విధి వంచిత, ప్రియురాలు-భార్యాభాధిత, జనబాధిత, అప్పుబాధిత...మొ'...

శోకా...తప్త హృదయుల్లారా
బాధా సర్పదష్టుల్లారా...

⚡ఏ బాధాలేకుండా ఉంటున్న మహర్జాతకుల్లారా...(కొందరు)

⚡బాధనిపిస్తే మనసారా ఏడ్వలేని నిస్సహాయ పురుషుల్లారా...

⚡బ్రతుకు సమరం లో చితికిపోయిన అభినవ గరళకంఠుల్లారా...

⚡జీవితంలో సమస్యలతో కుస్తీ పడుతున్న మల్లయోధుల్లారా...

⚡కుటుంబం కోసం గస్తీ కాస్తున్నా ఇంటి సైనికుల్లారా...

⚡కుటుంబ శ్రేయస్సు కోసం కష్టపడుతున్న జీతంలేని నిరంతర శ్రామికుల్లారా...

⚡ వచ్చింది...నీ కోసం ఓ రోజు నీకూ కేటాయించారు...ఓ రోజు...ఈ రోజైనా...అన్నీ...మరిచి...నీ...కోసం...నీవు...కాసేపైనా...సమయాన్ని కేటాయించుకొని సంతోషంగా గడుపుతావని... ఆశిస్తూ...

అంతర్జాతీయ
పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు...
HAPPY MEN'S DAY-2021
సర్వే 'మగ' జనా సుఖినోభవంతు🙏...

సేకరణ.
ఎవరో తెలియదు.

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యం. తప్పులెన్నువారు.

నేటి జీవిత సత్యం.
తప్పులెన్నువారు

🌹పరనింద మానవ స్వభావంలో సర్వసాధారణ లక్షణం. తప్పులుగా తమకు తోచేవి ఎదుటి వ్యక్తిలో కనపడినప్పుడు, ఆ మనిషిలో మరెన్ని మంచి గుణాలున్నా, ఆ తప్పులనే పట్టిచూపిస్తుంటారు కొంతమంది. తప్పులుగా వాటిని అతడు అంగీకరించక ప్రతిస్పందిస్తే, చులకనగా చూడటమే కాక, అపరాధిగా ముద్ర వేయడానికైనా వెనకాడరు.

🍁మనిషి ఎప్పుడూ తప్పులే చేయడా?
🍁మరొకరి తప్పులపై తనకంత ఆసక్తి ఎందుకని? 🍁ఆత్మవిమర్శ చేసుకునేందుకు కొందరు అవకాశమివ్వరు.
🍁 సర్వం విష్ణుమయమన్నప్పుడు భగవంతుడి సృష్టిలో తప్పులెలా ఉంటాయన్న పరమ భావన మహాత్ముల్లోనే కనిపిస్తుంది.

🍁గీతలో కర్మయోగం, తప్పొప్పులను విభజించి భగవంతుడు మనిషికిచ్చినదేమీ లేదని, అవి రెండూ అతడి కర్మాచరణల ఫలితాలని అంటుంది.
🍁ధర్మశాస్త్రాలన్నీ అతడిని, తన అహంభావనలతోనే అవి నిర్ణయించి నిర్దేశించే న్యాయాధికారివి కావద్దంటాయి.
🍁అదే వాస్తవాన్ని, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరని, వేమన శతకంలోని ఒక చిన్న పద్యపాదం అతడికి చిరకాలం జ్ఞాపకం ఉండేలా చెబుతుంది.

🍁ఇటాలియన్‌ మేధావి లియొనార్డో ఒకరిలో తప్పులుగా కనిపించేవి, భూతద్దాల్లో పెద్దవిగా చేసి చూపించి ప్రపంచాన్ని ఉద్ధరించాలని మనుషులనుకుంటే అది చవకబారు ప్రయత్నమంటాడు. దాన్ని మానుకొమ్మంటాడు.

🍁తప్పు మీద తప్పు చేసుకుపోతున్న శిశుపాలుడు అతడు నూరు తప్పులు చేసేదాకా కృష్ణపరమాత్ముడు ఉపేక్షించి ఊరుకున్నాడు.
🍁 ఆ తరవాతనే అతడిని సంహరించాడు. తప్పు చేసే వ్యక్తికి తగినన్ని అవకాశాలిచ్చికానీ భగవంతుడు శిక్షించడని చెప్పే పురాణ గాథల అంతరార్థం అదేనని మనుషులు గ్రహించరు.

🍁 తప్పు చేసినప్పుడు చేసిన వాడికది తప్పని చెప్పి సరిదిద్దుకొమ్మని ఒప్పించగల కుశలత కలిగినవాడు గొప్పవాడు.

🍁గౌతమ బుద్ధుడు అటువంటి మార్గదర్శకుడు. కరడుగట్టిన బందిపోటు అంగుళీమాలుడి దోషభూయిష్ఠమైన ప్రవర్తనలో గుణాత్మకమైన పరివర్తనకు కారణమై ఆయన అతడిని తనకు ప్రధాన శిష్యుడయ్యే స్థాయికి చేర్చాడు.

🍁తప్పులు చేసేవారికి తమ తప్పులు తెలుసుకునేందుకు భగవంతుడే సమయం ఇస్తున్నప్పుడు, సాటి మనిషి తప్పులపై అంత తొందరగా స్పందించవలసిన అగత్యం తమకేమిటని మనుషులు ఆలోచించరు. నిందారోపణలు చేస్తూ జీవించే మనిషి నిజ జీవితంలో ఎన్నటికీ విజేత కాలేడు.

🍁భగవంతుడు మనుషులందరినీ దోష రహితులుగా, సమగ్రత తొణికిసలాడే పరిపూర్ణులుగా సృష్టించలేదు. తప్పులు చేయవద్దని, అవి జరగకుండా చూసుకొమ్మని మనిషి మరో మనిషికి చెప్పడం ధర్మవిరుద్ధం కాదు.

🍁చేసిన తప్పు తెలియజెబుతున్నప్పుడు, తప్పు చేసిన వ్యక్తికి అది తనపై ప్రేమాభిమానాలతో, సదుద్దేశంతో జరిగిన ప్రయత్నంగా అనిపించాలి.
🍁యుక్తాయుక్తాలు నిర్ణయించే అధికారి తానన్న భావన అతడికి కలిగిస్తూ, తప్పులు సరిదిద్దాలనుకుంటే- ఈ ప్రపంచంలో అతడు ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముంటుంది.
- ✍️జొన్నలగడ్డ నారాయణమూర్తి

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Thursday, November 18, 2021

నేటి జీవిత సత్యం. *👃ముక్కు మీద కోపం🔥*

నేటి జీవిత సత్యం. 👃ముక్కు మీద కోపం🔥

“ముక్కుమీది కోపం నీ ముఖానికే అందం” అంటాడో సినీ కవి. కోపం ముక్కుమీద ఉండడమేమిటి? అక్కడేమీ కనిపించదు కదా? కోపం మన కళ్ళల్లో కదా కనిపించేది? అంటే నిజమే. కోపం మన చూపుల్లోనే కనిపిస్తుంది. ఎంతటి శాంతమూర్తులకైనా ఏదో సమయంలో కోపం రాకా తప్పదు. అది వారి కళ్ళల్లో కనిపించకా తప్పదు. కాని ముక్కుమీది కోపం అనే నానుడికి అర్థం వేరు. అతి తొందర గానూ అనవసరంగానూ కోపం తెచ్చుకునే వారి విషయంలోనే ఇలా అంటారు. ఎందుకనంటే ఎవరికైనా తమ శరీర భాగాల్లో అన్నిటి కంటే ముందుకు ఉండేది తమ ముక్కే
అందుచేత ముక్కుమీద కోపం అంటే కోపిష్టులకు వారికంటే ముందే వారికోపం ఉంటుందన్నమాట. ముక్కు మూసుకుని ఘోరమైన తపస్సు చేసి ఎన్నో శక్తులను పొందిన ముని వర్యులలో కూడా తమ కోపాన్ని అణచు కోలేక ఎవరెవరికో శాపాలనిచ్చి తమ తపఃఫలాన్ని వృథా చేసుకున్నవారూ ఉన్నారు. అందులో దూర్వాస మహర్షి అగ్రగణ్యుడు.ఆయనకు కోపం ఆయన ముక్కుమీదే ఉండేది. అయిన దానికీ కాని దానికీ శాపాలిస్తూ ఉండేవాడు. అందుకే మన వాళ్లు కోపిష్టి వాడిని చూస్తే “వాడో దూర్వాసుడు రా” అంటారు.
మన పెద్ద వాళ్లు ఏ పిల్ల అయినా అందంగా ఉందని చెప్పేటప్పుడు కన్ను ముక్కు తీరుగా ఉన్నాయని చెబుతారు. అంటే మిగతా అవయవాలకి ఇవ్వని ప్రాముఖ్యత ఈ రెండిటికి ఇచ్చినట్లే కదా? సర్వేంద్రియాణాం నయనం ప్రధానం కనుక కళ్ళు,వాటి తర్వాత ముక్కు తీరునే చూస్తారన్నమాట. మనిషి సౌందర్యంలో ముక్కుకు ఉన్న ప్రాధాన్యం అటువంటిది. పంచేంద్రియాలలో ముక్కు స్థానం పదిలం. అందుకే లక్ష్మణస్వామి వారు శూర్పణఖకి ముక్కు చెవులు మాత్రం కోసి పంపించి వేసారు.అదే పెద్ద శిక్ష.
రోజుల వయసులో ఉన్నలేలేతపిల్లలలో కొందరికి ఒళ్లంతా పచ్చగా ఉంటుంది.
ముక్కును గురించి తెలిపే పద్యం
మరెందుకాలస్యం? అద్దంలో మీ ముక్కు తీరు చూసుకుని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.
సూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకం తపం బంది యో
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనస్సౌరభ్య సంవాసియై
పొందెన్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులిర్వంకలన్
(అన్ని రకాల పూవుల వాసనను గ్రోలుచు ఆనందించే తుమ్మెద తనంటే ఎందు కిష్ట పడదని సంపెంగ పూవు ఘోరమైన తపస్సు చేసి నాయిక నాసిక రూపును ధరించి ఆమె చూపులనే తుమ్మెదల బారునే పొందినదని కవి ఉత్ప్రేక్షించాడు. అంటే నాయికయైన గిరికా దేవి ముక్కు సంపెంగ పూవంత అందంగా ఉందని భావం.)
ముక్కు లు అందరివీ ఒకేలా ఉండవు. కొందరివి సన్నగా పొడుగ్గానూ కొసదేరి ఉంటాయి. చివర కొంచెం వంగి ఉండి నాగలిలా ఉండే వాటిని కోటేరేసిన ముక్కులంటారు. (కోటేరంటే నాగలి). చిలక ముక్కు లాఉంటాయి కొందరివి. మరికొంత మందివి పొట్టిగానూ లావు గానూ నొక్కి వేసినట్లుంటాయి. వీటిని చప్పిడి ముక్కులంటారు. అసలే ముక్కు లేని వానిని ముక్కిడి అంటారు. మా చిన్నప్పుడు మా మాష్టరు గారొకాయనకు చాలా లావుగానూ పెద్దగానూ కొట్టొచ్చినట్లు కనిపించే ముక్కు ఉండేది. ఊళ్లో చిన్నా పెద్దా అందరూ ఆయనను ముక్కు మేష్టరుగారనే వ్యవహరించేవారు. ముక్కంటూ ఉన్నాక పడిశం రాకుండా ఉంటుందా? అన్నది సామెత. పడిశం సంగతి ఏమోగాని ఆయన ముక్కు ఆయనకు పెద్ద పేరు తెచ్చిపెట్టింది
రోజుల వయసులో ఉన్నలేలేత పిల్లలలో కొందరికి ఒళ్లంతా పచ్చగా ఉంటుంది. ముక్కు మీద చెవుల వెనకా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి పిల్లలకు వచ్చే పచ్చకామెర్లే కారణమట.వారిని
రోజూ ఉదయ కాలపు నీరెండలో కాసేపు ఉంచితే అదే తగ్గి పోతుంది. ఇలా చంటి పిల్లల ముక్కులు పచ్చగా ఉండడం చేతనే మన వారు వారిని ముక్కు పచ్చలారని ముద్దుబిడ్డలన్నారు. ( దీనినే ఇంగ్లీషు వారు కొంచెం వెనక్కివెళ్లి still green behind the ears అన్నారు). ఇక్కడా మన వారు మాత్రం ముక్కునే తలచుకున్నారు.
“ముక్కుకు ముక్కెర అందం” అన్నాడు మరో సినీ కవి. అందమైన ముక్కుకు ఆభరణం ముక్కు పుడక. మంచిరోజు చూసి ఆడ పిల్లకు ముక్కు కుట్టించడం కూడా ఒక పండుగే. ఇప్పుడంటే నవనాగరీకమైపోయారు గానీ,ఆంధ్ర దేశంలో ముక్కుకు ముక్కు పుడక లేని స్త్రీలు ఉండేవారు కాదు. (“ముద్దుకు అది ప్రతిబంధం” అయినా సరే.) మన మగువల సౌందర్యాభిలాష అటువంటిది మరి. వజ్రమో మెరిసే రాళ్లో పొదిగిన ముక్కెర ముదితల ముఖారవిందాలను ముచ్చటగొలిపేలా చేస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్త్రీలే కాదు రాధారమణుడూ రాసలీలాలోలుడూ అయిన మన శ్రీ కృష్ణుడు కూడా తన నాసికాగ్రాన నవ మౌక్తికాన్ని ధరించే వాడు. (ఎందుకో మరి మన సినీ కృష్ణుడు మాత్రం ఇది ధరించినట్లు దాఖలాలు లేవు)
నఖశిఖ పర్యంతం స్త్రీల సౌందర్యాన్ని వర్ణించిన మన ప్రబంధ కవులు ఇంత ముఖ్యమైన అంగాన్ని వర్ణించకుండా వదలి పెడతారా? “నువ్వు పువ్వన నవ్వు జవ్వని నాసిక” అని నువ్వు పువ్వుతో సరిపోలుస్తాడు నాయిక ముక్కును చేమకూర వేంకట కవి. మరి నంది తిమ్మన గారైతే ముక్కు మీద పద్యం వ్రాసి ప్రసిధ్ధి చెంది దానినే తన ఇంటి పేరుగా చేసుకున్నాడు. అందమైన ముక్కు మీది అందమైన పద్యాన్ని అడిగినంత ధర ఇచ్చి కొనుక్కుని మరీ తన కావ్యంలో వాడుకున్నాడు

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

వృద్ధాప్యానికి ఆహ్వానం: ---) శ్రీ గొల్లపూడి మారుతీరావు

వృద్ధాప్యాన్ని విశ్లేషించి, వర్ణించి, తరచి‌,
దాని రూపురేఖల్ని అరటిపండులా వలిచి
మన చేతిలో పెట్టిన
శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి
రచనను చదివి ఆనందించండి.

🧘‍♀🧘‍♀🧘‍♂🧘‍♂🧘‍♀🧘‍♀🧘‍♂🧘‍♂

వృద్ధాప్యానికి ఆహ్వానం:
---) శ్రీ గొల్లపూడి మారుతీరావు

వృద్ధాప్యం ఒక మజిలీ.

ప్రతీ వ్యక్తీ కోరుకున్నా, కోరుకోక పోయినా తప్పని సరిగా చేరుకునే మజిలీ.

వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి,
అలసి పోయిన అనుభవాలనీ,
ఆరిపోయిన అనుభూతులనూ
నెమరు వేసుకునే చలివేంద్రం.

వృద్ధాప్యం ఒక అవకాశం.

వెనక్కి తిరిగి చూసుకుని,
చేసిన తప్పిదాలకు నవ్వుకుని,
దాటిన అడ్డంకులను పరామర్శించి,

ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.

ముసిలితనం కొడుకుకంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది.

మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది.

జీవితమంతా కొరుకుడు పడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది.

పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు.

ఒక జీవిత కాలాన్ని 'తెలీని తనానికి తాకట్టు' పెట్టిన కొడుకుని చూసి నవ్వు కుంటుంది.

తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వ పడుతుంది.

అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది.

ఏ విమర్శా అవమానం అనిపించదు.
ఏ నిందకీ కోపం రాదు.
వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు.

నీ జీవితకాలంలోని సాధనల్ని పక్కనపెట్టి, కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు.

అదొక అంతస్థు.

అతని హితవుని నలుగురూ వింటారు, నీ ఆలోచనని గౌరవిస్తారు.

దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు.

వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.

''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది.

''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది.

తన గురించి తన పెద్దలూ అలనాడు.. అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.

వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది.

చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని,
శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది.

తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయి పోతోందని అర్థమవుతూంటుంది.

దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది.

''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది.

అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగువేస్తుంది.

దానికి ఊతం వృద్ధాప్యం.

జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి.

ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది.

ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది?

ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది?

ఏమయినా తనకేం బాధలేదు.
ఆ సమయంలో తను ఉండడు.

ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.

దేవుడు ఎక్కడ ఉంటాడు?
ఎలా వుంటాడు?

మృత్యువు తరువాత ఏమవుతుంది?

సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి.

చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం.

చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది.
చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది.

ఎప్పటిలాగే తెల్లారి,
వృద్ధులతో కలిసి నడిచి,
రెండుముద్దల అన్నం తిని,
అరగంట సేదతీరి,
వేడి టీ తాగి,
సాయంకాలం పార్కు బెంచీ దగ్గర 'ఈ దేశం తగలడి పోతోంద'ని తిట్టుకుని,
శాంతపడి,
కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి,
రాని నిద్రనీ,
నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం - వృద్ధాప్యం వ్యసనం.

ఇప్పుడు విచారం దగ్గరకు రాదు.

వెళ్లిపోయిన హితులూ,
సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు.

ముగింపు భయపెట్టదు.
ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక.

అన్నిటినుంచీ, అందరినుంచీ
తనని కుదించుకుని - మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.

ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి.

చేసిన తప్పిదాలు,
మాటతప్పిన కప్పదాట్లూ,
మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ -
అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి.

ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు.

వినినట్టు నటిస్తారు.
నటిస్తున్నారని తనకీ తెలుసు.
విన్న తృప్తిని తానూ నటిస్తాడు.

వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు.

కాని వృద్ధాప్యం
ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు.

వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు.

జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు.

ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.

'చమకం'
ఏ రుషి,
ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో,

ఎంత ముందుచూపు,
ఎంత వినయసంపద,
జీవుని నిస్సహాయత,
నిర్వేదం - అందులో ఎంత నిక్షిప్తమయి వుందో,

ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -
తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం'
తనని ఆవరించుకుని ఉంటుంది.

ఈ దేశపు వేదసంపద, సాంస్కృతిక వైభవం,
జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం.

చమకంలో
'వృద్ధం చమే'
అనే ఒక్క కోరికా
ఈ జాతినీ,
మతాన్నీ,
ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ.. వరం.

భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం.

అదీ వృద్ధాప్యం.

Source - Whatsapp Message

Wednesday, November 17, 2021

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.
మనం మాట్లాడే కొన్ని మాటలు ఎదుటి వ్యక్తిని సూటిగా గాయపరుస్తాయి. మనం చేసే మరికొన్ని ఆలోచనలు మన మైండ్ నుండి బయటకు రాకపోయినా ఇతరుల్ని హర్ట్ చేసేవిగానే ఉంటాయి. పాపాలూ, శాపాలూ ఎక్కడో లేవు. మన ప్రవర్తనలోనే అవి భాగం.

ఒక వ్యక్తికి మనం మానసికంగా గాయం చేసినప్పుడు మనకు అది సరదాగా ఉండి ఉండొచ్చు. మనం భేషుగ్గానే జీవిస్తూ ఉండొచ్చు. కానీ అవి మానసికంగా మనకు తెలీకుండా మన సబ్-కాన్షియస్‌లో గిల్ట్ రూపంలోనూ, ఇతర రూపాల్లోనూ పేరుకుపోతూ ఉంటాయి. అవి manifest అవడానికి వాటికంటూ ఓ రోజు వస్తుంది. అప్పుడు అవి తమ ప్రభావాన్ని మనపై చూపిస్తాయి. ఆ ప్రభావం ఏ రూపంలో ఉంటుందో కూడా మన ఊహకు తట్టదు.

ఎప్పుడు ఒకలానే ఉండటానికి
మనం మిషన్ కాదు మనుషులం కదా. పారే నది కూడా దిశ మార్చుకుంటుంది పయనాన్ని ఆపుకోలేక,వీచే గాలి కూడా స్తబ్దుగా నిలిచి పోతుంది, పయనమెటో తెలియక,
అల్లరి చేసే మనసు కూడా
మౌనంగా ఉండిపోతుంది గాయాలను మోయలేక,
ఒక్కోసారి అంతే అంతు చిక్కని ఆలోచనలలో పడి మనం తప్పిపోతాం.ఎప్పుడు ఒకలానే ఉండటానికిమనం రాయి, రప్ప కాదుగా..మళ్ళీ మనల్ని మనం వెతికే క్రమంలో మనం దొరుకుతామో లేదో కూడా తెలియదు.కొన్ని మార్పులు
మేలుకొల్పుతాయి.కొన్ని మార్పులు మనల్ని మనకు దూరం చేస్తాయి.

ఉషోదయం తో మానస సరోవరం 👏

Source - Whatsapp Message

పాపం చెవి గోల బాథ .

పాపం చెవి గోల బాథ .

హలో! నేను మీ చెవిని👂
మేము ఇద్దరము, కవలలము👂👂, కానీ మా దురదృష్టమేమిటంటే,
ఇప్పటి వరకు మేము
ఒకరినొకరు చూసుకోలేదు .
ఏ శాపమో తెలియదు
మేము ఎడ మొహం పెడ మొహంగా అమర్చబడ్డాము.

మా బాధ్యత కేవలము
వినడము మాత్రమే.
తిట్లు, చప్పట్లు,
మంచి, చెడు,
అన్నీ మేమ వింటాము.

కానీ క్రమ క్రమంగా మమ్మల్ని వస్తువుల్ని వేలాడదీసే ఆధారాలుగా మార్చేశారు. కళ్ళ జోడు బరువును మాపై మోపుతున్నారు. సమస్య కళ్లదైతే, సావు మోత మాకేమిటి?

బాల్యంలో చదువుకునేటప్పుడు
ఎవరికైనా మెదడు పని
చేయకపోతే మాస్టరు గారు
మమ్మల్నే మెలేస్తారు

యవ్వనంలో పురుషులు,
మహిళలు అందరూ
అందమైన జూకాలు,
కమ్మలు, లోలకులు
మొదలైనవి చేయించుకొని
మాపైన వేలాడదీస్తారు.
రంద్రాలు చేయడం, రక్తాలు కారడం మాకైతే,
పొగడ్తలు మాత్రము ముఖానికి.

ఇక అలంకరణ చూడండి. !
కండ్లకు కాటుక, ముఖానికి క్రీములు
పెదవులకు లిపిస్టిక్,
మరి మాపై ఎందుకు వివక్ష?

ఎప్పుడైనా ఏ కవి అయినా
ఏ శాయరీ అయినా చెవుల గురించి ప్రశంసిస్తూ పొగిడితే చెప్పండి.
వారి దృష్టిలో కళ్ళు,
పెదవులు, చెంపలు ఇవే సర్వస్వము.

కళ్లకు బాధ కలిగితే కన్నీరు కారుస్తాయి. ముక్కుకు బాధకలిగితే చీదుతుంది, నోటికి బాధ కలిగితే అబ్బో, అయ్యో అని మొత్తుకుంటుంది. మరి మాకు బాధ కలిగితే బయటకు తెలియకుండా లొలొపలే భరించాలి.

ఇక పోతే పెన్నులు, పెన్సిళ్లు, అగ్గి పుల్లలు, సిగరెట్లు, బీడీలు, ఇలా ఎవరికి కావలసింది వారు మా మీద దాస్తుంటారు.

ఇదివరకు హెడ్ ఫోన్లని మాకు మూతలు వేసేవారు, ఇప్పుడు పైత్యం పెరిగి, ఇయర్ ఫోన్లని మాలోపలికి తోసి మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏమండీ ఒక్కసారి మీ ముక్కుకు నోరుకు మూతవేసి చూడండి ఎం జరుగుతుందో.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కరోనా మాయరోగం మా చావుకు వచ్చింది. ముక్కు, మూతి మూసుకోవడానికి వేసుకునే మాస్కులను కూడా మాకే తగిలిస్తున్నారు.

మేము చెవులమండీ, చెక్క కొయ్యలం కాదు, ఏది పడితే అది వ్రేలాడెయ్యడానికి.

మీకిష్టమొచ్చినట్లు కాకుండా మా పనికి మాత్రమే మమ్మల్ని వాడండి. చెవులే కదా అని చిన్న చూపు చూడకండి. మేం సంయమనం కోల్పోయామంటే మీరు కళ్ళు తిరిగి కింద పడతారు.
అందరి కి నవ్వుల శుభోదయం*🙏☺️💐💐

Source - Whatsapp Message

Tuesday, November 16, 2021

కోరికల్ని నియంత్రించడం ఎలా..???

💥కోరికల్ని నియంత్రించడం
ఎలా..??? 💦🎊


🌱మనిషిలోని మనసు చాలా చంచలమైంది. దాని యాంత్రికతకు అంతం లేదు. మనిషి బాల్యం నుంచి ఏవేవో వాంఛలకు అలవాటుపడతాడు. ఒకదాని తరవాత మరొకదాన్ని మనసు కోరుతూనే ఉంటుంది.

🌱జీవితాంతం అలా మనసు మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. నిజానికి మనిషి తనలోని మనసును గురించి అవగాహన కల్పించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మడం ఒక పెద్ద వ్యామోహం. ఈ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే మనసు చెప్పినట్లు వినడం మానేస్తే సరి. మనసు నిండా కోరికలు, ఆలోచనలను నింపకూడదు.

🌱మనసును స్థిమితపరచడం ఎలా? కోరికల్ని నియంత్రించడం ఎలా? ఇందుకోసం మనిషి సాధన చేయాలి. మొదట మనలోని కృత్రిమత్వాన్ని గుర్తించాలి. అందులోని చెడును తెలుసుకోవాలి. మానవత్వాన్ని, దైవత్వాన్ని అవగాహన చేసుకోవడంవల్ల కోరికల ఉద్ధృతి తగ్గుతుంది.

🌱సరిగ్గా అప్పుడు మనలోకి మనం నెమ్మదిగా సూటిగా చూసుకోవాలి. మనలో ఏం జరుగుతుందో గమనించడం అవసరం. మనసులోకి ప్రవేశిస్తున్న ప్రతి వాంఛను, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండి, అలాంటి గమనిక కొనసాగినప్పుడు మనసు తాలూకు చంచల ప్రవృత్తి నెమ్మదిస్తుంది. ఆ తరవాత మన మనసులోకి మనం fప్రవేశించగలం.

🌱సాధారణంగా మనసు తాను గమనించిన ప్రతిదానికి ఏదో ఒక పేరు పెట్టి దానికో ప్రయోజనం కల్పించి, మరొకదానితో పోల్చడం చేస్తుంది. అయితే ఏ ప్రయోజనం ఆపేక్షించకుండా, నిర్వ్యామోహంగా మనసు లోపలికి చూడటం జరిగితే చంచలమైన ఆలోచనలు ఆగిపోతాయి. నిశ్చలమైన స్థితి కలుగుతుంది. ఆ స్థితిలో మనకు కోరికలు ఉండవు. ప్రయోజన ఆపేక్షా ఉండదు. ఆశలు, భయాలు కలగవు. ఈ స్థితిని నిలుపుకోవడం ఎలా?

🌱వస్తున్న ఆలోచనలను గమనించాలి. వాటిని గమనిస్తే చాలు- మనసు పరిధిలోకి వ్యక్తిగతమైన శక్తి అపరిమితమవుతుంది. అప్పుడు మనసును వ్యక్తిగత పరిధినుంచి తప్పించడమే మనం చేయాల్సిన పని. నెమ్మదిగా ముందుకు సాగాలి.

🌱ఈ ఆలోచన లేని ఏకాగ్రతను ధ్యానం అనవచ్చు. నెమ్మదిగా నిశితంగా మనలోని మనసును గమనించడంవల్ల ఏ ఘర్షణ లేకుండానే మనోభూమిక నుంచి వెలుపలికి రావచ్చు. మనలోని సున్నితత్వం, సూక్ష్మ పరిశీలనా పెరిగే కొద్దీ- ఆలోచనలు, కోరికలు సమసిపోతాయి. ఆలోచనల నుంచి స్వేచ్ఛ పొందడం, స్వస్థితిని చేరడం- మనల్ని మనం తెలుసుకోవడం! ఇవి తెలివితేటలతో సాధించేవి కాదు. మన స్వప్రేరణతో అనుభవించవలసిందే. మనసు ప్రమేయం లేకుండా స్వప్రేరణ సాధ్యమేనా? సాధ్యమే, కాని సాధన చాలా కష్టం.

🌱ఎందుకంటే నిరాపేక్షతో మనసును గమనించడం మనకు అలవాటు లేని పని. మన నరాల నిర్మాణం అందుకు సహకరించదు. మన మెదడులోని కణాలు తమను తాము గమనించుకోవడానికి అలవాటు పడి లేవు. అందుకే మన దృక్పథం మారడం ముఖ్యం. ఏవో కొన్ని అలవాట్లు, ఆలోచనలు మార్చుకున్నంత మాత్రాన సరిపోదు. మనలో మార్పు సమూలంగా రావాలి. అప్పుడే నూతన చైతన్యం కలుగుతుంది.మనశ్శాంతిని, ప్రశాంతిని, ఆనందాన్ని ప్రసాదించే శుద్ధ చైతన్యాన్ని అన్వేషించాలి. సంపూర్ణ అవగాహనతో మన సమస్త శక్తులను వెచ్చించి కృషి చేయాలి.

🌱సరే! మరి ఈ యాంత్రిక మానసిక క్రియలను ఎలా వదిలించుకోవాలన్న ప్రశ్న ఇక్కడ తలెత్తక మానదు. మౌలికంగా ప్రస్తుత స్థితినుంచే సాధన ప్రారంభించాలి. మనసు చర్యలను నెమ్మది నెమ్మదిగా గమనిస్తూ ఉండాలి. ఉత్తినే గమనించండి చాలు. ఆలోచనా ప్రవాహం నెమ్మదిస్తుంది. ఉద్ధృతి తగ్గుతుంది. రానురాను మనసు మనల్ని వశపరచుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉంటుంది.

🌱విచక్షణ, ఆలోచన, వాంఛ లేనప్పుడు ఆలోచనలు నిలిచిపోతాయి. ఎంత అధికశక్తిని ఏకాగ్రతపై వెచ్చించగలమో, అంతగా భౌతికమైన ఆలోచనలు తగ్గుతూ వస్తాయి. అప్పుడు ఆలోచించకుండానే బాహ్యాన్ని మరిచి పరాన్ని గమనించగలుగుతాం. ఆ పైన మనసు చైతన్యమై ప్రస్ఫుటమవుతుంది. మనసనేది కోరికల కర్మాగారం. ఆ విషయం గ్రహించి బయటపడాల్సింది మనమే. మన గురించి మనం అర్థం చేసుకొన్నప్పుడు ఆత్మ విలువ తెలుస్తుంది.

🌱అప్పుడే మనసు చేసే పెత్తనం నుంచి మనం చైతన్యం, స్వేచ్ఛ పొందగలుగుతాం. ఆ స్వేచ్ఛలోనే శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక అవగాహనతో జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి. మనసును హృదయంతో జతచేయాలి. అప్పుడు మన ప్రతిభ బయటకొస్తుంది.
ఎల్లెడెలా ఆధ్యాత్మికానందం మన సొంతమవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి మరొక మంచిమాట. నిత్య సత్యం.

నేటి మరొక మంచిమాట.
నిత్య సత్యం.

వచ్చిందీ తెలియదు పోయేదీ తెలియదు వచ్చిపోయేది మాత్రం సత్యం. నిత్యం మనం చూసే సత్యమే ఇది.ఇది తెలిసి కూడా నేను శాశ్వతం అన్నట్లుగా వుంటే తెలిసి కూడా తప్పు చేస్తున్నట్లే కదా!

ఇంకా విచిత్రం ఏమంటే 60 + లోకి వచ్చినా మారటం లేదంటే ఎలా?. ఇది ఆరోపణ కాదండి విశ్లేషణ. మారాలా లేదా అనేది ఆలోచిద్దాం.

అనుక్షణం మారే ఈ సృష్టిలో ఆనందంగా జీవించాల్సిన మనిషి అజ్ఞానంలో జీవిస్తూ ఎంతున్నా సంతృప్తి లేకుండా ఇంకా ఇంకా అని పరిగెడుతూ సమయం వృదా చేసుకుంటున్నాడు. అవునా కాదా కాస్త గమనిస్తే తెలుస్తుంది.

చేతులారా తెలిసి తెలిసి సమస్యలను ఆహ్వానించటం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నేటి సమాజంలో సమస్యల నైనా భరిస్తున్నాం కానీ మారటానికి ప్రయత్నించడం లేదు.

పంట చేను పాడు చేస్తున్నాయని పశువులకు మూతికి చిక్కం పెట్టినట్టుగా అందరికీ ఆ సృష్టికర్త కరోనా రూపంలో నోటికి చిక్కం పెట్టాడు చివరి ప్రయత్నంగా. అవునో కాదో ఎవరికి వారే ప్రశ్నించుకుందాం (ఎక్కడ చూసినా ఆస్పత్రులు రోగులు).

ఇప్పటికే మొదటి వేవ్ రెండో వేవ్ దిగ్విజయం. మూడో వేవ్ రెడీ టూ అటెంక్షన్ అని ప్రపంచం కోడై కూస్తుంది.

అందుకే నిర్లక్ష్యాన్ని వదిలి లక్ష్యాన్ని ఎంచుకుని మాంసాహారం మానేసి శాకాహారం తీసుకుని థ్యానం చేస్తూ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా దర్జాగా జీవిద్దాం. అమాయకులని మెల్కొల్పుదాం. మన ధర్మం మనం నెరవేర్చుదాము.

ప్రయత్నంలో ఒడిపోవద్దు. పట్టుదలగా ప్రయత్నిద్దాం ప్రగతి పథంలో పయనిద్దాం. థ్యాన జగత్ సాకారం చేద్దాం!

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

నేటి జీవిత సత్యం. నవ్వు ఓ అద్బుత ఔషధం

నేటి జీవిత సత్యం. నవ్వు ఓ అద్బుత ఔషధం

మనం మరిచిపోతున్నాం...
మనసుతో వచ్చెనవ్వును
ఆరోగ్యాన్ని ఇచ్చే నవ్వును!!...
ఆనందాన్నిచ్చే నవ్వును!!...
ఏడవడం నేర్చుకొన్నాం...
ఏడిపించడం నేర్చుకొన్నాం!!...
బతికించే నవ్వును వదిలేశాము!!...

అర్తంకాని ఆలోచనలతో
నిత్యం బాధలను మోస్తున్నాం!!...
ఇతరుల మీద మాటల
బాంబులు వేస్తున్నాం!!...
ఎవరికి అర్తం కానీ వ్యతలను
తలలోకి నింపుకున్నాం...
కపటనవ్వులు...నవ్వుతున్నాం...
ఆరోగ్యాన్ని కూల్చేస్తాయి!!...
ఇతరులను చూసి...
వెక్కిరింతల నవ్వులు
మనసును క్రుంగేలా చేస్తాయి!!...

నిజమైన నవ్వును ...
స్వచ్చమైన నవ్వును
ఏనాడో మరిచిపోయాం!!...
హృదయంలోనుంచి...
వచ్చే నవ్వు కావాలి!!...
మనస్ఫూర్తిగా...
వచ్చే నవ్వుకావాలి!!...

ఇప్పుడు నవ్వులన్నీ...
నకిలీమయం!!...
కుట్ర కుతంత్రపు నవ్వులు...
ఇతరుల కొంపకూల్చే నవ్వులు...
నవ్వుతోనే చంపేస్తారు!!...
నవ్వుల చూపుతో కాల్చేస్తారు!!...
వెతకాలి ఎక్కడ దాచుకున్నామో!!...
స్వచ్చమైన నవ్వును??...

సకిలింతల నవ్వు వద్దు!!...
ఆరోగ్యాన్ని నిలిపే నవ్వే ముద్దు!!...
నవ్వుకు నిర్వచనం మారాలి!!...
అనిర్వచనమైన ఆనందం నింపాలి!!...

ఒకరిది నిజమైన నవ్వు అయితే...
మరొకరిది స్వార్థపూరితమైన నవ్వు!!...
సమస్తాన్ని దూరంచేసే నవ్వు వద్దు!!...
గమనాన్ని గతి తప్పించే నవ్వు వద్దు!!...
అనురాగాన్నీ పంచే...
నవ్వే ముద్దు!!...

నవ్వుతో అందమైన
తీరాలు కనబడాలి!!...
దూరాలను దగ్గర చేయాలి!!...
ఎక్కడెక్కడో వెతకాలి...
అనుకున్నవారితో ప్రేమను
నవ్వులతో పంచుకోవాలి!!...

నవ్వినా ఏడ్చినా కళ్ళలో
కన్నీళ్లే వస్తాయి!!...
ఒక స్వచ్చమైన నవ్వు అందరి
హృదయాలలో ప్రతిఫలిస్తుండాలి!!...
పొంగేదుఃఖాన్ని ఆపగలగాలి!!...
పోయే ప్రాణం నిలపాలి!!...
ఇదే నిజమైన నవ్వుకు బలం!!...

కళ్లల్లో కాంతి...నవ్వుల్లో శాంతి!!..
హృదయం నిండా ప్రశాంతే!!...
కొందరు ఎన్నో బాధలను
లోపల దాచుకొని...
బయట నవ్వులను కురిపిస్తారు!!...
నవ్వులో దృఢచిత్తం...
కార్యదీక్ష...నిజమైన క్రమశిక్షణ...
కనబడాలి.!!..
అప్పుడే నవ్వే నవ్వుకు సార్థకత!!...



సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

Monday, November 15, 2021

జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు

🥞జొన్న రొట్టే కదా అని తేలిగ్గా తీసుకోకండి.. పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు



మధుమేహులకు మంచిదంటున్న డైటీషియన్లు
పోషక విలువలు అధికమంటున్న పరిశోధకులు
జొన్న.. తింటే ఆరోగ్యం మిన్న జొన్న రొట్టె.. ఒకప్పుడు పేదలు తినే ఆహారం. వరి అన్నం ఫేమస్‌ అయ్యాక వారూ జొన్నల వినియోగం తగ్గించారు.
తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ చాలా ఇళ్లల్లో ఆహారంగా తీసుకునేది జొన్న రొట్టెనే. బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌కు తోడు ఫైబర్‌, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ, క్రూడ్‌ ఫ్యాట్‌, అమినో యాసిడ్స్‌ ఇలా అత్యవసర పోషకాలు అధికంగా ఉండే ఆహారం జొన్న. ఆరోగ్యం మెరుగుపడాలంటే ఇది తప్పనిసరి. మధుమేహులకు ఇది చక్కటి భోజనం అని కూడా చెబుతున్నారు.
నగరంలో జొన్నరొట్టెలకు ప్రాచుర్యం ఇటీవల బాగా పెరిగింది. అంతకు ముందు హోటల్స్‌లో జొన్న రొట్టె కనిపించడం తక్కువే కానీ, పెరిగిన ఆరోగ్యాభిలాషులతో స్టార్‌ హోటల్స్‌ కూడా జొన్న రొట్టెను తమ మెనూలో జోడించాయిప్పుడు. వీధులలో రూ.10లకే లభిస్తున్న జొన్నరొట్టె పలు హోటల్‌లలో వాటి స్థాయిని బట్టి రూ.30 నుంచి రూ.150 వరకూ చార్జి చేస్తున్నారు.


🧑🏻‍⚕️ఏ రోటీ మంచిది..

చపాతీ, రోటీ ఏదైనా తక్కువ కాలంలోనే తినేయాలి. లేదంటే అవి పాడైపోయే అవకాశాలున్నాయి. కానీ జొన్నరొట్టెకు ఆ ఇబ్బంది లేదు. కాస్త ఆలస్యమైనా దీనిని ఇబ్బంది లేకుండా తినేయొచ్చు. జొన్నరొట్టెలో ఉన్న రెండు రకాలలో ఒకటి కడక్‌ రోటీ. ఇది గట్టిగా ఉంటుంది. మరోటి సాఫ్ట్‌రోటీ మెత్తగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడే దీనిని తినేయాలి. కానీ కడక్‌ రోటీ అలా కాదు. కొన్ని వారాలైనా పాడయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిని సంప్రదాయ పద్ధతులలో నిల్వ చేస్తే వీటి జీవితకాలం మరింత పెరుగుతుంది. మన నగరంలో జొన్న రొట్టెను వెజిటేబుల్‌ కర్రీ లేదంటే చికెన్‌ కర్రీ లాంటి వాటితో కలిపి తీసుకుంటుంటారు. కొంతమంది పచ్చడితో కలిపి కూడా తింటుంటారు.

జొన్న అనగానే ముందుగా గుర్తొచ్చేది జొన్నరొట్టెనే కానీ, పశువుల మేతకు కూడా జొన్నలు వాడుతుంటారు. అయితే, ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఈ జొన్నతో సిరప్‌, ఇథనాల్‌, బయో ఫ్యూయల్‌ కూడా తీయొచ్చంటూ నూతన వంగడాలనూ సృష్టించారు. ఇంకో విశేషమేమిటంటే, ప్లాస్టిక్‌ కూడా దీని నుంచి తీయొచ్చని చెబుతున్నారు.


🧑🏻‍⚕️మేలైన ఆహారం..

పోషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారం జోవార్‌. గ్లూటెన్‌ లేకపోవడం, పలు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా న్యూ క్వినోవాగా దీన్ని పిలుస్తున్నారు. దీనిలో కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ ఉండటం వల్ల మధుమేహులకు చక్కటి అవకాశంగా నిలిచింది. ఇది నెమ్మదిగా గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. శాఖాహారులకు ఇది అత్యుత్తమం. 100 గ్రాముల జొవార్‌లో 10.4 గ్రాముల ప్రోటీన్‌ ఉంది. మన శరీరానికి ప్రతిరోజూ అవసరమైన ఫైబర్‌లో 40శాతం ఇది అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గించడంలో సహాయపడటంతోపాటుగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గ్లూటెన్‌ పదార్థాల ఎలర్జీ ఉన్న వారితో పాటుగా ఉదరకుహర వ్యాధి (సెలియాక్‌ డిసెజస్‌) ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. జొన్నలలో ఐరన్‌, కాల్షియం, విటమిన్‌ బి, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటివి ఉన్నాయి. దీనివల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి దోహదపడతాయి. జీర్ణక్రియనూ మెరగుపరుస్తుంది. జొన్నలను రోటీ రూపంలో మాత్రమే కాదు ఇడ్లీ, దోశ రూపంలో తినొచ్చు. ఊబకాయులు బరువు తగ్గేందుకు కూడా ఇది చక్కటి ఎంపిక.

🌀☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️🌀

Source - Whatsapp Message

రేడియో కార్యక్రమాలు & రేడియో పంచిన ఆనందం ఇలా ఉండేది...

రేడియో కార్యక్రమాలు & రేడియో పంచిన ఆనందం ఇలా ఉండేది...

ఉదయం ఆరు గంటలకు

ఆకాశవాణి... విజయవాడ కేంద్రం ఇప్పుడు సమయం (గంటలు, నిమిషాలు, సెకండ్లు) చెప్పేవారు.

రెడీగా దగ్గర పెట్టుకున్న గడియారంలో టైము సరిచేసేసుకొనేవారు!

రేడియోలో ప్రతి హిందూ పండగకి ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలయ్యేవి.

4 గంటలనుండి మంగళ స్నానం చేసుకునే సమయంలో మంగళ వాయిద్యాలు (సన్నాయి) ప్రసారం చేసేవారు.

ఆరు గంటలకు
పుష్పాంజలి మొదలయ్యేది.

ఆదివారం నాడు
'శ్రీ సూర్య నారాయణ... వేద పారాయణ...',

సోమవారం నాడు
భూకైలాస్, భక్త కన్నప్ప పాటలు, 'శ్రీ ఆంజనేయా ప్రసన్నాంజనేయా' అన్నపాటో, కలియుగ రావణాసురుడు సినిమాలో 'నమో నమో హనుమంతా' అన్నపాటో... ఇలా ముందుగానే మాకు తెలిసిపోతూ వుండేది ఏంవినబోతున్నామో!

7
గంటలకు! వార్తలు చదువుతున్నది "అద్దంకి మన్నార్ "

మధ్యాహ్నం 'ఆకాశవాణి! వార్తలు చదువుతున్నది...' అంటూ కందుకూరి సూర్యనారాయణో, అద్దంకి మన్నారో, పార్వతీ ప్రసాదో... ఎవరో ఒకరు పలకరించేవారు. ఆ తర్వాత... '

కార్మికుల కార్యక్రమం'.
చిన్నక్క, ఏకాంబరం కలిసి కార్మికుల కోసం ప్రభుత్వ పథకాలు, వారి హక్కులు, బాధ్యతలు తెలియజేస్తూ మధ్యమధ్యలో అప్పుడప్పుడు చిత్రగీతాలు ప్రసారం చేసేవారు.

సరిగ్గా ఒంటిగంటా పదినిమిషాలవ్వగానే పసిడిపంటలు మొదలయ్యేది.

పసిడిపంటలవ్వగానే ప్రాంతీయ వార్తలు చదివేవారు... ప్రయాగ రామకృష్ణ లేక తిరుమలశెట్టి శ్రీరాములు.

అవవ్వగానే
మనోరంజని! మీరు కోరిన మధురగీతాలు వింటారు! అని మీనాక్షో, ఏవియస్ రామారావో అనగానే ఇంట్లో అందరం సంబరపడిపోయేవాళ్ళం.

ఆ అరగంటా ఎటువంటి ప్రకటనలు లేకుండా మంచి మంచి పాటలన్నీ వేసేవారు. అవన్నీ చెవులు రిక్కించి మరీ వినేవాళ్ళం.

రెండవ్వగానే
ఢిల్లీ నుంచి వార్తలు అని చెప్పేవారు. ఇంకా కొన్ని సెకన్లు ఉంటే... కు... కు... కు... అంటూ ఏదో రకం సౌండ్ పెట్టేవారు. ఇంగ్లీషులో వార్తలు... ఢిల్లీనించి ప్రసారమయ్యేవి.

ఆ ఇంగ్లీషు వింటూ ఏ పదాన్ని ఎలా పలకాలో, స్పష్టమైన ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో నేర్చుకునేవాళ్ళం.

ఇక ఆదివారాలు
సంక్షిప్త శబ్ద చిత్రం, సాయంత్రం నాటికలు, నాటకాలు ప్రసారం చేసేవారు... వి.బి.కనకదుర్గ, నండూరి సుబ్బారావు, ఎ.వి.యస్. రామారావు, పాండురంగ విఠల్... వీరందరూ ఎక్కువగా వినబడేవారు. వాళ్ళ గొంతు వింటోంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్ళం. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు, ఉచ్చారణలో ఎట్టి పొల్లూలేని ఆ భాష వింటే చాలు...మనకి ఎంత ప్రయత్నించినా వక్రభాష రాదు.

ఇక రాత్రిపూట చిత్రలహరి, మధురిమ అంటూ పాటలవీ వేస్తుండేవారు.

అన్నీ అయ్యాక రాత్రి ఢిల్లీనుంచి
శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెలువడేది. ఉద్దండులైన కళాకారులందరూ వినిపించే ఆ స్వరవిన్యాసాన్ని ఆలకించిన మాజన్మలు ధన్యం.

ఇక
సిలోన్ ఇక్కడ హిందీ పాటలు బాగా వచ్చేవి. మధ్యాహ్నం కొన్ని తెలుగు పాటలు వచ్చేవి. ఆ సిలోన్ స్టేషన్ సరిగ్గా వచ్చేది కాదు, కానీ, చెవి దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినేవాళ్ళం.

రేడియో ఒక ప్రసారసాధనంలానో, పాటలపెట్టెలానో కాకుండా మాకు భాషమీద మంచి పట్టును తెచ్చిపెట్టిన యంత్రంలా మేమందరం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం.

ఆ కాలంలో... పసితనం నుండి మనమందరం రేడియోతో పెనవేసుకుపోయాం. కాలక్షేపం, వినోదం అంతా రేడియోతోనే!

అప్పట్లో... సినిమా, రేడియో తప్ప వేరే వినోదం అనేది ఉండేది కాదు. రేడియోలో పాత, కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం.

ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల మ్యూజిక్ ను బట్టి ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో, పాట ఏమిటో చెప్పే వాళ్ళం. S.D. బర్మన్, నౌషాద్, మదన్ మోహన్...శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ , R. D. బర్మన్...ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు.

ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..

ఆదివారం మధ్యాహ్నం గుమ్మం ముందు కూర్చుని రేడియో లో
సంక్షిప్తశబ్ద చిత్రం
(
ఒక గంటకి కుదించిన) సినిమాని వింటే ఎంత ఆనందం...

రారండోయ్... రారండోయ్...'
హైదరబాదు బాలలమూ జైహిందంటూ పిలిచామూ...రఁయ్ రఁయ్ మంటూ రారండోయ్...రేడియో ప్రోగ్రామ్ వినరండోయ్...అని
ఆంధ్ర బాలనంద సంఘం రేడియో కార్యక్రమం ప్రారంభంలో వినిపించే పిలుపు పాట.
ప్రోగ్రామ్ అయిపోయిం తర్వాత...
బాలవినోదం విన్నాము... బాలల్లారా ఈపూట... చాలిక కథలు చాలిక మాటలు చాలిక పాటలు... నాటికలు...చెంగున రారండి...చెంగు చెంగున పోదాము అని ఉండేది.

1950లనుండి కొనసాగిన బాలానందం ప్రోగ్రాం రేడియోలో వినని వారుండరు. న్యాయపతి రాఘవ రావు (రేడియో అన్నయ్య) గారు, న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) రూపొందించిన ఆ ప్రోగ్రాం లో పి. సుశీల గారు కూడా పాడేవారు.

క్రికెట్ కామెంటరీ వింటూ... మురిసిపోయేవాళ్ళం.

రేడియో సిలోన్ లో ప్రతీ బుధవారం, రాత్రి 8గంటలకు క్రమం తప్పకుండా
బినాకా గీత్ మాలా వినేవారం.

వాతావరణ విశేషాలు వరకు విని, 'అబ్బో... ఇంకో రెండు రోజులు వర్షాలు' అని గొణుక్కుంటూ...
ఇలా ...

ఇంకా అనేకానేక ఆనందాలనందించిన రేడియోకి ధన్యవాదాలు

భృగువాసర శుభోదయం...
12 th November, 2021...
ఏ యస్ యన్ శర్మ ...

Source - Whatsapp Message

బొట్టు యొక్క ప్రాముఖ్యము

బొట్టు యొక్క ప్రాముఖ్యము



.
మిత్రమా........
నుదుటన..బొట్టు పెట్టుకోకపోతే..!!
ఏమవుతుందో.. తెలుసుకో

(ప్రతి ఒక్క హిందువు తెలుసుకో వలసిన విషయము)

🖍️🖍️🖍️🖍️🖍️🖍️🖍️🖍️🖍️

మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటు వంటి ప్రాధాన్యత ఉంది.

బొట్టులేని ముఖము,ముగ్గులేని ఇల్లు, అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం..
అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఇంట్లోఇంట్లో ప్రవేశించి తాండవం చేస్తుందో
అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,.. దరిద్రదేవత ప్రవేశించి దుష్పలితాలుని కలిగిస్తాయి అని
పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి
ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా వస్తారు

అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు. వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.

ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ మనపై పడుతుంది..

నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటారు పెద్దలు,
అలాగే ఎదురుగా ఉన్న వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.

మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.

ఎప్పుడైతే ఇతరుల నకిరాత్మకదృష్టి మనమీద పడుతుందో, అప్పుడు అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన,
ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉన్నందున, మెదడుకు సంభందించినటు వంటి నాడులపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు
తలనొప్పి వస్తుంది,
మనఃశాంతి పోతుంది,
చిరాకు వస్తుంది,
ప్రశాంతత లొపిస్తుంది,
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండి
మన యొక్క మేధాశక్తిని,
మెదడును కాపాడుకొంటు రక్షణ కల్పించాలంటే
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీకి రక్షణ కల్పిస్తూ అభివృధ్ధి పరచుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.

జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు. మనల్ని కాపాడుతూ ఉంటాయి.
మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.
అందుకని ప్రతి ఒక్కరూ చక్కగా బొట్టు పెట్టుకోండి.

ఋణ బాధలు ఉన్నటువంటి వారు నాగసింధూరాన్ని
బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ
కూడా తొలగిపోతాయి.
అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగి పోతాయి. ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.

పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు. దానినే గంగసింధూరము అంటారు.ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు.
ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
ఎటువంటి తప్పూ లేదు.
అందువల్ల చక్కగా ధరించండి.

మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొంద గలుగుతాము.
దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొంద గలుగుతాము.

ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి సంసృతి, సాంప్రదాయముల బంగారుబాటలు.
అందుకని చక్కగా కుంకుమను ధరించండి.
మీ ఉన్నతిని, అభివృధ్ధిని సాదించండి.

ఓం నమః శివాయ..!!
శంభో హర హర....🙏

🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹

కెర్లేపల్లి బాలసుబ్రమణ్యం
పుంగనూరు

Source - Whatsapp Message

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులకుకార్తీక సోమవారం శుభోదయ శుభాకాంక్షలు.. 💐🤝అదిదంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు అనందంగా జీవించాలని కోరుకుంటూ..

సోమ వారం --: 15-11-2021 :--

జీవితంలో మనం నడిచి వచ్చిన "దారిని" ఎక్కివచ్చిన మెట్లని" ఎప్పుటి కీ మరువ కూడదు అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లువుతుంది .

ఒక
అబద్దం" చెప్పడం వల్ల పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పిన రాదు . మనం చేసే చిన్న సాయం వలన ఈ ప్రపంచం ఏమి మారిపొదు కానీ సాయం పొందిన వారి ప్రపంచం కచ్చితంగా మారుతుంది ఆ ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది .

మనం ఎవరికైనా విలువ ఇవ్వాలంటే వారి ఆచరణ బట్టే ఇవ్వు కానీ వారి మాటలను బట్టి కాదు ఎందుకంటే మాటలు మోసం చేస్తాయి ఆచరణ సాక్ష్యం ఇస్తుంది

మిత్రమా ! నీ ముందు ఎవరున్నారు నీ వెనుక ఎవరున్నారు అనేది అనవసరం నీకు కష్టం వస్తే నీ ప్రక్కన ఎంతమంది నిలిచారు అన్నదే ముఖ్యం .

నీ మనసు ఎప్పుడు గాయపఢుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది , ఎవరు లేనప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన నిజమైన వ్యక్తిత్వం .

సేకరణ 🖊️*మీ ... AVB సుబ్బారావు

Source - Whatsapp Message

Sunday, November 14, 2021

హిందూ ద్వేషులకు భారత్ స్వర్గధామం

🙅‍♂️🙅‍♂️హిందూ ద్వేషులకు భారత్ స్వర్గధామం 🤗🙅‍♂️
ఇవి మాత్రమే ముస్లింలను అదుపు చేసే దేశాలు......
చైనాలో

రోజా.,రంజాన్.,నమాజ్.,గడ్డం.,బురఖా...అన్నిటిపైన నిషేధం.

మయన్మార్(బర్మా)లో

ముస్లిం తీవ్రవాది కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు.
దాదాపు మసీదులన్నీ కూల్చి వేశారు.

జపాన్ లో

ఇస్లాంపై నిషేధం.
ఇస్లాం ను ప్రచారం చేయడం చట్టవ్యతిరేకం.
ఏ ఒక్క ముస్లిం శరణార్ధినీ మా దేశంలో అడుగు పెట్టనివ్వమని ఐక్యరాజ్యసమితికి తేల్చి చెప్పింది.

అంకోళాలో

ఇస్లాంపైన నిషేధం.

ఫ్రాన్స్ లో

ఒక్క రోజులో 210 మసీదుల కూల్చివేత.

ఆస్ట్రేలియాలో

అందరు ముస్లింలకు "చట్టాన్ని గౌరవించండి లేదా దేశం విడిచి వెళ్ళండి"అని హెచ్చరిక.

అమెరికాలో

విమానాశ్రయంలోనే, లో దుస్తులతో సహా బట్టలు అన్నీ విప్పాలి.!

ఇజ్రాయెల్ లో

ముస్లింలకు ప్రధాన శత్రువు ఇది.
ఇక్కడి నినాదం"ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే".!
అంటే
మీరు ఇటుకతో కొడితే మేము రాళ్ళతో కొడతాం.!

శ్రీలంకలో

అన్ని మసీదుల లోనికి వెళ్లి వెతకడం.!
బురఖా నిషేధం.


కానీ... కానీ... కానీ....
భారత్ లో ఉండడానికి ముస్లింలకు భయమేస్తుందట.!?
వీళ్ళు జాతీయ పతాకాన్ని కాల్చివేసి అగౌరపరుస్తారు.
మౌలానా.,మౌల్వీలు దేశ ప్రధానికే సవాల్ విసురుతారు.?!
హిందూ దేవీ దేవతలను అవమానపరుస్తారు.
సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రీకరిస్తారు.?!
ఓవైసీ లాంటి నేతలు 15 నిమిషాలలో హిందువులను ఊచకోత కోస్తాం అంటారు.
కాశ్మీర్లో షరియత్ నేతలు పాకిస్థాన్ జిందాబాద్ అంటారు.
బెంగాల్ ముస్లిం గద్దార్ లు బంగ్లాదేశ్ ముస్లిం శరణార్ధులకు శరణు ఇవ్వమంటారు.
సత్యమేవ జయతే టీ.వీ షో నిర్వహించే అమీర్ ఖాన్ ఇస్లాంలోని హలాలా.,గజవా హింద్.,త్రిపుల్ తలాఖ్.,మదర్ సాలు.,రాళ్లు విసిరే గుండాలు.,జనాభా పెరుగుదల.,బహు భార్యత్వం.,నిరక్షరాస్యత.,బురఖా.,జీహాద్.,తీవ్రవాదం...తదితర సామాజిక దురాచారాలపై ఏ ఒక్కనాడు కూడా టీ.వీ.ఎపిసోడ్ లు నిర్వహించలేదు.!?

కానీ
కేవలం
హిందూ ధర్మంలోని సామాజిక దురాచారాలపైనే ఎపిసోడ్లు నిర్వహిస్తాడు.

అన్నిటికన్నా ముఖ్యవిషయమేమిటంటే?
ISIS ముస్లిం తీవ్రవాద సంస్థను వ్యతిరేకించే ఏ ఒక్క ముస్లింను ఇంతవరకు చూడలేదు.!?
కానీ RSS ను వ్యతిరేకించే లక్షల మంది హిందువులను చూశా.!
హోళీ.,దీపావళి పండుగలకు హిందువులకు విందు ఇచ్చే ఏ ఒక్క ముస్లిం పార్టీని చూడలేదు.
కానీ
రంజాన్ పండుగకు ముస్లింలకు విందు ఇచ్చే హిందూ పార్టీలను చూశాను.!
నేను కాశ్మీర్లో భారత జండాను కాల్చివేయడం చూశాను.
కానీ పాకిస్థాన్ జండాను కాల్చివేయడం చూడలేదు.
నేను దర్గాలకు టోపీలు పెట్టుకుని వెళ్ళే హిందువులను చూశాను.
కానీ బొట్టు పెట్టుకుని దేవాలయంకు వచ్చే ఒక్క ముస్లింను చూడలేదు.!
ఇదంతా ఏమిటి?
అర్థమైందా?
జాగో హిందూ
దేశ్ కే బంధూ*
(ఒక హిందీ వాట్సాప్ వీడియోకు యధాతథ తెలుగు అనువాదం)

Source - Whatsapp Message

శ్వాస విజ్ఞానము

శ్వాస విజ్ఞానము:-

శ్వాసతో పుట్టిన మనం, శ్వాస విడిచి వెళ్లిపోయేలోపు అసలా శ్వాసనే గుర్తించకపోవడం, పట్టించుకోకపోవడం ఓ విచిత్రము. అట్టి శ్వాసను మనం గుర్తించకపోయినా, దాని శక్తిని మనం పట్టించుకోకపోయినా -- మనం మనకు తెలియకుండానే దాన్ని మనం ఉపయోగించుకొంటాము. ఉదాహరణకు, ఏదైనా బరువు ఎత్తేటప్పుడు కానీ, కాలువలు దాటవలసి వచ్చినప్పుడు కానీ అసంకల్పితంగానే మనం శ్వాసను బిగిస్తాము. కొన్ని సెకన్లు మాత్రమే జీవించే ప్రాణి నుండి బ్రహ్మం వరకు అందరూ శ్వాసిస్తారు. అలాగే శిలలు, పర్వతాలు, కొండలే కాకుండా ఆకాశం కూడా శ్వాసిస్తుంటుంది. సెకనుకు 18 కి.మీ.ల చొప్పున ఆకాశం వ్యాకోచిస్తుందని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

❇️ శ్వాస - సోహం:-
మనం శ్వాస తీసుకున్నప్పుడు 'సో' అనే శబ్దం, వదిలేటప్పుడు 'హం' అనే శబ్దం వచ్చును. 'సో'లో 'ఓ' అనే శబ్దం, 'హం'లో 'మ్' అన్న శబ్దం అంతర్లీనంగా ఉన్నది. ఈ రెండు కలిపి 'ఓం' అవుతుంది. ఓం అనగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర శక్తి అనగా ఆదిపరాశక్తి. ఈ వివరణ మనకు తెలియక పోయినా, ఒక్కసారి మనము శ్వాస తీసుకుని వదిలినచో, ఆ ఆదిపరాశక్తి యొక్క ప్రభావం ఖచ్చితంగా మన మీద ఉండి తీరుతుంది అని ఋషుల వాక్కు.

శ్వాస ఎంత వరకు లోపలికి తీసుకుంటామో, అక్కడి నుండే మళ్ళీ వదలిపెడుతున్నాము. ఈ ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్యన ఉండు బిందువు 'శక్తి' యొక్క స్థానం అని తెలుసుకుని, ఆ బిందువు మధ్య ఖాళీ జాగాపై దృష్టి ఉంచగలిగితే అదే 'ప్రాణాయామము' అనబడుతుంది.


❇️ శ్వాస - ఆయుష్షు:-
ప్రాణికోటికి భగవంతుడు ఆయుష్షును శ్వాస లెక్కలో ఇవ్వడం జరిగింది. నిమిషానికి ఎక్కువ శ్వాసలు ఖర్చుపెట్టినచో- తక్కువ ఆయుష్షు., మరి నిమిషానికి తక్కువ శ్వాసలు తీసుకున్నచో - ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారు. సాధారణ మానవుడు సాధారణ కాలంలో నిమిషానికి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. పరుగెత్తినపుడు, కోపంగా ఉన్నప్పుడు 18-24 సార్లు శ్వాసిస్తాడు. కామకేళి అనగా మైథున కాలంలో 35 సార్లు అంటే అన్నిటికన్నా ఎక్కువ శ్వాసలు ఖర్చు పెడతాడు. మనిషి సరాసరిన రోజుకు 21,600 సార్లు శ్వాసిస్తాడు.
➡️ కోతి నిమిషానికి 32 సార్లు శ్వాసించి 20 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ కుక్క నిమిషానికి 38 సార్లు శ్వాసించి 13 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ గుర్రం 19 సార్లు శ్వాసించి 35 సంవత్సరాలు జీవిస్తుంది.
➡️ తాబేలు నిమిషానికి 5 సార్లు శ్వాసించి 200 సంవత్సరాలు జీవిస్తుంది.


❇️ శ్వాస - నాడులు:-
మన శరీరములో 272000 నాడులున్నాయి. నాడులనగా ప్రాణవాయువు (శ్వాస) యొక్క రాకపోకలకు మార్గములు, నరములు కావు. ఈ 272000 నాడులలో 10 నాడులు ప్రధానమైనవి. వీటిని దశ నాడులు అని పిలుస్తారు. అవి..

1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
4. గాంధారి నాడి - కుడి నేత్రం
5. అస్తిని నాడి - ఎడమ నేత్రం
6. పూష నాడి - కుడి చెవి
7. యశస్విని నాడి - ఎడమ చెవి
8. ఆలంబన నాడి - నోరు
9. లకుహా నాడి - శిశ్నము
10. శంభని నాడి - గుదము

మరణం సంభవించినప్పుడు పైన ఉదహరించిన 10 ద్వారాలలో ఏదో ఒక ద్వారం గుండా ప్రాణం బయటకు పోవును.

వీటిల్లో అత్యంత ప్రధానమైనది 3 నాడులు. అవి
1. ఇడ నాడి - ఎడమ ముక్కు రంధ్రం నందు
2. పింగళ నాడి - కుడి ముక్కు రంధ్రం నందు
3. సుషుమ్న నాడి - నాసికాగ్రం నందు
మనం తీసుకుంటున్న శ్వాస కుడి ముక్కు ద్వారా ఎక్కువగా బయటకి ప్రవేశిస్తే సూర్యనాడి పనిచేస్తుందని, ఎడమ ముక్కు ద్వారా ఎక్కువగా బయటకు వస్తే చంద్ర నాడి పనిచేస్తుందని తెలుసుకోవలెను. సుషుమ్న నాడి యందు శ్వాస ఆడుతున్నప్పుడు రెండు ముక్కు రంధ్రాల గుండా శ్వాస బయటకు వస్తుంటుంది. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు శ్వాస మార్చుకుంటున్నప్పుడు కొన్ని సెకన్లు మాత్రమే సుషుమ్న నాడి యందు శ్వాస నడుస్తుంది. ఈ సమయంలో మనం ఏమి ఆశించిన అవి సిద్దించును.
సూర్యనాడి ఉష్ణ శక్తికి, చంద్రనాడి శీతల శక్తికి ప్రతీకలు. అందువలన శీతల వ్యాధులకు సూర్యనాడి, ఉష్ణ సంబంధిత వ్యాధులకు చంద్రనాడి ఉపయోగకరము. మరి సూర్యనాడి నడుస్తున్నప్పుడు ఘన పదార్థాలు, చంద్రనాడి నడుస్తున్నప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవడం ఉత్తమం. కొద్దిసేపు ఎడమ చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేదా ఎడమ వైపు తిరిగి పడుకున్నా కుడి శ్వాస ఆడడం ప్రారంభమవుతుంది., అలాగే ఎడమ శ్వాసను నడపాలంటే కుడి చేతి కింద ఒత్తిడి తెచ్చిన లేక కుడి వైపు తిరిగి పడుకున్నా కొద్దిసేపట్లో ఎడమవైపుకు మారుతుంది.
స్త్రీ, పురుషులిద్దరూ ఒకే నాడి నడుస్తుండగా సంయోగం చేసినా అసలు గర్భధారణ జరుగదు. పురుషుని యొక్క ఎడమ స్వరం, స్త్రీ యొక్క కుడి స్వరం పని చేస్తుండగా సంయోగం జరిగితే పుత్రికా సంతానం కలుగుతుంది., అలాకాకుండా పురుషుని యొక్క కుడి స్వరం, స్త్రీ యొక్క ఎడమ స్వరం పనిచేస్తుండగా సంయోగం జరిగితే పుత్ర సంతానం కలుగుతుంది.

❇️ శ్వాస - పంచప్రాణాలు:-
శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి--
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్య మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

❇️ శ్వాస - చక్రాలు:-
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

❇️ శ్వాస - అంగుళాలు:-
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.
మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.

❇️ శ్వాస - సృష్టి వయస్సు:-
మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.

❇️ శ్వాస - సాధన:-
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.
84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.

Source - Whatsapp Message

జస్టిస్ చంద్రు రిటైర్ కాగానే బయటికొచ్చేసి… ఓ లోకల్ రైలు ఎక్కి ఇంటికెళ్లి పోయాడు..

💐జస్టిస్ చంద్రు రిటైర్ కాగానే బయటికొచ్చేసి… ఓ లోకల్ రైలు ఎక్కి ఇంటికెళ్లి పోయాడు..💐

 

జస్టిస్ చంద్రు చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు.‌ ఏదయినా ఉద్యోగంలో వున్న వ్యక్తి యెంతటి సమర్ధుడైనా సరే, ఏదో ఒకనాడు పదవీ విరమణ చేయక తప్పదు. జస్టిస్ చంద్రుకు కూడా ఆ రోజు వచ్చింది. మామూలుగా ఇలాటి సందర్భాలలో కొన్ని సంప్రదాయాలు వుంటాయి. న్యాయమూర్తి ఎవరయినా రిటైర్ అవుతున్నప్పుడు కోర్టులోనే అధికారికంగా ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తారు. ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ వగైరా హాజరవుతారు. వీడుకోలు ప్రసంగాలు చేస్తారు. పుష్పగుచ్చాలు అందచేస్తారు. తేనీటి విందు జరుగుతుంది. అందరూ కలసి ఫోటో దిగుతారు. వీలునుబట్టి, ఆ సాయంత్రం ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వీడ్కోలు విందు ఏర్పాటుచేస్తారు.

👉కానీ జస్టిస్ చంద్రు తరహానే వేరు. అందువల్ల ఆయన పదవీ విరమణ ఆయన పద్దతిలోనే జరిగింది. ఏడేళ్ళపాటు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యేముందు ఆయన ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయవద్దని అందులో ముందుగానే అభ్యర్ధించారు.

👉ఒక జడ్జి నిరాడంబరంగా పదవీ విరమణ చేయడం ఎన్నడూ జరగలేదా అంటే జరిగింది. కానీ ఎప్పుడూ? మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు 1929లో జరిగింది. ఆరోజుల్లో జస్టిస్ జాక్సన్ నాటి అడ్వొకేట్ జనరల్ తో చెప్పారు. ‘నా రిటైర్ మెంటు విషయంలో అనవసరమైన హడావిడి ఏమీ చేయవద్దు. నా విధులు నేను నిర్వర్తించాను. వీడ్కోలు ఇవ్వాల్సిన అవసరం ఏమి వుంది?’ మళ్ళీ ఎనభై రెండేళ్ళ తరువాత జస్టిస్ చంద్రు అలాటి నిర్ణయం తీసుకోగలిగారు.

2013, మార్చి ఎనిమిది, శుక్రవారం.

జస్టిస్ చంద్రు రోజుమాదిరిగానే కోర్టుకు వచ్చారు. తన ఆస్తిపాస్తుల వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. తరువాత తన చాంబర్స్ కు వచ్చి అవసరమైన కొన్ని పత్రాలపై సంతకాలు చేశారు. మీడియా మిత్రులతో కూర్చుని తేనీరు సేవిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు. రిటైర్ అయినరోజున కూడా ఆయన అధికారిక వాహనాన్ని వాడుకోలేదు. అన్నిసంవత్సరాలుగా వెన్నంటివున్న డఫేదారునూ వెంట తీసుకోపోలేదు.

తరువాత హై కోర్టు బయటకు వచ్చి నడుచుకుంటూ సుభాష్ చంద్రబోస్ రోడ్డు దాటి అక్కడవున్న సంగీత రెస్టారెంటులో మిత్రులతో కాఫీ తాగుతూ ముచ్చట్లు చెబుతూ గడిపారు. ఆ పిదప, బీచ్ రోడ్డు స్టేషన్ కు వెళ్ళి వేలాచెర్రి వెళ్ళే ఎం.ఆర్.టీ.ఎస్. లోకల్ ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు.

న్యాయమూర్తిగా వున్నప్పుడు కూడా జస్టిస్ చంద్రు ఉద్యోగంతోపాటు వచ్చే హంగులు ఆర్భాటాలకు దూరంగానే వుంటూ వచ్చారు. సాధారణంగా న్యాయమూర్తులు తమ చాంబర్ నుంచి కోర్టు హాలుకు వెళ్ళేటప్పుడు యూనిఫారం ధరించిన బిళ్ళ బంట్రోతు దండం ధరించి ముందు నడుస్తూ వెళ్లడం ఆనవాయితీ. జస్టిస్ చంద్రు దీనికి స్వస్తి చెప్పారు. తన అధికారిక వాహనానికి యెర్ర దీపం ఏర్పాటు తీసేయించారు. సెక్యూరిటీ సిబ్బందిని అవసరంలేదని చెప్పి వాపసు పంపేసారు. ఇంటివద్ద పనులకోసం బంట్రోతులను వాడుకోలేదు.

చెన్నై హైకోర్టులో జస్టిస్ చంద్రు చాంబర్ ముందు ఒక బోర్డు మీద ఇలా రాసివుండేది.

“పూలు,బొకేలు పట్రాకండి – నేనేమీ రాజకీయ నాయకుడిని కాను

ఆకలితో లేను – కాబట్టి పళ్ళూ మిఠాయిలు తేకండి

చలితో గడగడలాడిపోవడం లేదు – శాలువల అవసరం ఏమీ లేదు

అలా అని మీనుంచి నేనేమీ ఆశించడంలేదనుకోకండి.

లోపలకు వచ్చేటప్పుడు శుభాశీస్సులు పట్టుకురావడం మాత్రం మరచిపోకండి.”

బహుశా ఇప్పుడాబోర్డు అక్కడ వుండి వుండదు. దాని అవసరం కూడా వుండకపోవచ్చు…

Source - Whatsapp Message

మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో తెలుసుకోండి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో తెలుసుకోండి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

మనం ఎదుగుతున్నప్పుడు సైన్స్, ఆర్ట్స్, కామర్స్ అనే 3 బ్రాంచ్‌లు మాత్రమే తెలుసు.

1978లో కళాశాలలకు ఐదు శాఖలు ఉండేవి.

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ మరియు ఎలక్ట్రానిక్స్.

కానీ మీకు తెలుసా మన భారతీయ పాఠశాలలు 1858కి ముందు 50-72 రకాల విద్యలను బోధించేవి.

భారతీయ పాఠశాలల వ్యవస్థను బ్రిటిష్ దార్శనికులు నాశనం చేశారు.


ఇంగ్లండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 732000 భారతీయ పాఠశాలలు ఉన్నాయి.

మా పాఠశాలలు ఎలా మూతపడ్డాయో తెలుసుకోండి. ఇండియన్ స్కూల్ లెర్నింగ్ ఎలా ముగిసింది.
ముందుగా భారతీయ సంస్కృతిలో ఏయే విభాగాలు బోధించబడ్డాయో చెబుతాను!

చాలా భారతీయ పాఠశాలలు ఈ క్రింది విషయాలను బోధించాయి.

01 అగ్ని విద్య (మెటలర్జీ)
02 వాయు విద్య (గాలి)
03 జల విద్య (నీరు)
04 అంతిక్ష్ విద్యా (అంతరిక్ష శాస్త్రం)
05 పృథ్వీ విద్య (పర్యావరణం)
06 సూర్య విద్య (సోలార్ స్టడీ)
07 చంద్ర మరియు లోక్ విద్య (చంద్రుని అధ్యయనం)
08 మేఘ్ విద్యా (వాతావరణ సూచన)
09 ధాతు ఊర్జ విద్య (బ్యాటరీ శక్తి)
10 దిన్ ఔర్ రాత్ విద్య.
12 సృష్టి విద్య (అంతరిక్ష పరిశోధన)
13 ఖగోల్ విజ్ఞాన్ (ఖగోళ శాస్త్రం)
14 భుగోల్ విద్యా (భూగోళశాస్త్రం)
15 కాల విద్య (సమయ అధ్యయనాలు)
16 భూగర్భ్ విద్యా (జియాలజీ & మైనింగ్)
17 రత్నాలు మరియు లోహాలు (రత్నాలు & లోహాలు)
18 ఆకర్షణ విద్య (గురుత్వాకర్షణ)
19 ప్రకాష్ విద్య (శక్తి)
20 సంచార్ విద్య (కమ్యూనికేషన్)
21 విమాన విద్య (విమానం)
22 జలయన్ విద్య (నీటి నాళాలు)
23 ఆగ్నేయ అస్త్ర విద్య (ఆయుధాలు & మందుగుండు సామగ్రి)
24 జీవవిజ్ఞాన విద్య (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం)
25 యజ్ఞ విద్య (మెటీరియల్ సిక్)
ఇదీ వైజ్ఞానిక విద్య గురించిన చర్చ. ఇప్పుడు కవర్ చేయబడిన వృత్తిపరమైన మరియు సాంకేతిక విభాగాల గురించి మాట్లాడుకుందాం!
26 వ్యాపార విద్యా (కామర్స్)
27 కృషి విద్య (వ్యవసాయం)
28 పశు పాలన్ విద్య (పశుసంవర్ధక)
29 పక్షి పాలన్ (పక్షి సంరక్షణ)
30 యాన్ విద్య (మెకానిక్స్)
32 వాహన రూపకల్పన
33 రతంకర్ (రత్నాలు & ఆభరణాల రూపకల్పన)
36 కుమ్హార్ విద్యా (కుమ్మరి)
37 లఘు (మెటలర్జీ & కమ్మరి)
38 టక్కాలు
39 రంగ్ విద్య (డైయింగ్)
40 ఖట్వాకర్
41 రజ్జుకర్ (లాజిస్టిక్స్)
42 వాస్తుకార్ విద్య (వాస్తుశిల్పం)
43 ఖానా బనానే కి విద్య (వంట)
44 వాహన విద్య (డ్రైవింగ్)
45 జలమార్గాల నిర్వహణ
46 సూచికలు (డేటా ఎంట్రీ)
47 గౌశాల మేనేజర్ (పశు సంవర్ధక)
48 బాగ్వాణి (హార్టికల్చర్)
49 వాన్ విద్య (అటవీ శాస్త్రం)
50 సహయోగీ (కవరింగ్ పారామెడిక్స్)

ఈ విద్య అంతా బడిలో బోధించబడింది, కానీ కాలక్రమేణా, పాఠశాల అదృశ్యమైనప్పుడు, ఈ జ్ఞానం బ్రిటిష్ వారు కనుమరుగయ్యేలా చేసారు! ఇది మెకాలేతో ప్రారంభమైంది. నేడు మెకాలే పద్ధతిలో మన దేశ యువత భవిష్యత్తు నాశనం అవుతోంది.

భారతదేశంలో పాఠశాల సంస్కృతి ఎలా ముగిసింది?
కాన్వెంట్ విద్య శిథిలమైన పాఠశాలల ప్రవేశం భారతీయ విద్యా చట్టం 1835లో ఏర్పడింది (1858లో సవరించబడింది). దీనిని 'లార్డ్ మెకాలే' రూపొందించారు.

చాలా మంది బ్రిటీషర్లు భారతదేశ విద్యా వ్యవస్థ గురించి తమ నివేదికలను అందించినప్పుడు మెకాలే ఇక్కడ విద్యా వ్యవస్థపై సర్వే నిర్వహించారు. బ్రిటిష్ అధికారి ఒకరు జి.డబ్ల్యూ. లూథర్ మరియు మరొకరు థామస్ మన్రో! వీరిద్దరూ వేర్వేరు సమయాల్లో వేర్వేరు ప్రాంతాల్లో సర్వే చేశారు. ఉత్తర భారతదేశాన్ని (ఉత్తరభారత్) సర్వే చేసిన లూథర్ ఇక్కడ 97% అక్షరాస్యత ఉందని మరియు దక్షిణ భారతదేశాన్ని (దక్షిణభారత్) సర్వే చేసిన మన్రో ఇక్కడ 100% అక్షరాస్యత ఉందని రాశారు.

భారతదేశం (భారత్) శాశ్వతంగా బానిసలుగా ఉండాలంటే, దాని ′′స్వదేశీ మరియు సాంస్కృతిక విద్యా వ్యవస్థ′′ని పూర్తిగా కూల్చివేసి, దాని స్థానంలో "ఇంగ్లీషు విద్యావిధానం′′" తీసుకురావాలి, అప్పుడే భారతీయులు భౌతికంగా భారతీయులు అవుతారని మెకాలే స్పష్టంగా చెప్పాడు. , కానీ మానసికంగా ఇంగ్లీష్ మారింది. వారు కాన్వెంట్ పాఠశాలలు లేదా ఆంగ్ల విశ్వవిద్యాలయాలను విడిచిపెట్టినప్పుడు, వారు బ్రిటిష్ వారి ప్రయోజనాలకు అనుగుణంగా పని చేస్తారు.

మెకాలే ఒక యాసను వాడుతున్నాడు - ′′ పంట వేయకముందే పొలాన్ని పూర్తిగా దున్నినట్లే, దానిని దున్నేసి ఆంగ్ల విద్యా విధానంలోకి తీసుకురావాలి. "అందుకే అతను పాఠశాలలను చట్టవిరుద్ధమని మొదట ప్రకటించాడు. ఆ తర్వాత సంస్కృతం చట్టవిరుద్ధమని ప్రకటించి పాఠశాలలకు నిప్పంటించి, అందులోని ఉపాధ్యాయులను కొట్టి జైల్లో పెట్టాడు.
1850 వరకు భారతదేశంలో '7 లక్షల 32 వేల' పాఠశాలలు & 7,50,000 గ్రామాలు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక పాఠశాల ఉండేది మరియు ఈ పాఠశాలలన్నీ నేటి భాషలో 'ఉన్నత అభ్యాస సంస్థలు'గా ఉండేవి. వాటన్నింటిలో 18 సబ్జెక్టులు బోధించబడ్డాయి మరియు ఈ పాఠశాలల ప్రజలు రాజుచే కాకుండా కలిసి వీటిని నడిపేవారు.
విద్యను ఉచితంగా అందించారు.
పాఠశాలలు రద్దు చేయబడ్డాయి మరియు ఆంగ్ల విద్య చట్టబద్ధం చేయబడింది మరియు కలకత్తాలో మొదటి కాన్వెంట్ పాఠశాల ప్రారంభించబడింది. అప్పట్లో 'ఉచిత పాఠశాల' అనేవారు. ఈ చట్టం ప్రకారం కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం & మద్రాసు విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. ఈ మూడు బానిసత్వ కాలం నాటి విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ దేశంలో ఉన్నాయి!
మెకాలే తన తండ్రికి ఒక లేఖ రాశాడు. ఇది చాలా ప్రసిద్ధ లేఖ, అందులో అతను ఇలా వ్రాశాడు: ′′ ఈ కాన్వెంట్ పాఠశాలలు భారతీయులలా కనిపిస్తున్నప్పటికీ మెదడులో ఆంగ్లంలో ఉన్న పిల్లలను బయటకు తీసుకువస్తాయి మరియు వారికి వారి దేశం గురించి ఏమీ తెలియదు. వీరికి వారి సంస్కృతి గురించి ఏమీ తెలియదు, వారి సంప్రదాయాల గురించి వారికి తెలియదు, వారి యాసలు తెలియవు, ఇలాంటి పిల్లలు ఈ దేశంలో ఉన్నప్పుడు, బ్రిటీష్ వారు పోయినా, ఇంగ్లీష్ ఈ దేశాన్ని విడిచిపెట్టదు. .′′ అప్పట్లో రాసిన లేఖలోని నిజం నేటికీ మన దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చట్టం సృష్టించిన దుస్థితిని చూడండి. మన స్వంత భాష మాట్లాడటానికి మరియు మన స్వంత సంస్కృతిని గుర్తించడానికి సిగ్గుపడే మనకంటే మనం తక్కువగా భావిస్తున్నాము.

మాతృభాషతో తెగతెంపులు చేసుకున్న సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు, ఇది మెకాలే వ్యూహం! ఇక్కడి నేటి యువతకు భారతదేశం కంటే యూరప్ గురించి ఎక్కువ తెలుసు. భారతీయ సంస్కృతి అంత చల్లదనాన్ని పరిగణిస్తుంది, కానీ పాశ్చాత్య దేశాన్ని అనుకరిస్తుంది.

ఎంత పాపం. మనమందరం మేల్కొలపడానికి మరియు మన గొప్ప సంస్కృతి & వారసత్వాన్ని తిరిగి పొందేందుకు ఇది సరైన సమయం.

జై హింద్
🙏🙏

Source - Whatsapp Message

రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

👩‍⚕️రాత్రిళ్ళు త్వరగా భోజనం👨🏽‍⚕️
➖➖➖

రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ఆ ఆహారాన్ని ‘త‌గిన స‌మ‌యానికి’ తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే అది మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తుంది. అందువ‌ల్ల ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌రైన స‌మ‌యాల‌కు భోజ‌నం చేయాలి. ఇక రాత్రి పూట కొంద‌రు ఆల‌స్యంగా భోజ‌నం చేస్తుంటారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా భోజనం చేసేయాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

1.) రాత్రి 7.30 గంట‌ల లోపు భోజ‌నం ముగించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వ‌చ్చే శ‌క్తిని ఖ‌ర్చు పెట్టేందుకు శ‌రీరానికి త‌గిన స‌మ‌యం ల‌భిస్తుంది. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది.

2.) రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూల‌కాయం బారిన ప‌డ‌కుండా ఉంటారు.

3.) రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేసే వారికి క్యాన్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు. త్వ‌ర‌గా భోజ‌నం ముగించే పురుషుల‌కు 26 శాతం, మ‌హిళ‌ల‌కు 16 శాతం వ‌ర‌కు క్యాన్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.

4.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసి త్వ‌ర‌గా నిద్రించ‌డం వ‌ల్ల ఉద‌యాన్నే శ‌క్తివంతంగా ఫీల‌వుతారు. కొంద‌రికి ఉద‌యం నిద్ర‌లేవ‌గానే బ‌ద్ద‌కంగా ఉంటుంది. ఏ ప‌నీ చేయ‌బుద్దికాదు. అలాంటి వారు ముందు రోజు త్వ‌ర‌గా భోజ‌నం చేసి త్వ‌ర‌గా నిద్రిస్తే మ‌రుస‌టి రోజు త్వ‌ర‌గా నిద్ర లేస్తారు. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతారు.

5.) రాత్రిపూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భిస్తుంది. అలాగే మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే వ‌ర‌కు చాలా స‌మ‌యం ఉంటుంది క‌నుక జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మ‌ర‌మ్మత్తులు చేసుకునేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భిస్తుంది. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.

6.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. భోజనానికి, నిద్ర‌కు 3 గంట‌ల వ్య‌వ‌ధి ఉంటే నిద్ర చ‌క్క‌గా వ‌స్తుంది. లేదంటే నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది. కనుక రాత్రి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టాలంటే త్వ‌ర‌గా భోజ‌నం చేసేయాలి.

7.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసే వారికి గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. క‌నుక రాత్రి భోజ‌నాన్ని త్వ‌ర‌గా ముగించాలి.

♻️🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸♻️

Source - Whatsapp Message

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి #జయలలిత గారు తన జీవితంలో #దీపావళి పండుగను ఎప్పుడూ జరుపుకోలేదు...ఎందుకో తెలుసా..??

#తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి #జయలలిత గారు తన జీవితంలో #దీపావళి పండుగను ఎప్పుడూ జరుపుకోలేదు..
ఎందుకో తెలుసా..??


#టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి
#మేల్‌కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా...??

1790లో #నరకచతుర్దశి రోజు అర్థరాత్రి సమయంలో టిప్పుసుల్తాన్, తనకు అత్యంత నమ్మకస్తులు, అత్యంత క్రూరులైన సహచరులు, సైన్యంతో కలిసి మెల్కోట్ ఆలయానికి చేరుకున్నాడు..
అప్పటికి ఆ ఆలయంలో సుమారు 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగ ఊరేగింపును జరుపుకుని ఆనందంగా ప్రసాదాలు భుజించి విశ్రమించడానికి సిధ్దమౌతున్నారు..
టిప్పు ఆలయానికి చేరుకుని ఆలయ తలుపులు, ద్వారాలు మూసివేసి, 1000 లో 800 మందిని ఊచకోత కోశాడు, పసిపిల్లలు అనికూడా దయ లేదు..
200 మంది సుందర స్త్రీలను బంధించాడు, మరుసటి రోజు ఉదయం అంటే, దీపావళి. అప్పుడు ఈ నర హంతకుడు, మెల్కోట్ ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180 గుర్రాలను ఉపయోగించినా మూడు రోజులు సమయం పట్టింది..
అంటే ఎంత సంపద కొల్లగొట్టాడో..
ఆ రోజుల్లో సంపద దేవాలయాల్లో దాచబడేది..
టిప్పు భూమిపై ఇప్పటివరకు నివసించిన అత్యంత క్రూరమైన పాలకులలో ఒకడు..

ఆనాటి ఘటనకు గుర్తుగా ఇప్పటికీ #మైసూరుమేల్‌కోటే ప్రాంతంలో చాలామంది దీపావళి పండుగను జరుపుకోరు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆ ప్రాంతానికి చెందినదే కావడంతో ఆమె కూడా తన జీవితంలో ఎప్పుడూ దీపావళి పండుగ జరుపుకోలేదు..
కారణం ఆమె వంశంలోని వారు (#మేల్కోటె
అయ్యంగార్) కూడా ఊచకోత కోయబడిన 800 మందిలో ఉన్నారు..

చరిత్ర పుస్తకాలలో టిప్పు చిత్రం చాలా అందమైన శ్రావ్యమైన, శాంతి, ప్రేమగల చిత్రంగా చేర్చబడింది, కాని లండన్ లైబ్రరీలో భద్రపరచబడిన టిప్పు యొక్క దిగువ వాస్తవ చిత్రాన్ని చూడండి..

భారతీయ చరిత్రను ఖాన్-గ్రెస్ మరియు కుమ్మీలు ఎలా పూర్తిగా మార్చి వేశారో టిప్పుసుల్తాన్ విషయమే మంచి ఉదాహరణ..

నరరూప రాక్షసుడు (టిప్పుచే) ఊచకోతకు మరియు దోచుకోబడ్డ దేవాలయాల జాబితా..👇

త్రిపాంగోట్,
త్రిచెంబరం,
తిరునవయ,
తిరువన్నూర్,
కాలికట్ తాలి,
హేమాంబికా ఆలయం,
పాల్ఘాట్ లోని జైన దేవాలయం,
మామియూర్,
పరంబతాలి,
వెంకటంగూ,
పెమ్మాయనడు,
తిరువంజుకులం,
తేరుమనవ,
తైమళూన్,
తెమపనుమ,
వడకళ కేరళీశ్వర,
త్రిక్కండియూర్,
సుకాపురం,
భగవతి ఆలయం,
మరణేహి ఆలయం,
వెంగర ఆలయం,
టికులం,
రామనాథక్రా,
అజింజలం,
నరహంతకుడు టిప్పు, ప్రధాన పండుగ రోజులనే ఊచకోత కోయడానికి మరియు దోపిడీ చేయడానికి ఎంచుకునేవాడు..
కారణం: ఆ రోజున అధిక భక్తులు చేరుకుంటారు మరియు గరిష్ట సంపదను తీసుకువచ్చేవారు..
అప్పట్లో అధిక దేశ సంపద దేవాలయాల ఆధ్వర్యంలోనే ఉండేది..
టిప్పుసుల్తాన్ :
1.కిట్తూరు చెన్నమ్మ రాజ్యంలో మతం మారనందుకు 40,000 మందిని తలలు నరికించాడు.
2.కేరళలో మతం మారని 10,000 మంది బ్రాహ్మణులకు బలవంతంగా సున్తీ చేయించాడు.
3.హిందూ స్త్రీలను వాడి సైనికులకు బహుమతిగా ఇచ్చేవాడు.
4.ఇరవై సంవత్సరాల వయస్సు ఉన్న హిందూ యువకులను నపుంసకులుగా మార్చేవాడు. పరమ దుర్మార్గుడు వాడు.
5. కర్ణాటకలోని కొడగు హిందువులను ఊచకోత కోసాడు.
6.తిరుపతి కళ్యాణ వేంకటేశ్వరుని దోపిడీ చేసాడు టిప్పు తండ్రి హైదర్ అలీ.
7.కొడగు హిందూ స్త్రీల చన్నులు కోయించాడు టిప్పు సుల్తాన్.
8.చేతులు పైకెత్తించి చంక వెంట్రుకలు కనబడ్డ ప్రతి హిందూ బాలుడినీ చంపిన కసాయి టిప్పు.
9.కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోటె ప్రాంతంలో పవిత్రమైన దీపావళి పర్వదినం రోజు 800 మంది వేద పండితులను, చిన్న పిల్లలను, మహిళలను దారుణంగా గొంతులు కోసి హత్యలు చేశాడు టిప్పు సుల్తాన్, దీనికి నిరసనగా మెల్కోటె ప్రాంతంలో నేటికీ హిందువులు దీపావళి పండుగ చేసుకోవడం లేదు. కర్ణాటక కేరళ ప్రాంతాల్లో దాదాపు లక్ష మంది పైన అమాయక హిందువులను క్రూరంగా దారుణంగా హత్యలు చేశాడు ముస్లిం మతోన్మాది టిప్పు సుల్తాన్. వేలాది హైంధవ దేవాలయాల పైన దాడి చేసి ఆలయలలో వున్న విలువైన సంపదను దోపిడీ చేసి, ఆలయాలను మసీదులుగా మార్చాడు టిప్పు సుల్తాన్.

చరిత్రను హిందువులకు వ్యతిరేకంగా వ్రాసిన సంఘటనకు టిప్పూ చరిత్ర గొప్ప ఉదాహరణ. టీ.వీ ల్లో వచ్చే సీరియళ్ళు చూసి టిప్పును గొప్ప దేశభక్తుడూ, పరిపాలనాదక్షుడు అని భ్రమపడుతున్న అమాయక సెక్యులర్లూ, టిప్పూ కత్తి మీద ఏం రాసుందో ఒక్కసారి చదవండి.. "కాఫిర్‌లను ఊచకోతకోసిన ముస్లిం వీరుడు.." అని రాసుంటుంది. (కాఫిర్‌లు అంటే వాడి భాషలో హిందువులు..)

#TipuSultan #Melkote #Deepavali

Source - Whatsapp Message

మనో నిగ్రహం గురించి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసు్‌దేవ్ చెప్పిన కధ.

🕉🚩సనాతన మన హిందూ ధర్మం - 32🚩🕉

https://chat.whatsapp.com/LM1aq8QUvR4J9lxvpamZjb

https://t.me/joinchat/5gVEZGFAscQ3N2Fl

మనో నిగ్రహం గురించి ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసు్‌దేవ్ చెప్పిన కధ.

చాలాకాలం కిందట, ఒకాయన లోకాతీత శక్తులు సాధించాలనుకున్నాడు. ఆయన అనేకమంది గురువుల వద్దకు వెళ్లాడు. కానీ ఎవరూ నేర్పడానికి అంగీకరించలేదు. చివరకు ఒకతను, ‘టిబెట్‌కు వెళ్లండి. అక్కడ ఓ ముసలి సన్యాసి ఉన్నాడు,’ అని సలహా ఇచ్చాడు.

ఈయన తక్షణమే టిబెట్‌కు ప్రయాణమయ్యాడు. హిమాలయాలు దాటి ఆ బౌద్ధారామంలో ప్రవేశించాడు. ఏ బౌద్ధారామానికి వెళ్లినా, ‘మీరెక్కడి నుంచి వచ్చారు?’ అని ఎవరూ అడగరు. అది మిమ్మల్ని పట్టించుకోకపోవటం కాదు. వారి జీవితం మొత్తం ‘నేను ఎవరు?’ అనే విషయం తెలుసుకోవడం గురించే. అందువల్ల కొత్తగా వచ్చినవారిని అలా ప్రశ్నించి ఇబ్బంది పెట్టకూడదనేది వారి ఉద్దేశం. అందుకే అక్కడెవ్వరూ ఆయనతో మాట్లాడలేదు. ఎవ్వరూ ఆయన్ని తినమని కూడా అడగలేదు. భోజనం టైమ్‌లో ఒక గంట మోగుతుంది. కావలసినవారు భోంచేయొచ్చు. మీరు భోజనం చేయకపోతే గనక, దానికి కూడా అక్కడ ఎంతో ఆదరణ! బౌద్ధ ధర్మంలో ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ విచిత్ర పరిస్థితుల్లో ఆయన మరింత ఇబ్బందిపడ్డాడు. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు... ఇక ఆకలి తట్టుకోలేక వెళ్లి భోజనం చేసేశాడు. మొత్తానికి అక్కడే ఉన్నాడు. మూడు వారాలు గడిచాయి. చివరకు ఒక ముసలి సన్యాసి ఆయన్ని పిలిచాడు.

‘‘నీకు ఈ అతీంద్రియ శక్తులతో ఏం పని? అవి వద్దు కానీ నీకు ధ్యానం నేర్పుతా. దానితో నీవొక సఫలమైన జీవనం గడపగలవు’’ అన్నాడు.
కానీ మనవాడు ‘‘కాదు, నాకు అతీంద్రియ శక్తులే కావాలి’’ అన్నాడు.

గత్యంతరం లేక, ‘‘సరే! రేపు తెల్లవారుఝామున నాలుగ్గంటలకు చన్నీళ్ల స్నానం చేసి రమ్మ’’న్నాడు.
టిబెట్‌లో ఉష్ణోగ్రతలెప్పుడూ మైనస్ డిగ్రీల్లో ఉంటాయి. అయినా మనవాడు చన్నీటి స్నానం చేసి ఆయన ముందుకు వెళ్లి కూర్చున్నాడు.

ఆ సన్యాసి, ‘‘నీకు మూడు రహస్య మంత్రాలు నేర్పుతాను; బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈ మూడు మంత్రాలనూ మూడుసార్లు ఉచ్ఛరిస్తే గనక అతీంద్రియ శక్తులన్నీ నీవే. కానీ మంత్రాలు జపించేటప్పుడు నువ్వు కోతుల్ని మాత్రం తలుచుకోకూడదు’’ అన్నాడు.

మనవాడు సంతోషంతో గంతులేసుకుంటూ బయటకు వచ్చాడు. ‘ఈ తెలివితక్కువ సన్యాసి నాకు రహస్యాలన్నీ చెప్పేశాడు. గురుదక్షిణ కూడా అడగలేదు. కేవలం కోతులను గుర్తుపెట్టుకోవద్దని మాత్రం చెప్పాడు. వాటితో నాకేం పని? అసలు వాటిని చూసి కూడా ఎన్నో యేళ్లయింది’ అనుకుంటూ స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

తెల్లవారి, చన్నీటి స్నానం చేసి కూర్చున్నాక... బుద్ధం - కోతి! మళ్లీ చన్నీటి స్నానం చేసి వచ్చి, బుద్ధం - కోతి! బుద్ధం- మళ్లీ కోతి! ఆయన సాంతం - ‘బు’ అనకముందే మనసులోకి కోతులు వచ్చేస్తున్నాయి. ఒకవారం తీవ్ర సాధన తరువాత ఏ స్థితికి వచ్చాడంటే, ఆయన ఏమీ ఆలోచించకముందే మనసంతా ఎప్పుడూ కోతులే! ఈ అవస్థ పడలేక తిరిగి టిబెట్ వెళ్లి, ఆ బౌద్ధ సన్యాసితో, ‘‘నాకు అతీంద్రియ శక్తులేమీ అక్కర్లేదు. ముందు నా బుర్రలోంచి ఈ కోతుల్ని తీసేయండి’’ అని వేడుకున్నాడు.

చెప్పొచ్చేదేమిటంటే మనసు ఇలాగే ఉంటుంది. ‘ఏదైనా వద్దు’ అన్న మరుక్షణం నుంచీ ఇక మనసు అదే పనిచేస్తుంది. అందువల్ల మీరు మథనపడవద్దు. మీరు చూసినది మీ మనసులో వెనక ఎక్కడో ఉంది. దాన్ని అలా ఉండనిచ్చి, ఈ క్షణాన మీరు ఏం చేయాల్సివుందో అది చేయండి. మీరు ఒక ఆలోచనలో పూర్తిగా మునిగిపోతే, మిగిలినవన్నీ వాటంతటవే మాయమైపోతాయి. అలాకాకుండా ముందు ఫలానాదాన్ని తొలగించాలని పంతంతో కూర్చుంటే, అది ఎప్పటికీ జరగదు. జరగకపోగా దాన్ని వదిలించుకోవడమే మీ పూర్తిస్థాయి వ్యాపకం అయిపోతుంది!

- సద్గురు జగ్గీ వాసుదేవ్

https://www.facebook.com/groups/638078683192004

Source - Whatsapp Message