Saturday, January 29, 2022

మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు. చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు దీనికి కారణం..

కరోనా కు మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SAARC జాతి వైరస్. ఈ SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SAARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరం ల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టు కున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు.

చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు దీనికి కారణం..


5 - 6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతొ 2 -3 నెలలకు పెరిగే విధంగా తయారు చేస్తున్నారు.. ఈ వంగడాల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప, రోగాలను తట్టుకునే ఇమ్మ్యూనిటి రాదు.

Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs .100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేస్తున్నారు.

స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్థములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్, బెల్లం లను వాడడం ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరిస్తుంది.

తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు. కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ imblance జరిగి ఇమ్మ్యూనిటి హరించుకు పోతోంది.

వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు రోజుకు రెండు మూడు సార్లు తింటున్నారు. మాంసం తింటే శక్తి, కాలరీస్ వస్తాయి తప్ప, వున్న ఇమ్మ్యూనిటి పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్. బీపీ, షుగర్ పెంచుతుంది. ఆరు నెలల్లో పెరగవలసిన కోళ్లను 40 రోజుల్లో పెంచుతున్నారు. Anti Biotics ఇచ్చి పెంచిన కోళ్లు పెట్టె గుడ్లు తింటే ఏమైనా immunity వస్తుందా?

సముద్రపు ఉప్పు కాక iodised ఉప్పు వాడటం వలన ఇమ్మ్యూనిటి దెబ్బ తింటుంది. ఈ ఉప్పు తిని మన శరీరం హూనం అయ్యి నిర్జీవం అవుతోంది.

మైదా, నూడుల్స్ , పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటి పోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.

సంకరాలు అయిపోయిన స్వీట్ కార్న్, హైబ్రిడ్ కార్న్ , సొయా బీన్ తింటే ఇమ్మ్యూనిటి పోతుంది.

ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్నారు.. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు.

పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి కాయలను పీకి కెమికల్స్ తో మాగిస్తున్నారు... దీని వలన కూడా immunity పెరగటం లేదు....

పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.

తియ్యగా వుండే చాకొలేట్, Biscuts , Cakes అయితే శరీరాన్ని కుంగదీస్తున్నాయి. వైరస్ లకు ఆహరం గా ఉంటున్నాయి.

పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియా లను శరీరం నుండి తరిమేస్తుంది. ఇప్పుడు అందరు పెరుగును ఫ్రిడ్జ్ లలో పెడుతున్నారు. 15 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే లాక్టో బాసిల్లస్ చని పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లలో పెట్టి తినే పెరుగు , మజ్జిగ వేస్ట్.



పై విషయాలు అన్ని మరచి మానవుడు తప్పు చేయడం వళ్ళ 10 - 20 సంవత్సరం ల నుండి మనిషి immunity (రోగ నిరోధక శక్తి ) తగ్గి పోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి మాస్కులు , చేతులకు santitizers, సబ్బులు వాడే దుస్థితికి వచ్చాడు. వైరస్ లకు గడ గడ లాడు తున్నాడు. సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన దుస్తిలో వున్నాడు.

ఇప్పటికయినా మారక పొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది. లేకపోతె డబ్బాలలో కూర్చొని తనను వైరస్ ల నుండి కాపాడు కోవాలి.

మానవ జాతి వెంటనే చేయాల్సిన పనులు.

సైంటిస్ట్ లను కొత్త వంగడాలను తయారు చేయకుండా నిరోధించాలి. లేక పొతే వాళ్ళ promotions కోసం ఎదో చేసాం అనిపించు కోవడం కోసం మానవ జాతి ని నిర్వీర్యం చేస్తారు.

గ్లూకోస్ ఎక్కువ గా వుండే రైస్, గోధుమ లను మానేసి ఫైబర్ ఎక్కువగా వుండే సిరి ధాన్యాలు తినాలి. వాటిని కూడా వంగడం పేరుతొ సంకరం చేస్తున్న సైంటిస్ట్స్ లను ఆపాలి. ఇవీ కూడా వంగడం చేస్తే అవి తినడం కూడా వేస్ట్.

కెమికల్ లేని పండ్లు , కాయ గూరలు తినండి. Chemicals వి తినడం వల్లే ఇమ్మ్యూనిటి పోతోంది. వీలు అయితే ఇంట్లోనే కొన్ని కాయగూరలు పెంచు కొండి.

ఎక్కువగా కెమికల్స్ వాడే ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ మానివేయండి.

చెక్కర , బెల్లం, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్ మాని వేయండి. రిఫైన్డ్డ్ ఆయిల్ స్టాప్ చేసి, గానుగ నూనెలు వాడండి.

వారం లో ఒక రోజు , లేక పొతే నెలల్లో ఒకసారి అయినా ఉపవాసం ఉండండి. ఇది ఇమ్మ్యూనిటిని చాలాపెంచుతుంది
ఉపవాసం చేసేటప్పుడు నిమ్మకాయ, తేనె ల రసాన్ని గంటకు ఒకసారి చొప్పున 7 , 8 సార్లు తీసుకోవాలి.

టీ, కాఫీ లు మానివేసి ఇమ్మ్యూనిటి ని పెంచే natural బూస్టర్స్ అయిన కషాయములు తాగాలి.

రోజంతా 4,5 సార్లు తినడం మాని వేయడం వల్ల లోపల జీర్ణ వ్యవస్తత కు ఇమ్మ్యూనిటి పెంచే శక్తి వస్తుంది.

ఒక పూట తింటే యోగి
రెండు పూట్ల తింటే బోగి
మూడు పోట్ల తింటే రోగి
మరి నాలుగు పూట్ల తింటే కరోనాలు etc.,

ఇట్లు
మీ ఆరోగ్య అభిలాషి

సేకరణ

No comments:

Post a Comment